Showing posts with label telangana issue. Show all posts
Showing posts with label telangana issue. Show all posts

Wednesday, August 21, 2013

వీదిలో o.k. అని ఇంట్లోకి వచ్చి బావురుమంటున్న "బాబులు"

                                                             
    

 మొత్తానికి సోనియమ్మా సీమాంద్ర లోని లోని రాజకీయ బాబులుకు కంటిమీద కునుకు లేకుండా చేసింది . పాపం వారి పరిస్తితి చూస్తుంటే , జాలేస్తుంది . వీరి పరిస్తితి ఎలా ఉందంటే , వేలం పాటలో ఎచ్సులుకు పోయి నష్టానికి పాటపాడి , చివరకు ఉంచుకొలేక , వదులుకోలేక యాతన పడే పాటదారులా ఉంది .

  తెలంగాణా ఏర్పాటుకు అందరూ సై  అన్న వారే . ఇప్పుడేమో మీరు కాదని ఉంటే తెలంగాణాను  మా "అమ్మ " ఇచ్చేది కాదని అధికార పక్షం వారు బోరు మంటుంటే , "ఇస్తే ఇచ్చింది కానీ , సీమాంద్ర వారి ప్రశ్నలకు సమాదానం చెప్పకుండా ఇస్తే ఎలా కుదురుద్ది ? అని ప్రతిపక్షం వారు కన్నీళ్ళు పెట్టుకుంట్టునారు.  కాని ఇప్పట్టికైనా "అమ్మా , మీరేదో రాజకీయ డ్రామా కోసం అడిగారని "లేఖలు " ఇచ్చాం కానీ , మీరు సిన్సియర్గా అడుగుతునారని అనుకోలేదు తల్లీ " , కాబట్టి మా లేఖలు కి సీమాంద్ర ప్రజల అభిప్రాయానికి ఎటువంటి సంబందం లేదు . మేము  ఈ  విషయంలో "న్యూట్రల్ " గాళ్ళం , అని ఒక్క మాట నిజాయితీగా ఒప్పుకుంటే ,బంతిని కేంద్రం కోర్టులోకి తోసినట్లయేది . కాని అలా  చెయ్యరు . ఇంకా రాజకీయంగా ఏదో బావుకుందామనే ఆలోచన కాబోలు . తెలంగాణ ఇస్తే సీమాంద్రలో కాంగ్రెస్ పార్టీ , తెలుగు దేశం పార్టీ దాదాపు తుడిచి పెట్టుకు పోవడం ఖాయం . ఇవ్వకపోతే తెలంగాణాలో కొన్ని ప్రాంత్తాలలో దెబ్బ తింటాయి . హైదరాబాద్, రంగారెడ్డి ,ఖమ్మం ఇంకా కొన్ని ప్రాంతాలలో లోసెట్టిలర్స్ ప్రబావం ఎక్కువ అనేది పార్టీలు మరువ రాదు . కాబట్టి ఒక వేళ రాజకీయ లబ్ది కోసమే అయితే సమైక్యతకి వ్యతిరేఖంగా నిర్ణయం తీసుకున్న పార్టీలు నష్ట పోక తప్పదు .ఇప్పుడు నష్ట నివారణ కోసం ."ఆత్మ గౌరవ యాత్రలు , ఆత్మ ప్రబోద యాత్రలు , ఆత్మ ఘోష యాత్రలు అంటూ ప్రజలకి స్పష్టంగా తమ మనసులోని మాట చెప్పకుండా మబ్య పెట్టె పనులు చేస్తే , రెండు ప్రాంతాలలో కూడా  పార్టీ కి డిపాజిట్లు పోవడం ఖాయం . 


పిబ్రవరి ఒకటో తారీఖునే ఈ  బ్లాగులో స్పష్టంగా చెప్పాను.  "తెలంగాణా" ఇవ్వదనే గుడ్డి నమ్మక్కంతో. అందరూ విబజనకు సై  అన్నారు , కాని సోనియా గాంది వీరి పిల్లకాయ మాటలను నమ్మింది కాబట్టి తెలంగాణా ఇవ్వడానికే సిద్ద పడింది. ఎవరు అవునన్నా కాదానా  కాంగ్రెస్ అదిష్టానం తెలంగాణా ఇస్తుంది. అంద్రావాళ్ళ పిల్లాటలకు తగిన మూల్యం చెల్లించక తప్పదు"  అని .మరొక సారి  పోస్టును చూడాలనుకుంటే ఈ  లింక్ మీద క్లిక్ చెయ్యండి .http://kalkiavataar.blogspot.in/2013/02/blog-post.html .         
   .