Wednesday, May 22, 2013

లక్షలు పోసి, డాక్టర్లు అయినోళ్లు, చచ్చినోళ్లకు కాక, బ్రతికున్నవారికి వైద్యం చేస్తారా!?

                                                       

                                                                    

  మన వైద్యులు 50%  మంది ప్రతిబ ఆదారంగా, మిగతా 50% శాతం మంది మేనేజ్మెంట్ కోటాలో డబ్బులు పోసి మరీ వైద్య పట్టాలు కొనుగోలు చేస్తున్నారు.  ఈ విదంగా లక్షలు ఖర్చుపెట్టిన వారికి, ఆ డబ్బు వడ్డీతో సహా ఎలా గుంజుదామా అనే ఉంటుంది కాని,రోగులు, వారి రోగ నివారణ  పట్ల శ్రద్ద ఎందుకుంటుంది?.

  మొన్న మన రాష్ట్రంలోనే చనిపోయిన వ్యక్తికి చికిత్స పేరుతో వైద్యం చేసినట్లు నటించి వేల రూపాయలు కాజేస్తే, విషయం తెలుసుకున్న మ్రుతుని బందువులు లబో దిబో మంటూ, డాక్టర్ల మీద పోలిస్ కేసు పెట్టారు. నిజంగా వారు చదుకున్న వారేనా? అదీ ఒక పవిత్రమయిన వైద్య వ్రుత్తిలో ఉండి ఆ విదంగా చెయ్యడానికి వారికి సిగ్గు ఎలా అనిపించ లేదో? ఒక వైద్యుని తయారు చెయ్యడానికి ఎవరు ఎంత ఖర్చు పెట్టినా, వైద్య విజ్ణానం ఎవడబ్బ సొత్తు కాదు. అది మహానీయుల కఠోర శ్రమ పలితం. తరతరాలుగా పెంపొంధిచుకుంటూ వస్తున్న సామాజిక సొత్తు. దానిని డబ్బున్న వారికి అమ్మడం నిషిద్దం. అందుకే వెనుకటి కాలంలో గురువులు, మానవత్వం కలిగి, సమాజానికి ఉపయోగపెడతారు అనే వారికే ముఖ్య మైన శాస్త్ర విజ్ణానం బోదించే వారు. మరి ఈనాడు ఒక M.B.B.S   సీటు సుమారు యాబయి లక్షల నుండి కోటి రూపాయల వరకు అమ్ముకుంటున్నారు అంటే తప్పు ఎవరిది? ఇలా సీట్లు కొనుకుని వైద్య శాస్త్రం అభ్యసించిన వారు,చచ్చినోళ్లకు కాక బ్రతికున్నోళ్లకు వైద్యం చేసే ప్రతిభ ఉంటుందా?

   సంవత్సరానికి ఒక సారి అది ఉచితంగానే, తాము నమ్మిన వైద్యం, ఎవరికి హాని లేనటువంటిది అని రుజువు కాబడ్డ "బత్తిన సోదరులు" ఇచ్చే చేప మందు వంటి వాటి గురించి గగ్గోలు పెట్టే విజ్నానులకు ఈ శాస్త్రీయా వైద్యులు చేసే మోసాలు కనపడవా? కనపడకపోవచ్చు మరి!   

Tuesday, May 21, 2013

నాగరీకులుగ మనకు ఇన్ని యేండ్లు వచ్చినా, అత్యాచార కేసుల్లో "రెండు వేళ్లు" టెస్ట్,సిగ్గు!సిగ్గు!


                                                        
                                                                  

  మొన్న మన సుప్రీం కోర్ట్ వారు ఇచ్చిన తీర్పు, మానవీయ నాగరికతను కాపాడే విదంగా ఉంది.ఒక స్త్రీ అత్యాచారానికి గురి అయిందా లేదా అనడానికి లాబ్ టెస్ట్ ద్వారా నిర్దారిస్తున్నా,స్త్రీ యొక్క పూర్వ లైంగిక అనుబవ నిర్దారణకు పాత పద్దతి అయిన "రెండు వేళ్లు" టెస్ట్,చెయ్యడం అనాగరిక పద్దతి గానే బావించవచ్చు.

   ఇక్కడ "రేప్" అంటే స్త్రీ అంగీకారం లేకుండా పురుషుడు చేసే లైంగిక దాడి.దానికి స్తీ పూర్వానుబవంతో పని లేదు. లైంగిక క్రియ అంగీకారంతో జరిగిందా, లేదా అనేదే పాయింట్. అంతే కాని మె చెడు నడతను డిఫెన్స్ గా నిందితుడు కోరజాలడు అని సుప్రీం కోర్ట్ వారు స్పష్టం చెయ్యడం ముదావహం.

  ఒక వ్యక్తి కి బాగా స్వీట్లు తినే అలవాటు ఉందనుకుందాం. అంత మాత్రం చేత తనకు ఇష్టం లేని వ్యక్తి, బలవంతంగా స్వీట్ను నోట్లో పెడతానంటే కుదురుద్దా?ఆత్మాభిమానం దెబ్బ తినదా!అది కూడా నేరమే కదా. ఈ సూత్రమే లైంగిక దాడికి కూడా వర్తిస్తుంది. కాకపొతే ఆమే వైపు నుండి ప్రేరేపన ఉండి, లైంగిక క్రియ జరిగి,ఆ తర్వాత ఇతర కారణాలు అంటే  సమయంలో ఆమె తరపు వారు చూడడం లాంటివి జరిగినపుడు, కేసులు పెట్టడం జరుగుతుంది. అటువంటి కేసులలో కూడ ఆమే పూర్వానుబవం ప్రసక్తి అవసరం కాదు. మౌకికంగా సాక్షులను విచారించడం ద్వారా విషయ నిర్దారణ చేయవచ్చు. ఏది ఏమైనా సైన్స్ ఇంతగా అబిరుద్ది చెందిన ఈ రోజుల్లో కూడ ఇంకా ఈ అనాగరిక పరీక్షలేమిటి? ఇది పల్లెటూల్లో "శీల పరిక్ష" కోసం "కాల్చిన గడ్డ పార" దూయడం కంటే అనాగరికమయినది. ఇప్పటికయినా సుప్రీం కోర్ట్ వారు  దీని మీద ఒక స్పష్టమయిన తీర్పు ఇవ్వడం సంతోషించదగ్గ విషయం.

   కొంత మంది స్త్రీలు ఇతరుల చెతిలో పాచికలు మారడ వల్ల కాని, బ్లాక్ మెయిల్ కోసం కాని నిర్దోషులైన వారి మీద తప్పుడు కేసులు పెడుతుండడం వల్ల అట్టి నిర్దోషులను కాపాడడానికి ఇటూవంటి టెస్ట్ లను కొన్ని సార్లు కోర్టులు పరిగణనలోకి తీసుకుంటుండ వచ్చు.అయినా ఈ అనాగరిక విదానాన్ని త్యజించి, ఇతర సాక్ష్యాలు (సైంటిఫిక్) పద్దతిలో విషయ నిర్దారణ చేస్తే మంచిది.

కొసమెరుపు:- "మాయా బజార్" సిని మాలో చూపించిన "సత్యపీటం" లని ఎవరైనా కనుకుంటే బాగుండు.వాటిని ప్రతి కోర్టులో ఉపయోగించి తప్పుడు సాక్ష్యాలు చీపే వాళ్ళ ఆటలు కట్టించవచ్చు. మన సైంటిశ్టులు వాటిని కనిపెడతారని ఆశిద్దాం.       

Sunday, May 19, 2013

నొప్పించక, తానొవ్వక, కళంకితులను తప్పించిన కలేజా ముఖ్యమంత్రి!

                                                           
                                                              

  ఎందుకో మన ముఖ్యమంత్రి గారిని చూస్తే, కలేజా ఉన్న ముఖ్యమంత్రే అనిపిస్తుంది. ఆయనకి, హంగూ ఆర్బాటం, పిచ్చి మాస్ ఫాలోయింగ్ లేకపోయినా కొంచం చట్ట పరిదిలో తన పరిదిని, ప్రజల పట్ల నిబద్దతని గ్రహించి మెలుగుతున్న నాయకుడు అనిపిస్తుంది.

  ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు, ఈయనకి ఏం చూసి అధిష్టానం ముఖ్య మంత్రి పదవి కట్టబెట్టిందబ్బా! అని ఆలోచించించారు అటు  నాయకులు ఇటు ప్రజలు. ఆయన పెద్ద అవినీతి సామ్రాట్ అని ముద్రపడిన వాడు కాదు కాబట్టి, పైసల్ సంపాదించడం చేతకాని వాడికి పదవెందుకు అని పెదవి విరచిన వారూ ఉన్నారు.ఒక పక్క తెలంగాణా పేరుతో ప్రాంతీయ సెగలను బూచిగా చూపించి పదవులు పొందాలని ఆరాటపడుతున్న వ్రుద్ద నాయకులు, ఇంకొక పక్క ఆఫ్త్రాల్ మా అవినీతి సామ్రాజ్యానికి ఎవడయినా తల వంచాల్సిందే అని అంగబలం, అర్థబలం చూపి బయపెడుతున్న జగన్నాటక సూత్రదారులను ఎలా కట్టడి చేస్తాడని డిల్లీ పెద్దలు, ఆలోచించారో ఎవరికి అర్థం కాలేదు. తుమ్మితే ఊడిపోయే ముక్కనే అందరూ అనుకున్నారు.కాని తాను అందరూ అనుకున్నట్లు కాదని నల్లారి వారు రుజువు చేస్తున్నారు.

  అధిష్టాన దేవతను సంత్రుప్తి పరచడానికి రోడ్డు మీద ధర్ణా చేసి, ముఖ్యమంత్రి స్తాయిని దిగజార్చిన, మాజీల వలే అత్యంత దూర్త వినయం ప్రదర్సీంశింపలేదు. అలా అని అసలు అధిష్టానాన్ని "సీమ దొర" ల వలే బేఖాతరు చెయ్యలేదు. ఒక ప్రక్క ప్రతిపక్షాల దాడులను సమర్థంగా తిప్పి కొడుతూనే, మరొక వంక పార్టీ ప్రతిష్టను దిగజార్చుతున్న వారి బరతం పట్టడం మొదలెట్టారు.సి.బి.ఐ. చార్జ్ షీట్ మంత్రులను ఒక పక్క వెనకేసుకు వచ్చినట్లు అనిపిస్తూనే, కేంద్ర మంత్రులకు ఒక న్యాయం, రాష్ట్ర మంత్రులకు ఒక న్యాయం పాడి కాదని,అదిష్టానం బావిస్తున్నట్లు, సదరు మంత్రులను ఒప్పించి వారి లాంచన రాజీనామాలను లక్షనంగా ఆమోదింపచేసిన ఘనాపాటి నల్లారి బిడ్డ అని చెప్పక తప్పదు.

  అవినీతి డబ్బుతో, అహంకారంతో విర్రవీగే నాయకులు కాదు ఇప్పుడు ప్రజలకు కావాల్సింది. కనీసం తాము చేస్తున్న చట్టాలకు విలువిచ్చి, అవి వాటి పని అవి చేసుకు పోయేలా చూడగలిగిన సౌమ్యులైన నాయకులు చాలు మనకి. ఆ లక్షణాలు  మన ముఖ్య మంత్రి గారిలో పుష్కలంగా ఉన్నాయనే  అనుకుందాం.

  మేము ఇంతకు ముందు టపాలో "కేంద్ర మంత్రులు కంటే    మన మంత్రులు చాలా పవర్పుల్లా"http://kalkiavataar.blogspot.in/2013/05/blog-post_14.html అని అడిగాము. కాదు చట్టం ముందు అందరూ సమానమనే నిరూపించిన ముఖ్య మంత్రి గారికి దన్య వాదములు తెల్పుతూ...  " కల్కి ఖడ్గం"

 

 

Saturday, May 18, 2013

ఆమెది విచ్చలవిడి తనం నచ్చితే కాళ్ళు పట్టుకో! అంతేకాని ఆమెనే పట్టుకుంటానంటే ఎలా?

                                                                



  ఆమె ఒక మనిషి లాంటి దేవత!. సాక్షాత్తు, సమాజంలో ఎవరి ప్రమేయం లేకుండా దివి నుండి భువికేగిన దేవకన్య(?) ఇంద్రజ!ఆమెకు సమాజంలోని సంప్రదయాలు, కట్టుబాట్లు వర్తించవు గాక! ఆమె తన ఇచ్చ వచ్చిన వారితో విచ్చలవిడిగా సంచరించు మదవతి యగు గాక!అంత మాత్రం చేత ఆమెను చెరపట్టు హక్కు నీకెవరు ఇచ్చారు? ఆమే తన అయిష్టాన్ని వ్యక్తపరిచే హక్కు కల పౌరురాలు. ఆమే ఇష్టానికి భంగం కలిగిస్తే ఎంతటివారైనా శిక్షకు గురికాక తప్పదు.

  ఇలా కాకపోయినా ఇంచుమించు ఇదే అర్థంతో మన చట్టాలున్నట్లు ఇటీవలి బారత అత్యున్నత న్యాయ స్తానం వారు ఇచ్చిన తీర్పు వల్ల మనకు అవగతమవుతుంది.ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, ఒక స్త్రీ విచ్చలవిడి తన్నాన్ని చూస్తే నిజంగా బుద్దున్న వాడెవ్వడూ అటు వంటి స్త్రీ సాంగత్యాన్ని కోరుకోడు.ఒక వేళా వీడూ అటువంటి బుద్దిలేని వెదవైతే, ఆమే విచ్చలవిడి తనం నచ్చితే, ఆమె పొందు కోసం తపిస్తుంటే, కాసులన్నా ఇచ్చి మచ్చిక చేసుకోవాలి,లేదా కాళ్లు పట్టుకుని అయినా కక్కుర్తి తీర్చుకోవాలి. అంతే కాని అబలే కదా, ఎలాగూ అదే బాపతు కదా, అని రేప్ చేస్తావురా మగాడా! ఆమే కారెక్టర్ లూస్ అయితే, ఆమెను కోరుకున్న నీ కారెక్టర్ ఎటువంటిది?కాబట్టి ఒక కారెక్టర్ లెస్ ఫెలో కి మరొకరి కారెక్టర్ ని డిఫ్ ఎన్స్ గా మార్చుకునే వీలు లేదు. ఇది దర్మ సూక్ష్మం.

   కాకపోతే మన సుప్రీం కోర్టువారు ఇంకొక కోణంలో కేసును పరిశిలించి, ఒక విచ్చలవిడి మనస్తత్వం ఉన్న స్త్రీకి ఉండే సచ్చీలత, ఆత్మ గౌరవం గురించి నొక్కి వక్కాణించారు. పాపం అది విన్న మన దేశపు సగటు స్త్రీలకు "స్త్రీ ఔన్నత్యం" అనే పదానికి అర్థం తెలియక బుర్రలు గోకుంటూ ఉంటారు."ఒకరితో కాపురంచేస్తున్నా, వందమందితో విచ్చలవిడిగా తిరిగుతున్నా ఆడది, ఆడదేరా డోంగ్రే" అని ప్రతి మగ వాడు తెలుసుకోవాలి. అనుమతి లేకుంటే మొగుడైనా ముట్టుకుంటే శిక్షించే చట్టమున్న ఈ దేశంలో పరాయి దానిని ఎలా ముట్టుకుంటారు?.కాబట్టి కాసులిచ్చే దమ్మన్నా ఉండాలి, కాళ్ళు పట్టుకునే టెక్నిక్కన్నా తెలిసుండాలి.లేకపోతే ఒక్క రోజు బాగోతానికి మూతి మీసం గొరిగించుకున్నట్లు, కాసేపు కక్కుర్తికి కటకటాలు తప్పవు!
     కాకపోతే సగటు భారతీయ మగవాడి యొక్క విన్నపం ఒకటే. ఒక అద్యయనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పురుషునికంటే స్త్రీయే ఎక్కువ నైతిక విలువలు కలిగి ఉండడంలో సమర్దురాలు . "మగ బుద్ది" అనేది వెదవ బుద్ది అని నానుడి. స్త్రీల యొక్క నైతిక జీవనం మగవాడి బుద్దిని ప్రబావితం చేస్తుంది. ఏ కోర్టులు ఎన్ని తీర్పులు ఇచ్చినా, లైంగిక దాడి చేసేది మగవాడే,బాదితురాలు స్త్రీయె. ప్రక్రుతి పరంగా కూడ ఉన్న ఈ పక్షపాతాన్ని గుర్తుంచుకుని, కనీసం స్త్రీలు అయినా  నైతిక జీవనానికి కట్టుబడితే సమాజం అంతా కట్టుబడినట్లే.

Thursday, May 16, 2013

ఫిక్సింగ్ మాచ్ లు చూసి పిచ్చెత్తిపోవడమేనా, క్రికెట్ అంటే?

                                                                   


                                                               

  ఒక్క సారి కాదు, ఎన్నిసార్లు చెప్పినా మనకు పట్టిన క్రికెట్ పిచ్చి పోదు కాక పోదు. క్రికెట్ అంటే పిచ్చివాళ్ళ ఆట అని మేదావులు ఎంతమంది చెప్పినా, దాని మత్తులోనుండి బయటపడే పరిస్తితి లేదు. ఈ రోజు డ్రగ్స్ కంటే బయంకరమయిన మత్తు జబ్బు లాగ యువతను పీడిస్తుంది ఈ క్రికెట్ మహమ్మారి.యువత బలహీనతను అటు కంపెనీలు, ఇటు ప్రబుత్వ ఏజెన్సీలు సొమ్ము చేసుకుంటున్నాయి.కొన్ని కోట్ల రూపాయల వ్యాపారంగా క్రికెట్ ఆటను మార్చిన ఘనత వీరికి దక్కుతుంది.

  క్రికెట్ అనేది డ్రగ్స్ కంటె ఎక్కువ మత్తిచ్చే పిచ్చి కాబట్టే అండర్ వరల్డ్ డాన్స్ కన్ను దీని మీద పడి ఉంటుంది. అందుకే  ఈ ఆట పేరున బెట్టింగ్లు మొదలు అయ్యాయి. ఎలాగు బెట్టింగ్లు పేరిట కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి కాబట్టే, మాచ్ ఫిక్సింగులు మొదలు అయ్యాయి. అందుకు ఆటగాళ్ళ సహకారం కూడ ఉంది కాబట్టి, ఈ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతుండవచ్చు. అసలు ఒక ఆటని వ్యసనం లాగా చూసి ఆనందించడం ప్రజల మానసిక దౌర్బల్యానికి గుర్తు గా బావించ వచ్చు. అటువంటి దౌర్బల్య స్తితికి ప్రజల్ని దిగజార్చుతున్న ఈ క్రిడ ను ప్రజలు నిరసించాలి. లేకుంటే చూడటమే తప్పా ఆటలు ఆడలేని అర్బక జాతి తయారవుతుంది.    

Tuesday, May 14, 2013

కేంద్ర మంత్రులు కంటే, మన మంత్రులు చా...లా.....?

                                                                

  పవర్ ఫుల్లా! అనిపిస్తుంది. అక్కడ కుంభకోణాల్లో నిందితులైన వారు కిమ్మన్నకుండ రాజీనామాలు చేసి వైదొలిగితే, ఇక్కడ కోర్టుల చేత సమన్లు పొంది, విచారణకు సైతమ్ హాజరై రావడానికి రెడీ కాని రాజీనామాలు మాత్రం ఇవ్వం గాక ఇవ్వం అంటున్నారు. అటు ముఖ్యమంత్రి గారు కూడా వారికి న్యాయ సహయం అందించాడానికి సిద్దం అన్నట్లు ప్రవర్తిస్తూ, ప్రజల్ని విస్మయ పరుస్తున్నారు. మన మంత్రులు ఏ చట్ట ప్రకారం న్యాయ సహాయం పొందడానికి అర్హులో ప్రజలకు వివరిస్తే బాగుంటుంది.

   ఇంత అనైతిక పాలన నడపడం కాంగ్రెస్ ప్రబుత్వానికి అవసరమా?. అక్కడ కేంద్రంలో, ఇక్కడ రష్త్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పటికి ఈ ద్వంద నీతి ఎందుకో అర్దం కావడం లేదు. బాహూశా మన మంత్రులు కేంద్ర మంత్రులకంటే పవర్ ఫుల్లై ఉండాలి! లేదా మన ఆంద్రులుకు ఇటువంటి అవినీతి ఆరోపణలు బాగా అలవాటై ఉండి, వీటి గురించి పెద్దగా పట్టించుకునేదేముందిలే  అనే ద్రుక్పదం కలవారై ఉండాలి.
          ఆంద్రులు ఆరంభశూరులే కాదు, అవినీతి సమర్దనా ఔదార్యులు! అని కూడా మనం చరిత్రలో మిగిలిపోయే రోజు  వస్తుంది.
     

Thursday, May 9, 2013

తిరుమలలో జై కొట్టొచ్చు, సుప్రీంకోర్టులో జై కొట్టాలంటె కుదురుద్దా!?.


                                                                         

                                                                  
  ఒక సారి వై.యస్.ఆర్.పార్టీ అదినేత, శ్రీ జగన్ గారు తన మందీ మార్బలంతో, తిరుమల కొండకు వెళ్ళారు. ఆయన మతరీత్యా హిందూయేతరుడు. కాని ఇతర మతాలకున్న అలౌకిక తత్వం హిందువులకు లేదు కాబట్టి, ఆయన ఆ పవిత్ర గిరి మీద,ఆ దేవదేవుని సన్నిదిలో, తన అనుచరగణంతో  జైజగన్ జై జై జగన్ అనిపిస్తూ, రాజాది రాజు సంచరించినట్లు హల్ చల్ చేశారు. సరే ఆ రోజు అక్కడ ఉన్న అధికారులెవ్వరికి దీని మీద చర్యలు తీసుకునే దమ్ములు లేక పోయినవి.

  ఇక తిర్మలేశ్వరుడు కూడా, అన్ని మతాల బిడ్డలు తన బిడ్డలే కాబట్టి, బిడ్డలు తనను ఖాతరు చెయ్యక పోయిన కోపగించ్కోవడం తండ్రి దర్మం కాదు కాబట్టి,అక్కడ అంతా సాజావుగానే అనిపించ వచ్చు. కాని హిందూసోదరుల మనోబావాలు దెబ్బతింటాయని సదరు నాయకులు తెలిసికోకపోవడం విచారకరం.

  మొన్న సుప్రీం కోర్టులో అదే నాయకుడి బెయిల్ విషయం మీద వాదనలు జరిగాయి. మన రాజ్యాంగం ప్రకారం జై కొట్టే జనం బలం చూసి కాక , ఒక్కరు చెప్పినా, వాదనలు  బట్టె మన కోర్టులు న్యాయా న్యాయ నిర్ణయం చేస్తాయి కాబట్టి, కోర్టులో అనుచరులు జై కొట్ట లేకపోయారు. ఇక న్యాయ వాదులు కూడా, సి. బి.ఐ. వారి మీద అప వాదులు మోపే సరికి, చిర్రెత్తుకొచ్చిన సి. బి.ఐ వారు ఒక ఇంటర్నేషనల్ లెవల్ క్రైమ్ ని సాదరణ క్రైం లాగ పరిమితి గడువులో దర్యాప్తు ముగించాలంటే మానవ మాత్రులైన తమ వల్ల కాదు, ఆయనకు బెయిల్ ఇస్తే దర్యాప్తు కష్టం అనే సరికి అత్యున్నత న్యాయ స్తానం వారు మాత్రం ఏమి చెయ్య గలుగుతారు. అందుకే మరో నాలుగు నెలల గడువు సి.బి.ఐ. వారికి ఇచ్చే సరికి సదరు నాయకుడు, వారి అనుచర గనం జై కొట్టలేక, దిగాలుపడిపోతున్నారు.

  పోని కాంగ్రెస్ వారితో, ఎమైనా చేయి కలిపి సి.బి.ఐ. వారి ఫోర్స్ తగ్గిదామా అని చూస్తే ఆ దేవునికి ఇది కూడా ఇష్టం లేనట్లుంది, సి.బి.ఐ వారికి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చేలా చట్టం చెయ్యాలి అని, ఇందుకు జులై నెల దాక,కేంద్ర ప్రబుత్వానికి  సుప్రీం కోర్ట్ గడువు విదించింది. కాబట్టి వాస్తవ పరిస్తితుల మీదే జగన్ ఆదారరపడితే మంచిదేమో, రాజకీయ బలంతో జనం నోళ్ళు తెరిపించి,అధికారుల నోళ్లు నొక్కుదామనుకుంటే కోర్టులు చూస్తూ కూర్చోవు. ఒక వేళా అటువంటి పరిస్తితులే వస్తే భగవంతుడు చూస్తూ ఊరుకోకపోవచ్చు.     

Wednesday, May 8, 2013

బాబూ! ఒక్క సారి అమ్మా అంటే, అడ్డమైన చాకిరీ చేసి పెడతా!

                                                                                                                                  

                                                                             ఇది పాపం అమ్మ కాని ఒక అమ్మ యొక్క అవేదన! ఆంద్రుల అరాద్య దైవం, మహా నటుడు ఆయన. పాపం ముసలితనంలో సహ దర్మ చారిణి, కాల దర్మం చేస్తే, గంపెడు మంది సంతానం ఉన్నా, చూసే దిక్కులేకపోయింది ఆయనకి. ఆ దశలో ఆయన గారి జీవిత కథ రాయడానికని వచ్చిన స్త్రీ, గత్యంతరం లేని పరిస్తితిలో అంటే ఆరోగ్యం దెబ్బతిని నా అన్న వారు చూసే ప్రాప్తం లేని విపత్కర పరిస్తితిలో, అటు కుటుంబానికి, ఇటు అభిమాన ప్రజల్కు అందరికి చెప్పి, ఆ జీవిత చరిత్ర రాయడానికి వచ్చిన ఆమేను జీవన సహ చరి గా చేసుకున్నాడు. ఇది ఆయన నమ్మి ఆచరించాలనుకున్న హిందూ ధర్మ జీవన విదానానికి వ్యతిరేక మైనా ఆయనకు తప్పని స్తితి.

   సరే ఆయన ద్వితీయ వివాహం చేసుకోవడం కుటుంబ సబ్యులకు ఇష్టం ఉన్నా, లేకపోయినా వారి వారి పర్సనల్ పనుల బిజీలో ఆయన బాద్యతలు చూసే తీరిక ఎవరికి లేక పోవడం వలన కాబోలు కిమ్మన్నకుండా ఉన్నారు. తర్వాత ఇంట్లో సమస్యలు, పార్టీ సమస్యలుగా మారి, అదికార పంపిణీలో బేదాబిప్రాయాలు రావడంతో ఆయన్ని, ఆమెకు వదిలేసి పార్టీని కుటూంబ సబ్యులు హస్తగతం చేసుకున్నారు. ఇంతలో పాపం ఆ పెద్ద మనిషి ఆ మనాదితోనే కాల దర్మం చేసారు. ఆమె పాపం ఒంటరిదైంది.

  ఆమేకు అంతకు ముందు వైవాహిక జీవితం ఉన్నా,తద్వారా కలిగి బాందవ్యలు ఉన్నా, తన ఆరాద్య దైవం యొక్క కుటుంబం అంటేనే మక్కువ ఎక్కువట! వారి నుంచి అమ్మా అనే పిలుపు కోసం నిరంతరం తపిస్తూ ఉన్నట్లుంది!కాని వారెవ్వరూ ఈమె గారిని దగ్గరికి రానివ్వకపోవడంతో, వారంటే పడని రాజకీయ పార్టీల చెంతన చేరి, ఆ కుటూంబ సబ్యుల మీద అవసరమైనప్పుడు తన అక్కసు వెళ్ళ గ్రక్కుతూనే ఉంది. ఇక ఆ కుటూంబం మీద ఎదో రకంగా విమర్శలు చెయ్యలనుకునే రాజకీయ పార్టీలకు ఈమె దేవుడిచ్చిన వరం గా బావిస్తారు.

  పాపం నిన్న ఆ మహా నాయకుడి విగ్రహం బారత పార్లమెంటులో ఆవిష్కరించడానికి ఆ కుటుంబం అంతా అనందం గా వెళ్ళి తమ మద్య ఉన్న, వైషమ్యాలు మరచి(తాత్కాలికం కావచ్చు), ఆనందంగా గడుపుతుంటే, సదరు సహచరికి లోపల ఎలా ఉన్నా పైకి ఇది తనకు ఆనందం కలిగించే విషయమని, కాని తనను కూడ ఒక్క సారి "అమ్మా" అని పిలిచి ఆ కుటుంబంలోకి ఆహ్వానిస్తే, తాను ఒక్కరూపాయి కాని, పదవి కాని తీసుకోకుండా ఆ కుటూంబానికి అడ్డమైన చాకిరీ చెయ్యడానికి సిద్దమని చెప్పి పాపం మీడియా ముందు వాపోయింది ఆ ఇల్లాలు. అంతే కాదండోయి, అదే వారి  తండ్రి గారి ఆత్మ శాంతించే విషయం అని కూడా ఆమే నొక్కి మరీ వక్కానిస్తుంటే,ఏమి అనలేక కుటూంభ సబ్యులు అంతా కాం అయిపోయారు.పాపం ఆ కుటుంబానికి ఆమె ఒక పెద్ద తల నొప్పి కావచ్చు! ఏం చేస్తారు మరి చేసుకున్న వారికి చేసుకున్నంత మహా దేవ అని!తల్లి తండ్రుల   అస్తులకే కాదు ఆశయాలకు కూడా వారసులు కావాలి.అప్పుడే జన్మకు సార్థకత!.ఆశయాల వారసులు ఎప్పుడూ తల్లి తండ్రులను అవశాన దశలో వదలరు.మొత్తనికి ఆ మహా నాయకుడు పోతూ, పోతూ తన పిల్లలు జీవితాంతం గుర్తుంచుకునేలా చెయ్యడానికి ఒక శక్తిని ప్రయోగించి వెళ్ళారు.

   ఏక్కడ ఆయన గారి కుటుంబం వెళ్లునో, అక్కడకు ఆ శక్తి కూడా వెళ్ళి, అన్నగారిని వారికి గుర్తుకు తెస్తూనే ఉంటుంది.జై అన్న గారూ, జై జై అన్నగారూ!      



Tuesday, May 7, 2013

తెల్లవాడి గుండెల్లో అల్లూరి, కాంగ్రెస్ గుండెల్లో నందమూరి!

                                                           
ఆంద్రుల పౌరుషాగ్నిఅల్లూరి సీతారామ రాజు

                                                             
                                                                  

 నేడు మే 7 తారీకు. సరిగ్గా ఇదే రోజు పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ  సంవత్సరం లో తెల్ల కుక్క మేజర్ గుడాల్ నిరాయుదుడుగా ఉన్న అల్లూరి సీతారామ రాజు గారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి వేసిన రోజు.ఆ నాడు కేవళం ఇరవైయేడేళ్ళ ప్రాయంలోనే తెల్లవాడి పాలనను దిక్కరించడమే కాక, అక్షర జ్ణానం లేని, అమాయక గిరిజనులను అగ్నికణాలుగా మార్చి, తెల్లవాడి గుండేల్లో ఫిరంగులు పేల్చిన శౌర్య శాలి మన అల్లూరి సీతారామ రాజు. యువరక్తం అంటే ఎలా ఉంటుందో, దేశబక్తి చాటడంలో తెలుగువాడు ఏ ప్రాంతం వారికి తీసిపోరని నిరూపించిన దీరుడు మన అల్లూరి. ఆయనను స్మరించడం, ఒడలు  పులకరించే ఆయన జీవితచరిత్రను పటనం చెయ్యడం తెలుగువారిగా మన కనీస దర్మం.  క్రికెట్లు, సినిమా పిచ్చి, అమ్మాయిల ను వేదించడం లాంటివి
గోల్డెన్ లైఫ్ అనుకునే నేటి యువతరానికి కనీసం "అలూరి సీతారామ రాజు" సినిమా అయినా చూపించండి. మన వూరి వీదిరౌడీల జన్మ దినాలు, వర్దంతులు చేసి తెలుగు జాతిని అవమానం చేసే వారికంటే కనీసం రెండు నిమిషాలు అల్లూరి లాంటి ఆంద్ర పౌరుషాగ్ని తలచుకునేవారి జన్మే దన్యం.  అమర్ రహే అల్లూరి!

  ఇక పోతే నేటి తరం వారు చూసిన ఇంకొక వ్యక్తి, ఆంద్రుల ఆత్మ గౌరవన్ని చాటి చెప్పిన మహానుబావుడు స్వర్గీయ నందమూరి తారక రామరావు గారు. ఈయన "ఇందిరే ఇండియా, ఇండియాయే ఇందిర" అనే కాలంలో, రాష్ట్రాంలో ఎవరైనా సరే ముఖ్యమంత్రి కావాలంటే "ఇందిరమ్మ" దయ ఉండితీరాలి, అంతకు మించి తెలుగువారికి దిక్కే లేదన్న దుర్డశ నుంచి "తెలుగు దేశాన్ని" కాపాడిన రాజకీయ వీరుడు మన నందమూరి తారక రామరావు గారు. ఈ రోజున ఆయన విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టడం, మాన్యులు మన ప్రధాని మరియు ఇతర జాతీయ నాయకులు  హాజరు కావడం తెలుగువారికి గర్వకారణం. కాకపోతే చిన్న ట్విస్ట్ ఏమిటంటే, అమరులైన వారిని ఇంకా విపక్ష పార్టీ నాయకుడుగనే బావించి ఇందిరమ్మ కోడలు సోనియా గాందీజీ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం కూడా తెలుగువాడి దెబ్బ ఎంత గట్టిగా ఉంటుందో నిరూపించినట్లయింది.అన్నా ఉన్నా లేకున్నా, కాంగ్రెస్ గుండెలో మాత్రం ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాడు. అమర్ రహే  N.T.R!             

Monday, May 6, 2013

పాపం! N.T.Rగారి విగ్రావిష్కరణకు లక్ష్మిపార్వతి గారిని పిలిచేవారే లేరా?


                                                         



  మీరెప్పుడైన  N.T.R  గారి ద్వితీయ కళత్రం లక్ష్మి పార్వతి గారి మాటలు విన్నారా?  N.T.R  గారి కుమారులను గురించి ప్రస్తావించేటప్పుడు మా పెద్ద బాబు, బాలయ్య బాబు అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. కాని వారెవ్వరూ ఆమెను "పిన్ని" అని కాని, అమ్మా అని కాని పిలిచినట్లు ఎక్కడా కనపడ లేదు. కుటుంబంతా రామారావు గారిని అనాదగా వదలిన సంకట పరిస్తితుల్లో, లక్ష్మీపార్వతి గారు ఆ ముసలాయనకి అండగా నిలచి, తోడుగా మారారని అనుకుంటుంటారు. నిజా నిజాలు ఎలా ఉన్నా, రామరావు గారి అవసానదశ మాత్రం లక్ష్మీపార్వతి గారి సహచర్యంలో గడచిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం.

   మరి అటువంటి లక్ష్మీపార్వతి గారిని పార్లమెంటులో  N.T.R   గారి విగ్రావిష్కరణకు పిలవకపోవడమేమిటి?. ఒక వేళా లగడపాటి గారన్నట్లు, పార్లమెంటులో పెట్టే విగ్రహావిష్కరణకు ఎవరినీ పిలిచే సాంప్రదాయం లేదన్నప్పుడు,   గారి తిరస్కారానికి గురి అయిన, చంద్రబాబు నాయుడు గారిని ఎలా పిలిచారు? పాపం లక్ష్మీ పార్వతి గారికి వెనుక కోట్లు లేవనేగా ఆమెను పట్టించుకోవపోవడం? తనను అవసానదశ ఆదుకున్న ఆ ప్రేమ మూర్తిని కాదని, ఆయనను నిర్లక్ష్యం చేసిన వారందరిని పిలవడం ఆయన ఆత్మకు శాంతినిస్తుందా? ఆలోచించండి.

  అదే ఆమే పార్టీ కనుక బలంగా ఉండి, ఆమె వెనుక కోట్ల సొమ్ములు ఉంటే, ఆమెను ఆహ్వానించకుండా ఉండేవారా? ఏది ఏమైనా ఆమే చట్టప్రకారం ఆయన బార్య,కాబట్టి, మర్యాద కోసమయినా ఆమెను ఆహ్వానించడం దర్మం.
      ఇన్నాళ్ళకు తెలుగువారి ఆరాద్య నాయకుడు, అభిమాన నటుడు అయిన శ్రీ శ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహం బారత పార్లమెంటులో ప్రతిష్టింపబడటం తెలుగువారిగా మనందరకు సంతోషదాయకమే కాక గర్వకారణం కూడా!.   

Saturday, May 4, 2013

కొట్టా, పెట్టని రాజు, కోటలొ ఉంటేనేం!పేటలో ఉంటేనేం!?



India Google Map.


china google map

                                                            

  మన కేంద్ర సర్కారు వారి తీరు అచ్చం అలాగే ఉంది. మన ప్రధాన మంత్రి గారు బహు మంచి వారు. ఎంత మంచివారు అంటే నోట్లో వేలుపెడితే కూడా కొరకలేనంతగా!. ఆయన తీరును చూసిన కొందరు, మిన్ను విరిగి మీద పడినా చలించని మనస్తత్వం అంటుంటే, ప్రతిపక్షాల వారేమో అంతకన్నా ఏమి చేస్తాడు "రబ్బర్ స్టాంప్" అధికారం ఉన్నవారు అంటున్నారు.ఈ దేశాన్ని ఏలుతున్న అధికార కాంగ్రెస్ "అధినేత్రి" గారు కూడా మన ఇందిరా గాంది గారి లాగా "డైనమిక్" కాదు కాబట్టి అటు కర్ర విరుగకుండా, ఇటు పాము చావకుండా పాలనా రథం నడిపిస్తున్నట్లుంది. ఇక ఈ మద్యే "కాబోయే దేస్ కీ నేత" అని పిలువబడుతున్న రాహుల్ గారు కూడా అప్పుడప్పుడు వివాద స్పద వ్యాఖ్యలు చేసి,ప్రతి పక్షాల చేత పిల్ల వాడి మాటలు అనిపించుకున్నాక, ఏ పనులు చేస్తే పెద్దవారి పనులు అవుతాయా అని సీరియస్ గా ఆలోచిస్తున్నట్లుంది. ఇదీ ఇక్కడ మన పాలక పక్షం పరిస్తితి.

  ఇది చూస్తున్న పొరుగుదేశాలకు ఏమి మాయదారి ఆలోచనలు పుడుతున్నాయో కాని, వారికి ఇండియా అంటే ఖాతరు లేనట్లే ఉంది. ఒక పక్కా చైనా మన భూబాగం లోకి కిలోమీటర్ ల వంతున చొచ్చుకుని రావడమే కాక ఇది మా దేశంలో బాగమే అని భుకాయిస్తుంటే,కేంద్ర సర్కార్ చెష్టలుడిగి నామ మాత్ర నిరసనలతో కాలం వెళ్లబుచ్చుతున్నట్లుంది.ఒక్క సారి పైన ఇచ్చిన మన దేశం ఒక్క మాప్, చెనా దేశం వారి మాప్ చూస్తే వారు మన దేశ భూబాగాన్ని తమ భూబాగం గ ఎలా ప్రకటిస్తున్నారో అర్థం అవుతుంది. సాక్షాతు మన రక్షణ మంత్రి,  మన అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తే వారు అబ్యంతరం చెప్పారంటే, పరిస్తితి ఎంత క్లిష్టమైనదో అర్థం చేసుకోవచ్చు

   ఇంకొక పక్క, ఇండియన్స్ అందరు ఒక్క సారిగా ఉమ్మేస్తే, ఆ ఉమ్ము సునామికే కొట్టుకుపోయే పాకిస్తాన్, ఇరవైయేండ్లు పైనా తప్పుడు సాక్శ్యం, అది కూడా నిందితుడిని హింసించి ఒప్పించిన నేరాంగీకారా ఒప్పుదల వాంగ్మూలం ఆధారంగా, ఉరిశిక్ష వెయ్యడమే కాక, వేసిన క్షమా బిక్ష పిటిషన్ లను కొట్టివేసి, చివరకు ఆ దేశ న్యాయసూత్రాలకు కూడా విరుద్దంగా,క్రూర మత విశ్వాసాలకు అనుకూలంగా కొట్టి చంపారు. చివరకు వారు ఈ దేశ వాసుల మనోబావాలను ఎంతగా గాయపరచారంటే,సరబజిత్ సింగ్ గారి శరీర బాగాలను కూడా కొన్నింటిని తొలగించి, ఇండియాకు పార్థివ దేహాన్ని పంపారంటే, ఈ దేశం పట్ల వారికున్న క్రూర ద్రుక్పదం అర్థ మవుతుంది. ఇది ఖచ్చితంగా మన మత విశ్వాశాలను తివ్రంగా కించ పరిచే చర్యే.

  మరి పైన చెప్పిన పొరుగుదేశాల లెక్కలేని   తనానికి కారణాలు ఏమిటి? మనం ఎంతమంది  ఉన్నాము    అని కాదు, మనలో ఎంత దమ్ము, పౌరుషాలు ఉన్నాయి అనేదే  పాయింట్ .   మన పౌరుషాన్ని ప్రతిబింబించే మన నాయకులు ఇలా దేనికి చలించని తత్వం చూశి మనం మెచ్చుకోవచ్చు గాక, పొరుగువాడు ఇంకొకరకంగా అర్థం చేసుకోబట్టే, ఈ రకమైనా దుష్పరిణామాలు ఏర్పడుతునాయి అని అనుకోవాల్శి వస్తుంది.  కొట్టా, పెట్టని రాజు, కోటలొ ఉంటేనేం!పేటలో ఉంటేనేం! అని ప్రజలు అనుకుంటే మాత్రం రాబోయే ఎన్నికలు కాంగ్రెస్ వారికి "పీడ కలలు" గా మారుతాయి.             

Thursday, May 2, 2013

మనకు ముద్దంటే సెక్స్! వారికి జస్ట్ ఫ్రెండ్ టచ్!

                                                               


                                                        

  మన బారతీయుల శ్రుంగార బావాలు గురించి మన వాళ్ళకు ఎంతో తెలుసో తెలియదు కాని, ఆసియా అభివ్రుద్ది బ్యాంక్( A.D.B   ) వారికి మాత్రం బాగా అర్థమయిందనే చెప్పాలి. గురువారం డిల్లీలో ప్రారంభమైన, ఆసియా అభివ్రుద్ది బ్యాంక్(A.D.B    ) వాశిక సమావేశాలకు హాజరయ్యే మహీళా  ప్రతినిదులకు వస్త్రధారణ విషయంలో కొన్ని ఖచ్చితమైన నిబందనలు పెట్టింది. వాటిని పాటిస్తే మన దేశంలో స్త్రీల మీద లైంగిక దాడులు తగ్గవచ్చేమో అని చాల మంది బారతీయులు అభిప్రాయపడుతున్నట్లు కూడA.D.B   తెలిపింది.

   తక్కువుగా, కురచగా ఉండే దుస్తులు దరించడం, బారత దేశంలో లేని పోని కాంప్లికేషన్ లకు దారి తీయవచ్చట! ఎందుకంటే మన వాళ్ళకి కుతూహలం(?), ఎక్కువట!. బహూశ ఆ కుతుహలం మనస్సులో కామ హలాహలం  నింపి లైంగిక దాడికి పురిగొల్పుతుందేమో.!అలాగే విదేశాలలో ముద్దు పెట్టుకోవడాన్ని, ఆత్మీయత వ్యక్తపరిచే విదానంగా బావిస్తే, మన దేశంలో అది సెక్స్ కోరికను వ్యక్త పరచే విదానం అని A.D.B    తెలిపింది.

   ఏది ఏమైనా ఇక్కడి ప్రజలు "హుందాగా" ఉండే వస్త్రదారణను అభిమానిస్తారని,ఈ మద్య  బారత దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో నమోదవుతున్న స్త్రీల మీద అత్యాచారలకు "వస్త్ర దారణ" కూడా ఒక కారణమని  A.D.B  అభిప్రాయ పడటం సాంప్రదాయ వాదులకు రుచించినా, స్త్రీ వాదులకు మాత్రం కోపం తెప్పించక మానదు.
 మరిన్ని వివరాలకు లింక్ మీద క్లిక్ చెయ్యండి     
 http://www.thehindubusinessline.com/news/adb-issues-dress-code-for-women-delegates/article4676117.ece