Friday, November 30, 2012

."కల్కి" రావడం ఖాయం లేకుంటే" మనం" పోవడం ఖాయం.

                                                                         
చాలా మంది ముఖ్యంగా ఈ నాటి తరంవారు "మత గ్రందాలలో" చెప్పిన అవతార పురుషులు వస్తారని ఈ కలి నుండి మనల్ని కాపాడతారని నమ్ము తుండక పోవచ్చు. ఎందుకంటే దేవతలు,రాక్షసులు అనేవారిని పురాణాలలో చదివి వాటిని ఒక " సోషియో ఫాంటసీగా" ఏన్జాయి చెయ్యడమే తప్ప వాటి వెనుక నున్న " బావాజాలాన్ని" గ్రహించలేక పోవడమే అని నా అభిమతం.

 .పౌరాణిక పాత్రలైన "హిరణ్యాక్షుడు,హిరణ్య కశిపుడు, రావణుడు" అందరూ బౌతిక వాదులే అయి నప్పట్టికి అచంచల శివభక్తులు,రావణాశురిడి కాలంలో గాలి ఎంత కావాలి అంటే,అంత మాత్రమే వీచేదట . అలాగే ఆన్ని ప్రక్రుతి శక్తుల మీద "రావణ బ్రహ్మ" కు పట్టు ఉండేదని చెపుతుంటారు. దీని వలన వారు బౌతిక సుఖాలకు  ప్రాదాన్యత ఇచ్చారని తెలుస్తుంది. రామ రాజ్యం కంటె రావణ రాజ్యం ఒక పద్దతి ప్రకారమ్ ఏలబడింది. దేవతలు కంటె "రాక్షసులు బలవంతులని  సమర్దులని ఎన్నోసార్లు రుజువయింది.అయినా వీరు "దైవ క్రుపకు" ముఖ్యంగా "స్తితి కారుడైన" విష్నుమూర్తికి శత్రువులుగా గుర్తించబడి ఆయనచే సంహరించ బడ్డారు. మహా దేవుడి ప్రాపకం ఉన్నా,వీరి నాశన్నాన్ని అది నిరోదించ లేక పోయింది. ఇంకొక గమ్మయితైన విషయం ఏమిటంటే దేవతలు, రాక్షసులు ఇరువురూ ఒక తండ్రి బిడ్డలే. తల్లులే వేరు. ఏమిటిదంతా! ఇలా ఎందుకు పురాణాలలో రాసారు. ఒక వేళ ఇది కేవలం విష్ణు బక్తులు, శివ బక్తుల మీద రాసిన ద్వేషపూరిత రచనలే అయితే, శివబక్తులు, రావణబ్రహ్మ ని హీరో గా చూపిస్తూ కౌంటర్ రచనలు చేయాలిగా? అలా చేయలేదు ఎందుకని? రామాయణంలోనే రావణుడి గొప్పతనం కూడ చెప్పటం జరిగింది కదా!కాబట్టి ఇవి కేవల ద్వేషపూరిత రచనలు కావు. అప్పట్టి రాజులను, పాలనా విదానాన్ని ద్రుష్టిలో పెట్టుకుని కల్పనలు జోడించి రాసిన చరిత్రలే కావచ్చు,     

  సైన్స్ "బౌతిక" ప్రపంచాన్ని నిర్మిస్తుంటే, మతం, నైతికతో కూడిన "మానసిక ప్రపంచాన్ని" నిర్మిస్తుంది.ఈ రెంటి  మద్య సమన్వయం ఉండటం అవసరం."బౌతిక ప్రపంచ వాదులు" "రాక్షసులు గాను, "మానసిక ప్రపంచ వాదులు" దేవతలగాను అభివర్ణించబడినప్పటికి,ఇరువురూ మనుష్యుల ఆలోచనా విదానాలకు ప్రతీకలే తప్ప ఆటువంటి వారు జీవ  పరిణామ క్రమంలో ఉన్నారనడానికి ఈ నాటి వరకు ఆదారాలు లేవు.

 ప్రక్రుతిలో సకల జీవజాలం వర్దిల్లడానికి "మానసిక వాదం" తోడ్పడితే,కేవలం మానవుడి వికాసానికి మాత్రమే "బౌతిక వాదం" తోడ్పడుతుంది. ఈ స్రుష్టీ దర్మం "మానసిక వాదానికే అనుకూలం కాబట్టి ప్రతీకగా "భగవంతుడు,అవతారమూర్తులు" వచ్చారు.ఇంచుమించుగా అన్ని మతాల లోని సారాంశం ఇదే ఉద్బోదిస్తుంది. హిందూ అవతార మూర్తులు ఎప్పుడూ,"ఏ నాడైతే బౌతిక వాదం వెర్రితలలు వేసి, ప్రక్రుతి వినాశనానికి కారణమవుతుందో అప్పుడు ఉద్బవిస్తారు
            .ఒకానొక సిద్దాంతం ప్రకారం ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయానికి "కార్యా కారణ" సంబందం "ఉండి తీరుతుంది.పాలు పొంగితే పొయ్యి ఆరిపోవాలి. లేక పోతే పాలన్ని ఆవిరైపోతయి. కాబట్టి మనం మంట తగ్గిస్తాము. ఇదే సూత్రం ప్రక్రుతి నియమాల్కు వర్తిస్తుంది. బౌతిక సుఖాల మోజులో స్వార్దపూరితమయిన మనిషి చర్యలు సకల జీవజాలానికి వినాశకంగా పరిణమిస్తే, దానిని ప్రక్రుతి ఆపి.తీరుతుంది. అది మానవ చర్యల రూపంలో ఉంటుంది. అలా ఆపేవాడే "కల్కి".ఒక వేళ అలా ఆపకపోతే "ప్రళయం" రూపంలో మన పతనం తప్పదు.   అందుకే నేను ఇంత గట్టిగా విస్వశిస్తుంది."కల్కి" రావడం ఖాయం లేకుంటే మనం పోవడం ఖాయం.    

చంద్రబాబు "ఫస్ట్" అంట! కిరణ్ కుమార్ "నిల్" అంట



నేను వారం రొజుల క్రితం 

"ఆంద్ర ప్రదేశ్ కి సుపరిపాలన ఇవ్వగల నాయకుడు?"

అని ఒక సర్వే పోల్ పెట్టడం జరిగింది. అది నిన్నటితో ముగిసింది. ఇందులో ఇంచుమించు చంద్రబబు నాయుడు గారికి, జయప్రకాష్ నారాయణ్ గారికి ఒక వోట్ తేదాతో సమానంగా పలితాన్ని సాదించారు. జగన్ గారికి పద్నాలుగు శాతం వోట్లు పోలవ్వగా,కొత్త నాయకత్వం కావాలని  13శాతం వీక్షకులు అభిప్రాయపద్డారు.విచిత్రమైన విషయం ఏమిటంటే ప్రస్తుత అధికార పక్ష నేత అయిన కిరణ్ గారికి అసలు ఎవరూ ఓట్ చెయ్యక పోవడం గమనార్హం.

  కాబట్టి దీని వలన మన కర్థమయ్యేది 2 రకాలుగా చెప్పొచ్చు,.(1). ప్రజలను ఎన్నికల విషయంలో అనేక అంశాలు ప్రభావ పరుస్తాయి. సాదర్ణంగా ఏ పక్షపాతం లేకుండా, దేనికి ప్రబావితం కాకుండ ఓట్లు వేసే పరిస్తితి ఈ నాడు లేదు. ఒకవేళ ఉండి ఉన్నట్లైతే, కచ్చితంగా మంచి నాయకత్వమే ప్రజలకు లబిస్తుంది.

 డప్పులు,డొలీలు, పల్లకిలు, ప్రచారహోరు,కులాలజోరు, డబ్బుప్రవాహం,మద్యపుటేర్లు,బూతుల షేర్, బెదిరింపులు,వీటణ్ణింటిని ఆపి ప్రజలకు స్వేచ్చా వాతావరణం కల్పించగలిగితే తప్పా, ప్రజలు ఇచ్చే తీర్పును  ప్రజాస్వామ్యంలో బాగంగా పరిగణించవలసిన అవసరం లేదనుకుంటా!

 ఇకపోతే రెండవకోణం "ఆస్తిక ద్రుష్టి". "శివుని ఆజ్ణ  లేనిదే చీమైనా కుట్టదు" అని. దీన్కి నేను గతంలో

("’ " బుద్ది భూములు" ఏలుదాం అంటే,రాత "గాడిదలు" కాద్దాం అందట!"!http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_7924.html)అనే టపా

 పెట్టడం జరిగింది. లంకె మీద క్లిక్ చెయ్యగలరు.ఇక వివిద నాయకులకు సర్వే పోల్ లో వచ్చిన వోట్ల శాతం:---

చంద్ర బాబు నాయుడు
   36%
కిరణ్ కుమార్ రెడ్డి
  0%
జగన్
  14%
జయ ప్రకాష్ నారాయణ్
  35%
కొత్త నాయకుడు రావాలి
  13 14%


పండితులు రాసిన పంచాంగాలు కల్లలై పోవును,శూద్రులు చెప్పిందే నిజమై నిలుచు!

http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_5782.html
(పై లంకె మీద క్లిక్ చెయ్యండి}

Thursday, November 29, 2012

పండితులు రాసిన పంచాంగాలు కల్లలై పోవును,శూద్రులు చెప్పిందే నిజమై నిలుచు!

                                                                       

 ఈ మాట బ్రహ్మం గారు తన కాలజ్ణానం లో చెప్పిన మాట. ఇది చాల కరెక్ట్ అనిపిస్తుంది. లేకపోతే ఏమిటి చెప్పండి.మన్వంతరం అంటే కోట్ల సంవత్సరాలు అంట! అటువంటివి ఆరు గడచిపోయినవంట! ఏడోది ఒక పాదమే అయిందట. అలాగే కలియుగం లక్షల సంవత్సరాలంట! ఆ కల్కి పుట్టేది లక్షల సంవత్సరాల తరవాతే నంట!అప్పటిదాక ఈ పాపాలు ఇల కొనసాగాల్శిందేనంట.అసలు వీటిలో ఒక్కట్టైన నమ్మదగిన కనీసం నమ్మొచ్చు అనే అవకాశం ఉందా?

  అదే మయన్లు చూడండి వారి పంచాంగం (కాలెండర్) కి ఒక ప్రామాణికత ఉన్నట్టు తోస్తుంది.ఖచ్చితంగా ఇక్కడితో ఈ కాలెండర్ పూర్తి అయి తిరిగి కొత్తది మొదలవుతుంది అనేది రాశారు . మరి ఈ హిందూ పండితులు ఎందుకు ఇలా లక్షలు, కోట్లు సంవత్సరాలు ఈ లెఖ్కల్ని పొడిగించారు అంటె భయంతో కూడిన స్వార్దం. అవును అందుకే వీరు అలా చేసారు అనిపిస్తుంది. ఎలాగంటే:-

  "విష్ను పురాణంలో రాబోయే మన్వంతరం శూద్రులుకు(కొంత మంది ద్రుష్టిలో రాక్షసులు),సంబందించింది. ఈ మన్వంతరంలో,పరమాత్ముడు శూద్ర జన్మ ఎత్తాలి,ఇంద్ర పదవి శూద్రుడిదే, మహరుషులు కూడ వారే కాబట్టి ఈ  మన్వంతరం రావడానికి ఒప్పుకోని "పండిత పుత్రులు" బవిష్యగ్రంథాలలో సున్నాలు చొప్పించి ప్రక్షిప్తం చేసారు. కాని మూర్కులు కాలాన్ని ,దైవ నిర్ణయాన్ని ఆపగలరా? అది శూద్రులయిన మయన్ల రూపంలో ప్రపంచానికి తెలుస్తుండి.

  ఈ విదంగా బ్రహ్మం గారి జ్యొస్యం నిజమవుతుంది> శూద్రుడు ఇంద్రపదవి పొందడం గురించి తెలుసుకోవాలంటే లంకె మీద క్లిక్ చెయ్యగలరు  http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_1640.html

కాబోయే"ఇంద్రుడు" శూద్రుడైన "బలి చక్రవర్తి" అంట!

http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_1640.html
పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

Wednesday, November 28, 2012

కాబోయే"ఇంద్రుడు" శూద్రుడైన "బలి చక్రవర్తి" అంట!

                                                                         
ఇన్నాళ్లు ఈ దేశంలో దళితులు, తమను అగ్ర వర్ణాలవారు అణగద్రొక్కారని,బ్రాహ్మణ పక్షపాతి అయిన "మనువు" రాసిన "మనుస్మ్రుతి" మరియు ఇతర హిందూ మత గ్రంథాలు అన్ని కూడ అగ్రవర్ణాలకే పెద్దపీట వెయ్యడం వల్ల తాము నిమ్న కులాలుగా హీనస్తితిలో ఉండాల్శి వచ్చిందని బాదపడుతున్నారు కదా. వారికి ఒక శుభ వార్త. రాబోయే కాలంలో" ఇంద్ర పదవి" ని శూద్రుడైన "బలిచక్రవర్తి" అదిరోహిస్తాడటా! ఇది ఏ బౌద్ద గ్రంథమో, దళిత సాహిత్య గ్రంథాలో చెప్పింది కాదు. సాక్షాతు, హిందూ పవిత్ర గ్రంధమైన "విష్ణు పురాణంలోనే చెప్పబడిందట!కావాలంటే క్రింది రిఫరెన్స్ మీద క్లిక్ చేసి చూడవచ్చు.

  హిందూ బవిష్యపురాణం, విష్ణు పురాణం ప్రకారం మనకు 14 మంది "మనువులు" ఉంటారట. ఒక్కొక్క మనవు కాలాన్ని "మన్వంతరం" అంటారట.అలా 14మన్వంతరాలకు, 14 మంది మనువులే కాక, 14 మంది ఇంద్రులు కూడ ఉంటారట. ప్రతి  మన్వంతరంలో ఆ దేవదేవుడైన పరమాత్మ కూడ జన్మించి,తన దర్మాన్ని నెరవేర్చుతాడట. అలాగే ప్రతి మన్వంతరానికి"సప్తరుషులుగా" ఎవరు ఉంటారో కూడ నిర్ణయించబడింది. ఇలా ప్రతి మన్వంతారానికి వచ్చే మనువు పేరు,ఇంద్రుడి పేరు,పరమాత్మ పేరు,సప్తరుషుల పేర్లు, స్పష్టం గా తెలుపబడ్డాయి.ref:-http://en.wikipedia.org/wiki/Manvantara

  ఉదాహరణకి, ఇప్పుడు నదుస్తున్నది ఏడవ మన్వంతరం అయిన "వైవస్వత మన్వంతరం".ప్రస్తుత మనువు పేరు "వైవస్వతూడు". పరమాత్మ పేరు"వామనుడు".సప్త రుషులు "కశ్యపాది సప్త మునులు".ఇంద్రుడి పేరు "పురందరుడు"’పరమాత్మ అయిన వామనుడి తల్లితండ్రులు"కశ్యప,అదితి" దంపతులు.

  అలాగే రాబోయే 8 వ మన్వంతరం""సావర్ణి మన్వంతరం"లో కూడ ఎవరి పేర్లు ఏమిటొ స్పష్టం గా తెలుపబడ్డాయి.ఈ కాలంలో మనువు పేరు"సావర్ణి".ఇతడు సూర్యుని పోలికతో ఉంటాడని "సూర్య సావర్ణిక" అని కూడ అంటారు.పరమాత్మ పేరు "సార్వబౌమ".సప్తరుషులు "గాలవాది మహామునులు".ఇకపోతే ఇంద్రుడు"బలి చక్రవర్తి". ఇతనినే వామనావతారంలో విష్ణువు పాతాళానికి త్రొక్కివేసింది. పరమాత్మ అయిన "సార్వబౌమ" తల్లి తండ్రులు పేర్లు,"దేవగుహ్యుడు" మరియు"సరస్వతి".ref:http://en.wikipedia.org/wiki/Savarni_Manu

 కాబట్టి 8వ మనువు కాలంలో పాతాలానికి త్రొక్కివేసిన బలి చక్రవర్తే "ఇంద్ర" పదవి అలంకరిస్తున్నడంటే అంతకంటే కావాల్సిందేముంది మన దళితులకి. కాకపోతే బలిచక్రవర్తి ఎక్కడ వచ్చేస్తాడొనని కోంతమంది మూడ పంచాంగ గణికులు మన్వంతర కాలాన్ని,4320 సంవత్సరాలుకు కొన్ని సున్నాలు కలిపి లక్షల యేండ్లు చేసారు.ఎలాగు శూద్రులు ఈ పురాణాలు పట్టించుకోరు కాబట్టి వారు ఆ విదంగా చేయగలిగారు. కాని ఒక అంచనా ప్రకారాం ౭ వ మన్వంతరం కూడ  వచ్చే సంవత్సరం "రఠసప్తమి" నాటికి పూర్తి కావాలి. దీనికి "మాయా  యుగాంతానికి" చాల దగ్గరి సంబందం ఉండటం గమనార్హం.

 కాబట్టి "ఉందిలే మంచి కాలం ముందు,ముందునా,"శూద్రుడే దేవుడంట" నంద నందనా" అనుకుంటూ హాపీగా ఉందామా!    http://www.newworldencyclopedia.org/entry/Rakshasa 

కిరణ్ కుమార్ రెడ్డీ గారిని సి.యం. చేసింది ప్రజలా?పరమాత్ముడా?

http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_7924.html
పై లంకె మీద క్లిక్ చెయ్యండి

"’ " బుద్ది భూములు" ఏలుదాం అంటే,రాత "గాడిదలు" కాద్దాం అందట!"!

                                                                                                                                                                                                                      
నేను "ఈ రాష్ట్రంలో ఎవరు సు పరిపాలన" ఇవ్వ గల నాయకుడు అని "సర్వె పోల్" పెడితే ’జయ  ఫ్రకాష్ నారాయణ్’,"చంద్ర బాబు నాయిడు"  వైపు ప్రజలు మొగ్గు చూపారు కాని, ఎవరూ కిరణ్ కుమార్ వైపు తల తిప్పి చూడలేదు.విచిత్రమైన అంశం ఏమిటంటే ,ఆయన మన సి.ఎమ్.అయినా ఒక్కడు కూడా ఆయనికి వోట్ వెయ్యలేదు.

.దీనివల్ల మనమొక విషయం అర్థం చేసుకోవాలి,"కిరణ్ కుమార్ రెడ్డి "గారికి ప్రజలలో "చరిష్మా" లేదు. అయన ముఖ్యమంత్రి అవుతారని ఎవరూ ఊహించని విషయం.అయినా ఆయన సి.యం అయ్యారు అంటే ఏమిటి కారణం. పైనున్న"అదిష్టాన దేవత" అని దేవున్ని నమ్మన్ని వారు సింపుల్  గా తీసి పారెయ్యొచ్చు. కాని" ప్రజా చరిష్మా" గలిగిన నాయకుల్ని కాదని కిరణ్ గారినే ఆమే ఎందుకు నియమించింది? ఏ సమాదానం చెప్పిన సంత్రుప్తికరంగా ఉండకపోవచ్చు.

 కాని "కిరణ్ కుమార్" గారి జాతక చక్ర ఫలం వల్ల అయన మీద దైవానుగ్ర్హం ఉండటం వలనే ఆయన ఇంత వొడిదుడుకుల్లో కూడ విజయవంతమైన పాలన చేస్తున్నాడు, అని మా బోటి ఆస్తికులు చెప్పేది మాత్రం చాలా మందిని సాటిస్పై చేసే  జవాబు కావచ్చనుకుంతా!

 అందుకే మేమనేది ,ప్రజా సమ్మత్తి ఉండని ఉండకపోని, ప్రజలంతా "సైతాన్" ల మాయలకు బ్రమసి,వెర్రివారై వారి చుట్టే తిరుగుతూ వారే తమ కాబోయే నాయకుడు అనుకోని గాక ఇవ్వన్నీ దేవుడి ముందు ఎందుకు కొరగావు.’బుద్ది బూములేలాదామంటే, రాత గాడుదులు కాద్దామందట! అనే సామెత ఊరికే రాలేదు నాయనలారా! తప్పకుండ మనకు మంచి రోజులు రాబోతున్నాయి! "కల్కి అవతారుడు" వస్తాడు, ఈ "కల్ నాయక్" లందరిని చెండాడుతాడు. ఇది ఆ బగవత్ నిర్ణయం .దీనిని ఎవరూ తప్పించలేరు.

 రోజు రోజుకు మారుతున్న పరిణామాలు చూసి అయినా ఇంకా ప్రజల ఆలోచనలో మార్పు రాక పోతే ఎలా? కోట్లు కుమ్మరించే దమ్మున్న వారిని సైతం "కటకటాల" వెనక్కి పంపించింది ప్రజా చైతన్యమా? వారిని అరెస్ట్ చెయ్యాలని ఎవరైనా ఉద్యమాలు చేసారా? లేదే! కేవలం రాతండి, రాత! అదే వారిని జైలుపాలు చేసింది! పొద్దున్న ఆరు గంటలకు ఇంట్లో ’కోట్లు" విలువ చేసే కుర్చీ లో కూర్చుని రాజసం వెలగబెట్టే వారిని సాయంత్రం ఆరు గంటలకు చిప్పకూడు తినే చెర సాలలో ఉంచింది ఏది> రాత బాబూ రాత!

  ప్రజలు, చైతన్యం, కోర్ట్లు, కేసులు ఇవన్న పైకి కనపడే కారణాలు కావచ్చు, కాని వాటిని నిర్ణయించిన ఆ దేవుడ్ని,లేక ఆ మహా శక్తిని మరిస్తే ఎలా?   ఆ బగవంతుడిని రమ్మని అందరూ ఆహ్వానిదాం  జై కల్కి! జై జై కల్కి.   

Tuesday, November 27, 2012

త్వరగా అవినీతిని త్రుంచడమో, పెంచడమో చెయ్యండి.!

                                                               
మన డెశాన్ని పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య అవినీతి. మన ఆదర్శమేమో అవునీతి నిర్మూలించి "దర్మ రాజ్యం" తెమ్మాంటుంటే, ఆచరణలో మాత్రం అది సాద్యమయ్యేపని కాదు అని చిన్నోళ్ల దగ్గర్నుంచి పెద్దోళ్లదాక ఒకటే నమ్మక్కం.ఈ మద్య అవినీతి నిర్మూలిస్తామని ఎవరైనా చెపితే వాడినో "వెర్రి వెంగళప్ప" ని చూసినట్టు చూస్తున్నారు.వీళ్ళ వల్ల కాడు వీళ్లను పుట్టించోడి వల్ల కూడ కాదు అనేది సామాన్య అభిప్రాయం.

  కాబట్టి ప్రజలారా దీనికొకటే విరుగుడు. ప్రభుత్వానికి ఒక "చివరాకరి" అవకాశం ఇచ్చేద్దాం. ఆ లోపు దేశమ్ లో అవినీతిని నిర్మూలించారా వెల్ అండ్ గుడ్. లెదా మనమే దానిని నిర్మూలిద్దాం. ఎలాగంటే అవినీతిని బాగా ప్రోత్సాహించేసి అవినీతి పరులను గడ గడ లాడిద్దాం!  ఈదేమి పిచ్చి సలహా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. మనకో సామెతుంది "పెరుగుట విరుగుట కొరకే" అని . అందులో గొప్ప లాజిక్   తో కూడిన సత్యం ఉంది. కొంత మంది అవినీతి వలన ఎక్కువమంది బాదపడుతున్నాం. కాని అవినీతిని చట్టబద్దం చేసేసి(మనమే చెయ్యడం), అందరు విచ్చల విడిగా అవినీతిని ప్రోత్సహిస్తే దాని పలితం అతి త్వరలో ప్రజలకు కనపడి చివరకు "పాస్ పొయ్యడానికూడా"  పదిరూపాయలు ఇస్తే కాని పనికాని పరిస్తితులు వస్తాయి. అప్పుడు నా సామి రంగా ఈ అవినీతి ని ప్రజలు "నీతిగా" తరిమేస్తారు. మా "కల్కి" గారు అప్పుడు అందరికి దర్శనమిస్తాడు. కాబట్టి మనం ఎలాగు త్రుంచలేము. మన నాయకులకు,అదికారులకు సహాయపడి కనీసం దానిని పెంచుదాం. వాట్ డు యు సే?  

Monday, November 26, 2012

శివుని ఆజ్ణ లేనిదే సి.యం. కాలేడు,ఎవరైనా!


నేను "ఈ రాష్ట్రంలో ఎవరు సు పరిపాలన" ఇవ్వ గల నాయకుడు అని "సర్వె పోల్" పెడితే ’జయ  ఫ్రకాష్ నారాయణ్’,"చంద్ర బాబు నాయిడు"  వైపు ప్రజలు మొగ్గు చూపారు కాని, ఎవరూ కిరణ్ కుమార్ వైపు తల తిప్పి చూడలేదు.విచిత్రమైన అంశం ఏమిటంటే ,ఆయన మన సి.ఎమ్.అయినా ఒక్కడు కూడా ఆయనికి వోట్ వెయ్యలేదు.

 దీని వల్ల మనకి అర్థమయ్యేది ఒక్కటే,దేవుడు తలచుకుంటే ఏమైనా చెయ్యగలడు! ఎవరు అవునన్నా, కాదన్నా,అందలమెక్కించగలడు, దించనూ గలడు.కాబట్టి దేవుడితో గేమ్స్ వద్దు.

Sunday, November 25, 2012

మన దేశం లో ఏ మతం వారైనా సరే "జనగణమన" పాడ వల్సిందే, చివరకు "జై హింద్" అనాల్సిందే




మొన్న తెలంగాణా ప్రాంతంలొకి  "షర్మిల" ప్రవేశించినపుడు అక్కడ ఆమెకు స్వాగతం పలికిన జన  ప్రభంజనం చూసిన ఏ.బి.యన్. చానల్. వారు అయోమయంలో,పడ్డట్టుంది. వెంటనే అదే రోజు తమ చానల్ లో కామెంటోపనిషత్ ప్రసారం చేసారు. ఇక రానుంది ’అన్యమత రాజ్యమే’ అని ఒక సందేశం ప్రజలకు ఇచ్చినట్లుంది.

అయ్యా "దమ్మున్న చానల్, దుమ్ము రేపే చానల్" గారు మన దేశం లో ఏ మతం వారైనా సరే "జనగణమన" పాడ వల్సిందే, చివరకు "జై హింద్" అనాల్సిందే. మా హీందూ మతం గురించి మాకు భయం లేదు. మాకు "కల్కి" వస్తాడు."ధర్మాని రక్షిస్తాడు.ఇది హిందువుల అచంచల నమ్మకం. 

మా ప్రజలకి కావాల్సింది" నీతిగలవాడు" కాదు.వారిని"సబ్సీడీ నీతి" గా పాలించేవాడు..


ఈనాడు ప్రజలకు చాలమందిలో "అవినీతి" గురించి మాట్లాడే వారిలో పెద్ద నమ్మక్కం లేనట్టుంది అందుకే ఎవరి మీద అవినీతి అరోపనలు ఉన్నా వారు పెద్దగ స్పందించడం లేదు. నీవు ఎంత అవినీతి పరుడవన్నది మా కనవసరం ,మా కిచ్చే సబ్సీడీలు మాకు నిజాయీతీగా ఇప్పిస్తే చాలు, "నీవే మా నాయకుడివి" అంటున్నారు. అది కని పెట్టి మన నాయకులు ఒకరిని మించి మరొకరు సబ్సీడీలు మీద  సబ్సీడీలు వాగ్దానం చేస్తున్న్నారు.ఈ కిటుకు తెలియని వారు అమాయకంగా , అవినీతి ,గాడిద గుడ్డు, అంటూ ప్రజలకు పట్టని పంచాంగం వివరిస్తున్నారు,ఏమిటో ఎవడి గోల వాడిది!

Saturday, November 24, 2012

యుగాంతానికి, ప్రళయానికి ఏమిటీ తేడా?

http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_2259.html

(పై లంకె మీద క్లిక్ చెయ్యండి)

యుగాంతం తర్వాత "కల్కి" స్తాపించేది "కమ్యూ’నిజమే" నంటా!


విశ్వం లో ఆవిష్క్రుతమవుతున్న  "అరుణ తార"


 ఈ దేశంలో కమ్మ్యునిస్ట్ లు "సోషలిజం ,ఇదిగో వస్తుంది,.అదిగో వస్తుంది అని ప్రజల్ని ఊరించి,ఊరించి అసలు దాన్నేలా ఈ దేశానికి తేవాలో తెలియక 'నోరెళ్ళ బెట్టి  సిద్దాంత రాద్దాంతాలు  చేస్తుంటే, వీళ్ళ గోల అర్థంకాక, ప్రజలు నెహ్రూ గారి ’శోషలిజానికి" జై అనేశారు. అ దెబ్బతో క్రిందబడిన కమ్మ్యునిస్టులు ఇంతవరకు లెగలేదు.
 ఇక మన రాష్ట్రంలో అయితే, "రామారావు" గారు రెండు రూపాయలకు క్కిలో బియ్యం నకు మించిన సోషలిజం ఉందా ? అనేసరికి అప్పట్టి దాక జుత్టు పీక్ఖున్న చాలా మంది జై "తెలుగు దేశం" అనేశారు. ఇక అక్కడక్కడ మిగిలి పోయిన వారు మళ్లి ఎప్పుడో ఒకప్పుడు "మన ఇజం" రాకపోతుందా అని ఎద్రు చూస్తున్నారు. అటువంటి వారికి ఒక శుభ వార్త! మా కల్కి తేబొతుంది నిజమైన "కమ్మ్యునిజమంటా!

   అదేలాగంటే " కల్కి’ దుష్టులను నిర్మూలించి,"బ్రహ్మజ్ణానులను(బ్రాహ్మనులు కాదు) కాపాడతాడట. ఇక మిగిలేది వారే కాబట్టి వారికి ఈ ప్రాపంచిక సుఖాల మీద అంత యావ ఉండదు కాబట్టి, చాతనైనది చెయ్యడం, కావల్సినంత వరకే తీసుకుంటారు."     మార్క్స్"   చెప్పింది అదే గదా. ఆ విదంగా బారతదేశమే మొట్ట మొదటి "మన కమ్మ్యునిస్ట్"  దేశం అవబోతుందహో.... 

మన దేశం లో ఏ మతం వారైనా సరే "జనగణమన" పాడ వల్సిందే, చివరకు "జై హింద్" అనాల్సిందే

                                                                       

మొన్న తెలంగాణా ప్రాంతంలొకి  "షర్మిల" ప్రవేశించినపుడు అక్కడ ఆమెకు స్వాగతం పలికిన జన  ప్రభంజనం చూసిన ఏ.బి.యన్. చానల్. వారు అయోమయంలో,పడ్డట్టుంది. వెంటనే అదే రోజు తమ చానల్ లో కామెంటోపనిషత్ ప్రసారం చేసారు. ఇక రానుంది ’అన్యమత రాజ్యమే’ అని ఒక సందేశం ప్రజలకు ఇచ్చినట్లుంది.

అయ్యా "దమ్మున్న చానల్, దుమ్ము రేపే చానల్" గారు మన దేశం లో ఏ మతం వారైనా సరే "జనగణమన" పాడ వల్సిందే, చివరకు "జై హింద్" అనాల్సిందే. మా హీందూ మతం గురించి మాకు భయం లేదు. మాకు "కల్కి" వస్తాడు."ధర్మాని రక్షిస్తాడు.ఇది హిందువుల అచంచల నమ్మకం. 

Friday, November 23, 2012

యుగాంతానికి, ప్రళయానికి ఏమిటీ తేడా?


                                                                    

యుగాంతం వేరు, ప్రళయం వేరు. కొంతమంది వీటి మద్య తేడా తెలియక ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందని ప్రచారాలు చేస్తే వాటిని నమ్మిన వారు భయపడుతున్నారు. చాలా మంది "ఉపద్రవం" అనే విషయంలో నమ్మక్కం లేక పోయినా ఏమి మార్పులు జరుగుతాయోనని ఆసక్తిగా ఎదురు చూస్తుణ్న్నరు . మరి కొంత మంది దీని మీద జోక్ లు వేస్తూ ఎన్జాయ్ చేస్తున్నారు . ఏమైనా వీటి మద్య తేడా తెలుసుకుంటే . మంచిది 

యుగాంతం అంటే మనం లెక్కించే కాలగణన పద్దతిలో ఒకానొక పద్దతి అయిన "మయన్’ కాలెండర్ సమాప్తమయే రొజు. తిరిగి కొత్త కాలెండర్ మొదలవుతుంది .వారి ఒక లెక్క ప్రకారం వచ్చే డిసెంబర్ 21 వ తారికు నుండి మనం కొత్త యుగమైనా "కుంభ రాశి" యుగం లోకి అడుగు పెట్ట బోతున్నాం. దీని వలన మనుష్యుల అలోచనా సరలిలో అనేక మార్పులు రావచ్చు అని తద్వార నీతి వంతమైన  పద్దతులు ఏర్పడి తిరిగి సత్య యుగం మొదలవ్వుదని నమ్మఖ్ఖం.మన దేశంలో చాలామంది నమ్మక్కం ఏమిటంటే  ఆ తేది లోపు "కల్కి అవతార పురుషుడూ" వస్తాడని.దీని గురించి టన్నుల కొద్ది సాహిత్యం ఉంది. ఏది ఏమైనా కొత్త కాలెండర్ రావడం ఖాయం.

ఇక ప్రళయం  అంటే ఈ బూమికి చేటు తెచ్చే ఉపద్రవాలు ముంచుకొచ్చి మనమంతా పోతామని. ఇది నమ్మే మాట కాదు కాబట్టి దానిగురించి ఆందోళన అనవసరం. ఇంకా వివరాల  కొరకు క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యండి 
                        http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_8271.html 

"విజయ కుమార్" "కల్కి భగవాన్" గా ఎందుకు అవతారం ఎత్తాడో తెలుసా?!.

http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_7767.html
( పూర్తి టపా కోసం పై లంకె మీద క్లిక్ చెయ్యండి)   

Thursday, November 22, 2012

’షర్మిల’యే "కలికి" అవతారమా?

                                                           
"కలికి", అంటే అందమయినది, ప్రక్రుతి అనే అర్థంలో చూడవచ్చు. ఈ పదాన్ని అలా అన్వయిస్తే, మన"రాజన్న కూతురు" గా ప్రజల వద్దకు వెల్తున్న"మరో ప్రజా ప్రస్తానం" నాయకు రాలు "షర్మిల" కలికి అవతరమా అనిపిస్తుంది.నిన్న ఆంద్ర జిల్లాల నుండి తెలంగాణ జిల్లాలో ప్రవేశించినప్పుడు "ప్రజలు" ఆమెకు పట్టిన బ్రహ్మ రథం చూస్తె కాసేపు అలా అనిపించింది.కాని ఈక్రింది కారణాల వల్ల కాదులే అనిపిస్తుంది.

  (1).పురాణాలలో కల్కి  పురుషుడు గా చెప్ప బడ్డాడు.

  (2).’కల్కి’ని ఎక్కువ మంది అనుసరించరు.

  (3).అతనికి ప్రజా సహకారం కంటే ప్రక్రుతి(దైవ),సహకారమే ప్రదానంగా ఉంటుంది.

  (4).అతని సైన్యం (అభిమానులు) మెరుపు వేగంతో పనిచెయ్యాలి.     కాని ఆ జనాన్ని చూస్తే   "జైల్లో ఉన్నా జర బయట ఉన్నా,జగన్ జగనేరా డోంగ్రే" అనే యస్.వి.ఆర్. డైలాగ్ గుర్తుకు వచ్చింది.

 కాబట్టి అమే కల్కి అవతారం కాదులే అనే నిర్ణయానికి రావాల్శి వచ్చింది.

చదువుకున్న వారి ద్రుష్టిలో "జగన్" కంటే "జయ ప్రకాష్ నారాయణే" సమర్దుడా?



 నేను నిన్న "ఆంద్ర ప్రదేశ్ లో సుపరిపాలన ఇవ్వగల నాయకుడెవ్వరు" అని సర్వే పోల్ పెట్టగా, "జయ ప్రకాష్ నారాయణ్" గారికే ఎక్కువగా ఓట్లు పోల్ అవుతున్నాయి.దీనిని బట్టి నాకొక డౌట్ ఏమిటంటే, చదువుకున్న వారి ఆలోచనలు, సామాన్యుల ఆలోచనలకి చాలా.... బిన్నంగా ఉన్నాయి.ఎవరిది కరెక్ట్ తీర్పు?.మీ అభిప్రాయాలకు ఆహ్వానం,  మీ అభిప్రాయాలు భగవంతుని సంకల్పం గా బావిస్తున్నాను.. ఈ నాటివరకు  "జయ ప్రకాష్ నారాయణే" గారి మీద నాకు ద్రుష్టి లేదు. ఆయన జాతకం చక్రాన్ని పరీసిలించి మీ ముందుంచుతాను.. అంతా మీదే నిర్ణయం.ఆ భగవంతుడే ఈ ప్రజలను సరైనా మార్గంలో నడిపిస్తాడనే   సంపూర్ణ విశ్వాసముతో.... 
                                                                           

Wednesday, November 21, 2012

"కల్కి" అవతారం కంటే ముందు "కల్తీ" సైతాన్ వచ్చేసింది.

                                                                    

కల్కి అయితే యుగాంతాని కి రావచ్చేమో కాని అంత కంటే ముందు "సైతాన్"(కలి) రూపాలు వచ్చేశాయి.వీటి ద్వారానే ప్రస్తుతం నడుస్తుంది "కలి యుగాంత" దశ అని చెప్పవచ్చు. మనం చూస్తున్న వివిద కలి రూపాలలో "కల్తీ" ఒకటి.
 నేను ఈవిషయం గురించి మీకు ఎక్కువగా చెప్పక్కర్లేదు అనుకుంటా? మనం పీల్చే గాలినుంచి, తినే తిండి వరకు కల్తీ లేనిది ఎక్కడో చెప్పండి.డబ్బులు కుమ్మరించిన "కల్తీ"లేని సరుకు దొరకడం కష్టం అవుతున్న ఈ రోజుల్లో అసలు మనం దేన్ని చూసి మనకున్న పాలనా వ్యవస్త బాగుందని కితాబివాలో అర్థం కావడం లేదు.

 మార్కేట్లో ఒక సహజమైన పండును చూడలేని, స్వచ్చమైన పాలు అందించలేని, మనది ఒక పాలనేనా? రోజూ  కల్తీ పదార్థాలు తిని తిని మన బుద్ది కూడ కల్తీ అయిపోయిందనుకుంటా! అందుకే "కల్తీ నాయకులకు" జై కొడుతున్నాం.వారు  తప్ప దిక్కు లేదని దేబిరిస్తున్నాం.

 మనకు ఈ కలి రూపమయిన "కల్తీ’ ని సంహరించి(నిరోదించి) కల్తీ చేయ్యా లనుకున్న వారి గుండేలో ఎవరు రైళ్లు పరిగెత్తిస్తారో వారే "కల్కి"అవతార పురుషుడు.ఆశ్రమాలు పెట్టి వ్యాపారాలు చేసేవారు కాదు గాక కాదు

       మేదావుల,చదువుకున్న వారి,  ఆలోచనలు సామాన్యుల కంటే మెరుగా ఉంటాయి అనే ఉద్దేస్యంతో  ఈ బ్లాగులో ఒక" సర్వె పోల్ "పెట్టడం జరిగింది.ఇది మాములుదే అనుకోకుండా తప్పకుండా మీ అభిప్రాయం ఓటు ద్వార  తెలుపుతారని ఆశిస్తూ...

"విజయ కుమార్" "కల్కి భగవాన్" గా ఎందుకు అవతారం ఎత్తాడో తెలుసా?!.

                                                                    
ప్రసిద్ద గురువుగా," కల్కి భగవాన్" గా శిష్యులచే పిలవ బడుతున్న, "ఒన్ నెస్" సంస్త స్తాపకుడి  అసలు పేరు విజయ కుమార్.ఇతను కల్కి భగవాన్ గా అవతార మెత్తడానికి  రెండు అంశాలు చెప్తుంటారు

(1), "నోస్ట్రా డామాస్"  తన భవిష్య వాణి లో రాబోయే యుగపురుషుడి పేరు "చైరన్" అంటే "విజేత" అర్థమట." విజయ కుమార్ అన్నా  అదే అర్థం కాబట్టి తనే ఆ యుగ పురుషుడినని శిష్యులని నమ్మించి మన అవతార పురుషుడి పేరు అయిన ’కల్కి భగవాన్"అని పెట్టుకుని  విజయం సాదించాడు(అంటే బాగా  సంపాదించాడు}

(2). "కల్కి  పురాణం ప్రకారం "కల్కి" బార్య "పద్మ’.ఈయన బార్య పేరు కూడ పద్మే కాబట్టి తామే అవతార పురుషులమని నమ్మించారు.

అంతకుమించి "కల్కి"కి ఆయనకు దేనిలోను పోలిక లేదు. ఈయన  ఆశ్రమమ్  వరదాయ పాలెంలో ఉంది.

మీ పేరుకి"తామర(కమలం) పుష్పం" కి ఏమైనా సంబందం ఉందా? అయితే మీరే "కల్కి" కావచ్చు.

http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_4908.html

పై లంకె మీద క్లిక్ చెయ్యండి

’కసబ్ వాదానికి’ "కల్కి వాదమే" కరెక్ట్ అయినది, మరియు చవకైనది.

                                                                     
అబ్బా! మొత్తానికి కసబ్ ని ఏసేసారు! ఉరి! ఇదంతా బాగానే ఉందిగాని ఈ  ధర్మ యుద్దం లో ఎవరు గెలిచారు "కసబా(ఉగ్రవాదం)? ప్రభుత్వమా(ప్రజాస్వామ్యం)? అనేది  సమీక్షించాల్సిన  అవసరం ఉంది.

కసబ్ వైపు లాభ, నష్టాలు:- వీళ్లెలాగు "ఆత్మాహుతి దళం" కాబట్టి  వీళ్ల ప్రాణాలకు విలువలేదు.ఒక వేళ ఉన్నా పదిమంది అనుకుంటా.కొంత ఆయుద సంపత్తి లక్షల్లో ఉంటుదేమో.  ఇది నష్టం. పోతే లాభం,ఏమిటంటే వాళ్ళ జాతికి "వీరులు" అన్న గౌరవం, ఒక పెద్ద దేశాన్ని వణికించామన్న త్రుప్తి,పది మందికి 166  ప్రాణాలు తీసామన్న పైశాచికానందం, ప్రంపంచస్తాయిలో  ఉనికి నిరూపణ.బారతీయ న్యాయ స్తానాలను అవహేళన చెయ్యడం(కసబ్ చేసింది},

ప్రభుత్వం వైపు లాభ, నష్టాలు:- మంచి సమర్దులైన పోలిస్ ఆఫిసర్లను కోల్పోవడం,166 మంది ప్రజలను కోల్పోవడం,నాలుగేండ్లు, విచారణ పేరుతో సుమారు ముప్పయి కోట్ల రూపాయలు ఖర్చు కావడం,  అయితే ఇక లాభం ఒకటే "ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించారు అని, దీనివెనుక "పాకిస్తాన్ వుంది" అనేది. ప్రపంచానికి చాటడం    

 ఏదైనా తీవ్రవాదానికి, తీవ్రవాదమే కరెఖ్టేమోఅనిపిస్తుంది. వాడిని ఆరోజే  ఖతం చేసి, ఉగ్రవాద తండాల మీద అమెరికా తరహాలో దెబ్బతీస్తే దీర్ఘ కాలిక ప్రయోజనాలు ఉండెవి.మన ప్రజలు శాంతమూర్తులు కాని మనదేవుళ్లు శాంతి మూర్తిత్వత్వం చెప్పలేదు. కరూణామయుడిని ఆరాదించే వాళ్లే శత్రు వినాశనం కొరకు అన్ని విదాల హింసను అమలు చేస్తుంటే మనకేమిటి ఈ దిక్కుమాలినతనం? కాబట్టి  కసబ్   వాదానికి’ "కల్కి వాదమే" కరెక్ట్ అయినది, మరియు  చవకైనది.  

Tuesday, November 20, 2012

మీ పేరుకి"తామర(కమలం) పుష్పం" కి ఏమైనా సంబందం ఉందా? అయితే మీరే "కల్కి" కావచ్చు.


"రవికిరణం తాకనిదే నవ కమలం విరిసేనా"
                                                       

మీ పేరు "తామర పువ్వు" సంబందం ఉన్న పేర్లు అంటే "కమల,కమల్ కుమార్,పంకజ్,పంకజం,అరుణ కుమార్,అరుణకుమారి,సూర్య,సూర్య కుమారి,అరుణోదయ,పద్మ,పద్మ కుమార్, ఈ విదంగా తామరకు కాని దాని వికాసానికి కారకు డైన సూర్యుడి పేరుతో కాని సంబందంఉంతే మీరే కల్కి కావచ్చు.మీ జాఅతక చక్రం లో నేను రాబోవు టపాలలో చెప్పే విదంగా గ్రహ,రాశులు ఉంటే తప్పనిసరిగా మీరే మేమంతా ఎదురుచూసే "కల్కి" అవతార పురుషుడు (స్త్రీ కూడా కావచ్చు.).మరి ఈ బ్లాగును డిసెంబెర్ 21 దాక చూస్తుండంది. ఒక వేళా మీరే అని రుజువైతే మా ఓట్లన్ని మీకే.

 ఇదంతా ఏమిటంటే"కల్కి" అనే పదానికున్న అర్థం!. "కల్క" అంటే "బురద".కల్కి అంటే "బురద లోనుంచి జన్మించినది "కమలం" లేక తామర పువ్వు.మీకు ఘంటసాల గారి పాటొకటి గుర్తుందా?"రవికిరణం తాకనిదే నవ కమలం విరిసేనా" అని. అదన్నమాట.సూర్యుడికి కమలానికి లంకె,ఇలా సూర్య కిరణాలు వల్ల వికసితమైన కమలం లాగా సూర్యుడివల్ల "కల్కి" శక్తి ఉద్వమవుతుందా? లేక ఆయన లేకఆమే పేరులోనే పై విదంగా ఉంటాయా? అన్నది తరవాతి తపాలలో తెలుసు కుందాం.
"లోటస్ మహల్" గురించి తెలుసుకోవాలంటే ఈ లంకె మీద క్లిక్ చెయ్యగలరు http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_7331.html

 వీక్షకులకు మనవి:- నేను ఈ టపాలో "సర్వే పోల్" ఒకటి పెట్టడం జరిగింది.మీ ఓటు ద్వారా అభిప్రాయం చెప్ప గలరు.ఇది సీక్రెట్ ఓటింగే. 

మనకు మంచి పాలన ఇవ్వగల నాయకుడెవరో చెప్పగలరా?

మేదావుల,చదువుకున్న వారి,  ఆలోచనలు సామాన్యుల కంటే మెరుగా ఉంటాయి అనే ఉద్దేస్యంతో  ఈ బ్లాగులో ఒక" సర్వె పోల్ "పెట్టడం జరిగింది.ఇది మాములుదే అనుకోకుండా తప్పకుండా మీ అభిప్రాయం ఓటు ద్వార  తెలుపుతారని ఆశిస్తూ..........యుగాంతం

"యుగాంతం" అంటే నవ్వులాట కాదు,"ప్రళయం" అంటే పరాచికం కాదు

http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_8271.html
(పై లంకె మీద క్లిక్ చెయ్యగలరు)

Monday, November 19, 2012

"యుగాంతం" అంటే నవ్వులాట కాదు,"ప్రళయం" అంటే పరాచికం కాదు

"ఇదే మహా విజ్ణానులు మయన్ల కాలెండర్",
                                                          
ప్రళయానికి, యుగాంతానికి తేడా తెలియని వారు,ఇంగ్లిష్ సినిమా చూసి  యుగాంతం అంటే ఇలా ఉంటుందా అని గజ గజ వణికే వారికి  ఒక శుభ వార్త .రాక్షస బల్లుల్లా మనం తుడిచి పెట్టుకు పోయే ప్రళయం" మాత్రం ఇప్పుడే రాదు లెండి. దానికి  ఎవ్వరయినా  గ్యారంటి ఇవ్వవచ్చు.

ఎందుకంటె,జీవ పరీణామం ఒక క్రమం లో అభివ్రుద్ది చెందినప్పట్టికి దాని అంతం అలాగే ఉండాలని రూలేమి లేదు.దీనికి ఉదాహరణ"రాక్షస బల్లులే".ఇది ఆస్తికులు చెప్పిందికాదు "నాస్తికులు" చెప్పిందే.
 ఈ మద్యకొంత మంది "యుగాంతం వాయిదా" అని ఫేస్ బుక్ లో పెట్టారు.అది చూస్తే నాకు కొంచెం జాలి వేసింది.యుగాంతం అన్నది ఒక కాలగణితం ఆదారంగాచెప్పే మాట."ప్రళయానికి దానికి సంబందం లేదు."మయన్లు" కాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం వచ్చే నెల 21 వ తారీకున "యుగాంతమే".ఇందులో నవ్వుకోవల్సినది ఏముందో అర్థం కావటం లేదు.

  వారి కాలెండర్ ప్రకారం ఆ రోజు తో వారి కాలెండర్ ఆపుచేసారు అంటే వారికి వారి లెఖ్క మీద ఎంత నమ్మక్కముందో దీనిని బట్టే తెలుస్తుంది.తిరిగి నూతన కాలేందర్ ఆవిష్కరించ బడుతుంది."మనం దీపావళి చేసుకోనంత మాత్రానా అమావాస్యే రాదు" అన్నట్టుంది కొంత మంది పద్దతి చూస్తుంటే.
             కల్కి,వీరభోగ వసంతరాయులు,ఇవి బవిష్య వాణి.గణికుల శక్తి సామర్థ్యాలు బట్టి వారు పుట్టే తేదిలు ప్రాంతం అంచనాలు ఉండవచ్చు. 1999 లో ఏదొ వీరబోగ వసంత రాయలు పుడటాడని కొంతమంది రాసారు.అందులో "ఎక్కిరాల వేదవ్యాస్ గారు" ఒకరు.ఆయన జ్యోస్యాన్ని బౌద్ద గురువు "దలైలామా" గారే నమ్మినట్టుంది."శాంబవి"అనే బాల దేవతని ఇక్కడకు పంపించడంలో ఆంతర్యం అదే  అనుకుంటా."సూర్య నందియందు ఉద్భవం అయ్యేను" అని బ్రహ్మం గారి కాలజ్ణానం వ్యాక్యల అదారంగానే "శాంభవి" ని సూర్య నందికి పంపారు. ఇది అంతా అంత గొప్ప బౌద్దగురువు నమ్మటం వలనే కదా! మనం అనుకున్నవి అనుకున్న రూపంలో జరగనంత మాత్రాన అసలు జరుగదనికాదు.మనంఅర్థం చేసుకోవడం లో తేడా! అంతే!
 
" కల్కి రాని రాకపోని,వీర భోగ వసంత రాయుడు పుట్టని పుట్టకపోని,ఈ బూమి మీద ఉన్న నాస్తికులు ఒక్క పెట్టున అడ్డం తిరిగినా "యుగాంతం" జరిగి తీరుంది. ఎందుకంటే అది "కాల చక్రం". దానిని ఆపడం ఎవరి వల్లాకాదు. అసలు మయన్లు ఎవరు? వారేమి చెప్పారు? అనేదాని మీద చాలాసమాచారం నెట్లో దొరుకుతుంది. ఆసక్తి ఉన్న వారు చూడ వచ్చు. తరవాటి టపాలలో నేను దాని గురించి చెప్పుకున్నాకే,మళ్లి "కల్కి" దగ్గరకు వెళదాం.   ,    

జడలు పెంచుకుని "చంద్రగిరి" వచ్చే,"జగన్నాయకులు" ఎవరు?




 కాలజ్ణానం లో ఒక చోట "జడలు పెంచుకుని జగన్నాయకులు చంద్రగిరి చేర వచ్చేను"  అని ఉంది. ఈ జగన్నాయకులు ఎవరు? జదలు పెంచుకుని రావడమేమిటి?అది కూడా చంద్రగిరికి రావడమేమిటీ? అనేది విశ్లేషిస్తే నాకు ఈవిదంగా అనిపించింది.

 చంద్రబాబు గారు, ఒక వేళ చంద్రగిరి నుంచి పోటి చేస్తే అయన మీద పట్టు దలకు పోయి  జగన్ గారు, కూడ  అదే నియోజక వర్గం నుంచి పోటి చేస్తాడా? ఇక్కడ జడలు పెంచుకోవడం అంటే పట్టుదల పట్టడం అని అర్థం కావచ్చు. జగన్నాయకులు అంటే "జగన్" గారె
కావచ్చు. ఏదైనా ఆసక్తికర అంశమే కదా? మొత్తానికి రానున్న ఎన్నికలు బహు రంజుగా ఉంటాయ్యన్న మాట!

జగన్ గారికి "కల్కి" కి ఉన్న లింక్ ఏమిటో తెలియాలంటే ఈలంకే ను క్లిక్ చెయ్యాలిhttp://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_7331.html

బుద్దికి భూములేలాలని ఉన్నా, రాత "పావురాల గుట్టను" అడ్డం పెడుతుంది!

http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_18.html
 (పూర్తి టపాకోసం లంకె మీద క్లిక్ చెయ్యగలరు)

Sunday, November 18, 2012

బుద్దికి భూములేలాలని ఉన్నా, రాత "పావురాల గుట్టను" అడ్డం పెడుతుంది!


                                                                          

ఏమిటి సామెతను మార్చేసాను అనుకుంటున్నారా!.అవును అనుబవం లో నుంచి పుట్టేవే సామెతలు. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగదు. జరిగితే ఆ దేవుడిని(దేవతని) మనం మర్చి పోతామని ఆయన భయం కాబోలు.

  నేను చెప్పే ఈ సామెత మన ప్రియతమ దివంగత ముఖ్యమంత్రి శ్రీ రాజ శేఖర్ రెడ్డి గారి గురించే.నిజంగా ఆయన ఒకగొప్ప అడ్మినిస్ట్రేటర్ అని చెప్పవచ్చు. ఆయన ఊహించిన విదంగా ఆయన అనుకున్న"అపరేషన్ ఆకర్ష్" కనుక విజయవంతమైతే,ఈ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు పరేషానే. 2014 కల్లా వందమంది కార్యకర్తల బలమున్న అన్ని పార్టీలలోని  చోటా,మోటా నాయకులంతా "వై.యస్.ఆర్,జిందాబాద్" అనే వాళ్లు.రాహుల్ గాందికి మద్దతిచ్చే అంశంతో ఇక్కడ ఎదురులేని రారాజుగా మన రెడ్డి గారు తెలుగు నేలను మరొక 2౦ సంవత్సరాలు ఏకదాటిగా పాలించే వారు.ఇది ఆయన బుద్ది బలం.కాని ఏమి జరిగింది చివరకు?

  భగవంతుడి ఆలోచన వేరుగా ఉంది. తెలుగు నేల మీద ఏదో ఒక కొత్త శక్తి రావాలనో,లేక రోశయ్య,కిరన్ కుమార్ రెడ్డి గార్ల జాతక చక్రంలో ముఖ్య మంత్రి యోగం ఉండటం వలనో,అయన మార్గంలోకి "పావురాల గుట్ట"ను(రాజశేఖర్ రెడ్డిగారు ప్రమాదానికి గురి అయిన హెలికాప్టర్ ను డీ కొట్టింది "పావురాల గుట్ట" యే’) అడ్డంగా పెట్టాడు.కనిసం అయన కొడుకునైనా వెంటనే సింహాసనం మీద కూర్చో బెట్టాడ అంటే అదీ లెదు తీసుకెళ్లి జైలులో కూర్చో బెట్టాడు. పాపం ఇంటిల్లి పాదిని,ఎప్పుడు ఎండ ముఖం ఎరుగని పిల్లల్ని ఎండలో త్రిప్పి హింసిస్తున్నాడు. ఇదీ ఆయన రాత!అసలు ఆ భగవంతుడి ఉద్దేశ్యం ఏమిటి? కాలం మాత్రమె సమాదానం చెప్పగలదు.మనం ఊహించినా వేస్టే.ఎందుకంటే మన ఊహకందనివే కదా దైవ లీలలు!.     

Saturday, November 17, 2012

వారేవ్వా! ముస్లిమ్ లు కూడ "కల్కి పురాణం" నమ్ముతున్నారు!

http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_982.html
(పూర్తి టపా కోసం లంకే మీద క్లిక్ చెయ్యండి)

అయ్యలారా! అమ్మలారా! వినండహో! మహమద్ ప్రవక్తే కల్కి అవతారమట!

                                                                   
                                      
 అదండి సంగతి! క్రిష్టియన్లు యేసు ప్రభువే కల్కి అవతార మంటుంటె మేమేమి తక్కువ తిన్నాం, అన్నట్లు ముస్లింలలో కొంతమంది "మహమద్ ప్రవక్తే భూమి మీద జన్మించిన చివరి అవతారం కాబట్టి ’కల్కి ’అంటే ఎవరో కాదు సాక్షాత్తు "మహమద్ ప్రవక్తే" అని బల్ల గుద్ది వాదిస్తున్నారు.దీనిని నిరూపించటానికి కల్కిపురాణం,శ్రిమద్బాగవతం,భవిష్య పురాణాలలో చెప్పిన భవిష్యాలు తమ ప్రవక్త కు సరిగ్గా సరిపోయాయి అని  మురిసి పోతున్నారు . వాటిలో మచ్చుకు కొన్ని:--

కల్కి పుట్టేది  "శంబళ" అనే ప్రాంతం:- శంభళ అంటే "ప్రశాంతమయిన  ప్రాంతం" అని అర్థమటా !. మహమద్ పుట్టిన "దారు సలేం" అన్నా అదే అర్థమట!.

కల్కి తండ్రి పేరు "విష్ణు  యశుడు" అంటే "దైవ సేవకుడు" అని అర్థమట! ప్రవక్త తండ్రి "అబ్దుల్లా" పేరులోని అర్థం కూడ అదేనటా!

కల్కి తల్లి పేరు " సుమతి" అంటే"శాంతి దూత"అటా! ప్రవక్త తల్లి అమీనా అన్నా అదే అర్థమట!

 ఇలా చెప్పుకుంతూ పోతే చాట బారతమ్ అయ్యేటట్లుంది! కాబట్టి సంబందిత లంకె ను ఇస్తున్నాను క్లిక్ చేసి చూడగలరు.

ఏతా వాతా చెప్పేది ఏమిటంటే హిందువుల కన్నా హిందూ బవిష్య పురాణాల మీద ఇతర మతస్తులకే ఎక్కువ నమ్మకం ఉన్నట్లుంది. అందుకే వారు మా ప్రవక్త కల్కి అంటే, మా ప్రవక్త కల్కి అని తెగ ఊదేస్తుంటె, ఈ హిందువులేమో ,ఎప్పుడొ కొన్ని లక్షల యేండ్లకు గాని కల్కి పుట్టడు అని హాయిగా కాలంవెళ్లదీస్తున్నారు.

కాని నేనైతే కల్కి ఈ సంవత్సరం చివరికల్లా వస్తాడని ఎందుకో మహా నమ్మకంగా ఉంది.చూద్దాం ఏమి జరుగుద్దో!     

(http://www.islamicvoice.com/november.97/OURD.HTM)

జగనే, కల్కి అవతారమా!?

http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_7331.html

( పూర్తి టపా కోసం లంకె ను క్లిక్ చెయ్యండి) 

Friday, November 16, 2012

"జగన్"గారి "లోటస్ పాండ్ మహల్" కి "కల్కి"కి ఉన్న సంబందం ఏమిటో తెలుసా?

                                                                    
ఇదే లోటస్ పాండ్ మహల్


 హైదరాబాద్ నగరంలో ఉన్న నివాస గ్రుహాలలో అతి పెద్ద గ్రుహం ఎవరిదో తెలుసా? ఇంకెవరిది! రాజశేఖర్ రెడ్డి గారి ఏకైక పుత్రుడు,వై.యస్.అర్ పార్టీ అద్యక్షులు  వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి "లోటస్ పాండ్".కొన్ని కోట్ల విలువ చేసే ఈ మహల్ కి ఈ పేరు ఎందుకు పెట్టారో? ఎవరు చెపితే పెట్టారో తెలియదు కాని, ఈ పెరుకు రాబోయే అవతార పురుషుడైన "కల్కి" పేరుకు సంబందం ఉంది.
                                                                      
ముందుగా "కల్కి" అంటే ఏమిటో తెలుసుకుందాం. "కల్క" అంటే ’మట్టి’ లేక ’బురద’ అనే అర్థం ఉంది. కాబట్టి "కల్కి" అంటే బుర్దలోనుంచి పుట్టినది "కమలం" లేక "తామర పుష్పం". అని అర్ఠమట.కాబట్టి కల్కి అవతార పురుషుడికి ఈ తామర పువ్వుకి ఏదో బలీయమైన సంబందం ఉండి తీరాలి.అందుకే బవిష్య కారులు పురాణాలలో నిగూడంగా" కల్కి" అనే నామంతో రాబోయే అవతార పురుషుడి జననం గురించి చెప్పి ఉంటారు.
                                                                    
 ఇప్పుడు ఆసక్తికరమఈన అంశం ఏమిటంటే "జగన్’ గారే కల్కి అవతారమా? ఇది ద్రుష్టిలో పెట్టుకునే ఈ మద్య కొంత మంది "యేసుక్రీస్తే" రాబోయే "కల్కి" అని ప్రచారం మొదలు పెట్టారా?అలా అయితే నెను ఇంతకు ముందు  టపాలలో చెప్పినట్టు, ఏసుక్రీస్తు,జాతక చక్రంలో ఉన్నట్ట్లు ఈయన జాతక చక్రంలో కూడ "రవి, బుదులు"ఒకే రాసిలో ఉన్నారా? లేదా? అనేది తరవాతి టపాలలో చూదాం.కల్కి కి నేను పైన చెప్పిన అర్థం కొర్కు నెను క్రింది లంకె ను ఆదారంగా తీసుకుని చెప్పాను.వివరాలు  కావాలంటే లంకె ను క్లిక్ చెయ్యగలరు.(సశేషం)
http://en.wikipedia.org/wiki/Kalki_Purana
http://www.deccanchronicle.com/tabloid/hyderabad/jagan%E2%80%99s-lotus-mahal-biggest-house-town-695








"అపరచితుడు" గెటప్ కు "నోస్ట్రడామస్" చిత్రమే ప్రేరణా?!

                                                                     

  పైన ఉన్న చిత్రాన్ని చూస్తుంటే " అపరిచితుడు" సినిమాలో అపరిచితుడు గుర్తుకు వస్తున్నాడు కదూ! ఇది ప్రఖ్యాత భవిష్య దార్శనికుడు నోస్త్రాడామస్ దర్శించించిన రాబోయే కలికి అవతారం లేక ప్రపంచ విజేత చిత్రమట. బహూశా ఈ బొమ్మను ప్రేరణగా తీసుకునే అపరిచితుడు గెటప్ తయారు చేసి ఉంటారు.

 ఈ బొమ్మలో కనపడుతున్న దానిని బట్టి, రాబొYఏ అవతార పురుషుడికి కొన్నిటితో సంభందం ఉన్నట్టు అనిపిస్తుంది. అవి (1)సింహం (2)సూర్యుడు (3) మత సంబందం (4)నల్లని& ఎర్రని వస్త్రాలు (5)బవిష్యత్తు దర్శించి రాసే లెఖకుడు లెదా దేవదూత . వీటి గురించి వివరంగా తెలుసుకుందాము.

          పై చిత్రంలొని రూపం ప్రసిద్ద భవిష్య దార్శనికుడు నోస్ట్రడామస్ చిత్రించినది అని తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ బొమ్మ ద్వార  బవిష్యత్తు అవతార పురుషుడు ఎవరని నోస్ట్రాడామస్ చెప్పాడో తెలుసుకుందాము. సాదరణంగా నోస్ట్రాడామస్ చెప్పిన సెంచరీస్ అన్ని ఇంచుమించుగా నక్షత్ర మండలం, రాశులు స్తానం ద్వార మరుగు మాటలో చెప్పాఅడు. కాబట్టి ఆయన చిత్రించిన ఈ చిత్ర్రాన్ని కూడ ఆ బాషలోనే డీ కోడ్ చేద్దాం.

  ఈ బొమ్మలో నక్షత్ర రాశులకు సంబదించినవి (1)సింహం (2) మనిషి(కన్య).క్రింది 2 సింహాలు మద్యలో మనిషి ని కన్య సింహ రాసులకు ప్రతీకలుగా బావించవచ్చు.అలాగే పై నున్న సూర్యుడి బొమ్మ సూర్యుడు కి ప్రతీక కాగ, రెండొ ప్రక్కన్న ఉన్న దేవదూత బుదుడుకి ప్రతీకగా చెప్పవచ్చు.

  దీనిని బట్టి, కన్య,సింహ రాసులుకు, వాటికి  అదిపతులైన సూర్యుడు బుదులకు, రాబోయే అవాతార పురుషుడుకు తప్పకుండా సంబందం ఉందని నోస్ట్రడామస్ దర్శించాడు. అంటే ఖచ్చితంగా ఈ అవతార పురుషుడి జనన సమయంలో సూర్యుడు బుదుడు ఒకే రాసిలోఉండాలి.ఆ రాశి కూడ తప్పకుండ మార్పును సూచించే రాసి అయి ఉండాలి. ఒక లెఖ్క ప్రకారం రానున్నది "ఆక్వేరియన్ ఏజ్" అంటె "కుంభరాశి యుగం"అని కాలజ్ణులు చెపుతున్నారు.అలాంటప్పుడు భహుశా కుంభ రాశిలో రవి, బుదులు, ఉండగా జన్మించిన వాడై ఉండాలి.  పైగా మత పరమైన చిహ్నాలు చిత్రించడం ద్వార ఈ రాబోయే అవతారం తప్పక మత నాయకుడై ఉందాలని తెలుస్తుండి. ప్రపంచంలోని వివిద మతాలలో ఈ కన్య బుద రాశులుకు వారి దేవతలకు ఉన్న సంబందం ఎమిటొ రాబొయే టపాలలో వివరంగా తెలుసుకుందాము అంతవరకు (సశేషం) 

Thursday, November 15, 2012

’స్త్రీ’,’పురుషుడు’కావడమనేది యుగాంతానికి గుర్తు అంటా!

!
కాలజ్ణానం లో వీర బ్రహ్మం గారు చెప్పిన "కలియుగ వింతల జాబితాలో" స్త్రీ పురుషుడుగా మారడం కూడా ఒకటి. ఇది యుగాంతానికి గుర్తు గా కూడా ఆయన అభివర్ణించాడు. సాదరణంగా బ్రహ్మంగారి కాలం నాటికి స్త్రీలను పురుషులుగా మార్చే టెక్నాలజి రాలేదు.ఈ రోజుల్లో కూడా పురుషులను స్త్రీలుగా మారుస్తున్నారు కాని, స్త్రీలను, పురుషులుగా మార్చినట్టు ఎక్కాడా జరుగలేదనుకుంటా.మరి ఆ రోజులలోనే బ్రహ్మం గారు ఈ విషయాన్ని చెప్పడమనేది ఊహ కందని విషయం.

                                                           

 బ్రహ్మం గారు చెప్పిన బవిష్యం నిజమైంది.ఈ మద్య "పింకి ప్రామాణిక్" అనే క్రీడాకారిణిని ఒక మహిళను రేప్ చేసిన కేసులో అరెస్ట్  చేసారు పోలిస్లు. ఈమే మన దేశం తరపున ఏసియన్ గేమ్స్ లో ఆడింది.అప్పుడు ప్రపంచం అంతా ఈమెను స్త్రీ గానే గుర్తించింది.కాని విచిత్రంగా అమే ఈ సంవత్సరమ్ జూన్ లో రేప్ అభియోగం మీద అరెస్ట్ అయింది. మూడు  రోజుల క్రితమె ఆమే మీద చార్జ్ షీట్ దాఖలు చేసారు.డాక్టర్లు ఇచ్చిన రీపోర్ట్ లో అమే పురుషుడెనని తేల్చారట!.ఎంత ఆశ్చర్యం! ఇన్నాళ్లు లోకమంతా స్త్రీ అని నమ్మిన వ్యక్తి, పురుషుడు గా డాఖ్టర్ల చేత నిర్దారింపబడటం!

దీని వల్ల మనం అనుకోవచ్చన్న మాట! యుగాంతం వచ్చేసిందని! అవును కదా మరి డిసెంబర్ 21 వ తారీకు ఇంకెన్ని రోజులుంది?అతి త్వరలోనే కదా. మనమంతా వీర భోగవసంత రాయలుని చూడొచ్చన్న మాట!హుర్రే!
 "పింకి ప్రామాణిక్" గురీంచి పూర్తి సమాచారం కావాల్సిన వారు ఈ లంకె మీద క్లిక్ చెయ్యగలరు.   
 (http://en.wikipedia.org/wiki/Pinki_Pramanik)   

ఏసు క్రీస్తు కు రాబోయే యుగపురుషుడు కల్కి అవతారం కు పోలికలేమీటి?

http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post.htmlపూర్తిటపా కోసం లంకె మీద క్లిక్ చెయ్యండి

Wednesday, November 14, 2012

బ్రహ్మం గారు చెప్పిన "చంద్రగుప్త మహరాజు","చంద్ర బాబు నాయుడు"గారేనా!?

http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_14.html
పూర్టి టపా కోసం లంకె మీద క్లిక్ చెయ్యండి

మీకు తెలుసా? "బాలదేవత శాంభవి" "సూర్య నంది"లో ఆశ్రమమ్ ఎందుకు నిర్మించాలనుకుందో?

ఎవరు ఏపని చేసినా స్వార్థమో, పరమార్థమో ఏదో ఒకటి ఉంటుంది.మన రాష్ట్రంలో టిబెట్ బౌద్ద గురువు "దలైలామా"పంపగా వచ్చిన దైవదూత, బాల దేవత "శాంబవి" ఎందుకు ఆంద్ర ప్రదేష్ లోని"సూర్య నంది" అనే ప్రాంతానికి వచ్చి హడావుడి చెయ్యడం వెనుక, బ్రహ్మం గారి కాలజ్ణానం,మరియు బౌద్ద గ్రంథాలలో ఉన్న బవిష్య వచనాల ఆదారంగా,దలైలామా గారు ఇచ్చిన ప్రోద్బలం ఉందని మీకు తెలుసా? తెలియకపోతే పూర్తి వివరాల కోసం ఈ  లంకె మీద క్లిక్ చెయ్యండి! http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_11.html

Sunday, November 11, 2012

మీకు తెలుసా? "బాల శాంభవి" "సూర్య నంది"లో ఆశ్రమమ్ ఎందుకు నిర్మించాలనుకుందో?

మీకు తెలుసా? "బాల శాంభవి" "సూర్య నంది"లో ఆశ్రమమ్ ఎందుకు నిర్మించాలనుకుందో?

 మీకు గుర్తుండె ఉంటుంది ఆ మద్య బాల దేవత శాంబవిని, ఆమె తల్లి అనబడే ఉషా రాణి తీసుకు వచ్చి,"సూర్య నంది" వద్ద ఒక ఆశ్రమం కట్టాలని ప్రయత్నించడం,వారు చేసిన హల్ చల్ కి వీపరీతమైన పబ్లిసిటి వచ్చి,చివరకు ఈ రాష్ట్రంలోని,కొంతమంది బాల హక్కుల పరిరక్షణ వాదులు చూపిన అత్యుత్సాహంతో, వారు ఈ రాష్ట్రం వదలి వెళ్లడం,వగైరా,వగైరా.
  ఎంతవర్కు ఆ ఆమ్మాయి జీవితం ఏదొ నాశనం అయిపోతుందని గగ్గోలు పెట్టారే కాని,అసలు ఆ అమ్మాయి ప్రపంచం అంతా వదలిపెట్టి కేవలం మన తెలుగు ప్రాంతమైన "సూర్య నంది" కే ఎందుకు వచ్చింది? ప్రంపచ ప్రస్సిద్ద బౌద్ద గుర్వు "దలైలామా" గారూ ఆమేను ఇక్కడకు పంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?అని ఆలోచించారా? లేదు.ఈరాష్ట్రంలో లక్షలాది మంది బాలల జీవితాలు నాశన మవుతుంటే పట్టిచ్చుకోలేరు కాని "ఒక ’ప్రత్యేక  పని’మీద వాచ్చిన వాళ్లను మాత్రం నానా యాగి చేసి పంపారు.ఆ తర్వాత వాళ్లటు,వీళ్లిటు అంతే!

   మీకు తెలుసా? బ్రహ్మం గారి కాలజ్ణానంమరియుప్రసిద్ద బౌద్ద గ్రంథాలలో , రానున్న అవతార పురుషుడు ఈ రాష్ట్రం నుంచే వస్తాడని బవిష్య వాణి రాసుందని?!."సూర్యుని యందు ఉద్బవం అవుతాడని"రాయబడిన ఆ గ్రంథాలలోని వ్యాక్యల ఆదారంగానే "దలైలామా" తన శిష్యురాలైనా శాంభవిని సూర్య నంది అనే ప్రాంతంలో అవతార పురుషుడు వస్తున్నాడని,ఆయన వల్ల టిబెట్ విమోచన జరుగనుందని ప్రకటించాల్శిందిగా దైవ దూత గా ఉషా రాణిని తోడిచ్చి పంపారు.             
                                                      

 ఆమే రాను వచ్చింది ,వచ్చే జనవరి లోపు "వీర బోగ వసంత రాయలు" వస్తాడని చెప్పటం జరిగింది,అందరికి తెలియ చెప్పి తాను వెళ్లి పోవటం జరిగింది.ఇప్పటికి వాళ్ళ నమ్మకం ప్రకారం మన రాష్ట్రం నుంచే అవతార పురుషుడు జనవరి లోపు పకటితమవుటాడని ఎదురు చూస్తున్నారంట! మరి సూర్య నంది ప్రాంతానికే ఎందుకు వచ్చారంటే " సూర్యుని యందు ఉద్బవం" అనే మాటను భవిష్యకారులు పొరపాటు గా అర్థం చేసుకుని "సూర్య నంది" ప్రాంతం  అనుకుని ఇక్కడకు పంపించి ప్రచారం చేసారు.
            వారి నిర్దేశిత కార్యక్రమం ఏమిటంటే ,"దలైలామా" గారు కూడా "సూర్య నంది" ప్రాంతాన్ని సందర్సించి "శాంబవి" ని ఆశిర్వదించి,ఆమె ద్వారా "వీరభొగ వసంత రాయుడి" అగమనాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలియపరచడం.కాని గమ్మతు ఏమిటంటే ఈ రాష్ట్రంలో బౌద్ద మతాన్ని అభిమానించే వారే వారి ప్రయత్నాలకు గండి కొట్టారు. అందుకే వీరి హడావుడి చూసి "దలైలామా" తన సూర్యనంది"సందర్శన మానుకున్నారు.ఉషా రాణి శాంబవి తో సహా "దర్మ సాల"కు వెళ్లి పోవటం జరిగింది.  

  మరి ఇంతకు వారు నమ్మి ప్రచారం చేసినది జరుగుతుందా? జరగదా? తెలుసుకోవాలని కుతుహలంగా ఉన్నారా? ఈ బ్లాగును అనుసరించండి,మీకు చెపుతాను.మరి నాకు కూడా, పరిశోదించటానికి సమయం కావాలి కదా!
                                                              

                                       

Thursday, November 1, 2012

ఏసు క్రీస్తు కు రాబోయే యుగపురుషుడు కల్కి అవతారం కు పోలికలేమీటి?

                                                                    
                                                                       
గత కొన్ని సంవత్సరాలుగా కొంత మంది  విదేశి భవిష్యకారులు యేసు ప్రభువే కల్కి అవతారంగా వస్తాడని భవిష్యత్ గ్రందాలలో ఉన్నదని ప్రచారం చేస్తున్నారు.( గూగుల్ శొదన ద్వారా ఎవరైనా ఇటువంటి ప్రచారపు రాతలను చూడవచ్చుhttp://www.prophet666.com/2009/07/bible-prophecy-on-kalki-avatar.html#comment-form_5890978538720982908)    .  అయితే అసలు బవిష్య యుగపురుషుడుకి , జీసస్ క్రైస్ట్ కి  ఉన్న సంభందం ఏమిటి? కేవలం తమ మత ప్రవక్త మీద ఆరాదనతో ఇలా చెపుతున్నారా? అలా అయితే వారు ఖచ్చితంగా కల్కి అవతార జననం కరక్టే అని నమ్మితేనే కదా! యేసు క్రీస్తే కల్కి అని ప్రకటించ బూనటం. ఇవన్ని ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు. దీని గూర్చి విశ్లేషిస్తాను. ఆలోచించండి.


  యేసు క్రీస్తు జనన తేది  గురించి కూడ వివాదాలు ఉన్నప్పటికి అధిక ప్రజలు ఆమోదించిన అదికారిక సమాచారం ప్రకారం "క్రిస్టమస్" గా నేడు జరుపుతున్నది ఆయన జన్మ దినమే. ఆయన జన్మ సమయాని అనుసరించి ఆయన జాతక చక్రం ఈ విదంగా ఉంది( దీనిని వికిపీడియా ద్వారా సేకరించడమైనది) http://en.wikipedia.org/wiki/File:Horoscope-Christ.jpg#filehistory


                                                                        File:Horoscope-Christ.jpg

         పై రాశి చక్రం ప్రకారం యెసు క్రీస్తు జన్మించే సమయానికి  రవి(సూర్యుడు), బుదులు ఒకే రాశిలో ఉన్నారు.అదే మకర రాశిలో ఉన్నట్లు మనం చిత్రంలో చూడవచ్చు. నేను ముందు టపాలో రాబొయే యుగ పురుషుడు  నోస్ట్రాడామస్ చిత్రం ప్రకారం తప్పకుండా రవి బుదులు ఒకె రాశిలో ఉండగా జన్మించిన వాడై ఉంటాడు అని వివరంగా చెప్పటం జరిగింది.కావాలంటె ఈ లింక్ మీద క్లిక్ చేసి పూర్తి టపాను చదవగలరు.(నేను ఆ టపా రాసే సమయానికి యేసు క్రీస్తు జన్మ చక్రం చూడలేదు.ఇది నిజం.)  http://kalkiavataar.blogspot.in/2012/10/2.html


   కాభట్టి యెస్తు క్రీస్తు జననంలోను, రాబోయే యుగపుర్య్షుడి జననంలోను రవి బుదులు ఇరువురు ఏక రాశిలో ఉండటం అనే పోలిక వలన "క్రీస్తు రెండవ రాకడ" కల్కి అవతారమని పైన చెప్పిన వారు ప్రతిపాదించి యుండవచ్చు. నోస్త్రాడామస్ కూడ ఆ విదంగానే దర్శించడమో, ఊహించడమో చేసి ఉండవచ్చు. అదే నిజమైతే కల్కి అవతారం కూడ ఇదే గ్రహచారం (రవి, బుదులు) కలిగి ఉండాలి కథా! ఉందా చూదాం, రాబోయే టపాలలో.(నేను రాస్తున్న టపాలన్ని అప్పటి కఫ్ఫుడు సేకరించిన సమాచారం ఆదారంగా రాస్తున్నవే.అందు చేత ఎప్పటి దప్పుడు టపాగా పెట్టడం జరుగుతుంది.డీనిని ఆశు పరిశోదనగా బావించవచ్చు.నేను ఇటు వంటి పరిశోదనకు పూనుకోవడం ఆ దైవ సంకల్పం లో బాగమనుకుంటా)