Showing posts with label భారతీయుల బానిసత్వానికి కారణం. Show all posts
Showing posts with label భారతీయుల బానిసత్వానికి కారణం. Show all posts

Friday, July 12, 2013

భారతీయుల బానిసత్వానికి కారణం గీతా బద్దులా? చేతగాని "బుద్దులా"?


                                                           

  హిందూ మతం అంటే పడనివారు చరిత్రను ఎంత వక్రీకరించారో, వక్రీకరిస్తూ హిందుత్వం మీద విషం గ్రక్కుతున్నారో, విదేశి గన్నయల తత్వపైత్యం తెలియచేస్తుంది. అలాంటి వారి వక్ర బాష్యాలు  ఎలా ఉన్నాయో ఒక ఉదాహరణ చూడాం. అన్నం ఉడికిందా లేదా అని చూడటానికి అన్నం అంతా పట్టి చూడక్కరలేదు.నాలుగు మెతుకులు పట్టి చూస్తే తెలిసి నట్లే వీరి వక్ర బాష్యాలు ఎలా ఉంటాయో చెప్పటానికి వారు చెప్పిన కొన్ని వ్యాక్యలు విశ్లేషిస్తే చాలు.

 "కృష్ణుడుతనను సర్వాంతర్యామిగా, సర్వశక్తివంతుడుగా చెప్పుకొని అర్జునుడితో పాటు అందరినీ తనకు లొంగిపొమ్మన్నాడు. ప్రపంచ మత సాహిత్యంలో అంత ఆడంబరంగా గొప్పలు చెప్పుకున్న ధోరణి మరి ఎక్కడా కనిపించదు. తన శక్తిని శంకించిన వారినందరినీ ఖండించాడు. అలాంటి తత్త్వం అత్యున్నతమైందని మన నాయకులు పొగిడారు. మనదేశం శతాబ్దాలుగా లొంగిపోయిందంటే ఆశ్చర్యమేమున్నది. ఇరానియాన్లూ, గ్రీకులూ, బాక్టీరియన్లూ, కుషాణులూ, హుణులూ, శాక్యులూ, అరబ్బులూ, తురుష్కులూ, మొగలులూ, ఆఫ్ఘన్లూ, పోర్చుగీస్, ఫ్రెంచి, బ్రిటిషువారికి భారత జాతి లొంగిపోయింది. 1962లో చైనావారి తన్నులకు గురయింది. ఇదంతా లొంగుబాటు తత్త్వ సారాంశమే."(గీతకు తత్త్వం ఉందా?-14--The truth about Gita by  Narla).
 
  పై  బాష్యం  చూస్తే ఎంట వక్రంగా ఉందో అర్దమవుతుంది. భారతీయులందరికి తెలిసిన గీత లో అర్జునుడు యుద్దరంగం లో వైరి పక్షం లో ఉన్న బందువులందరిని చూశి , వీరందరిని సంహరించడం తన వల్ల కాదని వైరాగ్యం తో దుఃఖిస్తుంటే " నీవు నిమిత్త మాత్రుడవు, చంపు నీవెవ్వరూ, చచ్చు వారెవ్వరూ? అన్నీ నేనే,కర్మలను చేయుటయందే నీకు అధికారముంది కాని ఖర్మ పలితం పైన కాదు. నీవు ఖర్మ పలితమునకు కారణం కారాదు, అట్లని ఖర్మలు చేయుట మానరాదు" అని మహోన్నతమైన తత్వం భోదిస్తే, దానితో తనకు కలిగిన వైరాగ్యం నుండి విముక్తుడై, సుడి గాలిలా చెలరేగి యుద్దం చేసి పాండవులకు విజయం చే కూర్చాడు అర్జునుడు.

   మరి పైన తెల్పిన దానిలో ఎక్కడైన శత్రువులకు లొంగి పొమ్మని క్రిష్ణుడు చెప్పినట్లు ఉందా? కాడి వదిలేసిన వాడిని కార్యోన్ముఖుడుని చెయ్యటం బానిసత్వం అవుతుందా? ఏమిటీ పిచ్చి రాతలు!?
సరే మరి ! వీరు విపరీతంగా ఆరాధించే బుద్దుడు ఏమన్నాడో చూద్దాం.

 . జీవ హింస వద్దన్నాడు.పెండ్లి చేసుకోవద్దన్నడు. మద్యం మాంసం తినవద్దన్నాడు. అలా ప్రక్రుతికి విరుద్దమైన పనులు అన్నీ చెప్పి ప్రజలను రాజులును నీరస వాదులుగా మార్చాడు. మన చరిత్రలో అశోక చక్రవర్తే గొప్ప ఉదాహరణ. అంత గొప్ప వీరుడే బౌద్ద మతం తీసుకున్నాక శాంతి పరుడై పోయాడు. ఎవరి డ్యూటి వారు చెయ్యాలి అనే సూత్రమ్ మరచి, ప్రజల్ని రక్షించాల్సిన రాజులే, సన్యాసులై తత్వాలు చెపుతుంటే, విదేశియులు దండ యాత్రలు చేస్తే ఏమి చెయ్యగలరు? కత్తులు తిప్పాల్సిన చోట తత్వాలు చెపితే శత్రువులు "చెవిలో పువ్వులు" పెట్టుకుని వింటుంటారా? వినరు కదా౧ అందుకే మన చేత కాని బుద్దుల వల్ల మన దేశం విదేసియుల దండ యాత్రలకు గురి అయి బ్రష్టు పట్టి పోయింది.

  విజ్ణులైన వారు ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి తాత్వికంగా  గొప్ప వాడు కావచ్చు.కాని ఆయన బోదించిన తత్వమే మన దేశాన్ని విదేసియుల దండయాత్రలనుండి ఎదుర్కోలేని దద్దమ్మలుగా, స్వదేశియులుని చేస్తే దాని వల్ల మనకు కలిగింది లాభమా? నష్టమా?. బుద్దుడు వ్యక్తిగతంగా  మహాత్ముడు కావచ్చు. కాని ఆయన చెప్పిన విదానం ప్రక్రుతికి విరుద్దం. అది ఒక విపల తత్వమ్ అనడానికి,  గన్ లు పెట్టి కాల్చుకుంటున్న బౌద్దులే ప్రతీకలు.

   హీందూ మతం అంటే అది అన్ని  మతాల వలే  కాదు. ఒక జీవన విదానం. అది అందరి తత్వాలలోని మంచిని గ్రహించింది. హిందూ సముద్రంలో అన్ని నదులు కలుస్తున్నట్లే అన్ని తత్వాలు ఇందులో ఇముడ్చుకుంది.బుద్దుడు చెప్పిన ఆచర్నాత్మక విదానాలను హిందూ మతం కాదనలేదు.అందుకే బుద్దుడును భగవానుడే అంది. పచ్చగడ్డి తినే పశువుకు ఏదో ఒక రకమ్ మేతతో జీవించ గలదు. కాని పశు దశ నుండి మనిషి దశకు ఎదిగిన జీవికి ఎదో ఓ ఒక రకమ్ కాదు. అన్నీ సమపాల్ళలో ఉంటేనే కమ్మని బోజనం. అలాగే హిందూ తత్వం ఏ వయసులో ఆ ముచ్చట అనే ప్రక్రుతి దర్మానుసారంగా " ఆశ్రమ జీవన విదానం" అవలంబించమంది.దానిలోనే త్రి మూర్తులను దర్శించవచ్చు. అది ఎలాగ్ ఈ లింక్ మీదhttp://ssmasramam.blogspot.in/2012/08/my-philosphy-doctrine-of-trinity-in.html క్లిక్ చేసి చూడండి.