ఒక సారి క్రింది వీడియోను చూడండి . ధర్మాన ప్రసాదరావు గారు , లక్ష్మి పార్వతి గారు Y.S.R పార్టిలో చేరుతున్న సీను. అందరికి పార్టి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు జగన్ గారు. అ సందర్బంగా అందరు నవ్వుతూ జగన్ ని ఆలింగనం చేసుకుని తమ ఆత్మీయతను చాటారు . కాని లక్ష్మి పార్వతి గారు మాత్రం ఎందుకో జగన్ కి తర్జని చూపిస్తూ మాట్లాడడం చూస్తుంటే ఏదో వార్నింగ్ ఇస్తున్నట్లే ఉంది . బహుశా తనను పార్టీలోకి చేర్చుకున్నాక పార్టికి ఏమైనా అయితే తనను ఏమన్నా ఊరుకోను, అని వార్నింగ్ ఇస్తున్నట్లుంది .గతంలో అన్నగారి పరిస్తితి చూసిన ఆమెకు ఎందుకైనా మంచిది అని ముందే జాగర్త పడుతున్నట్లు ఉంది .
2032 లో దక్షిణ భారతదేశానికి చెందిన హిందూ నాయకుడు ఆసియా ఖండంని ఏకం చేస్తాడు అని ప్రఖ్యాత భవిష్యద్రష్ట నోస్ట్రడామస్ తెలిపారు. అలాగే రాబోయే కాలం లో తాను వీరభోగవసంత రాయలుగా గా పుట్టి రాజ్యసింహాసనమ్ అదిష్టిస్తాను అని ఇండియన్ నోస్ట్రడామస్ గా పిలువుబడుతున్న శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల వారు తన కాలజ్ణానం లో చెప్పి ఉన్నారు. మరి వీరు తెల్పిన కాలజ్ణాన వాక్యాలు నిజమయ్యే అవకాశం ఉందా అనేదాని తో పాటు సమకాలీన రాజకీయాలు గూర్చి చర్చించడమే ఈ బ్లాగు పని.
Tuesday, February 11, 2014
జగన్ కి వార్నింగ్ ఇచ్చి మరి అక్కున చేర్చుకున్న లక్ష్మి పార్వతి !
ఒక సారి క్రింది వీడియోను చూడండి . ధర్మాన ప్రసాదరావు గారు , లక్ష్మి పార్వతి గారు Y.S.R పార్టిలో చేరుతున్న సీను. అందరికి పార్టి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు జగన్ గారు. అ సందర్బంగా అందరు నవ్వుతూ జగన్ ని ఆలింగనం చేసుకుని తమ ఆత్మీయతను చాటారు . కాని లక్ష్మి పార్వతి గారు మాత్రం ఎందుకో జగన్ కి తర్జని చూపిస్తూ మాట్లాడడం చూస్తుంటే ఏదో వార్నింగ్ ఇస్తున్నట్లే ఉంది . బహుశా తనను పార్టీలోకి చేర్చుకున్నాక పార్టికి ఏమైనా అయితే తనను ఏమన్నా ఊరుకోను, అని వార్నింగ్ ఇస్తున్నట్లుంది .గతంలో అన్నగారి పరిస్తితి చూసిన ఆమెకు ఎందుకైనా మంచిది అని ముందే జాగర్త పడుతున్నట్లు ఉంది .
Labels:
లక్ష్మి పార్వతి !
Location:
Garloddu, Andhra Pradesh 507168, India
Friday, February 7, 2014
టెన్షన్ తో తొందర పడి ముందే కూస్తున్న సిమాంద్ర కోయిలలు !
దేనికైనా ఒక టైం ఉంటుంది . అది అ టైం ప్రకారమే జరుగుతుంది . వసంతకాలం లో కోయిలలు కూస్తాయి ,అంతే కాని కోయిల కూసింది కదా అని వసంత కాలం రాదు . వసంత కాలం రాకుండా కూసే కోయిల కూతలు తొందరపడి కూసేవే అవుతుంది . ఇదే విషయాన్ని రెండవ సారి మన సుప్రీం కోర్టు వారు సిమాంద్ర నాయకుల పక్షానా వాదనలు వినిపించిన సుప్రీం కోర్టు న్యాయవాదులకు చెపుతూ, వారు దాఖలు చేసిన రాష్ట్ర విభజన మిద పీటిషన్లు ను సున్నితంగా తిరస్కరించారు .
4 రోజుల క్రితం తెలంగాణా రాష్ట్ర విభజన ను చాలెంజ్ చేస్తూ సిమాo ద్రకు చెందిన వారు 9 పిటిషన్ లు వేసారు . గతంలో ఇలాగే వెయ్యగా అవి అపరిపక్వమైనవని , అసెంబ్లీ తీర్మానం కాని , కేంద్ర ప్రబుత్వ నిర్ణయం కాని జరుగకుండా వాటి మిద విచారణ జరపటం తొందరపాటు చర్య అవుతుందని కోర్టు వారు పెటిషన్ లను తిరస్కరించారు . ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం అయి పోయింది . విభజన బిల్ టెక్నికల్ గా తిరాస్కారానికి గురి అయిo ది . అయినా సరే రాష్ట్ర విబజనకే కంకణం కట్టుకున్నట్లు కేంద్రం తెగ యాక్షన్ చేస్తుంటే , టెన్షన్ పెంచుకున్న సిమాంద్ర నాయకులు కొందరు తిరిగి చాలెంజ్ పిటిషన్ లు వేస్తె కోర్టు వారు గంటన్నర వాదనలు విన్నాక , గతంలో పిటిషన్ లకు ప్రస్తుతం వేసిన పిటిషన్ లకు పెద్ద తేడా లేదని పెదవి విరచి ఈ రోజు తిరస్కరించారు
కాకపొతే సమైక్యతా కోరుకునే వారికి ఉన్న ఒక్క ఆశ ఏమిటంటే , పిటిషన్లు తిరస్కరిస్తూ సుప్రీం కోర్టు వారు అన్న మాటలు . " కేంద్ర ప్రబుత్వం నిర్ణయం ఏమిటో తెలియకుండా పిటిషన్లు విచారించడం తొoదర పాటు చర్య అవుతుoది. కాబట్టి సరి అయిన సమయంలో వేస్తె పరిశిలించవచ్చు " అంది . అంటే కేంద్రం రాజ్యంగా ప్రకారం రాష్ట్ర విభజన చెయ్యడానికి ఇంకా అవకాశం ఉంది అని సుప్రీం కోర్టు వారి అభిప్రాయం కావచ్చు. అది నిజమే . రాజ్యంగా బద్దంగా విభజన చెయ్యడానికి కేంద్ర ప్రబుత్వానికి ఆవకాశం ఉంది . కానీ టైమే లేదు . కాంగ్రెస్ వారు చెయ్యాలంటే ఇప్పుడున్న రూపంలోనే మమా అనిపించాలి .దానిని కోర్టువారు అడ్డుకునే ఆవకాశం కూడా లేకపోలేదు . ఈ రోజు కోర్టువారు అన్న చివరి మాటలు అదే అభిప్రాయం కలిగిస్తున్నాయి . ఒక వేలా కోర్టులకు ఆ చాన్స్ ఇవ్వద్దు అనుకుంటే రాష్ట్ర విభజన బాద్యతను రాబోయే ప్రబుత్వానికి వదిలెయ్యాలి .అది కాంగ్రెస్ కి కష్టమైనా పనే . అందుకే డ్రామాలకు తేర తీసింది . చూదాం ఏమి జరుగుద్దో!
Wednesday, February 5, 2014
దేశ ప్రజలకు ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ! రాష్ట్ర ప్రజలకు మాత్రం టెన్షనాయన కష్ట కాలం !
ఈ రోజు రధ సప్తమి అంటే సూర్య జయంతి .భూమి మీద సంవత్సర కాలాన్ని రెండు సమ బాగాలుగా విభజించి ఉత్తరాయణం , దక్షిణాయనం అని వ్యవహరిస్తుంటారు . సూర్యుడు భూమధ్య రేఖ నుండి కర్కట రేఖకు , కర్కట రేఖ నుండి తిరిగి బూమాద్య రేఖ మీదుగా మకర రేఖకు, ప్రయాణించి తిరిగి భూమధ్య రేఖకు చేరుకోవడానికి సంవత్సర కాలం పడుతుంది . దిని గురించి వివరంగా క్రింది విడియోలో చూడవచ్చు .
సూర్యుడు భూమధ్య రేఖ నుండి కర్కట రేఖ వైపు ప్రయాణించే కాలం మార్చ్ 22 నుండి మొదలవుతుంది . అ రోజునే ప్రదమాంద్ర పాలకుడు , శక పురుషుడు శాలివాహన చక్రవర్తి జన్మించిన దినo . దానినే ప్రామాణికంగా తీసుకుని మన జాతీయ కాలెండర్ రూపొందించారు . అలాగే జులై 23 నుంచి దక్షిణాయన కాలం ప్రారంబం అవుతుoది . అలా దక్షిణాన ఉన్న మకర రాసి వరకు జనవరి 20 వరకు ప్రయాణించి తిరిగి 21 తారీకు నుండి ఉత్తరo వైపు మరలటం జరుగుతుంది . దీనినే ఉత్తరాయణం అంటారు . హిందూ సాంప్రదాయ నమ్మకాల ప్రకారం ఉత్తరాయణం వైపు సూర్యగమనం సాగడం శుభదాయకమ్ . అందుకే దీనిని ఉత్తరాయణ పుణ్య కాలం అంటారు . హిందూ పంచాంగం ప్రకారం ఉత్తరాయణ పుణ్య కాలం మాఘ శుద్ద సప్తమి నుండి ప్రారంబం అవుతుంది . అందుకే అ రోజు సూర్యుడు తన రదాన్ని ఉత్తరం వైపు మల్లిస్తున్న రోజుగా బావిస్తూ "రద సప్తమి " అనే పేరుతొ దినిని పవిత్ర దినం గా బావిస్తారు. దీనినే సూర్య జయంతి గా కూడా వ్యవహరిస్తారు. ఈ రోజు మాఘ శుద్ద సప్తమి అంటే రదసప్తమి. ఈ రోజు నుండి దేశ ప్రజలకు ఉత్తరాయణ పుణ్యకాలం .
మరి మన రాష్ట్రానికి వస్తే పరిస్తితి వేరుగా ఉంది . యాద్రుచ్చికంగా అయినా మనకు టెన్షన్ ల కాలం ఈ రోజునుంచే మొదలయిన్ది. రాష్ట్ర విబజన జరగదెమొనని తెలంగాణా నాయకులకు టెన్షన్ అయితే . రాష్ట్ర విభజన జరుగుదెమొనని సిమా0ద్రా నాయకులకు టెన్షన్ . ఇలా ఇరువైపులా ఈ టెన్షన్ ఉంటుంది . ఆ తర్వాత కూడా తెలుగు ప్రజలు ప్రశాంతంగా ఉంటారు అన్న నమ్మకం లెదు. మొత్తానికి తెలుగు ప్రజలకు కష్ట కాలమే మరి. పుణ్య కాలం లో కష్టాలు అనేది తెలుగు జాతికి రాజకీయ నాయకులు ప్రసాదించిన వర0. పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అంటారు . కాని ఖర్మ కొద్ది నాయకులు అనేది తెలుగు ప్రజలకు అనుభవమవుతుంది .
సూర్య గమనం గురించి క్రింది విడియోలో చూడండి . ఈ రోజు నా పుట్టిన రోజు కూడా . అ వివరాలకు ఈ లింక్ మిద క్లిక్ చెయ్యండి
రధ సప్తమి నా పుట్టిన రోజు కావటం మా అదృష్టమా ?
http://ssmanavu.blogspot.in/2014/02/blog-post_5.html
Labels:
రదసప్తమి.
Location:
Garloddu, Andhra Pradesh 507168, India
Tuesday, February 4, 2014
రాష్ట్ర విభజన ఆపడానికి ముఖ్య మంత్రి గారికి మరొక టెక్నికల్ అవకాశమిస్తున్నకేంద్ర మంత్రి మండలి !.
నేను ఇదే బ్లాగులో తెలంగాణా రాష్ట్ర విభజన విషయం గురించిన టపాలలో తెలంగాణా బిల్ విషయంలో గొప్ప డ్రామా అడిస్తుoదని చెప్పటం జరిగింది . అటు చేసి చేసి చివరకు తెలంగాణా ప్రజల చెవిలో పూవులు పెట్టడానికి కాంగ్రెస్ సర్కార్ డిసైడ్ అయిందని అర్ధమవుతుంది . దీనికోసం పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలు అందరిని వంచించే రీతిలో ఒక హై డ్రామా నడపటానికి రంగం సిద్దమయింది . ఒక వైపు పార్లమెంటులో బిల్ పాస్ కావడానికి చిత్త శుద్దితో ఉన్నామని ప్రజలను నమించదానికి తెగ ఆరాట పడుతున్న కాంగ్రెస్ నాయకత్వం ఇంకొక వైపు సమైక్యామ్ద్రా చాంపియన్ గా తాము ప్రమోట్ చేస్తున్న ముఖ్య మంత్రి గారికి సుప్రీం కోర్టు ద్వారా రాష్ట్ర విభజన ఆపే విదంగా టెక్నికల్ అవకాశాలు ఇస్తున్నారు . అవేమిటో చూదాం .
రాజ్యాంగం ప్రకారం అసెo బ్లికి ఒరిజినల్ బిల్ పంపాల్సి ఉంది కాని అలా పంపలేదు . డ్రాప్ట్ బిల్ పంపారు . ఇది బలమైన టెక్నికల్ పాయింట్ . దిని సాకుగా చూపి ఆంద్ర ప్రదెస్ అసెంబ్లీ అ బిల్ ని తిరస్కరించింది . అంటే రాష్ట్ర విబజనను కాకుండా టెక్నికల్ పాయింట్ మిద రాష్ట్ర విభజన బిల్ ని తిరస్కరించి వెనుకకు పంపింది . దినిని సరిచేసి తిరిగి అసెoబ్లికి పంపాలి కాని అలా చెయ్యకుండా డైరెక్టుగా అదే బిల్ ని ఈ నెల 10 వ తారికున రాజ్య సభలో ప్రవేశ పెడుతున్నట్లు హొమ్ మంత్రి ప్రకటించారు . ఇది మరో ఘోర తప్పిదం . రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర పతి మాత్రమె పార్లమెంటుకు బిల్ ని రికమెండ్ చెయ్యాలి. ఈ విషయంలో కేంద్ర మంత్రి మండలి కలుగ చేసుకోవడం అంటే రాష్ట్ర పతి గారి అధికారాలను బంగపరచినట్లే . రాష్ట్రపతి గారు చెప్పాల్సిన మాటను పబ్లిక్ గా కేంద్ర మంత్రి చెప్పడం వలన మొత్తం ప్రొసిజర్ పనికి రాకుండా పోయే ప్రమాదం ఏర్పడింది . ఇది చాలు సుప్రీం కోర్టు వారు కలుగ చేసుకోవడానికి . మరి ఇలా చెయ్యటం వలన లాబపదెది ఎవరు ? నష్టపోయేది ఎవరు? తరవాతి టపాలో చూదాం . ఎందుకంటే డ్రామా ఈ రోజే మొదలయింది ,ఇంకా కొన్నాళ్ళు నడుస్తుంది కాబట్టి . మరింత సమాచారం కొరకు క్రింది వీడియోను చూడండి .
Monday, February 3, 2014
మేకప్ లు వేసేసుకుని స్టేజ్ ఎక్కడానికి సిద్దంగా ఉన్న తరుణంలో "డ్రామా " అపమంటే ఎలా !?
పార్లమెంట్ లో అఖిలాంద్రా కాంగ్రెస్ డ్రామా కంపెనీ వారిచే భయంకర , బీబత్స రస పోషణతో ప్రదర్సింప బోతున్న గొప్ప నాటక ప్రదర్శనకు కళాకారులు అందరూ మేకప్ లు వేసుకుని స్టేజ్ ఎక్కడానికి సిద్దమైన .వేళ ప్రతి పక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు హటాతుగా ఇప్పుడు నాటక ప్రదర్సన వద్దంటే ఎలా చెప్పండి? అందుకే కమలనాదుల పార్టి అబ్యంతరాలను కాంగ్రెస్ మంత్రి కమల్ నాద్ ఒప్పుకొలెదు. నాటకం ఆడి తీరాల్సిందే అన్నారు. ఇంతకీ నాటకం వివరాలు ఏమిటంటే
.
నాటకం పేరు: ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్ వార్ .(తెలంగాణా బిల్ పోరు )
రచన: కేంద్ర మంత్రుల గుంపు (గూప్ ఆప్ మినిస్టర్స్).
సాంకేతిక సహకారం : ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ గుంపు .
వాద్య సహకారం: సీమాంద్రా పార్టీస్(అరుపులు గొలలు)
స్తంట్ మాస్టర్: తెలంగాణా పార్టీస్ (తంతాం, పొడుస్తాం)
దర్శకత్వం: తమిళ తంబి
పబ్లిసిటి సహకారం : సీమాంద్రా అండ్ తెలంగాణా N.G.O లు
స్పాన్సర్ : సోనియా గాంది .
క్లుప్తంగా కద: తెలుగునాడు లో అదికార కాంగ్రెస్ వారి ప్రాబవం తగ్గినట్లు కేంద్ర ప్రబుత్వ పెద్దలు గ్రహిస్తారు . 2009 లో 33 సీట్లు గెలిచిన అదికార పార్టీకి రానున్న ఎన్నికల్లొ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్తితిలో అటు తెలంగాణాలో, ఇటు సీమాంద్రాలో అదిక సీట్ల మద్దతు పొందే ఉపాయంతో అటు తెలంగాణా ఉద్యమ నాయకుడితోను, ఇటుసీమాంద్రా సానుబూతి నాయకుడితోను ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకుంటారు . కాని అది గమనించిన సీమాంద్రా ప్రజలు క్రమంగా అధికార పార్టికి లోపాయాకార మద్దతు ఇస్తున్న సానూబూతి నాయకుడికి కి దూరమవుతుండటం, అటు వైపు తెలంగాణా ఉద్యమ నాయకుడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటo తో పునరాలోచన లో పడతారు కేంద్ర పెద్దలు. ఎలాగైనా సరే సీమాంద్రా ఓట్లు తమ గుప్పెట్లో ఉంచుకోవాలి అని తలచిన అధికార పార్టీ తమ అభిమాన పాత్రుడు కిరణ్ ని రంగంలోకి దించుతారు . అతను సీమాంద్రా హీరో గా గుర్తించబడడానికి అన్ని రకాల సహకారమ్ అందిస్టారు . దానివలన రాష్ట్రం లో తెలంగాణా బిల్ ఓడిపోతుంది. కావాలని తప్పుల తడక బిల్ ని తయారు చేసిన కేంద్ర ప్రబుత్వం దానిని ఎలాగైనా పార్లమెంటులో గెలిపిస్తాం అంటుంది. ఇంకొక పక్క తమ పార్టీ వారినే సభ జరుగకుండా అడ్డుకోమని సీక్రెట్ గా చెపుతుంది. అటు కేంద్ర పెద్దలు కిరన్ ని కోర్టుకు వెల్ళి మోకాలు అడ్డు పెట్టమంటారు . ఇలా మాయోపాయంతో అందర్నీ బోల్తా కొట్టించి తాము మాత్రం లబ్ది పోందాలని చూస్తుoటారు . అదీ కధ.
Labels:
telangana story
Location:
Garloddu, Andhra Pradesh 507168, India
Sunday, February 2, 2014
పెద్ద కోడలు అని పెత్తనమిస్తే చివరకు సొనియమ్మ చెప్పేది ఇదా!? ! !
భారత దేశం అంటే కర్మ భూమి , వేదబూమి అనేక సాంప్రదాయాలు సంస్కృతులు కు నెలవైన భూమి అని ఇన్నాళ్ళు అందరూ అనుకుంటున్న దానిని ఇందిరా గాంది గారి పెద్ద కోడలు ఒక్క మాటతో కాదు అని తేల్చేసింది . మేజార్తి హిందువుల ఓట్లతో గద్దె మిద కూర్చున్న కాంగ్రెస్ పార్టికి అదినేత గా ఉన్న ఈమే తన నోటితో "హిందూ" అనాలoటెనే అసహ్యం అన్నట్లుంది అమె స్పీచ్ లు చూస్తుంటే. కనీసం సూపి పండితులు కూడా హిందుస్తాన్ అని గౌరవంగా పిలుచుకునె బారత దేశాన్ని ఇది మొదట సూపి పండితుల క ర్మ భూమి అని , ఆ తర్వాతె అందరిది అని అర్దం వచ్చేలా మాట్లాడడంలో అర్దమేమిటి? వినాశకాలే విపరీత బుద్ది అని అన్నట్లు ఇవి ఆమె పాలనకు చరమ దశ అని చెప్పకనె చెపుతున్నవి. ఆత్మాభిమానం ఉన్న హిందువులు ఆమె మాటలు విన్న తర్వాత దానిలొని అంతర్యం గ్రహించి తదనుగుణంగా నడచుకుంటే మంచిది. లేదంటే "హిందువులు " అంటే రాక్షసులు అని డిక్షనరీ లలొ ఎక్కించడానికి ఎత్తుగడలు వేస్తున్న ఈ కుహాన లౌకిక వాదులు ను ఎదుర్కొవడం కష్టం.2014 ఎన్నికలు హిందువులు అంటే పడని వారికి బుద్ది చెప్పేలా ఉండాలి.
సోనియా గాంది ఏమందో ఈ క్రింది వీడియోలొ చూడండి.
Labels:
సూపీస్తాన్
Location:
Garloddu, Andhra Pradesh 507168, India
Thursday, January 30, 2014
సురభి కళాకారులను మించి పోయిన తెలుగు M.L.A లు మంత్రులు !
అనుకున్నది అయింది ! ముక్య మంత్రి గారు లాస్ట్ బాల్ ప్రయోగించారు . దెబ్బతో ఆట పూర్తీ కాకుండానే మాచ్ డిక్లేర్ అయింది . అసెంబ్లీలో తాము గెలిచామని సిమాoద్రా నాయకులు సంబరపడుతుంటే , ఇక్కడి పలితం నామ మాత్రం కాబట్టి , పార్లమెంటులో అసలైన విజయం తమదే నని తెలంగాణా వాదులు అంటున్నారు . కాబట్టి తెలంగాణా ప్రజలు అవేశా లకు లోను కాకుండా సంయమనం పాటించాలని హితవు చెపుతున్నారు . కాని అసలు మాచ్ కు ముందే మాచ్ పిక్స్ అయిందన్న సంగతిని ఎవరూ చెప్పరు . ఎందుకంటే రానున్న ఎన్నికల్లో వారెవరూ ప్రజలు ముందు జిరోలుగా నిలబడటానికి సిద్దంగా లేరు .
ఇక అసలు మాచ్ పిక్సింగ్ సూత్రదారులైన కేంద్రo లోని పెద్దలు రాష్ట్ర విభజన విషయంలో తాము ఎంతో తొందరతో ఉన్నట్లు తెలంగాణా ప్రజలు అనుకోవాలని , అనుకూల మీడియా వర్గాలతో పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు షెడ్యూల్ ప్రకటించారు . ఎట్టి పరిస్తితుల్లో పిబ్రవరి 21 కి రెండు రాష్ట్రాలు గ్యారంటి అంటున్నారు . కాని కిరణ్ కుమార్ గారికి సుప్రీం కోర్టు కు వెళ్ళే బంగారం లాంటి చాన్స్ ను తామే కావాలని ఇచ్చినట్లు ప్రజలకు చెప్పరు గాక చెప్పరు ! ఎo దుకంటే రేపు సిమాంద్రాలో తమ కు దిక్కు కిరణ్ గారే కాబట్టి .
మొన్నట్టి దాక ఒరిజినల్ బిల్ అన్న కేంద్ర హొమ్ మంత్రిత్వ శాఖ వారు చివరి దశలో తాము రాష్ట్ర పతికి పంపింది ముసాయిదా బిల్ మాత్రమె అని చెప్పడంలో ఉన్న పరమార్దం ఏమిటి ? అది మాచ్ పిక్సింగ్ లో బాగం కాదా ?
సాంప్రాదాయం ప్రకారం అయితే ముసాయిదా బిల్ , రాజ్యంగ ప్రకారం అయితే ఒరిజినల్ బిల్ పంపాలని కేంద్ర ప్రబుత్వ పెద్దలకు తెలియదా? తెలియదని ప్రజల్ని నమ్మ మంటారా? రాజ్యాంగం ప్రకారం ఒరిజినల్ బిల్ ని సమగ్రం గా తయారు చేసి రాష్ట్ర అసెంబ్లీకి పంపించాలి . అదే ఇతర రాష్ట్రాల విబజన విషయాలలో మాదిరి సాంప్రాదాయ విదానం అయితే ముసాయిదా బిల్ పంపితే సరిపోతుంది . ఎందుకంటే సంప్రాదాయ విదానంలో రాష్ట్ర అసెంబ్లీ విబజన చేయమని తీర్మానించాకే విబజన ప్రాసెస్ మొదలు అవుతుంది . అలానే చేద్దామని కేంద్రం వారు మొదట్లో అనుకున్నారు . అప్పుడు అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయి కాబట్టి అసెంబ్లీ నుండే ప్రాసెస్ మొదలు పెట్టొచ్చు అనుకున్నారు.అలా చేస్తే తెలంగాణలో T.R.S తోనూ , సిమామ్ద్రాలొ లో జగన్ తోను పొత్తుపెట్టుకుని ప్రతి పక్షాలను దుంప నాశనం చెయొచు అనుకున్నారు కాని సిమాన్ద్రా ప్రజలు కాంగ్రెస్ వారి మిద తీవ్రంగా ఎదురు తిరగడంతో ఏమి చెయ్యాలో అర్ధం కాక , చివరకు సిమాంద్రా వారితో మాచ్ పిక్సింగ్ చేసుకుని కిరణ్ గారిని కెప్టైన్ గా బరిలోకి దించే కండిషన్ మిద గేమ్ మొదలు పెట్టారు . అందులో బాగమే ముక్య మంత్రి గారు ఈ రోజు అసెంబ్లీలో బిల్ ని తిరస్కరించి "జై సమైక్యామ్ద్రా " అంటూ అసెంబ్లీలో నినాదాలు చేస్తూ బయటకు రావడం .
ఇక ఈ డ్రామా లోని రెండవ అంకం డిల్లీలో జరగ బోతుంది . అక్కడా అంతే ! సిమంద్రా ..M.P లు సబను సాగ బోనివ్వమంటూ విర పద్యాలు పాడుతుంటే ప్రబుత్వం తమ కర్తవ్యంలో బాగంగా , ఎన్ని అడ్డంకులు ఎదురయినా పార్లమెంటులో బిల్ పాసవ్వడానికి నానా ప్రయాస పడుతున్నట్లు యాక్షన్ చేస్తుంది . ఈ లోపు సుప్రీం కోర్టు వారు జ్యొక్యమ్ చేసుకుంటారు . తాము ఎంత చిత్త శుద్దితో ఉన్నప్పటికీ కిరణ్ గారి వాళ్ళ అది సాద్యం కాలేదని చెపితే తెలంగాణా ప్రజలు నిజమే అని నమ్మి కనీసం 5 సీట్లు అయినా గెలిపిస్తారని , అలాగే తాము హిరోను చేసిన కిరణ్ గారు సిమామ్ద్రాలొ స్వీప్ చేసినా లేక అత్యదిక సీట్లు సాదిమ్చినా అవి తమకు మాత్రమే ఉపయోగ పడతాయని అధికార పార్టి వారి బావన . అందుకే కిరణ్ గారికి కోర్టు తలుపు లు తట్టే టెక్నికల్ అవకాసం కల్పించారు అనేది స్పష్టం అవుతుంది .
కాబట్టి తెలుగు ప్రజలారా ఇంకా 4 నెలలు దాకా మనందరికీ ఉచిత డ్రామా ప్రదర్సనలు ఉండబోతున్నాయి అన్న మాట . మొత్తానికి తెలుగు M.L.A లు మంత్రులు సురభి కళాకారులను మించి పోయారని పిస్తుంది . ,
Monday, January 27, 2014
ఒక్క రాత్రిలో ప్రజా నాయకుడు కి కావాల్సిన అర్హత సంపాదించా నంటున్న "తనిష్క్ జ్యయలరి" దొంగ !
అయన పేరు కిరణ్ . ఊరు గుంటూరు జిల్లాలోని ఈపూరు. అయనకి సమాజ సేవ చేయాలన్న తపన ఎక్కువట. అ ఉద్దేశ్యంతోనే తమ గ్రామ సర్పంచిగా పోటి చేద్దామని తన ఆలోచన ఊరి వారికి చెపితే ఊల్లో వారందరూ నవ్వి ఇతనిని పిచ్చోడి క్రింద జమ కట్టారట. దానితో మనస్తాపం చెందిన అతను హైద్రబాద్ కి వచ్చేసి తనంటే ఏమిటో సమజానికి చెప్పాలనుకున్నాడు. కొన్నాళ్ళు బాగా ఆలోచించి నట్లుంది " ప్రజా నాయకుడు" కావాలంటే కావాల్సిన ప్రాదమిక అర్హత ఏమిటా అని. అలా ఆలోచించగా , ఆలోచించగా ఒక రోజు బుద్దుడికి జ్ణానోదయం అయినట్లు అతనికి జ్ణనోదయం అయింది. ప్రజాసేవకుడు కావాలంటే కోట్లు కొల్లగొట్టగలిగిన గుండె దైర్యం కావాలని అతనికి కలిగిన జ్ణానోదయం. అందుకు తాను సమర్దుడా , కాదా అని చిన్న పరీక్ష తనకు తానే పెట్టుకుని అందులో ఘన విజయం సాదించాడు . ఆ తర్వాత తాను చేసిన పని ద్వారా తనకు ప్రజానాయకుడు అయ్యే అర్హత వచ్చిందని , కాబట్టి తాను చేసిన పనిని బట్టి అయినా తన సమర్దతను గమనించి తనకు "లీడర్" పొస్ట్ ఇవ్వాలని తెలుగు ప్రజలకు సంచలన టి.వీ. ద్వారా విజ్ణప్తి చేస్తున్నాడు.
ఇంతకీ కి ఆయన చేసిన పని ఏమిటో తెలుసా? హైద్రాబాద్ లోని పేరెన్నిక గన్న బంగారం షాప్ లలో ఒకటైనా "తనిష్క్ జ్యూవలరీస్ షాప్" లో అర్ద రాత్రి కన్నం వేసి కోట్లు విలువ చేసే బంగారం దొంగతనం చేసాడు. దీనిని పోలిస్ వారు అంతర్ రాష్త్రీయ దొంగల ముఠా పని అయి ఉంటుందని చెప్పి, పోలిస్ వారిని బ్రుందాలుగా ఏర్పాటు చేసి వెతకడం ప్రారంబించారు. మూడు రోజుల తర్వాత సదరు ప్రజాసేవక అభిలాషి కిరణ్ గారు టి.వి.9 చానల్ వారి దగ్గరకు వెళ్ళి తనేలా ఆ దొంగతనo చేసింది, సొము ఎక్కడున్నది పూస గుచ్చినట్లు వివరించారు. దానితో ఎగిరి గంతేసిన సదరు చానల్ వారు "తనిష్క దొంగ మా ముందు సరెండర్ అయ్యాడు. అతనిని పట్టి ఇవ్వడానికి మేమె కారణం" అని ఈ రోజు పొద్దున్నుంచి తమ ఛానల్ లో ఒకటే ఊదరగొట్టడం మొదలు పెట్టారు. అంటే "సొమ్ము ఒకడిది, సోకు ఒకడిది" అన్నట్లు తను కష్టపడి చేసిన చోరి గురించి, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం గురించి ప్రజలకు చెపుతారని ముందుగా ఫొలిసుల వద్దకు వెళ్ళకుండా టి.వి. 9 వారి వద్దకు వస్తే, దొంగను పట్టించిన ఘనత తమదిగా ప్రసారమo చేసుకుంటున్నారు.అప్ కోర్స్, దానికి ప్రతి పలంగా దొంగ గారి సద్దుదేశ్యాన్ని గూర్చి కూడా ప్రసారం చేస్తున్నారు అనుకోండి . చివరకు పోలిసులు సరెండర్ అయిన వాడిని అరెస్ట్ చేసి టి.వి9 వారికి క్రుతజ్ణతలు చెప్పారు.
మొత్తానికి తన అర్హత నిరూపించుకుని ప్రజల అభిమానం పొంది ప్రజా సేవకుడు కావాలనుకుంటున్న "కిరణ్ ది తీప్" గారిని గుర్తించి ఏ రాజకీయ పార్టీ సీటు ఇస్తుందో వేచి చూడాలి. ఇప్పటికైనా ఈపూరు గ్రామ ప్రజలు అతనిలోని సమర్దతను గుర్తించి , తమ నాయకుడు గా ప్రకటించాల్సిన అవసరం ఉంది. మరి ఆ ఊరి పేరు అంద్రప్రదేశ్ మొత్తం తెలిసిందంటే కిరణ్ చేసిన ప్రయోగమే కద! ఇంత కంటే సమర్దత ఉన్న నాయకుడు వారికి దొరకడం కష్టమే మరి! జై ప్రజా నాయకా! దిని గురించి మరిన్ని వివరాలకు క్రింది విడియో చూడండి .
Friday, January 17, 2014
ముంబాయి డాన్సర్ "రేప్" కేసు కున్న ప్రాదాన్యత, మచిలీపట్టణం ఇంజనీర్ అనూహ్య మర్డర్ కేసుకు లేదా ?
లేదనే అనిపిస్తుంది , ముంబాయి పోలిసుల తీరు చూస్తుంటే . ఇక విషయానికి వస్తే , మొన్నీ మద్య ,హైదరాబాద్ లో జనవరి 1 వేడుకల్లో డాన్స్ చెయ్యడానికని ముంబాయికి చెందిన డాన్సర్ ఒకామె హైదరాబాద్ కి వచ్చింది . ఆమెను ఎయిర్పోర్టులో పికప్ చేసుకోవడానికి వచ్చిన వారు ఆమెకు మత్తు మందు ఇచ్చి , దూరంగా ఎక్కడి కో తీసుకు వెళ్లి, ఆమె మిద సామూహిక అత్యాచారం జరపి , ఆమె దగ్గరున్నది దోచుకుని , అ తర్వాత ఆమెను ముంబాయి బస్ ఎక్కించారట . ఆమె కూడా మత్తులో ఉండటం వలన ఇవేవి గమనించక ఇంటికి పోయి చూసుకున్న తర్వాత గాని తనకు జరిగిన అన్యాయం అర్ధం కాలేదట . అక్కడి పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే వారు పట్టించుకో పోయేసరికి , తనకున్న ఇన్ప్లూయన్స్ తో ఒక సామాజిక సంస్ట ద్వారా ముంబాయి పోలీసులను కదిలించి , వారిని తీసుకుని హైదరాబాద్ కు వచ్చి , ఇక్కడి పోలీసులను కదిలిస్తే , అప్పటికప్పుడు 4 స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి నిందితులను పట్టుకుని కట కటాల వెనుకకు నెట్టారు . ఈ కేసు గురించి పోలిస్ అధికార్లు ఎంత శ్రద్ద తీసుకున్నారో పోలిస్ అధికారుల మాటల్లోనే ఈ విడియో ద్వారా తెలుస్తుంది . ఇందుకు హైదరాబాద్ పోలిస్ వారిని అభినందించి తీరవలసిందే !
అయితే ఇక్కడొక ప్రశ్న ఏమిటంటే , ముంబాయికి చెందిన అమ్మాయి రెప కేసు గురించి హైదరాబాద్ పోలీసులు చూపించిన శ్రద్ద లో , మచిలీ పట్నానికి చెందిన తెలుగు ఇంజనీర్ అనూహ్య ఘోరంగా మొన్న తగులపెట్టబడి శవంగా ముంబాయి సమీపంలో దొరికితే , ఆ కేసు మిద ముంబాయి పోలీసులు వందవ వంతైనా చూపించారా అని ?
ఈ కేసు వివరాలు లోకి వెళితే , మచిలీ పట్నానికి చెందిన అమ్మాయి అనూహ్య ముంబాయి లో ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తుంది . క్రిష్టమస్ సెలవులకు ఇంటికి వచ్చిన అనూహ్య ,పండగ తర్వాత ముంబాయి వెళ్ళింది . కాని ఆమె ముంబాయి చేరినట్లు సమాచారం ఆమె తండ్రికి రాలెదు. అ రోజు నుంచి ఆమె ఏమైందో అర్ధం కాలెదు. దానితో విజయవాడ రైల్వే పోలిస్ స్టేషన్ లో ఆమె తండ్రి పిర్యాదు చేస్తే , మిస్సింగ్ కేసు నమోదు చేసిన విజయవాడ పోలీసులు కేసును ముంబాయి పోలీసులకు బదిలీ చేసారు . కానీ అక్కడి పోలీసులు ఈ కేసును ఎ మాత్రం పట్టించుకోక పోవడం తో , అమ్మాయి తాలూకు వారె ఒక టీం గా ముంబాయి వెళ్లి అక్కడి స్తానికుల సహకారం తో గాలింపు చేపట్టారు . చివరగా వారికి ఒక చోట తగుల పెట్టబడి కంపు కొడుతున్న స్తితిలో , అనూహ్య శవం కనిపించగా , ఆ సమాచారాన్ని తండ్రికి చెపితే అయన ముంబాయి వెళ్లి, దారుణంగా హత్య చేయబడిన తన కూతురు ని చూసి కన్నీరు మున్నీరు అయ్యారు . కాని ఈ విషయం లో ముంబాయి పోలీసులు ఎ మాత్రం పట్టించుకోలేదని తెలుస్తుమ్ది.. దిని మిద అమ్మాయి తాలూకు వారి బాదను క్రింది విడియో లో చూడండి . కాబట్టి దిని వలన అర్దమయ్యేది ఒకటే , ముంబాయి డాన్సర్ గారికి ఉన్న ఇంప్లూయన్స్ ఆంద్రా అమ్మాయి తల్లి తండ్రులకు లెదు. ఉంటే ఇంత నిమకు నిరెత్తినత్లు ఉంటారా పోలీసులు ?
ముంబాయి అయినా , హైదరాబాద్ అయిన అందరూ ఇండియన్ పోలీసులే . మరి డాన్సర్ గారి విషయంలో చూపిన శ్రద్ద , అబాగ్య ఇంజనీర్ విషయం లో ఎందుకు చూపించడం లేదు? ఈ విషయం లో తెలుగు వారు అంతా అనూహ్య తల్లి తండ్రులకు సంగి బావం తో కూడిన సంతాపం తెలుపాల్సిన అవసరం ఉంది . దానిలో బాగంగానే అనూహ్య తల్లి తండ్రులకు కల్కి ఖడ్గం బ్లాగర్ గా నా సంఘీ బావం ను మరియు సంతాపం ని తెలియ చేస్తున్నాను.
Wednesday, January 8, 2014
పాపం! అమాయకుడైన "ఉదయ కిరణ్" ఉసురు పోసుకోవడానికి మీకు మనసెలా ఒప్పింది?
నేను నిన్న ఉదయి కిరణ్ మరణ ఉదంతం గురించి "P.V నరసింహా రావుగారి మరణం ని గుర్తుకు తెచ్చిన "ఉదయి కిరణ్ " ఉదంతం!." అనే టపా పెట్టడం జరిగింది. అందులో " సినిమా మెగా దేవుడుకు పనికి రాని వారెవరైనా సరే వారికి అన్ని రకాల అవకాశాలు కోల్పోవాల్సిందే. దీని గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధిష్టాన దేవుళ్ళు అంతరంగం ఎరిగి మసలుకునే వారు సినిమా రంగం నిండా ఉన్నారు. ఆ విదంగా ఉదయి కిరణ్ సినిమా రంగం నుండి వెలివేయబడ్డాడు . అదే అతని జీవితం ని నిరాశమయంగా మార్చి వేసింది. క్రమంగా దెప్రెషన్ లోకి వెళ్ళిన ఆత ను చివరకు బలవన్మరణానికి గురిఅయ్యాడు. ఇది చాలా విషాదకరం." అని చెప్పటం జరిగింది. దానికి రుజువుగా ఈ రోజు ఒక న్యూస్ ఐటం చూడడం జరిగింది. అదే పైనున్న చిత్రం
. ఇక పోతే ఉదయి కిరణ్ కి చిరంజీవి గారు అంటే అభిమానమో "ఇంద్ర" పంక్షన్ లో ఉదయి మాట్లాడిన తెలియ చేస్తుంది. ఇంతటి అభిమానాన్ని చూపించిన ఇటువంటి అమాయకుడి మీదనా వీరు పగ బట్టి నట్లు వెంటాడి అతనికి అవకాశాలు రాకుండా చేసింది! పాపం ఉదయి కిరణ్ ! ఎన్ని బాదలు పడ్డావయా! నీ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్దిస్తున్నాను .
ఏది ఏమైనా , నిజానిజాలు ఎలా ఉన్నా ఒకటి మాత్రం నిజం . అమాయకుల ఉసురు పాశుపతాస్త్రం కంటే పవర్ పుల్ . అతని పతనానికి కారకులైన వారు ఎంత గొప్పవారైనా సరే , ఆ ఉసురు కు ఊడ్చుకుపోవటం ఖాయం! ఉదయ కిరణ్ అభిమాన్నాన్ని క్రింది వీడియోలో చూడండి. అలాగే నిన్నటి టపాను ఈ లింక్ ను క్లిక్ చూడవచ్చు . http://kalkiavataar.blogspot.in/2014/01/pv.html
Subscribe to:
Posts (Atom)