Showing posts with label telangana bill issue. Show all posts
Showing posts with label telangana bill issue. Show all posts

Monday, February 17, 2014

సరి అయిన బిల్లు ఏమిటో నాయకులకు తెలియదు! సరి అయిన సమయం ఏమిటో లాయర్లకు తెలియదు!

                                                     


ఆల్  ఇండియా గ్రేట్ డ్రామా కంపెని అయిన  కాంగ్రెస్ వారు ఆడుతున్న నాటకంలో  మంచి రసవత్తర సీన్  నడుస్తుంది . అయితే ఇంత పకడ్బంది నాటకం ఆడి వారు రుజువు చేయడలచింది  ఏమిటంటే తాము రాజ్యంగ పద్దతులు తెలియని మూర్కులమని , తాము ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం తప్పా , దాని పలితాలకు తాము బాద్యులం  కాదని తెలంగానా ప్రజలకు తెలియచెయ్యదమే . దిని వలన రాష్ట్ర విభజన బిల్ పాస్ చేసినా దాని పలితం మాత్రం మాత్రం తెలంగాణా ప్రజలకు దక్కుద్దా లేదా అనేది అనుమానంగా ఉంది . . ఈ అనుమానాలు కలగటానికి గల కారణాలు ఇవి
(1). తెలంగాణా బిల్ మిద ఇప్పటివరకు 3 పిటిషన్ లు సుప్రీం కోర్టులో వేయడం జరిగింది . ఆ  మూడింటిని కోర్టు వారు ఒకే ఒక కారణంతో తిరస్కరించారు . అది ఏమిటంటే పిటిషన్ లు విచారించడానికి ఇది సరి అయిన సమయం కాదు, అ సమయం వచ్చాక తప్పకుండా విచారిస్తo అని. దిని వలన అర్దమయ్యేది ఒకటే.. విభజన బిల్ మిద పార్లమెంట్ నిర్ణయం వెలువడ్డాక పిటిషన్ వేస్తె తప్పకుండా విచారణకు స్వికరిస్తామ్ అని ఒక అభయం సుప్రీం కోర్టు వారు ఇచ్చినట్లే కనబదుతు0ది. సుప్రీం కోర్టు లో ఏంతో అనుభవమున్న సీనియర్ లాయర్లు పోయిన సారి వాదించి నపుడు ఇదే విషయం సుప్రిం కోర్టు వారు చెప్పినప్పటికీ "సరి అయిన సమయం " అంటే ఏమిటో తెలియక సిమాంద్ర లాయర్లు "ముద్ద ముద్దకు  బిస్మిల్లా " అన్నట్లు , కేంద్రం ఒక స్తెప్ వేయగానే పిటిషన్ ఒకటి వేస్తూ "సమయం వచ్చిందా , రాలేదా ? అని టెస్ట్ చేస్తున్నారు . ఇది లాయర్ల పరిస్తితి !

 (2). ఇక పొతే నాయకులు విషయానికి వస్తే , అసెoబ్లికీ పంపాల్సింది బిల్లో , డ్రాప్ట్ బిల్లో వారికి తెలియదు . కొన్ని గంటలు చర్చ జరిపాక "తూచ్ ' ఇది డ్రాప్ట్ బిల్ " అని మూజు వాణి  వొటుతో తిరస్కరిస్తారు . 117 మంది సబ్యులు అనుకూలంగా ఉన్న బిల్ మూజువాణితో వోటు తో తిరస్కారానికి గురి అవుతుంటే నోట్లో బెల్లం గడ్డలు పెట్టుకున్నట్లు మిన్నకుండి పోయారు  తెలంగాణ నాయకులు . పార్లమెంట్ మనదే అయినా , సుప్రీం కోర్టు మనది కాదు అన్న  జ్ఞానం లేకుండా పోయింది వారికి. ఒక వేళ తెలంగాణా బిల్ పార్లమెంటులో పాస్ అయినా కోర్టు వారు ఆపితే, దానివలన కాంగ్రెస్ కె లాభం . ఇచ్చిన మాటకు కట్టు బడి K.C.R గారు తమ పార్టిని కాంగ్రెస్ లో విలీనం చేయక తప్పదు . దాని వలన T.R.S నాయకులకు నష్టమైనా ,  K.C.R గారికి మాత్రం డిల్లీలో సోనియా గాంది గారి పర్మనెంట్ కోటరిలో మెంబర్ షిప్ లబిస్తుంది . ఎలాగు రాష్ట్ర విబజన ఆగింది కదా అని సిమాoద్రులు కిరణ్ గారికి జై అంటారు . కిరణ్ గారి ఖాతాలో జమ అయ్యే సీట్లు అన్ని అంతిమంగా కాంగ్రెస్ కు జమ అయ్యెవె ! ఇంత  మహత్తరమైన ప్లాన్ తో గొప్ప నాటకానికి తేరా తిసిందా కాంగ్రెస్ అనిపిస్తుంది . 
    (3) ఇక జాతీయ ప్రతి పక్ష హోదాలో ఉన్న B.J.P విషయానికి వస్తే, పార్లమెంటులో బిల్ ప్రవేశ పెట్టారో లేదో ఘనత వహించిన పార్లమెంటేరియన్ లకు తెలియదట ! బిల్ ప్రవేశం జరిగిపోయిందని అధికార పార్టి వారు అంటుంటే , "సభలో ఉన్న మాకు తెలియకుండానా ! అని బోల్డంత ఆశ్చర్య పోతున్నారు ప్రతి పక్ష నెతలు. చట్టాలు తయారు చేసే వారే , తమ పార్టి స్వార్దాల కోసం డ్రామాలు ఆడుతున్న దేశం లో ప్రజలకు దిక్కెవరు?
           ఈ డ్రామాల వల్ల  తెలుగు ప్రజలు చివరకు ఎ పరిస్తితులకు గురి అవుతారో రాబోయే వారం రోజులలో జరగబోయే పరిణామాలు నిర్ణయిస్తాయి .

 

Friday, February 7, 2014

టెన్షన్ తో తొందర పడి ముందే కూస్తున్న సిమాంద్ర కోయిలలు !

                                                                 
                                                         

దేనికైనా ఒక టైం  ఉంటుంది . అది అ టైం  ప్రకారమే జరుగుతుంది . వసంతకాలం లో కోయిలలు కూస్తాయి ,అంతే కాని కోయిల కూసింది కదా అని వసంత కాలం రాదు . వసంత కాలం రాకుండా కూసే కోయిల కూతలు తొందరపడి కూసేవే అవుతుంది . ఇదే విషయాన్ని రెండవ సారి మన సుప్రీం కోర్టు  వారు సిమాంద్ర నాయకుల పక్షానా వాదనలు వినిపించిన సుప్రీం కోర్టు న్యాయవాదులకు చెపుతూ, వారు దాఖలు చేసిన రాష్ట్ర విభజన మిద పీటిషన్లు ను సున్నితంగా తిరస్కరించారు .

  4 రోజుల క్రితం తెలంగాణా రాష్ట్ర విభజన ను చాలెంజ్ చేస్తూ సిమాo ద్రకు చెందిన వారు 9 పిటిషన్ లు వేసారు . గతంలో ఇలాగే వెయ్యగా అవి అపరిపక్వమైనవని , అసెంబ్లీ తీర్మానం కాని , కేంద్ర ప్రబుత్వ నిర్ణయం కాని జరుగకుండా వాటి మిద విచారణ జరపటం తొందరపాటు చర్య అవుతుందని కోర్టు వారు పెటిషన్ లను తిరస్కరించారు . ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం అయి పోయింది . విభజన బిల్ టెక్నికల్ గా తిరాస్కారానికి గురి అయిo ది . అయినా సరే రాష్ట్ర విబజనకే  కంకణం కట్టుకున్నట్లు కేంద్రం తెగ యాక్షన్ చేస్తుంటే , టెన్షన్ పెంచుకున్న సిమాంద్ర నాయకులు కొందరు తిరిగి చాలెంజ్ పిటిషన్ లు వేస్తె కోర్టు వారు గంటన్నర వాదనలు విన్నాక , గతంలో పిటిషన్ లకు ప్రస్తుతం వేసిన పిటిషన్ లకు పెద్ద తేడా లేదని పెదవి విరచి ఈ రోజు తిరస్కరించారు

  కాకపొతే సమైక్యతా కోరుకునే వారికి ఉన్న ఒక్క ఆశ  ఏమిటంటే , పిటిషన్లు తిరస్కరిస్తూ సుప్రీం కోర్టు వారు అన్న మాటలు . " కేంద్ర ప్రబుత్వం నిర్ణయం ఏమిటో తెలియకుండా పిటిషన్లు విచారించడం తొoదర పాటు చర్య అవుతుoది. కాబట్టి సరి అయిన సమయంలో వేస్తె పరిశిలించవచ్చు " అంది . అంటే కేంద్రం రాజ్యంగా ప్రకారం రాష్ట్ర విభజన చెయ్యడానికి ఇంకా అవకాశం  ఉంది అని సుప్రీం కోర్టు వారి అభిప్రాయం కావచ్చు. అది నిజమే . రాజ్యంగా బద్దంగా విభజన చెయ్యడానికి కేంద్ర ప్రబుత్వానికి ఆవకాశం  ఉంది . కానీ టైమే  లేదు . కాంగ్రెస్ వారు చెయ్యాలంటే ఇప్పుడున్న రూపంలోనే మమా అనిపించాలి .దానిని కోర్టువారు అడ్డుకునే ఆవకాశం  కూడా లేకపోలేదు . ఈ రోజు కోర్టువారు అన్న చివరి మాటలు అదే అభిప్రాయం కలిగిస్తున్నాయి . ఒక వేలా కోర్టులకు ఆ చాన్స్ ఇవ్వద్దు అనుకుంటే రాష్ట్ర విభజన బాద్యతను రాబోయే ప్రబుత్వానికి వదిలెయ్యాలి .అది కాంగ్రెస్ కి కష్టమైనా పనే . అందుకే డ్రామాలకు తేర తీసింది . చూదాం ఏమి జరుగుద్దో!

Tuesday, February 4, 2014

రాష్ట్ర విభజన ఆపడానికి ముఖ్య మంత్రి గారికి మరొక టెక్నికల్ అవకాశమిస్తున్నకేంద్ర మంత్రి మండలి !.

                                                        

నేను ఇదే బ్లాగులో తెలంగాణా రాష్ట్ర విభజన విషయం గురించిన టపాలలో తెలంగాణా బిల్ విషయంలో గొప్ప డ్రామా అడిస్తుoదని చెప్పటం జరిగింది . అటు  చేసి చేసి చివరకు తెలంగాణా ప్రజల చెవిలో పూవులు పెట్టడానికి కాంగ్రెస్ సర్కార్ డిసైడ్ అయిందని అర్ధమవుతుంది . దీనికోసం పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలు అందరిని వంచించే రీతిలో ఒక హై డ్రామా  నడపటానికి రంగం సిద్దమయింది . ఒక వైపు పార్లమెంటులో బిల్ పాస్ కావడానికి చిత్త శుద్దితో ఉన్నామని ప్రజలను నమించదానికి తెగ ఆరాట పడుతున్న కాంగ్రెస్ నాయకత్వం ఇంకొక వైపు సమైక్యామ్ద్రా చాంపియన్ గా తాము ప్రమోట్ చేస్తున్న ముఖ్య మంత్రి గారికి సుప్రీం కోర్టు ద్వారా రాష్ట్ర విభజన ఆపే విదంగా టెక్నికల్ అవకాశాలు ఇస్తున్నారు . అవేమిటో చూదాం . 

  రాజ్యాంగం ప్రకారం అసెo బ్లికి ఒరిజినల్ బిల్ పంపాల్సి ఉంది కాని అలా పంపలేదు . డ్రాప్ట్ బిల్ పంపారు . ఇది బలమైన టెక్నికల్ పాయింట్ . దిని సాకుగా చూపి ఆంద్ర ప్రదెస్ అసెంబ్లీ అ బిల్ ని తిరస్కరించింది . అంటే రాష్ట్ర విబజనను కాకుండా టెక్నికల్ పాయింట్ మిద రాష్ట్ర విభజన బిల్ ని తిరస్కరించి వెనుకకు పంపింది . దినిని సరిచేసి తిరిగి అసెoబ్లికి  పంపాలి కాని అలా చెయ్యకుండా డైరెక్టుగా అదే బిల్ ని ఈ నెల 10 వ తారికున రాజ్య సభలో ప్రవేశ పెడుతున్నట్లు హొమ్ మంత్రి ప్రకటించారు . ఇది మరో ఘోర తప్పిదం . రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర పతి మాత్రమె పార్లమెంటుకు బిల్ ని రికమెండ్ చెయ్యాలి. ఈ  విషయంలో కేంద్ర మంత్రి మండలి కలుగ చేసుకోవడం అంటే రాష్ట్ర పతి గారి అధికారాలను బంగపరచినట్లే . రాష్ట్రపతి గారు చెప్పాల్సిన మాటను పబ్లిక్ గా కేంద్ర మంత్రి చెప్పడం వలన మొత్తం ప్రొసిజర్ పనికి రాకుండా పోయే ప్రమాదం ఏర్పడింది . ఇది చాలు సుప్రీం కోర్టు వారు కలుగ చేసుకోవడానికి . మరి ఇలా చెయ్యటం వలన లాబపదెది ఎవరు ? నష్టపోయేది ఎవరు? తరవాతి టపాలో చూదాం . ఎందుకంటే డ్రామా ఈ రోజే మొదలయింది ,ఇంకా కొన్నాళ్ళు నడుస్తుంది కాబట్టి . మరింత సమాచారం కొరకు క్రింది వీడియోను చూడండి .