Thursday, December 11, 2014

"విగ్రహారాదన"లో కొంత సైన్స్ ఉంది ! దానిని వ్యతిరేకించే వారిలో ఏముంది....?

                                                                           


ఈ  మద్య నేను ఒక మిత్రుని బ్లాగులో విగ్రహారాదనను హిందూ మహా పండితులు వ్యతిరేకించారు కాబట్టి దానిని పాటించక పోవడమే మంచిది అన్న ఉచిత సలహా చూసే సరికి , నాకు నవ్వు ఆగలేదు . అసలు హిందూ అంటె అర్దం తెలియని వారు , తాము అనుసరించే మతవిదానాలు మాత్రమె మహా గొప్పవని విశ్వసించే వారు రాసిన బ్లాగ్ రాతలు అవి. హిందూ ఆరాధనా పద్దతులు లో రెండు రకాలు ఉన్నవి . ఆకార, నిరాకార పద్దతుల్లో ఆ భగవంతుణ్ణి ఆరాదించవచ్చని మన పెద్దలు చెప్పారు. వ్యక్తుల యొక్క మనస్సును  నిగ్రహించే  స్తాయి ని పట్టి అతనికి లేక ఆమెకు ఆకార లేక నిరాకార ఆరాధనా పద్దతిని ఎంచుకోవడం జరుగుతుంది .

        ప్రతి మతంలో కొన్ని శాఖలు ఉన్నాయి . వారికి వేరెవేరు ఆరాధనా పద్దతులూ ఉన్నయి. ఎవరి పద్దతిలో వారు పూజలు చేసుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కాని నీది తక్కువ  నాది ఎక్కువ  అన్నప్పుడే , ఆ ఎక్కువ తన్నాన్ని పరీక్షించడానికి మొత్తం కెలక వలసి వస్తుంది. ఇది దేవుదు ఒక్కడే అని నమ్మే వారికి సరి అయిన పద్దతి కాదు. అసలు విగ్రహారాదన పద్దతి ఎవరికీ  అవసరం , నిరాకార ఆరాధన పద్దతి ఎవరికీ అవసరం అనేది చూదాం .

  మనకు  " హిప్నాటిజం " అనే దానిలో సాధకుడు అవలంభించే విదానాలు ఎలాగుంటాయి చూడండి . బాగా ప్రాక్టిస్ ఉన్నవారు " సెల్ప్ సజె షన్ " ల ద్వారా సబ్కాన్షియస్ స్తితికి వెళ్లి , ఆ స్తితిలో మైండ్ కి పాజిటివ్ సజెషన్ ల ద్వారా తమలోని నెగటివ్ బావాలను మాయమయ్యేలా చేస్తారు . తద్వారా వారు నిజ జీవితంలో విజయాలను సాదిస్తారు  అని అంటారు. అలాగే కొత్తగా ప్రాక్టిస్ చేసే సాధకుల ఎదుట , హిప్నాటిశ్ట్ ఒక లైట్ నో , లేక ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంచి దానినే తదేకంగా చూస్తూ ఉండమని చెప్పి, వారికి సజెషన్ లు ఇస్తూ సబ్ కాన్షియస్ స్తితిలోకి తీసుకువెలటాడు . ఆ తర్వాత పాజిటివ్ సజెషన్ లతో మైండ్ లోని నెగటివ్ నెస్ ని లేకుండా చేస్తారు. బాగా ప్రాక్టీస్ ఉన్న వారికి ఏ అబ్బ్జెక్టు ఉండవలసిన అవసరంలేదు.

   హిందూ ఆరాధనా పద్దతిలో విగ్రహారాదన కూడా మానసిక స్తిరత్వానికి ఉద్దేసించిందే . విగ్రహం ని ఒక ఆబ్జెక్టు గా చేసి, సంకల్పం ద్వారా భగవంతుని అరాదనకు మనసును సిద్ధంచేసి, తదేక ద్యానంతో భక్తులు తమ మనసును ఆ భగవంతుని మీద లగ్నం చేసి ఆరాదిస్తారు. దానికి ఆచార్యులు  ఆరోహ , అవరోహణ క్రమంలో పాటించే మంత్రోచ్చారణ , భక్తులను త్వరగా సబ్కాన్షియస్ స్తితిలోకి తీసుకు వెలుతుంది. ఆ స్తితిలో వారి మనసు కోరుకునేదే నిజ జీవితంలో సిద్దిస్తుంది. ఒక వేళ విగ్రహం , మంత్రోచ్చారణ లేకుండా మనసుని సబ్కాన్షియస్ స్తితికి తీసుకువెళ్ళే సమర్దత  ఉన్న వారికి విగ్రహం అవసరం లేదు. అటో సజెషన్ చాలు. అంటె ఒక రకంగా ఈ నాడు హిప్నాటిజం లో మనసు ని నియంత్రించుకుని , పాజిటివ్ సజెషన్ ల ద్వారా మైండ్ ని శక్తివంతం చేసుకుని నిగ్రహ పరులుగా మారడానికి ఏ పద్దతులు అవలంబిస్తున్నారో , అవే పద్దతులు విగ్రహ ఆరాధన పద్దతిలో , వేల సంవత్సరాల క్రితమే మన పూర్వికులు ప్రవేశ పెట్టారు. అసలు హిప్నాటిజం సైన్సు కాదు అనే వారు ఉన్నారు. వారికి పెద్ద నమస్కారం పెట్టి వదిలెయ్యడం మంచిది.

   యితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన అంశం ఏమిటంటె,సోషలిజం కి, కమ్యునిజం కి తేడా తెలియని బోల్డంత మంది , కమ్మ్యునిస్ట్ పార్టిలో  ఉన్నట్లు, నిరాకారా పద్దతిలో ద్యానం  చేసి మనసుని స్వాదీనంలోకి తెచ్చుకోవటం ఎలాగో తెలియని వారు , నిరాకార ఆరాధనా పద్దతి గురించి తెగ లెక్చర్ లు ఇస్తున్నారు . అదే అసలు బాద. మనసుని స్వాదీనంలోకి తెచ్చుకోవడమనేది చాలా కష్ట తరమైన ప్రక్రియ. అది సామాన్యునికి సాద్యం కాదు. రోజుకు 3 సార్లు వంగుని లెగిస్తేనొ, 30 సార్లు బోర్లా పడుకుంటేనో అది సాధ్య పడుతుందని నేను అనుకోవడం లేదు. అందుకే సామాన్యులైన మానవులు " విగ్రహారాదన " పద్దతిలో అయినా ఆ దేవున్ని పూజిస్తే కొంతలో కొంత మానసిక  తృప్తి పొందవచ్చు . అందుకే జ్ఞానులకు నిరాకార మార్గం, సామాన్యులకు ఆకార మార్గం. అన్నీ తెలిసిన వారికి ఆకారం అయినా నిరాకారం అయినా ఒకటే . తెలిసి , తెలియని వారికి ఏ "కారం " అయితే బెస్టో  వాళ్ళ దేవుడే చెప్పాలి.

      చివరగా ఒక మాట. సైన్స్ ప్రకారం ఈ సృష్టి అంతా ఎలక్టాన్ , ప్రోట్రాన్ , న్యూట్రాన్ లే ఉన్నప్పుడు ,కనిపించే  విగ్రహం లో నైనా , కనిపించని నిగ్రహం లోనైనా ఉన్నవి అవే కదా? మరి ఏ పద్దతిలో పూజిస్తేనేమ్ . అంతా ఎలెక్ట్రాన్ ,ప్రోటాన్ , న్యూట్రాన్ ల మాయే తప్పా , అనుకోవడానికి ఏముంది ? !!!!

Saturday, November 8, 2014

మనవు: e ఫ్యామిలీ కౌన్సెలింగ్

మనవు: e ఫ్యామిలీ కౌన్సెలింగ్:                                                                                                                                         ...

Friday, May 9, 2014

" సేవ్ సిస్టర్స్ " వారు జాలి పడాల్సింది "కరుణామయులు " గురించి , రౌద్ర రూపినులైన హిందూ దేవతల గురించి కాదు!

                                                                                    

భారత దేశం లో ఉన్న హిందువులకు చీము నెత్తురు తక్కువ అయినందు వల్లా , చేతకాని వెదవలు సైతం హిందూ దేవుళ్ళను , దేవతా మూర్తులను తీవ్రంగా అవమానిస్తున్నారు . స్టానిక ఆహార అలవాట్లు అయిన ఉప్పూ , కారం  మానివేసి  పిజ్జా లు లాంటి పదార్దాలు తినటం అలవాటు చేసుకున్నందు వలన కాబోలు మన జాతిలో ఎవరేమి చేసినా పట్టించుకోని తత్త్వం ఎకువై పోయింది . సహజంగా శాంత స్వబావులైనా ,అవసరమైన  వేళలో ఉగ్ర నరసింహాలుగా , రుద్ర దుర్గా మూర్తులుగా ఉండాల్సిన జాతి దిక్కుమాలిన కరుణామయ తత్వాన్ని అలవార్చుకున్నారా అన్నట్లు ప్రవర్తిమ్చండం అత్యంత హేయం .
     విదేశి పండ్స్ తో పురుడు పోసుకున్న సంస్తలు కొన్ని కావాలని పనికట్టుకుని , భారతీయ స్త్రీలను రక్షిస్తున్నాం అని పోజులు కొడుతూ , అ వంకతో హిందూ దేవత లను ఘోరంగా అవమానిస్తుంటే  హిందువులు  మిన్నకుండడం ఈ  దేశ బవిశ్యత్ కి మంచిది కాదు ? "సేవ్ సిస్టర్స్ " అనే సంస్త ముంబాయి ఆడ్ ఏజెన్సి వారితో ఒక యాడ్ ని తయారు చేసి ప్రచారం లో పెట్టింది . దాని ఉద్దేశ్యం "గృహ హింస " కు బలి అవుతున్న స్త్రీల గురించి   ప్రచారం చేయడమట ! దాని కోసం హిందూ త్రి మూర్తినులైన లక్ష్మి ,సరస్వతి , పార్వతి మాతలను గృహ హింస కు గురై నట్లు వారి ముఖాల మిద గాయాల గుర్తులు పెట్టి  ప్రచారం చేయడం వెనుకాల ఎ శక్తులు ఉన్నాయో తెలుసుకోలేని వారు కాదు హిందువులు . హిందూ దేవతలు ఏమైనా చేతకాని కరుణామయ తత్వాన్ని ప్రబోదిమ్చిన వారా హింసలు పాలు కావడానికి?    పేరొందిన పురుష రాక్షసులనే తమ కత్తులకు బలి ఇచ్చిన రౌద్ర రూపినులు . వారినా చేత కాని "సేవ్ సిస్టర్స్ " అవహేళన చేసేది ? ఇటువంటి యాడ్ ల ద్వారా  హిందువుల మనోబావాలు గాయపరచాలని చూస్తె , రాక్షసులకు పట్టించిన గతినే హిందూ మాతలు మీకు పట్టిస్తారని గుర్తుంచుకోవడం మంచిది .

    పరమ నీచమైన సదరు యాడ్ ని క్రింది విడియోలో చూడగలరు . ఒక హిందువుగా, ఇట్టి ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను .
                       
                  

Sunday, May 4, 2014

"బట్ట తక్కువ వ్యాధి" తో బాద పడుతున్న బాలిఉడ్ నటి !



ఆమె గారి పేరు పూనం పాండే . బాలిఉడ్ చలన చిత్ర సీమలో  సంచలన నటిమణ . ఆమె నటిమణి కాక ముందు మోడల్ అట . మోడల్ గా తన అంగాంగ బంగిమలతో వివిధ ఆడ్స్ లో పోజులిచ్చి వీక్షకులను వేర్రేత్తించిన హాట్ గర్ల్ !2013 లో నషా అనే హిందీ సినిమాలో విద్యార్డితో ప్రేమాయాణం సాగించిన టిచర్ పాత్రలో నటించి  కుర్రకారు మతుల్నిపోగొట్టిన  నటి . 

అయితే ఇదంతా మనకు అవసరం లేదు కాని ఈమే కు పాపం ఒక జబ్బుంది .దాని గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది . ఎందుకంటే దీనిని జబ్బు అని కొంతమంది స్త్రీవాదులు అనుకోరు . దీనిని ప్యాషన్ అని ,అది స్త్రీ స్వేచ్చ లో బాగమని పొరపడుతుంటారు . అందుకే దిని గురించి తెలుసుకుంటే మంచిదనేది . అ జబ్బు పేరు "బట్ట తక్కువ వ్యాది ". దీనినే ఇంగ్లిష్ లో exhibitionism అని అనవచ్చు. ఇది ఒక మానసిక రుగ్మత . ఈ రుగ్మతతో బాద పడే వారు ఒంటి నిండా బట్ట కప్పుకోవడానికి తెగ ఇబ్బంది పడి పోతుంటారు .  తరగని వస్త్ర సంపద ఉన్నా , ఒంటిని మాత్రం చిన్న పిలికతో కప్పుకుని ఎదుటి వారిని ఆకర్షించాలని తెగ ఉభలాట పడి పోతుంటారు . అది చూసి ఎవరైనా మగాళ్ళు అదుపు తప్పితే , వారిని మృగాల్ల క్రింద జమ కట్టేసి నానా యాగి చేసి జాతియ మీడియాలో పోకస్ అయి తమ రేటింగ్ లు పెంచేసుకుంటారు .                                                                                                                                                                                                                                                                                                          అలాంటి బట్ట తక్కువ వ్యాది తో బాద పడుతున్న పూనం పాండే గారు మొన్న ముంబాయిలో అర్దరాత్రి 11 గంటలకు కారును ఒక చోట ఆపి , తన బట్ట తక్కువ తన్నాన్ని ప్రదర్శిస్తుంటే , అటుగావెళుతున్న పోలీసులు ఆమెను చూసి జీపు ఆపి వెళ్లి ఆమెను అరెస్ట్ చేసి అసభ్య ప్రవర్తన క్రింద కేసు బుక్ చేసారు అట . అ తర్వాత ఎవరో రాజకీయ నాయకుడు పోన్ చేస్తే వార్నింగ్ ఇచ్చి వదిలేశారట . ఆమె మాత్రం పోలీసులు తనను అడిగారు తప్పా , పోలిస్ స్టేషన్ కి తీసుకు వెళ్ళలేదు అంటుంది . తీసుకు వెళ్ళారో లేదో క్రింది విడియో చూస్తె తెలుస్తుంది .                                                                                                                                                                                                                                                                                                                               ఏది ఏమైనా బట్ట తక్కువ వ్యాదితో బాద పడే వారిని జాలి తలచి ఒంటినిండా బట్ట  కప్పాలి కాని , ఇలా అరెస్ట్ చెయ్యడమేమిటి , నాన్ సెన్స్ 1 అని సంస్కరణ వాదులు అడుగుతున్నారట . నిజమేగా మరి !ఇక నుండి పోలీసులు బట్టలు మూటలు పోలిస్ జీప్ లో  పెట్టుకుని తిరగాలి మరి .                                                                                                                                                                                




                                                                         

Saturday, May 3, 2014

"ఉదయభాను" ని అంతలా ఆవేశ పరచిన అ "కొడుకు " ఎవరు !?

ఇంతకు ముందే టి.వి మహిళా యాంకర్ ఉదయభాను పాడిన పాటకు సంబందించి "నిగ్గదీసి అడుగు " అనే టైటిల్ తో యూ ట్యూబ్ లో ఏదో పెట్టారని పేస్ బుక్ లో చూసి , బహుసా ఆమె నిగ్గదీసి అడుగు అనే సినిమా పాటను ఆమె తన గొంతుతో పాదిందేమో అనుకుని క్రింది వీడియోను చూడడం జరిగింది . ఆమె పాడిన 4 చరణాలు సదరు పాటకు సంబందించినవి కావు . ఆమె పాడినది ఎవరో అవినీతి పరుడు అయిన ఆమె కొడుకు గురించి అనిపించింది . ఆమె ఆవేశo  చూసిన  నాకు అంతలా ఆమెను అవేశ పరచిన ఆమె కొడుకు ఎవ్వరో నాకు అర్ధం కాలేదు . మీకేమైనా తెలుస్తుందేమో అని ఆమె పాడిన 4 చరణాల వీడియోను పోస్ట్ చేస్తున్నాను . చూడండి  

   
                 
అయినా  ఉదయ బాను పిచ్చి కాకపొతే , అవినీతి పరులను ఆదరిస్తున్న ప్రజలను వదిలి పెట్టి , వారిని ఏమంటే ఏమి సుఖం ? ప్రజలు ఆదరిస్తున్నారు అంటే తాము చేసేది కరెక్టే అని అనుకోవడం మానవ సహజం . అందుచేత దమ్ముంటే ప్రజలను నిగ్గదీసి అడుగు సిరి వెన్నెలా సీతా రామ శాస్త్రిలా ! అది ఎలాగో క్రింది విడియోలో చూడండి .

                                           

Wednesday, April 16, 2014

వందన సమర్పణ ఎలా చేయాలో ఈ "ఉత్తమ కుమార్ " గారిని చూసి నేర్చుకోవలసిందే !

                                                                   

సభా సాంప్రదాయాలు తెలియని వారు ఘనంగా సభలు నిర్వహిస్తారు . అందరి సంగతి ఏమో కాని ఈ  రోజు కరీంనగర్ లో కాంగ్రెస్ వారు నిర్వహించిన సభ చప్పగా సాగింది అని చెప్పవచ్చు . అధిష్టాన దేవత ఎలాగో చూసి చదువుతుంది కాబట్టి , కంపెని సెక్రటరి వార్షిక నివేదిక చదివినట్లు అనిపిస్తుంది . పోనీ ఇంకా ఎవరైనా ప్రజల్ని ఆకట్టుకునేలా  మాట్లాడారా అంటే అబ్బే అందరికి దేవతను పొగడటం మిద ఉన్న యావ తెలంగాణా బవిశ్యత్ మిద ఉన్నట్లు లేదు . ఇక అందరూ అమ్మకి కండువాలు కప్పాకా , చివరకు వందన సమర్పణ చేయమని తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ కుమార్ రెడ్డి గారికి అవకాసా మిచ్చారు . ఆయనకి అసలు వందన సమర్పణ అంటే ఏమిటో బొత్తిగా తెలిసినట్లు లేదు . అందుకే అయన కూడా పొడి పొడి మాటలతో తానూ కూడా ఉపన్యాసం చెప్పి వెళ్లి పోయాడు . మొత్తానికి వందన సమర్పణ లేకుండానే బారి భహిరంగ సభ ముగిసింది .
     ఉత్తం  గారి  ఉత్తుత్తి వందన సమర్పణ ఎలా ఉందొ చూడాలంటే క్రింది విడియోలో చూడవచు!
             
                 

Tuesday, April 15, 2014

ఎలెక్ట్రాన్ , ప్రోటాన్ లానే న్యూట్రాన్ లను గుర్తించాలన్న సుప్రీం కోర్టు.అప్ ఇండియా !

                                                                 


మానవ సమాజం ,ఒక  అణువు లాంటి నిర్మాణం తో పోలిస్తే అందులో ఎలెక్ట్రాన్ లు న, ప్రోటాన్ లు ఉన్నట్లే సమాజo లో స్త్రీలు , పురుషులు ఉన్నారు . అలాగే ఈ రెండు లింగాలే కాకుండా అటూ ఇటూ కాని వారు కూడా ఉన్నారు . మన దేశంలో ఇప్పటి దాక వారికి, వారు కోరుకున్నట్లు స్త్రీ యో , లేక పురుషుడి గానో పరిగణిస్తూ అన్ని సౌకర్యాలు ఇవ్వటం జరుగుతుంది . కాని దేవుడే తమని ఒక ప్రత్యెక జాతిగా పుట్టిస్తే , మీరేమిటి మాకు సంబంధం లేని జాతిలో(లింగం) మమల్ని చేర్చి అవమాన పరచడం అని వారిలో చైతన్య వంతులైన వారు కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు .
 నిజమే మరి అణువులో ఎలెక్ట్రాన్ , ప్రోటాన్ లతో పాటు న్యూట్రాన్ లు ఉంటాయి కదా ! వాటి స్వబావ రిత్యా వాటిని గుర్తించి , న్యూట్రాన్ లని ప్రత్యేకంగా పరిగాణిస్తున్నట్టే ఈ న్యూట్రల్ ల్స్ ని గుర్తించాలి కాని , స్త్రీ పురుషులలో కలిపి వారికి రావాల్సిన ప్రత్యెక  సౌకర్యాలు రాకుండా చేయటమేమిటి ? ప్రత్యెక సౌకర్యాలు ఏమిటంటార ? ఇక నుండి వారు సెక్సువల్ మైనారిటిలు . వారికి కూడా ఇతర మైనార్టిలు కు ఉండే ప్రత్యెక సౌకర్యాలు అన్ని లభిo చవచ్చు . ఈ  విదంగా వారు సక్సేసే అయినట్లే! కాకపొతే ఈ తీర్పు  తమకు కూడా వర్తిస్తుందని కొంతమంది హోమో లు, లెస్బియన్ లు అపోహ పడుతున్నట్లు ఉంది . వారికి ఎంత మాత్రం ఈ తీర్పు వర్తించదని , జన్మతః తృతీయ ప్రక్రుతి కలిగి ఉన్న వారికె ఈ  తీర్పు వర్తిస్తుందని ఉన్నత న్యాయ స్తానం వారు స్పష్టంగా చెప్పారు .
    మరి రిజర్వేషన్ సౌకర్యాలు కోసం కులాలు ని , తెగలు ని సైతం రికార్డు పరంగా మార్చుకునే ఘనులు ఉన్న మన  దేశం లో ఈ  న్యూట్రల్ మైనార్తి సౌకర్యలకోసం కృత్రిమ ఆపరేషన్లు చేయించుకుని ,అన్ని ఉన్న వారు   కూడా న్యూట్రల్ గా మారి సర్టిపికేట్ లు పొందరా అంటే , న్యూట్రల్స్  రాజ్యాదికారులుగా ఉన్నంత కాలం అవి జరుగుతూనే ఉంటాయి . ఇప్పుడు డబ్బు కోసం ఏంతో  మంది మగపిల్లలు "కోజ్జాలు " గా మారుతున్నా దౌర్బాగ్యపు సమాజంలో రేపు సౌకర్యాలు కోసం మారరని  గ్యారంటి ఏమి లేదు . అవినీతి సమాజంలో అన్నిo టి ని మార్చవచ్చు . అప్త్రాల్ లింగాలు ఎంత ?
  ఏది ఏమైనా ఇన్నాలకు న్యూట్రాన్ లను గుర్తించడం ద్వారా మన సమాజం పరిపూర్నమైంది . ఇకపోతే మిగిలింది ఆప్పోజిట్  ఎలేక్రాన్ , అపోజిట్ ప్రోటాన్ లను గుర్తించాల్సి ఉంది . అదే నండి , హోమో లు , లెస్బియన్ లు . ఈ సారి వారిని సపోర్ట్ చేసే రాహుల్ , సోనియాలు అధికారం లోకి వస్తే , చట్టం చేసి వారికి కూడా మైనార్టీ హోదా తో పాటు అన్ని సౌకర్యాలు కల్పించే అవకాశముంది . ఇంకేం మరి ! ఈ ఎన్నికల్లో వారిని గెలిపిస్త్రే పోలా!

Wednesday, April 9, 2014

ఆమెను చూస్తె తాకబుద్ది అవుతుందట !ఈయన్ని చూస్తె పికబుద్ది అవుతుందట !

                                                                   


2014 ఎలెక్షన్ల తేది లు ప్రకటించేశారు . రాజకీయాలలో ఉన్నవారు , సినిమా రంగంలో ఉన్న వారు తమ తమ అదృష్టాలను పరిక్షించు కోవటానికి సమాయత్త మవుతున్నారు ఈ సమయంలో వారికి గుళ్ళో దేవుని కరుణ కంటే , ఓటరు దేవుని కరుణే అత్యంత అవస్యకం ! అందుకె పొద్దున్న లేచినది మొదలు రాత్రి పడుకోబోయే వరకు రోజూ లక్షలాది ఓటరు దేవుళ్ళను కరునించమని ప్రార్దిస్తూ (అలా నటిస్తూ ), సందు సందుకు , గొంది గొంది కు తిరుగుతున్నారు . మరి ఇటువంటి వారి  తిప్పలు చూస్తున్న ఓటర్లు కొంతమందికి జాలి కలిగి ఓటు వేసి కరునిద్దామా అనే ఆలోచనలో పడుతుంటే , మరి కొంత మందికి విరి చేష్టలు చూసి , వికారం కలిగి , తమలో కలిగే వికారాలను ప్రత్యక్షంగా తెలియ చేస్తున్నారు . అదెలాగ అంటే

     ఉదాహరణకు డిల్లీలో రాష్ట్ర ఎన్నికలలో అధికారానికి దగ్గరగా చేరువైన ఆమ్ అద్మి పార్టి అదినేత అరవింద్ కేజ్రివాల్ గారికి మంచి అవకాసం వచ్చినా అంటే రాష్ట్ర పాలనా అధికారం  కట్టబెట్టినా , సరిగ్గా వ్యవహరించకుండా తిక్కల నిర్ణయంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి , అవినీతి నిర్మూలనే తమ అజెండా అని ప్రగల్బాలు పలికి , అసలు అవినీతి సామ్రాట్ లను వదిలివేసి , వారి భరతం పడతానంటున్న మోడీ గారికి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తూ , కాంగ్రెస్ వారికి పరోక్షంగా సహాయం చేస్తున్న , డి గ్రేట్ అరవింద్ కేజ్రివాల్ గారిని చూస్తె ఒక అటో డ్రైవర్ కి ఎందుకో కాని ఆయనకి ఒక దండ వేసి చెంప మిద పీక బుద్ది అయిందట ! అంతే! వెంటనే ఒక పూల దండ కొనుక్కుని అరవింద్ గారి కాన్వాయి దగ్గరికి వచ్చాడట . ఇంకేం , తనకు అభిమాని ఎవరో పూలదండ వేస్తున్నాడేమో అనుకుని  అనుకుని అతనికి అవకాసమిస్తె , సదరు అటో డ్రైవర్ పూలదండ వేసినట్లు వేసి , వెంటనే కేజ్రివాల్ చెంప మిద ఒకటి పీకాడట ! దానితో నివ్వెరపోయిన కేజ్రివాల్ అనుచరులు వెంటనే తేరుకుని అతని మిద దాడి చేసి కొట్టి పోలీసులకు అప్పచెప్పారట .
  కేజ్రివాల్ గారికి పై అనుభవం ఎదురైతే , ప్రముఖ గ్లామరస్ నటిమణి నగ్మా గారికి మరో రకం అనుభవాలు ఎదురవుతున్నాయట . ఆమె గారిని చూస్తుంటే ఓట్లు వేయడం తర్వాత కానీ , ఒక్క సారి ఆమెను  తాకితే  చాలు! జన్మ దన్యమైనట్లే ! అని బావిస్తున్నారట ఓటర్లు . అందుకే ఆమెను ఎలాగైనా తాకాలని ఒకరి మిద ఒకరు పోటి పడి పొలిసు వారికి సెక్యూరిటి ప్రాబ్లం కలుగ చేస్తున్నారట . మొన్న ఒక ముసలాయన , M.L.A అంతటి వాడే ఆపుకోలేక టక్కున నగ్మాని ముద్దు పెట్టుకున్నాడట . అది చూసిన పోలిస్ అధికారులు ఇక లాబం లేదని నగ్మాకి పెద్ద ఎత్తున పోలిస్ సెక్యూరిటి కలుగ చేసారట . వీళ్ళు  నాయకులైతే  ప్రజలకు ఏమి సేవ చేస్తారో తెలియదుకాని ప్రస్తుతం మాత్రం ఓటర్లు వీళ్ళని గోకకుండా  కాపాడానికే  ప్రజా దనం  ఎకువ ఖర్చు చేయాల్సి వస్తుంది . అది సంగతి

     ఒక చోట  నగ్మాను  చూస్తె తాకబుద్ది అవుతుందట !మరొక చోట కేజ్రివాల్ ను  చూస్తె పికబుద్ది అవుతుందట ! ఓట్లు వేయండి అని అడుగుతుంటే ఈ  తాకుడు , పికుడు గోల ఏమిటో అర్ధం కావటం లేదట అబ్యర్డులకు! కేజ్రివాల్ గారి చెంప చెళ్ళు కద గురించి మరింత సమాచారం కొరకు క్రింది వీడియోను చూడండి .

               
             

Monday, March 31, 2014

పవన్ "ఇజం" లోని ప్రక్రుతి సమతుల్యత బావనకు, "పావురాల గుట్ట " ఉదంతానికి ఏమైనా సంబందం ఉందా ?

                                                                         


నేను ఇదే బ్లాగులో 18 నవంబర్ 2012 న బుద్దికి భూములేలాలని ఉన్నా, రాత "పావురాల గుట్టను" అడ్డం పెడుతుంది!" అనే టపాను పెట్టడం జరిగింది . అందులో మనిషి అనేకం అనుకున్నా , చివరకు భగవంతుడి డెసిషన్ యే పైనల్ అని "పావురాల గుట్ట ఉదంతం " ఉదాహరణ గా చెప్పాను.
  మొన్న వైజాగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గారు , తన "ఇజం " పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తూ అందులోని ఆరు అంశాలు గురించి టూకీగా చెప్పాడు . మొదటి 5 అంశాలు కామన్ గా అందరూ చెప్పేవే అనిపించింది . కాని అరవ అంశ మైన "ప్రక్రుతి సమతుల్యత " గురించి చెపుతూ ఇది చాలా ఇంపార్టెంట్ అంశం అని అన్నాడు కాని దాన్ని గురించి సరిగ్గా వివరించ లేదు . బహుశా రాజు రవితేజ అయితే బాగా వివరించి ఉండే వాడేమో . అయన రాసిన పుస్తకం ఇంకా మార్కెట్ లో కి రాలేదు కాబట్టి మనకు ఇజం లోని "ప్రక్రుతి సమతుల్యత" గురించి తెలుసు కోవటానికి కొంత సమయం పడుతుంది . ఇక్కడ ప్రక్రుతి అనేది దేవుడు అనే బావనలో ఉపయోగించి ఉండవచ్చు .
                                           తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు !
                                        బుద్ది బూములేలదాం అంటే రాత గాడుదులు కాద్దాం అందట
                                  
అనే సామెతలు మానవ సంకల్పాలు అనుకున్నవి అనుకున్నట్లు జరుగక ఊహించిన దానికి పూర్తీ వ్యతిరేక దోరణిలో జరిగే సంఘటనల అనుభవం లో నుండి పుట్టినవి . అదే భారతీయులను  సమాజంలో జరుగుతున్నా దుష్కృత్యాలను తాము నిరోదిoచ లేమని నైరాశ్యానికి గురి అయినప్పుడు , అందులోనుoఛి  తీవ్ర వాదం జనిo చకుండా కాపాడుతున్నది , దైవిక పరమైన ఈ బావనలే అనేది నిజం . అందుకే సమాజం లోని ప్రజలలో   వేచి చూచే దోరణి , సహనం ఇవ్వన్ని అలవడి కొంత శాంతి సామరస్యాలతో జీవించడానికి అలవాటు పడ్డారు .
               
           నూరు గొడ్లను తిన్న రాబందు , ఒక్క గాలి వానకే ఖతం! అనే బావన కచ్చితంగా ప్రక్రుతి సమతుల్యత బావం లో నుంచి అవిర్బవిమ్చిందే . "ఎప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో , అధర్మం దే పై చేయి అవుతుందో అప్పుడు నేను అవతరించి అధర్మాన్ని అంతం చేస్తాను " అన్న గితాచార్యుని వాక్యాలు ప్రక్రుతి సమతుల్యత బావానికి అడ్డం పట్టేవి . సమాజంలో సంస్కరించ లేనంతగా అరాచకం ప్రబలితే వాటిని దునుమాడె వారే అవతార పురుషులు . వారెవరూ అనేది బవిష్య  చరిత్ర మాత్రమె చెప్పగలదు . ఎందుకంటే వర్తమానం లో ఎవరికీ వారే దేవుళ్ళు . వారు చేసేదే కరెక్టు అనిపిస్తుంది . తాము పుట్టినది  ప్రజా ఉద్దరనకే అని అందరికి అనిపిస్తుంది . అలాగే  "ఆయనోస్తున్నాడు " అని అయనను  అనుసరించే వారు కోరుకుంటూoటారు.   అందుకే దేవుడు ఎవరూ , సైతాన్ ఎవరు అనేది బవిశ్యత్ లో చరిత్ర ను అద్యయనం చేసేవారు తెలుసుకుంటారు .
   మొన్నటి ఎన్నికల్లో ఒక్కొక ఓటరుకు 1000రూపాయలు , వెండి కుంకుమ బరినే లు , వస్త్రాలు ఇలా ఎవరికీ చేతనైన రీతిలో వారు పంచి పెట్టి తమ నాయకత్వ అర్హతను పరిక్షిమ్చుకుంటూ న్నారట . కోటి నిబందనలు పెట్టినా భారత ప్రజాస్వామ్యంలో  నితి  నిజాయితిలు నేతి  బీరకాయలో నేయి లాంటిదే ! మరి ఇలాంటి వాటిని చూస్తూ ఇంకా ఓపిక పట్టడానికి కారణం "ఆయనోస్తాడు " అనే . కాకపొతే అ అయన ఎవరు అంటే ఎవరి దేవుడు వారికి లాగా ఎవరి అయన వారికే అయన!

బుద్దికి భూములేలాలని ఉన్నా, రాత "పావురాల గుట్టను" అడ్డం పెడుతుంది!కొసం లింక్ మిద క్లిక్ చేయండి "http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_18.html

Wednesday, March 26, 2014

కులంలోనైనా కాంప్రమైజ్ ఉంటుందేమో కాని , రక్తంలో మాత్రం "నో కాంప్రమైజ్ " కామ్రేడ్స్ !.

                                                                         


కొంత మంది విజ్ఞాన వాదులు కొన్ని విషయాలు గురించి వివరిస్తూ ఉపమానాలు చెపుతున్నారు . వారు చెప్పే విషయం గురించి పెద్దగా అబ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు కాని , వారు చూపే పోలికలు చూస్తుంటే వారిలో ఎ మాత్రం జ్ఞానం ఉందొ యిట్టె అర్ధం అవుతుంది . ఉదాహరణకు మొన్న గుంటూర్ లో తల్లి తండ్రులు తమ కన్నా కూతురిని  తమ అనుమతి లేకుండా , తమను మోసం చేసి వివాహం చేసుకుందనే కోపంతో ఆమెను దారుణంగా చమ్పారు. దీనికి యావత్ ప్రజలు, చివరికి వారి బందువులు కూడా తీవ్రo గా ఖండించడం జరిగింది .
 
      అయితే పై కేసులో అమ్మాయిని చంపటానికి "కులం" కంటే ఆర్దిక కారణాలే ఎక్కువ ప్రబావం చూపాయి . దిని గురించి వివరంగా తెలుసుకోవాలంటే    http://ssmanavu.blogspot.in/2014/03/blog-post_24.html ని క్లిక్ చెయ్యండి . అయితే కొంతమంది మనదంతా ఒకే కులం అని చెప్పటానికి ఎన్నో ఉదాహరణలు చూపిస్తున్నారు . దానిలో "రక్తం " ఉదాహరణ ఒకటి . పైనున్న బొమ్మ చూసారు కదా ! పేస్ బుక్ లో కొంత మంది మిత్రులు పోస్ట్ చేసారు దాన్ని . కొన్ని దశాబ్దాలుగా ఈ  ఉదాహరణ తో ప్రజలలో "కులం" గురించి ఉన్న అపోహలు తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు . ఒక్కప్పుడు దిని ని కరక్టే అనుకున్నారేమో కాని , విజ్ఞానం పెరిగాక ఈ  ఉదాహరణ వాళ్ళ మనుషులు అంతా ఒకటి కాదు అనే బావమే బల పడుతుంది . అదెలాగో చూదాం .

   మనుషులలో లేక భారతీయులలో కులాలు మాదిరిగానే రక్తం లో గ్రూపులు ఉన్నాయి . కులాలు చూసుకోకుండా వివాహాలు చేసుకున్నా ఏమి జరుగదు కాని , గ్రూపులు చూడకుండా ఒకరి రక్తం మరొకరికి ఎకిస్తే మాత్రం ఎగిరి చచ్చె అవకాశ ముంది . కులంలో కొంతైనా కాంప్రమైజ్ ఉంటుందేమో కాని , రక్తంలో మాత్రం "నో కాంప్రమైజ్ " . అందు చేత మనుషులంతా ఒకటే అని చెప్పడానికి "రక్తం" ఉదాహరణ పనికి రాదు . మనుషులంతా వేరు వేరు అని చెప్పడానికి మాత్రం బేషుగ్గా పనికి వస్తుంది

Thursday, March 13, 2014

రాష్ట్ర అద్యక్షుడైనా సరే , ఒంగుంటే "ఓటు మాయం" అట!

                                                            

                                                          

అయన పేరు కఠారి శ్రీనివాస రావు గారు . అయన హోదా "లోక్ సత్తా" అనే జాతీయ పార్టికి రాష్ట్ర అద్యక్షులు . అంటే ఆంద్ర ప్రదేస్ లో ఆ పార్టి బాగోగులు చూడాల్సిన వారు . ఆయనకు గత ఎనిమిదేళ్ళుగా సేరిలింగం పల్లి బూతులో ఓటరుగా తన ఓటు హక్కు వినియోగించు కుంటున్న వ్యక్తీ . దానికి గుర్తుగా ఎప్పుడూ అయన ఓటరు కార్డు అయన జేబులోనే ఉంటుందట . కాని మొన్న ఎందుకో ఓటరు లిస్టు చూస్తె అయన పేరు గారి అయన కుటుంభ సబ్యుల పేర్లు కాని ఓటరు లిస్టు లో లెవట . దానితో ఖంగు తిన్న అయన తిరిగి కొత్తగా ఓటరు లిస్టు లో నమోదు కోసం అప్లై చేసుకున్నారట . దినంతటికీ కారణం ఒంగుంటే ఓట్లు మాయం చేసే ప్రత్యర్ది రాజకీయ పార్తిలే అని అయన గారి అరొపణ . నిజమే సుమా ! అప్పుడప్పుడు చెక్ చేసుకోక పొతే ఏదైనా మాయం చేయగల వారున్న రాష్ట్రం ఇది. తస్మాత్ జాగర్త !
 ఇంతకీ అయన గారి ఈ విషయం గురించి ఏమన్తున్నారి ఈ  విడియోలో తిలకించండి .
      

Monday, March 3, 2014

ముంబాయి పోలీసులు అనూహ్య మర్డర్ కేసును మరో "అయేషా " కేసు గా మార్చ బోతున్నారా !?

                                                             


వినేవాడి చెవిలో పువ్వులు ఉంటె చెప్పేవాడు ఎన్ని కట్టు కదలు చెప్పటానికైన రెడి ! భారత దేశం లో నిర్బయ ఉదంతం తర్వాత జరిగిన హత్యల్లో ఆంద్ర ప్రదేస్ లో ని మచిలీ పట్నం కు చెందిన మహిళా  ఇంజనీర్ అనూహ్య కేసు కూడా ఒకటి . అ హత్య జరిగి నెలలు గడుస్తున్నా నిన్నటి వరకు ఏ  క్లూ సాదిo చినట్లు ముంబాయి పోలీసులు మీడియాకు చెప్పలేదు . ఈ రోజు మాత్రం ఒక 35 ఏండ్ల వ్యక్తిని, హత్య చేసిన నిందితుడిగా ముంబాయి కోర్టులో ప్రవేశ పెట్టి , రిమాండ్ కు పంపించారు . కొద్ది సేపటి క్రితం ముంబై  పోలిస్ వారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి , అనూహ్య కేసులో మిస్టరి చేదిoచామని, ఆమెను  సనప్  అనే పాత నేరస్తుడు , టాక్సీ డ్రైవర్ గా ఆమెను తీసుకు వెళ్లి , అత్యాచారం లేక రాబరి చేయబోతే ఆమె ప్రతిఘటించడం వలన , ఆమెను ఉరి వేసి చంపి , ఆ  పై పెట్రోల్ పోసి తగల బెట్టాడని చెప్పుకొచ్చారు . ఇదంతా వింటుంటే కొన్ని అనుమానాలు బుర్ర ఉన్న వారికెవరికైనా జనిస్తాయి . మరి ఘన మైన ముంబాయి పోలిస్ వారికి రాలేదంటే నమ్మడం కష్టం . కావాలనే ఎవరో వెనుక ఉండి ఈ  కేసును అయేషా కేసు లో మాదిరి పక్క దారి పట్టించి అసలు నెరస్తులను రక్షించడానికే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది . ఈ  కేసులో కలుగుతున్న అనుమానాలేమిటంటే ---

    ఎస్తేర్ అనూహ్య ముంబాయి T.C.S కంపెనీలో ఉద్యోగిని . ఆమె గత క్రిస్టమస్ కి తన స్వస్తలం మచిలీ పట్నానికి  వచ్చి , తిరిగి జనవరి మూడవ తారికున బయలు దేరింది . 4 వ తారికున హైదరాబాద్లోని ప్రెండ్స్ తో పార్టి లో పాల్గొని ఆ సాయంత్రం ముంబాయికి రైలులో బయలు దేరింది . 5 వ తారీకు తెల్లవారు జామున ముంబాయిలో దిగిన తర్వాత కొంత సేపు వెయిటింగ్ రూమ్ లో ఉండి అ తర్వాత ఒక వ్యక్తికీ తన బ్యాగ్ ను ఇచ్చి , తానూ సెల్ పోన్లో మాట్లాడుతూ బయటకు వేలుతుండడం క్లియర్ గా రైల్వే స్టేషన్ లోని సి.సి. పుటేజ్ లలో కనిపించింది . అయితే ఆమె తో పాటు పుటేజ్ లలో కనిపించిన వ్యక్తే ఈ రోజు పోలీసులు చెపుతున్న
   సనప్  పాత నెరస్తుడట.పార్ట్ టైం కాబ్ డ్రైవర్ గా ఉన్న అతనికి అనూహ్యను తీసుకు వెళ్ళిన రోజు మాత్రం కాబ్ లెదట . తను కాబ్ డ్రైవర్ ని అని చెప్పి ఆమెతో 300 రూపాయల బేరం కుదుర్చుకున్న అతను  బయట వరకు ఆమెను తీసుకువచ్చిన తర్వాత , తన దగ్గర కాబ్ లేదని మోటార్ సైకిల్ మిద డ్రాప్ చేస్తాను అంటే మొదట్లో అనూహ్య ఒప్పుకోలేదట . అ తర్వాత ఆతను అనుమానం ఉంటె నా సెల్ తీసుకుని మిరేవరితోనైనా పోన్ చేసి విషయం చెప్పండి, కాని నన్ను మాత్రం నమ్మండి , మిమల్ని నమకంగా ఇంటి దగ్గర దిగబెడతాను అంటే , దానికి ఆమె కూడా అతని పోన్ తీసుకుని ఎవరికో పోన్ చేసినట్లు నటించిందట కాని నిజంగా చేయలేదట . గుడ్డిగా అతనిని అనుసరించి హత్యకు గురి అయిo దట . ఇది పోలిస్ వారి కహాని . ఈ కహాని లో   కలుగుతున్న అనుమానాలేమిటంటే -

  (1).  ముక్కు ,  ముఖం తెలియని వాడు కాబ్ ఉందని చెప్పి బయటకు తీసుకు వచ్చి , అక్కడ మోటార్ సైకిల్ చూపించి దాని మిద దిగబెదతాను అంటే అ ఇంజనీర్ నమ్మి గొర్రె పిల్లలా అతని వెంట వెళ్ళిందా ?

 (2). "నా మిద అనుమానం ఉంటె మిరేవరికైనా నా సెల్ లోనే నా గురించి సమాచారం ఇచ్చాకె నాతొ రండి"అని అతడు అంటే సరే అని సెల్ తీసుకుని ఎవరితోనో మాట్లాడినట్లు నటించాల్సిన అవసరం ఆమెకు  ఏమిటి? ఖచ్చితంగా ఆమె తనకు తెలిసిన వారేవరితోనో మాట్లాడి , వారు పర్వాలేదు అతనితో వెళ్ళమని రికమెండ్ చేసాకే వెళ్లి ఉండాలి . అ నిందితుడు కూడా  ఆమెకు తెలిసిన వ్యక్తీ చెపితేనే ఆమెను పికప్ చేసుకోవడానికి వచ్చానని , కావాలంటే అతనితో/ఆమె తో మాట్లాడండి అని తన సెల్ ఇచ్చి ఉండాలి . అ విషయాన్ని ఆమె అతని సెల్ ద్వారా కన్పర్మ్  చేసుకున్నాకే అమాయకంగా అతనిని అనుసరించి బలి అయి పోయి ఉంటుంది .
(3). ఈ  కేసులో ముంబాయి పోలీసులను ఇమ్ప్లూయన్స్ చేయగలిన వారి హస్తం ఉంది ఉండాలి .వారికి ఆ అమ్మాయికి ఏదో బేదాభిప్రాయాలు ఉంది ఆమె బ్రతికి ఉంటె తమకు ముప్పు అని ముంబాయి పాత నేరస్తులతో ఆమెను ప్లాన్ ప్రకారం హత్య చేయించి ఉండాలి . తమక్జు ఉన్న ఇన్ప్లోయన్స్ తో కేసుకు మసి పోసి మారేడు కా య చేసి , పాత నేరస్తులకు కేసు అంట గట్టి , తము తప్పించుకునే ప్రయత్నం అని అనిపిస్తుంది తప్ప, పోలిస్ వారి కహాని ఎ మాత్రం నేమ్ విదంగా లెదు.
        ఈ కేసును నిజాయితిగా సి.బి.ఐ వారి చేత దర్యాప్తు చేస్తే తప్పా నిజాలు నిజాలు వెలుగులోకి రావు . అ  దిశగా ఆమె సంబదికులు చర్యలు తీసుకోవాలి . అవసరమైతే తెలుగు  ప్రజా సంఘాలను కదిలిoచితే తప్పా అనూహ్య కుటుంబానికి న్యాయం జరుగదు .

Wednesday, February 26, 2014

ఖమ్మం జిల్లా మంత్రి ,శ్రీ రామిరెడ్డి వెంకట రెడ్డి &అదర్స్ మిద మద్యం సిండికేట్ కేసు పెట్టాల్సిందే అన్న హై కోర్టు !

                                                         


రూల్ ఉంటె కోర్టుకు పో ! లేకుంటే మంత్రి దగ్గరకు పో ! అనేది లౌక్యం తెలిసిన కార్య సాధకుల మాట!. ఆ  మాట అక్షరాల నిజమేనని రుజువైంది ఈ రోజు ఆంద్ర ప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వులు రుజువు చేస్తున్నాయి . కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలన సంగతి ఎలా ఉన్నా ,బడా  బడా నిందితులు మిద చట్ట పరమైన చర్యలు తీసుకున్నది మాత్రం అయన గారి హయాంలోనే . అయితే అయన గారి నిజాయితిని కూడా సవాలు చేసేలా తయారయింది 2012 లో A.C.B  వారు జరపిన మద్యం సిండికేట్ కెసు. ఈ  కేసులో 12 మంది M.L.A  లతో పాటు ఇద్దరు మంత్రులు శ్రీ రామిరెడ్డి వెంకట రెడ్డి , మోపిదేవి వెంకట రమణతో సహా చాలా మంది అధికార అనదికారులమిద విచారణ జరిపారు . అయితే సరి అయిన ఆదారాలు ఉన్నా ప్రజా ప్రతినిధులు మిద కేసులు నమోదు చేయకుండా , రాజకీయ ఒత్తిడికి తలొగ్గి కేసును నిరు గార్చడానికి చూస్తున్నారని A.C.B మిద ఆరోపణలు వచ్చాయి .

   చివరకు ఆ ఆరోపణలు ఆదారంగా హైకోర్టులో ఒక ప్రజా హిత వ్యాజ్యం దాఖలు కాగా , దానిని పరిశిలిoచిన ఆంద్ర ప్రదెస్ హై  కోర్టు వారు ఆదారాలు ఉన్న వారి మిద కేసులు నమోదు చేసి 3 నెలలలో విచారణ పూర్తీ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ  చేసింది . ఇన్నాళ్ళు ఆగి తీరా ఎన్నికల ముందు ఇలా హై  కోర్టును ఆశ్రయించడం వెనుక రాజకీయ కారణాలు ఉండవచ్చు కాని ,  చైతన్యం కల ప్రజలు ఉన్న సమాజంలో పాలకులు తాము ఏమి చేసినా అడిగే వారు ఉండరు అనుకోవటం పొరపాటే . ఆదారాలు ఉంటె ఎంతటి వారైనా చట్టం నుండి తప్పించుకోలేరు . నిందితులు కోర్టుల్లో విచారణ ఎదుర్కుని తమ నిర్దోషిత్వాన్ని నిరూపిoచు కోవలసిందే  అని పై ఉదంతం తెలియ చేస్తుంది .
  ఈ విషయం గురించి మరింత సమాచారం కొరకు క్రింది విడియో ను చూడండి
                  
            

Tuesday, February 25, 2014

మాట తప్పి , ఆంద్ర ప్రదేశ్ లోకే అడుగుపెడుతున్న "తెలంగాణా దొర " గారికి స్వాగతం! సుస్వాగతం !

                                                                   


మొన్నతెలంగాణా   దొర  విమానం ఎక్కి డిల్లికి పోయాడు . బేగం పేట విమానాశ్రయం దగ్గరకు పోయేసరికి ఆయనకి ఒక పోన్ కాల్ డిల్లి నుంచి వచ్చింది . ఈయన దగ్గర M.P  సీటు ప్రామిస్ తీసుకున్న డిల్లీ  నాయకుడు ఒకరు ,  దొర గారికి డిల్లి ఇన్ఫార్మర్ గా పని చేస్తున్నాడు . ఆ ఇంఫార్మరే పోన్ చేసి మరి చెప్పాడట ! ఈ పార్లమెంట్ సెషన్ లోనే తెలంగాణా బిల్ పాస్ చెయ్యాలని మేడం హుకుం జారీ  చేసేసారట ! అందుకే ఇక తెలంగాణా O.K అని సమాచారం . ఆ మాట వినగానే ఒళ్ళంతా పులకరించింది తెలంగాణా దొరకి . అంతే ! అప్పటికప్పుడు అక్కడున్న మీడియా వారి ముందు వీర ప్రతిజ్ఞ చేసేసాడు . "నేను అడుగంటూ తిరిగి హైదరాబాద్ లో పెడితే "తెలంగాణా రాష్ట్రం " లోనే తప్పా ఆంద్ర ప్రదేశ్ లో కాదు " అని . ఆ మాట విని తెలంగాణా ప్రజలు సంతోషించారు .

   కాని అదే తెలంగాణా దొర ఈ  రోజే డిల్లి నుండి హైదరాబాద్ కి తిరిగి వస్తున్నారు . ఆయనకు తెలంగాణా చరిత్రలో ఎవరికీ పలకని ఘన స్వాగతం పలికేందుకు అయన గారి పార్టి సంసిద్ధులు అవుతున్నారు . మంచిదే ! కాని అయన చేసిన ప్రతిజ్ఞ ఏమిటి ? చేస్తున్న పని ఏమిటి? అయన తిరిగి అడుగు పెడ తానన్నది తెలంగాణా రాష్ట్రంలో . కాని అడుగు పెడుతున్నది ఆంద్ర ప్రదేశ్ లో . కనీసం టెక్నికల్ గా కూడా తెలంగాణా ఎర్పడలేదే ! దానికి రాష్ట్రపతి గారు అప్పాయింటెడ్ డేట్ ను ప్రకటించాల్సి ఉంది కదా ! ఆ  రోజు నుంచి కదా తెలంగాణా ఏర్పాటు ! మరి ఈ నాలుగు రోజులు డిల్లిలోనే ఉండీ రాష్ట్రపతి గారి చేత అ డేట్ ప్రకటింప చేసి , తెలంగాణా ఏర్పడిన తోలి రోజున తోలి అడుగు డిల్లి నుండి వచ్చి పెడితే ఎంత గొప్పగా ఉండేది ? ఇలా  ప్రతిజ్ఞా బంగం చేసి అయన రావడం! దానికి చరిత్ర లో గుర్తుంచుకునే స్వాగతం పలకడం ! చివరకు ప్రజలు అయన వాగ్దానా బంగాన్నే గుర్తుంచుకునే ప్రమాదం ఉంది .

  ఏదైనా దొర  దొరే ! అయన చెప్పిందే వేదం . అందుకే ఆయనకు స్వాగతం! సుస్వాగతం

Sunday, February 23, 2014

రాజకీయపార్టీల కోసమైనా రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేయక తప్పేట్టు లేదు !.

                                                        
                                                           

ఆంద్ర ప్రదేశ్ లోని   రాజకీయ పార్టీల కోసమైనా రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేస్తే బాగుంటుంది కదా అని ఆ లోచిస్తున్నారట కొంతమంది ప్రాంతీయ పార్టీల నాయకులు!. ఇన్నాళ్ళు అంటే తెలుగు జాతికి ఒకే రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో నే ప్రాంతీయ పపార్టీలుగా  ఉంటూ తెలుగు ప్రజలు అందరికి సేవ చేసే బాగ్యం దక్కినందుకు పొంగిపోతూ  ఉండేవారు . ఇప్పుడు హఠాతుగా  రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించే సరికి వీరికి ఒక టెక్నికల్ ప్రాబ్లం ఎదురయింది . అదేమిటంటే

   ఏదైనా ఒక ప్రాంతీయ  రాజకీయ పార్టి ఒకటి మించి వేరే రాష్ట్రాల్లో అదే గుర్తుతో పోటి చేయాలంటే దానికి జాతీయ స్తాయి గుర్తింపు కావాలి . మరి అలా ఉండాలంటే కనీసం 4 రాష్ట్రాలలో సదరు పార్టికి చట్ట ప్రకారం ప్రాతినిద్యం ఉండాలి . కాని ఇప్పుడు తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోవడం వలన కంపల్సేరిగా  ప్రాంతియ పార్టీలు రెండు రాష్ట్రాలలోను పార్టీని నడపాల్సిన పరిస్తితి. మరి అటువంటప్పుడు రెండు రాష్ట్రాలలోను ఒకే గుర్తు మిద పోటి చేయాలంటే అ దానికి జాతీయ పార్టి గుర్తింపు కావాలి . అందువల్ల మరో రెండు రాష్ట్రాలు వాటికి కావాలి . ప్రాంతీయ పేరులు పెట్టుకుని ఇతర రాష్ట్రాలలో పార్టి ని విస్తరించలెరు . కాబట్టి ఉన్న ప్రత్యామ్నాయం , సెంట్రల్  చట్టానికి సవరణలు చెయ్యడం లేదా ఉన్న రెండు రాష్ట్రాలను మరో రెండు ముక్కలు చేయడం . కాబట్టి రానున్న 10 సంవత్సరాలలో మరో 2 రాష్ట్రాలు తెలుగు నాట అవతరిoచ వచ్చు .

   మంచి కైనా చేడుకైనా నలుగురు ఉండాలి అంటారు . తెలుగువారి రాష్ట్రాలు కూడా నాలుగు ఉంటె మనకి జాతి య హోదా రాకపోయినా , పార్టీలకు ఒక జాతీయ గుర్తింపు  వస్తుంది కదా !

Saturday, February 22, 2014

రాజీవ్ గాంది ,సంజయ్ గాంది , గార్లు ఒక తండ్రి బిడ్డలు కారా ?!

                                                      
         
                                                                

ఇంతవరకు నాకు తెలియని అంశం . అపకొర్స్ తెలిసినా పెద్దగా ఒరిగేది ఏమి లేదనుకోండి . కాకపొతే నాకు ఒక చిన్న అనుమానం ఉండేది . రాజీవ్ గాంది , సంజయ్ గాంది  గారాలు ఇందిరా గాంది  గారి పుత్రులే కదా. మరి సంజయ్ గాంది  గారి కుటుంభం అంత నిర్లక్ష్యానికి ఎందుకు గురైంది అని . అది ఇందిరా గాంది , మేనకా గాంది  గారలు మద్య ఉన్న బెదాభిప్రాయాలు అనుకున్నాను కాని ఈ రోజు వారి తండ్రులు వేర్వేరు అని తెలిసాక బహూశా అదే కారణమై ఉంటుందనుకుంటున్నాను . నాకు ఆ సంగతి తెలిపినడది  పైన చిత్రంలో ఉన్న నెహ్రూ గారి వంశ  వృక్షమే . నెహ్రూ గారిది కాశ్మీరి  బ్రాహ్మణ వంశం అంటారు చాలా మంది. అది నిజం కాదని వారిది లౌకిక వoశ మని పై పట్టిక ద్వారా తెలుస్తుంది .అందుకే వారికి హిందూ అంటే సరిపడదు అనుకుంటా !

Friday, February 21, 2014

బ్రహ్మం గారు చెప్పిన "కాలజ్ఞానం" నిజమయినా కాకకపోయినా" కల్కిఖడ్గం" చెప్పిన భవిష్య వాణి మాత్రం నిజమయింది !.

కల్కిఖడ్గం

                                                         

నేను ఈ బ్లాగు మొదలు పెట్టడమే భవిష్య ద్రష్ట లు చెప్పిన ఒకానొక విషయం మిద . అదిఏమిటంటే డిసెంబర్ 21, 2012 న యుగాంతం అని . మొదట్లో నా బ్లాగు పేరు కూడా అదే . ప్రపంచంలో చాలా దేశాలలోని ప్రజలు దానిని నమ్మిన వారు ఉoడొచ్చు. కాని దాని గురించి కోట్లాది మంది ప్రజలు మాత్రం ఉత్సుకత చూపించారు అనేది మాత్రం నిజం . నా బ్లాగులో మాత్రం నేను యుగాంతం గురించి కాదు కాని ఆ రోజు బ్రహ్మం గారు కాలజ్ఞానం లో చెప్పిన వీరబొగ వసంత రాయలు వస్తాడు అని చెప్పాను. నా బ్లాగు పట్ల కూడా వీక్షకులు కొంత ఆసక్తి చూపారు . అయితే విరబొగ వసంత రాయలు అంటే ఉన్న అర్ధం వేరని అయన వచ్చింది నిజమే అని కొన్ని కారణాల వల్ల ఆయన్ని కనుకొవటం కష్టం అని నేను ప్రచురించిన టపా చూసి   వీక్షకులు నిరాశ చెంది , కేవలo నా బ్లాగు పాపులారిటి కోసం అ పని చేసాను అని అనుకున్నారు . O.K .  నాడు వీరభొగ వసంత రాయలు విషయంలో నేను చెప్పినది నిజం అయినా కాకపోయినా , ఇదే బ్లాగులో పిబ్రవరి 1, 2013 న నేను చెప్పినది మాత్రం నిజమైంది . అదే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు . నేను పిబ్రవరి 1,2013 న ఏమి చెప్పాను అంటే 
            
   "అదిష్టానం వాగ్దానాల మీద పార్టీలకు నమ్మక్కం లేదు. అందుకే అదిగో తెలంగాణా ఇదిగో తెలంగాణా అంటే అవన్ని పిల్లకాయ మాటలుగా బావించారు. అలాగే పార్టీ అభిప్రాయాలను, అంద్రా ప్రజల అభిప్రాయాలను బేఖాతరు చేసి చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ ఎట్టి పరిస్తితిలోను "తెలంగాణా" ఇవ్వదనే గుడ్డి నమ్మక్కంతో. కాని సోనియా గాంది వీరి పిల్లకాయ మాటలను నమ్మింది కాబట్టి తెలంగాణా ఇవ్వడానికే సిద్ద పడింది. ఎవరు అవునన్నా కాదానా  కాంగ్రెస్ అదిష్టానం తెలంగాణా ఇస్తుంది. అంద్రావాళ్ళ పిల్లాటలకు తగిన మూల్యం చెల్లించక తప్పదు."  
                   అని చెప్పాను . మొన్న 20-2-2014 నాడు తెలంగాణా బిల్  సొనియా గాంధి గారి పట్టుదలతో ఉభయ సభలలొ ఆమోద ముద్ర పడింది . ఇక కేవలం లాంచన ప్రాయమైన రాష్ట్రపతి ఆమోదమే మిగిలి ఉంది . కాబట్టి నేను చెప్పిన మాట నిజమయింది కదా! బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం నిజమయినా కాకకపోయినా కల్కిఖడ్గం చెప్పిన భవిష్య వాణి నిజమయింది !.వీరభొగ వసంత రాయలు రాకపోయినా ,కల్కి ఖడ్గం చెప్పిన విదంగా తెలంగాణాని  మాత్రం సోనియమ్మా ఇచ్చింది .

    
  1-2-2013 నాడు పెట్టిన టపా కోసం క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి .  

నాన్నా "తెలంగాణా" వచ్చే! http://kalkiavataar.blogspot.in/2013/02/blog-post.html

    

Thursday, February 20, 2014

ఈ పదేళ్ళ పందానికి తెలుగు రాజకీయ నాయకులు సిద్దమా !?

                                                             

అయిందేదో అయిపొయింది . మంచో , చెడో ,తను ఎంత పోరాడినా తను అనుకున్నది కానప్పుడు ఏది జరిగినా ఆ  దైవ నిర్ణయం అనుకుని ముందుకు సాగడమే జ్ఞానుల లక్షణం . తెలంగాణా కోసం కోట్లాది ప్రజలు కోరుకున్నారు అనేది వాస్తవo . శ్రీ కృష్ణ కమిటి రిపోర్ట్ రానంతవరకూ తెలంగాణా సిమాంద్ర ప్రాంతం కంటే చాలా వెనుకబడి ఉందనే తెలంగాణాలోని అత్యదిక శాతం ప్రజలు అనుకున్నారు . అందుకే తెలoగాణా వేరు పడితే తప్పా అభివృద్ధి సాదిoచలెము అన్న తెలంగాణా నాయకుల మాటను సమర్దిoచారు. దానికి తోడూ రాష్ట్రంలోని ఎ రాజకీయ పార్టి (C.P.M తప్పా ) తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించలేదు . కాబట్టే రాష్ట్ర విభజన సాధ్య పడింది . ఇప్పటికి సిమాoద్రా లోని సామాన్య ప్రజలలో విభజన అంటే ప్రజల మద్య ఎడబాటే అనే బావనతొ ఉండటం వలన శోక తప్తులై ఉన్నారు . కొంత మంది మాత్రమె హైదరాబాద్ ను U.T చేస్తే చాలు అనుకుంటున్నారు తప్పా , సామాన్య జనం మనస్పూర్తిగా విభజనను ఒప్పుకోవడం లేదు . అలాగే తెలంగాణా జిల్లాలోని  అత్యదిక శాతం ప్రజలు విభజన కావాలనే కోరుకుంటున్నారు . అయితే గడచినా 60 సంవత్సరాలుగా సిమాoద్రా నుండి లక్షలాదిగా ప్రజలు తెలంగాణా కు వచ్చి ఇదే తమ జన్మ భూమి అని స్తిర పడిపోయారు . విరెవ్వరికి మనస్పూర్తిగా రాష్ట్ర విభజన ఇష్టం లేదు . కాకపొతే తామున్న దగ్గర సమస్యలు కొని తెచ్చు కోవడం ఇష్టం లేక అందరితో పాటు తాము తెలంగాణా కు జై అంటున్నారు .

  సరే ఏదేమైతేనేం ఆర్టికిల్ 3 అనేది ప్రజల్ని విదదియలెదు . ప్రాంతాలను అది కూడా రాజకీయంగా విడదీయ గలుగుతుంది . సమర్ధులు పాలకులు గా ఉన్నంత కాలం సమైక్యంగా ఉంటారు  , పాలించే వారిలో చేవ చచ్చినప్పుడే  విడిపోతుంటారు అనేది చారిత్రిక సత్యమ్. కాని ఇప్పుడు మాత్రం ప్రజలు కాకుండా ప్రాంతాలను రాజకీయ నాయకులు విడగొట్టుకున్నార్రు . వారు తమ సమర్ధతను చూపించి తమ ప్రాంతాలను స్వర్గ దామం చెయ్యాలని ఉవ్విలూరుతున్నారు . వారి కోరికను కాదనడం ప్రజలకు పాడి కాదు. ఈ రోజు ఏ ఆర్టికిల్ ద్వారా విడి పొయామో అదే ఆర్టికిల్ కి తిరిగి కలిపే శక్తి ఉన్నాడని నేతలుకు తెలియంది కాదు . అందుకే ఈతెలంగాణా  సిమాంద్ర నేతలకు మద్య తెలుగు ప్రజలు ఒక పందెం  పెడితే ఎలా ఉంటుంది ?

  పందెం ఎందుకంటే , తెలంగాణా నెతలెమొ విడిపోతే బాగుపడతాం అంటుంటే , సిమాంద్ర నేతలేమో కలిసి ఉంటే నే బాగుంటాం అంటున్నారు . సామాన్యుడికి సమర్దుడైన నాయకుడి పాలనే కావాలంటున్నారు . మంచో , చెడో ఇంకా 10 ఏండ్లు  రాజధాని , హై కోర్టు , విద్యా అవకాశాలు ఉమ్మడిగా ఉండాల్సిందే . కాబట్టి ఈ 10 యేండ్ల లో ఎ రాష్ట్రం ఎక్కువుగా అభివృద్ధి చెందుతుందో చూడాలి . ఒక వేల తెలంగాణా ఎక్కువగా  అభివృద్ధి చెందితే విడిపోయిన రాష్ట్రాలు యదావిదిగా ఉండాల్సిందే . లేదూ సిమాంద్ర ఎక్కువుగా అభివృద్ధి చెందితే మరల ఆర్టికిల్ 3 ని ప్రయోగించి రెండు రాష్ట్రాలను కలపాలి. ఇప్పుడు 10 ఏండ్లు విడిపోయినంత మాత్రానా నష్టం ఏమి ఉండదు . ఎందుకంటే అప్పటి దాక కేంద్రం వారు తెలుగు రాష్ట్రాలకు ప్రకటించిన అన్ని సౌకర్యాలు పొందుతాం కాబట్టి , 10 ఏండ్లు రాష్ట్ర విభజన వల్ల లాభమే తప్పా నష్టం ఉండదు .

  మరి పైన చెప్పిన విదంగా పందానికి మన రాజకీయ నాయకులు ఒప్పుకుంటారా ? ఒప్పుకుంటే 2014 నాటికి తెలుగు రాష్ట్రాలు  ప్రపంచంలోనే ఒక గొప్ప గుర్తింపు పొందుతాయి అనడంలో నాకైతే సందేహం లెదు.

Tuesday, February 18, 2014

రాష్ట్ర విభజన బిల్ ని హై కోర్టు ఆపినట్లేనా !?

                                                         



ఇప్పుడే అన్ని చానల్స్ లో ప్రసారం చేస్తున్న దాని ప్రకారం ఆర్టికిల్ 3 మిద హై కోర్టు న్యాయవాది శ్రీ P.V క్రిష్నయ్య గారు వేసిన పిటిషన్ ను ఆంద్ర ప్రదెశ్ కోర్టు వారు ఈ రోజు అడ్మిట్ చేస్తూ , కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలకు నోటిసులు జారి చేసింది అని తెలుస్తుంది . . మరి ఇటువంటి పరిస్తితుల్లో రాష్ట్ర విభజన బిల్ మిద చర్చలు కొనసాగించడం కరెక్టు కాకపొవచ్చు. ఇదంతా చూస్తుంటే ఈ బ్లాగులో ఇంతకూ ముందు టపాలో నేను చెప్పిన కాంగ్రెస్ డ్రామా నిజమేనని రుజువైనట్లే ! దిని మిద ఏమి జరుగబొతు0దో ఇంకా కొన్ని గంటల్లోనే తెలస్తుంది ఆ తర్వాత ఎవరు ఏమి చేసారో ఒక స్పష్టమైన అవగాహన కు రావచ్చు . అంతవరకూ డ్రామాలను చూస్తూ ఉండడమే!
అప్ డేట్ : హై కోర్టు నోటిసుల  జారి విషయం గురించి తర్వాత చానల్స్ ప్రసారం చేయటం మానివేయటం చూస్తుంటే , బహూశా ఇది కూడా అబద్దమేనేమో ! ఏది ఏమైనా పార్లమెంటులో మూజువాణి వోటుతో తెలంగాణా బిల్ పాస్సయిoది.ఈ  దెబ్బతో ఏదో రకంగా తమ ఇన్నాళ్ళ కోరికను తీర్చిన సోనియా గాంది తెలంగాణా ప్రజల పాలిత దేవత గా మారితే , సిమాoద్రాలొ దెయ్యం గా మారింది .బిల్ ఎలాగు రాజ్య సభలో కూడా పాసవుతున్ది కాబట్టి రాష్ట్ర విభజన అయినట్లే!అయిందేదో అయింది ! ఇక సిమాoద్రా వారు కూడా సుప్రీం కోర్టుకు వెళ్ళకుండా ఏదో ఒక రకంగా అడ్జస్ట్ అయి కాంగ్రెస్ లాంటి చట్ట ఉల్లంగనలకు పాల్పడే పార్టీలను వారి ప్రాంతంలో మనుగడ లేకుండా చెయ్యడమే వారు చేయగలిగిన వివేకమైన పని. ఇక తెలంగాణా వారు "సంబురాలు " మొదలెట్టేసారు కాబట్టి అంతా హ్యాపిసె ! 

Monday, February 17, 2014

సరి అయిన బిల్లు ఏమిటో నాయకులకు తెలియదు! సరి అయిన సమయం ఏమిటో లాయర్లకు తెలియదు!

                                                     


ఆల్  ఇండియా గ్రేట్ డ్రామా కంపెని అయిన  కాంగ్రెస్ వారు ఆడుతున్న నాటకంలో  మంచి రసవత్తర సీన్  నడుస్తుంది . అయితే ఇంత పకడ్బంది నాటకం ఆడి వారు రుజువు చేయడలచింది  ఏమిటంటే తాము రాజ్యంగ పద్దతులు తెలియని మూర్కులమని , తాము ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం తప్పా , దాని పలితాలకు తాము బాద్యులం  కాదని తెలంగానా ప్రజలకు తెలియచెయ్యదమే . దిని వలన రాష్ట్ర విభజన బిల్ పాస్ చేసినా దాని పలితం మాత్రం మాత్రం తెలంగాణా ప్రజలకు దక్కుద్దా లేదా అనేది అనుమానంగా ఉంది . . ఈ అనుమానాలు కలగటానికి గల కారణాలు ఇవి
(1). తెలంగాణా బిల్ మిద ఇప్పటివరకు 3 పిటిషన్ లు సుప్రీం కోర్టులో వేయడం జరిగింది . ఆ  మూడింటిని కోర్టు వారు ఒకే ఒక కారణంతో తిరస్కరించారు . అది ఏమిటంటే పిటిషన్ లు విచారించడానికి ఇది సరి అయిన సమయం కాదు, అ సమయం వచ్చాక తప్పకుండా విచారిస్తo అని. దిని వలన అర్దమయ్యేది ఒకటే.. విభజన బిల్ మిద పార్లమెంట్ నిర్ణయం వెలువడ్డాక పిటిషన్ వేస్తె తప్పకుండా విచారణకు స్వికరిస్తామ్ అని ఒక అభయం సుప్రీం కోర్టు వారు ఇచ్చినట్లే కనబదుతు0ది. సుప్రీం కోర్టు లో ఏంతో అనుభవమున్న సీనియర్ లాయర్లు పోయిన సారి వాదించి నపుడు ఇదే విషయం సుప్రిం కోర్టు వారు చెప్పినప్పటికీ "సరి అయిన సమయం " అంటే ఏమిటో తెలియక సిమాంద్ర లాయర్లు "ముద్ద ముద్దకు  బిస్మిల్లా " అన్నట్లు , కేంద్రం ఒక స్తెప్ వేయగానే పిటిషన్ ఒకటి వేస్తూ "సమయం వచ్చిందా , రాలేదా ? అని టెస్ట్ చేస్తున్నారు . ఇది లాయర్ల పరిస్తితి !

 (2). ఇక పొతే నాయకులు విషయానికి వస్తే , అసెoబ్లికీ పంపాల్సింది బిల్లో , డ్రాప్ట్ బిల్లో వారికి తెలియదు . కొన్ని గంటలు చర్చ జరిపాక "తూచ్ ' ఇది డ్రాప్ట్ బిల్ " అని మూజు వాణి  వొటుతో తిరస్కరిస్తారు . 117 మంది సబ్యులు అనుకూలంగా ఉన్న బిల్ మూజువాణితో వోటు తో తిరస్కారానికి గురి అవుతుంటే నోట్లో బెల్లం గడ్డలు పెట్టుకున్నట్లు మిన్నకుండి పోయారు  తెలంగాణ నాయకులు . పార్లమెంట్ మనదే అయినా , సుప్రీం కోర్టు మనది కాదు అన్న  జ్ఞానం లేకుండా పోయింది వారికి. ఒక వేళ తెలంగాణా బిల్ పార్లమెంటులో పాస్ అయినా కోర్టు వారు ఆపితే, దానివలన కాంగ్రెస్ కె లాభం . ఇచ్చిన మాటకు కట్టు బడి K.C.R గారు తమ పార్టిని కాంగ్రెస్ లో విలీనం చేయక తప్పదు . దాని వలన T.R.S నాయకులకు నష్టమైనా ,  K.C.R గారికి మాత్రం డిల్లీలో సోనియా గాంది గారి పర్మనెంట్ కోటరిలో మెంబర్ షిప్ లబిస్తుంది . ఎలాగు రాష్ట్ర విబజన ఆగింది కదా అని సిమాoద్రులు కిరణ్ గారికి జై అంటారు . కిరణ్ గారి ఖాతాలో జమ అయ్యే సీట్లు అన్ని అంతిమంగా కాంగ్రెస్ కు జమ అయ్యెవె ! ఇంత  మహత్తరమైన ప్లాన్ తో గొప్ప నాటకానికి తేరా తిసిందా కాంగ్రెస్ అనిపిస్తుంది . 
    (3) ఇక జాతీయ ప్రతి పక్ష హోదాలో ఉన్న B.J.P విషయానికి వస్తే, పార్లమెంటులో బిల్ ప్రవేశ పెట్టారో లేదో ఘనత వహించిన పార్లమెంటేరియన్ లకు తెలియదట ! బిల్ ప్రవేశం జరిగిపోయిందని అధికార పార్టి వారు అంటుంటే , "సభలో ఉన్న మాకు తెలియకుండానా ! అని బోల్డంత ఆశ్చర్య పోతున్నారు ప్రతి పక్ష నెతలు. చట్టాలు తయారు చేసే వారే , తమ పార్టి స్వార్దాల కోసం డ్రామాలు ఆడుతున్న దేశం లో ప్రజలకు దిక్కెవరు?
           ఈ డ్రామాల వల్ల  తెలుగు ప్రజలు చివరకు ఎ పరిస్తితులకు గురి అవుతారో రాబోయే వారం రోజులలో జరగబోయే పరిణామాలు నిర్ణయిస్తాయి .

 

Thursday, February 13, 2014

రాజగోపాల్ గారికి తన మిద లైంగిక దాడులు జరుగుతాయని భయమా !?

                                                             

మా ఊరి లో ఉన్న మల్లన్న అంటే అందరికి కొంత భయం ఉంటె అంతో ఇంతో గౌరవం కూడా లేక పోలేదు  భయం ఎందుకంటే కండలు తిరిగిన అతని బలిష్టమైన శరీరం  చూసి . ఎవరైనా సరే అతను ఒక గుద్దు గుద్దితే గిద్దెడు మిరియాలు కక్కాల్సిందే అని అనిపించేలా ఉంటాడు.  మరి గౌరవం ఎందుకంటే అంత కండలు తిరిగిన విరుడైనా ఏనాడు పద్దతి తప్పి వ్యవహరించలేదు కాబట్టి . కుస్తీ పోటిలో సైతం ఉపాయపు పట్లే తప్పా దొంగ దెబ్బ తీసి ప్రత్యర్దిని ఓడించాలని చూడడు .అటువంటి మల్లన్న నిన్న పార్లమెంట్ లో జరిగిన కాంగ్రెస్ వీరుల వీరంగం చూసి బాగా నిరాశ చెందాడు .
 మా మల్లన్నకు పార్లమెంట్ లో ఉండే వారంతా పెద్ద మనుషులు అని మా చెడ్డ నమ్మక్కమ్ . వారు ఏదైనా చర్చల ద్వారా సాదిస్తారు అని ఇన్నాళ్ళు అనుకునే వాడు . అందుకే మా ఊరు M.L.A లు వచ్చినా , M.P లు మంత్రులు ఎవరు వచ్చినా వారిని ఎంతో అభిమానంగా గౌరవించే వాడు . భగవంతుడు తనకు బుద్దిబలం  ఇవ్వకుండా కండ బలం ఇచ్చినందుకు తెగ బాద పడేవాడు . కాని నిన్న పార్లమెంట్లో గందరగోళం చూసాక "ఓస్ ! ఇంతోటి దానికా ప్రజలందరూ M.P లను ఎన్నుకునేది అని తెగ ఆచ్చర్య పోయాడు . రేపు రానున్న ఎన్నికల్లో M.P గా తనకే అవకాసం ఇవ్వాలని అప్పుడే ప్రచారం కూడా మొదలెట్టాడు . మా కూడా అదే కరెక్టు అనిపిస్తుంది .

  అసలు దేశ  హొమ్ మంత్రి సభలో బిల్లు ప్రవేశ పెట్టడానికి తన చుట్టూ 18 మంది జమా జెట్టి లాంటి M.P లను ఉంచుకోవలసిన అంత దౌర్బాగ్య ప్రజాస్వామ్యమా మనది ?!బిల్ మిద అబ్యంతరాలు ఉన్న వారెవరైనా తమ నిరసనను ప్రజాస్వామ్య యుతంగా మాటల రూపంలో , వ్రాతల రూపంలో తెలపాలి కాని , మంత్రులు మీదకు ఎగబడి బిల్ ను లాక్కుని చించే హక్కు రాజ్యాంగం ఇచ్చిoదా  ? అలాగే ఎవరైనా సబ్యులు తన పనికి ఆటంకం కలిగిస్తున్నారు అని  ముందే తెలిస్తే వారిని సస్పెండ్ చేసి బయటకు పంపమని చట్టాలు చెపుతున్నాయి కాని , తనొక ముటా నాయకుడు లాగా తనకు అనుకూలమైన M.P లను రక్షణ వలయంగా పెట్టుకుని హొమ్ మంత్రి బిల్ ప్రవేశ పెట్టడం ఎంతవరకు సబబు? మీకు రాజ్యాంగం ప్రకారం కొన్ని ప్రివిలేజ్ లు ఇచ్చింది స్వెచ్చగా మీ బావాలను వ్యక్తం చేస్తారని తప్పా , మీ ఇష్టం వచ్చినట్లు బాదుకుని ప్రపంచ దేశాలలో దేశ  ప్రతిష్టను దిగ జారుస్తారని కాదు . అలా చేసే వారు ఒక్క క్షణం కూడా చట్ట సబలలొ ఉండటానికి విలు లేదు .

   ఇకపోతే రాజగోపాల్ గారు ఏకంగా పార్లమెంట్లో కి పెప్పర్ స్ప్రే తీసుకు రావడమే కాక , దానిని ప్రయోగించి కొందరిని హాస్పిటల్ పాలయెలా చేసారు . నిజంగా తెలంగాణా బిల్ చట్ట వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రవేశ పెడుతున్నారు అని మీకు నమ్మకం ఉంటె దానిని చట్టం అయ్యాక కూడా సుప్రీం కోర్టులో చాలెంజ్ చేసి న్యాయం పొoదవచ్చు. ఆ అవకాసం మీకు ఉందని కోర్టు వారు చెప్పారు కూడా ! అది తెలిసిన వారు పెప్పర్ స్ప్రే ప్రయోగించే అంత పనికి పూనుకోవడం ఎందుకు?దేశ ప్రతిష్టను దిగజార్చడం ఎందుకు ? సరే రాజగోపాల్ గారికి తన మిద లైంగిక దాడులు జరుగుతాయని బయం ఉంటె ఉండవచ్చు . దానికోసం అయన కారం పొట్లం కి మోడరన్ రూపం అయిన "పెప్పర్ స్ప్రే " జేబులో పెట్టుకుని తిరుగుతుంటే ఎవరికీ అబ్యంతరం లేదు కాని ,దేశ పరువును నాశనం చేసే ఇలాంటి పనులు చెయ్యడం ఎందుకు? ఇక అటు తెలంగాణా వారు సైతం ఇతర రాష్ట్ర M.Pలతో కలసి కిరాయి గూండాల్లా తోటి M.P లను అడ్డుకోవడం ఎ ప్రజాస్వామ్యానికి ప్రతికలో ఆత్మ విమర్శ చేసుకోవాలి . కండ బలం ఉపయోగించి బిల్ లు పాసు చేసుకోవచ్చు అని రాజ్యాంగం చెపితే మా ఊరి మల్లయనె పంపే వారం కదా ? మీరెందుకు ?

   అదికార పార్టి వారు వారి స్వార్ధం కోసం ఏదైనా అతిక్రమణలకు పాల్పడితే దానిని సరి చెయ్యాల్సిన బాద్యత ప్రతి పక్షాలది . ఒక పక్క అధికార పార్టి వారు ప్రవేశ పెట్టె  తెలంగాణా బిల్ కి సంపూర్ణ మద్దతు అని చెపుతూ , ఇంకొక పక్క సభ సజావుగా సాగకపోతే సహకరిమ్చమని చెప్పడంలో అంతర్యం ఏమిటి ? మేజార్తి అయిన అదికార , ప్రతి పక్షాలు O.K.  అన్నాక మూజువాణి వోటు తో కూడా బిల్ పాస్ చెసెయొచ్చు కదా ! ఆంద్ర ప్రదెస్ అసెంబ్లీ చేసింది అదే కదా ! దానికి ఇంత  రాదాంతం  సృష్టించాలా ? లేదూ సిమాంద్రా వారికి పలానవి ఇవ్వాలని కచ్చితంగా చెపుతున్నప్పుడు అవి ఇస్తేనే మద్దతు ఇస్తాం అని స్పష్టంగా తెగేసి చెప్పండి . అంటే కాని గంటకొక మాటతో గందరగోళానికి గురిచేసి తమాషా చూడడం ప్రతి పక్షానికి హుందా నివ్వదు .
  ఏది ఏమైనా అటు సిమామ్ద్రా వారు కావచ్చు . ఇటు తెలంగాణా వారు కావచు నిన్న జరిగిన సిగ్గుమాలిన పనికి ముక్య కారణం అధికార కాంగ్రెస్ పార్టి యే ! వారిని గురించి ఉత్తరాది మీడియా ఏమి అనుకుంటుదో క్రింది విడియో చూసి తెలుసుకోవచు . మీరంతా ఇలాగే చేయడం సబబు అని వాదిస్తే  బుద్ది ఉన్న ప్రజలకు రానున్న ఎన్నికలలో "నోటా " మీటను ఉపయోగించడం తప్పా వేరే గత్యంతరం లెదు .

 
         

Tuesday, February 11, 2014

జగన్ కి వార్నింగ్ ఇచ్చి మరి అక్కున చేర్చుకున్న లక్ష్మి పార్వతి !

                                                 

ఒక సారి క్రింది వీడియోను చూడండి . ధర్మాన ప్రసాదరావు గారు , లక్ష్మి పార్వతి గారు Y.S.R పార్టిలో చేరుతున్న సీను. అందరికి పార్టి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు జగన్ గారు. అ సందర్బంగా అందరు నవ్వుతూ జగన్ ని ఆలింగనం చేసుకుని తమ ఆత్మీయతను చాటారు . కాని లక్ష్మి పార్వతి గారు మాత్రం ఎందుకో జగన్ కి తర్జని చూపిస్తూ మాట్లాడడం చూస్తుంటే ఏదో వార్నింగ్ ఇస్తున్నట్లే ఉంది . బహుశా  తనను పార్టీలోకి చేర్చుకున్నాక పార్టికి ఏమైనా అయితే తనను ఏమన్నా ఊరుకోను, అని వార్నింగ్ ఇస్తున్నట్లుంది .గతంలో  అన్నగారి పరిస్తితి చూసిన ఆమెకు ఎందుకైనా మంచిది అని ముందే జాగర్త పడుతున్నట్లు ఉంది .

                

         

Friday, February 7, 2014

టెన్షన్ తో తొందర పడి ముందే కూస్తున్న సిమాంద్ర కోయిలలు !

                                                                 
                                                         

దేనికైనా ఒక టైం  ఉంటుంది . అది అ టైం  ప్రకారమే జరుగుతుంది . వసంతకాలం లో కోయిలలు కూస్తాయి ,అంతే కాని కోయిల కూసింది కదా అని వసంత కాలం రాదు . వసంత కాలం రాకుండా కూసే కోయిల కూతలు తొందరపడి కూసేవే అవుతుంది . ఇదే విషయాన్ని రెండవ సారి మన సుప్రీం కోర్టు  వారు సిమాంద్ర నాయకుల పక్షానా వాదనలు వినిపించిన సుప్రీం కోర్టు న్యాయవాదులకు చెపుతూ, వారు దాఖలు చేసిన రాష్ట్ర విభజన మిద పీటిషన్లు ను సున్నితంగా తిరస్కరించారు .

  4 రోజుల క్రితం తెలంగాణా రాష్ట్ర విభజన ను చాలెంజ్ చేస్తూ సిమాo ద్రకు చెందిన వారు 9 పిటిషన్ లు వేసారు . గతంలో ఇలాగే వెయ్యగా అవి అపరిపక్వమైనవని , అసెంబ్లీ తీర్మానం కాని , కేంద్ర ప్రబుత్వ నిర్ణయం కాని జరుగకుండా వాటి మిద విచారణ జరపటం తొందరపాటు చర్య అవుతుందని కోర్టు వారు పెటిషన్ లను తిరస్కరించారు . ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం అయి పోయింది . విభజన బిల్ టెక్నికల్ గా తిరాస్కారానికి గురి అయిo ది . అయినా సరే రాష్ట్ర విబజనకే  కంకణం కట్టుకున్నట్లు కేంద్రం తెగ యాక్షన్ చేస్తుంటే , టెన్షన్ పెంచుకున్న సిమాంద్ర నాయకులు కొందరు తిరిగి చాలెంజ్ పిటిషన్ లు వేస్తె కోర్టు వారు గంటన్నర వాదనలు విన్నాక , గతంలో పిటిషన్ లకు ప్రస్తుతం వేసిన పిటిషన్ లకు పెద్ద తేడా లేదని పెదవి విరచి ఈ రోజు తిరస్కరించారు

  కాకపొతే సమైక్యతా కోరుకునే వారికి ఉన్న ఒక్క ఆశ  ఏమిటంటే , పిటిషన్లు తిరస్కరిస్తూ సుప్రీం కోర్టు వారు అన్న మాటలు . " కేంద్ర ప్రబుత్వం నిర్ణయం ఏమిటో తెలియకుండా పిటిషన్లు విచారించడం తొoదర పాటు చర్య అవుతుoది. కాబట్టి సరి అయిన సమయంలో వేస్తె పరిశిలించవచ్చు " అంది . అంటే కేంద్రం రాజ్యంగా ప్రకారం రాష్ట్ర విభజన చెయ్యడానికి ఇంకా అవకాశం  ఉంది అని సుప్రీం కోర్టు వారి అభిప్రాయం కావచ్చు. అది నిజమే . రాజ్యంగా బద్దంగా విభజన చెయ్యడానికి కేంద్ర ప్రబుత్వానికి ఆవకాశం  ఉంది . కానీ టైమే  లేదు . కాంగ్రెస్ వారు చెయ్యాలంటే ఇప్పుడున్న రూపంలోనే మమా అనిపించాలి .దానిని కోర్టువారు అడ్డుకునే ఆవకాశం  కూడా లేకపోలేదు . ఈ రోజు కోర్టువారు అన్న చివరి మాటలు అదే అభిప్రాయం కలిగిస్తున్నాయి . ఒక వేలా కోర్టులకు ఆ చాన్స్ ఇవ్వద్దు అనుకుంటే రాష్ట్ర విభజన బాద్యతను రాబోయే ప్రబుత్వానికి వదిలెయ్యాలి .అది కాంగ్రెస్ కి కష్టమైనా పనే . అందుకే డ్రామాలకు తేర తీసింది . చూదాం ఏమి జరుగుద్దో!

Wednesday, February 5, 2014

దేశ ప్రజలకు ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ! రాష్ట్ర ప్రజలకు మాత్రం టెన్షనాయన కష్ట కాలం !

                                                         


ఈ రోజు రధ సప్తమి అంటే సూర్య జయంతి .భూమి మీద సంవత్సర కాలాన్ని రెండు సమ బాగాలుగా విభజించి ఉత్తరాయణం , దక్షిణాయనం అని వ్యవహరిస్తుంటారు . సూర్యుడు భూమధ్య రేఖ నుండి కర్కట రేఖకు , కర్కట రేఖ నుండి తిరిగి బూమాద్య రేఖ మీదుగా మకర రేఖకు, ప్రయాణించి తిరిగి భూమధ్య రేఖకు చేరుకోవడానికి సంవత్సర కాలం పడుతుంది . దిని గురించి వివరంగా క్రింది విడియోలో చూడవచ్చు .

   సూర్యుడు భూమధ్య రేఖ నుండి కర్కట రేఖ వైపు ప్రయాణించే కాలం మార్చ్ 22 నుండి మొదలవుతుంది . అ రోజునే ప్రదమాంద్ర పాలకుడు , శక పురుషుడు శాలివాహన చక్రవర్తి జన్మించిన దినo . దానినే ప్రామాణికంగా తీసుకుని మన జాతీయ కాలెండర్ రూపొందించారు . అలాగే జులై 23 నుంచి దక్షిణాయన కాలం ప్రారంబం అవుతుoది . అలా దక్షిణాన ఉన్న మకర రాసి వరకు జనవరి 20 వరకు ప్రయాణించి తిరిగి 21 తారీకు నుండి ఉత్తరo  వైపు మరలటం జరుగుతుంది . దీనినే ఉత్తరాయణం అంటారు . హిందూ సాంప్రదాయ నమ్మకాల ప్రకారం ఉత్తరాయణం వైపు సూర్యగమనం సాగడం శుభదాయకమ్ . అందుకే దీనిని ఉత్తరాయణ పుణ్య కాలం అంటారు . హిందూ పంచాంగం ప్రకారం ఉత్తరాయణ పుణ్య కాలం మాఘ  శుద్ద సప్తమి నుండి ప్రారంబం అవుతుంది . అందుకే అ రోజు సూర్యుడు తన రదాన్ని ఉత్తరం వైపు మల్లిస్తున్న రోజుగా బావిస్తూ "రద సప్తమి " అనే పేరుతొ దినిని పవిత్ర దినం గా బావిస్తారు. దీనినే సూర్య జయంతి గా కూడా వ్యవహరిస్తారు. ఈ రోజు మాఘ  శుద్ద సప్తమి అంటే రదసప్తమి. ఈ  రోజు నుండి దేశ ప్రజలకు ఉత్తరాయణ పుణ్యకాలం .

  మరి మన రాష్ట్రానికి వస్తే పరిస్తితి వేరుగా ఉంది . యాద్రుచ్చికంగా అయినా మనకు టెన్షన్ ల కాలం ఈ రోజునుంచే మొదలయిన్ది. రాష్ట్ర విబజన జరగదెమొనని తెలంగాణా నాయకులకు  టెన్షన్ అయితే . రాష్ట్ర విభజన జరుగుదెమొనని సిమా0ద్రా నాయకులకు టెన్షన్ . ఇలా ఇరువైపులా ఈ  టెన్షన్ ఉంటుంది . ఆ తర్వాత కూడా తెలుగు ప్రజలు ప్రశాంతంగా ఉంటారు అన్న నమ్మకం లెదు. మొత్తానికి తెలుగు ప్రజలకు కష్ట కాలమే మరి. పుణ్య కాలం లో కష్టాలు అనేది తెలుగు జాతికి రాజకీయ నాయకులు ప్రసాదించిన వర0. పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అంటారు . కాని ఖర్మ కొద్ది నాయకులు అనేది తెలుగు ప్రజలకు అనుభవమవుతుంది .
 సూర్య గమనం గురించి క్రింది విడియోలో చూడండి . ఈ రోజు నా పుట్టిన రోజు కూడా . అ వివరాలకు ఈ  లింక్ మిద క్లిక్ చెయ్యండి

రధ సప్తమి నా పుట్టిన రోజు కావటం మా అదృష్టమా ?

 http://ssmanavu.blogspot.in/2014/02/blog-post_5.html




Tuesday, February 4, 2014

రాష్ట్ర విభజన ఆపడానికి ముఖ్య మంత్రి గారికి మరొక టెక్నికల్ అవకాశమిస్తున్నకేంద్ర మంత్రి మండలి !.

                                                        

నేను ఇదే బ్లాగులో తెలంగాణా రాష్ట్ర విభజన విషయం గురించిన టపాలలో తెలంగాణా బిల్ విషయంలో గొప్ప డ్రామా అడిస్తుoదని చెప్పటం జరిగింది . అటు  చేసి చేసి చివరకు తెలంగాణా ప్రజల చెవిలో పూవులు పెట్టడానికి కాంగ్రెస్ సర్కార్ డిసైడ్ అయిందని అర్ధమవుతుంది . దీనికోసం పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలు అందరిని వంచించే రీతిలో ఒక హై డ్రామా  నడపటానికి రంగం సిద్దమయింది . ఒక వైపు పార్లమెంటులో బిల్ పాస్ కావడానికి చిత్త శుద్దితో ఉన్నామని ప్రజలను నమించదానికి తెగ ఆరాట పడుతున్న కాంగ్రెస్ నాయకత్వం ఇంకొక వైపు సమైక్యామ్ద్రా చాంపియన్ గా తాము ప్రమోట్ చేస్తున్న ముఖ్య మంత్రి గారికి సుప్రీం కోర్టు ద్వారా రాష్ట్ర విభజన ఆపే విదంగా టెక్నికల్ అవకాశాలు ఇస్తున్నారు . అవేమిటో చూదాం . 

  రాజ్యాంగం ప్రకారం అసెo బ్లికి ఒరిజినల్ బిల్ పంపాల్సి ఉంది కాని అలా పంపలేదు . డ్రాప్ట్ బిల్ పంపారు . ఇది బలమైన టెక్నికల్ పాయింట్ . దిని సాకుగా చూపి ఆంద్ర ప్రదెస్ అసెంబ్లీ అ బిల్ ని తిరస్కరించింది . అంటే రాష్ట్ర విబజనను కాకుండా టెక్నికల్ పాయింట్ మిద రాష్ట్ర విభజన బిల్ ని తిరస్కరించి వెనుకకు పంపింది . దినిని సరిచేసి తిరిగి అసెoబ్లికి  పంపాలి కాని అలా చెయ్యకుండా డైరెక్టుగా అదే బిల్ ని ఈ నెల 10 వ తారికున రాజ్య సభలో ప్రవేశ పెడుతున్నట్లు హొమ్ మంత్రి ప్రకటించారు . ఇది మరో ఘోర తప్పిదం . రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర పతి మాత్రమె పార్లమెంటుకు బిల్ ని రికమెండ్ చెయ్యాలి. ఈ  విషయంలో కేంద్ర మంత్రి మండలి కలుగ చేసుకోవడం అంటే రాష్ట్ర పతి గారి అధికారాలను బంగపరచినట్లే . రాష్ట్రపతి గారు చెప్పాల్సిన మాటను పబ్లిక్ గా కేంద్ర మంత్రి చెప్పడం వలన మొత్తం ప్రొసిజర్ పనికి రాకుండా పోయే ప్రమాదం ఏర్పడింది . ఇది చాలు సుప్రీం కోర్టు వారు కలుగ చేసుకోవడానికి . మరి ఇలా చెయ్యటం వలన లాబపదెది ఎవరు ? నష్టపోయేది ఎవరు? తరవాతి టపాలో చూదాం . ఎందుకంటే డ్రామా ఈ రోజే మొదలయింది ,ఇంకా కొన్నాళ్ళు నడుస్తుంది కాబట్టి . మరింత సమాచారం కొరకు క్రింది వీడియోను చూడండి .
                  

Monday, February 3, 2014

మేకప్ లు వేసేసుకుని స్టేజ్ ఎక్కడానికి సిద్దంగా ఉన్న తరుణంలో "డ్రామా " అపమంటే ఎలా !?

                                                     


  పార్లమెంట్ లో అఖిలాంద్రా కాంగ్రెస్ డ్రామా కంపెనీ  వారిచే  భయంకర , బీబత్స రస పోషణతో ప్రదర్సింప బోతున్న గొప్ప  నాటక ప్రదర్శనకు కళాకారులు అందరూ మేకప్ లు వేసుకుని  స్టేజ్ ఎక్కడానికి సిద్దమైన .వేళ ప్రతి పక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు హటాతుగా ఇప్పుడు నాటక ప్రదర్సన వద్దంటే ఎలా చెప్పండి? అందుకే కమలనాదుల పార్టి అబ్యంతరాలను కాంగ్రెస్ మంత్రి కమల్ నాద్ ఒప్పుకొలెదు. నాటకం ఆడి  తీరాల్సిందే అన్నారు. ఇంతకీ నాటకం వివరాలు ఏమిటంటే
 .
 నాటకం పేరు: ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్ వార్ .(తెలంగాణా బిల్ పోరు )

  రచన: కేంద్ర మంత్రుల గుంపు (గూప్ ఆప్ మినిస్టర్స్).


 సాంకేతిక సహకారం :  ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ గుంపు .

 వాద్య సహకారం: సీమాంద్రా పార్టీస్(అరుపులు గొలలు)

 స్తంట్ మాస్టర్: తెలంగాణా పార్టీస్ (తంతాం, పొడుస్తాం)

  దర్శకత్వం: తమిళ తంబి   

 పబ్లిసిటి సహకారం  : సీమాంద్రా అండ్ తెలంగాణా N.G.O లు  

స్పాన్సర్ :  సోనియా గాంది .

 క్లుప్తంగా కద: తెలుగునాడు లో అదికార కాంగ్రెస్ వారి ప్రాబవం తగ్గినట్లు కేంద్ర ప్రబుత్వ పెద్దలు గ్రహిస్తారు . 2009 లో 33 సీట్లు గెలిచిన అదికార పార్టీకి రానున్న ఎన్నికల్లొ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్తితిలో అటు తెలంగాణాలో, ఇటు సీమాంద్రాలో అదిక సీట్ల మద్దతు పొందే ఉపాయంతో అటు తెలంగాణా ఉద్యమ నాయకుడితోను, ఇటుసీమాంద్రా  సానుబూతి నాయకుడితోను ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకుంటారు . కాని అది గమనించిన సీమాంద్రా ప్రజలు క్రమంగా అధికార పార్టికి లోపాయాకార మద్దతు ఇస్తున్న సానూబూతి నాయకుడికి కి దూరమవుతుండటం, అటు వైపు తెలంగాణా ఉద్యమ నాయకుడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటo  తో పునరాలోచన లో పడతారు కేంద్ర పెద్దలు. ఎలాగైనా సరే సీమాంద్రా ఓట్లు తమ గుప్పెట్లో ఉంచుకోవాలి అని తలచిన అధికార పార్టీ తమ అభిమాన పాత్రుడు కిరణ్ ని రంగంలోకి దించుతారు . అతను సీమాంద్రా హీరో గా గుర్తించబడడానికి అన్ని రకాల సహకారమ్ అందిస్టారు . దానివలన రాష్ట్రం లో తెలంగాణా బిల్ ఓడిపోతుంది. కావాలని తప్పుల తడక బిల్ ని తయారు చేసిన కేంద్ర ప్రబుత్వం దానిని ఎలాగైనా పార్లమెంటులో గెలిపిస్తాం  అంటుంది. ఇంకొక పక్క  తమ పార్టీ వారినే  సభ జరుగకుండా అడ్డుకోమని సీక్రెట్ గా చెపుతుంది. అటు కేంద్ర పెద్దలు కిరన్ ని కోర్టుకు వెల్ళి మోకాలు అడ్డు పెట్టమంటారు . ఇలా మాయోపాయంతో అందర్నీ బోల్తా కొట్టించి తాము  మాత్రం లబ్ది పోందాలని చూస్తుoటారు . అదీ కధ.


Sunday, February 2, 2014

పెద్ద కోడలు అని పెత్తనమిస్తే చివరకు సొనియమ్మ చెప్పేది ఇదా!? ! !



భారత దేశం అంటే కర్మ భూమి , వేదబూమి అనేక సాంప్రదాయాలు సంస్కృతులు కు నెలవైన భూమి అని ఇన్నాళ్ళు అందరూ అనుకుంటున్న దానిని ఇందిరా  గాంది  గారి పెద్ద కోడలు ఒక్క మాటతో కాదు అని తేల్చేసింది . మేజార్తి హిందువుల ఓట్లతో గద్దె మిద కూర్చున్న కాంగ్రెస్ పార్టికి అదినేత గా ఉన్న ఈమే  తన నోటితో "హిందూ" అనాలoటెనే అసహ్యం అన్నట్లుంది అమె స్పీచ్ లు చూస్తుంటే. కనీసం సూపి పండితులు కూడా హిందుస్తాన్ అని గౌరవంగా పిలుచుకునె బారత దేశాన్ని ఇది మొదట  సూపి పండితుల క ర్మ భూమి అని , ఆ తర్వాతె అందరిది అని అర్దం వచ్చేలా మాట్లాడడంలో అర్దమేమిటి? వినాశకాలే విపరీత బుద్ది అని అన్నట్లు ఇవి ఆమె పాలనకు చరమ దశ అని చెప్పకనె చెపుతున్నవి. ఆత్మాభిమానం ఉన్న  హిందువులు  ఆమె మాటలు విన్న తర్వాత  దానిలొని అంతర్యం గ్రహించి తదనుగుణంగా నడచుకుంటే మంచిది. లేదంటే "హిందువులు " అంటే రాక్షసులు అని డిక్షనరీ లలొ ఎక్కించడానికి ఎత్తుగడలు వేస్తున్న ఈ కుహాన లౌకిక  వాదులు ను ఎదుర్కొవడం కష్టం.2014   ఎన్నికలు హిందువులు అంటే పడని వారికి బుద్ది చెప్పేలా ఉండాలి.

 సోనియా గాంది ఏమందో ఈ క్రింది వీడియోలొ చూడండి.         

Thursday, January 30, 2014

సురభి కళాకారులను మించి పోయిన తెలుగు M.L.A లు మంత్రులు !

                                                         


అనుకున్నది అయింది ! ముక్య మంత్రి గారు లాస్ట్ బాల్ ప్రయోగించారు .  దెబ్బతో ఆట  పూర్తీ కాకుండానే  మాచ్ డిక్లేర్ అయింది . అసెంబ్లీలో తాము గెలిచామని సిమాoద్రా నాయకులు సంబరపడుతుంటే , ఇక్కడి పలితం నామ మాత్రం కాబట్టి , పార్లమెంటులో అసలైన విజయం తమదే నని తెలంగాణా వాదులు అంటున్నారు . కాబట్టి తెలంగాణా ప్రజలు అవేశా లకు లోను కాకుండా సంయమనం పాటించాలని హితవు చెపుతున్నారు . కాని అసలు మాచ్  కు ముందే మాచ్  పిక్స్ అయిందన్న సంగతిని ఎవరూ చెప్పరు . ఎందుకంటే రానున్న ఎన్నికల్లో వారెవరూ ప్రజలు ముందు జిరోలుగా నిలబడటానికి సిద్దంగా లేరు .

  ఇక అసలు మాచ్ పిక్సింగ్  సూత్రదారులైన  కేంద్రo  లోని పెద్దలు రాష్ట్ర విభజన విషయంలో తాము ఎంతో తొందరతో ఉన్నట్లు తెలంగాణా ప్రజలు అనుకోవాలని , అనుకూల మీడియా వర్గాలతో పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు షెడ్యూల్ ప్రకటించారు . ఎట్టి  పరిస్తితుల్లో పిబ్రవరి 21 కి రెండు రాష్ట్రాలు గ్యారంటి అంటున్నారు . కాని కిరణ్ కుమార్ గారికి  సుప్రీం కోర్టు కు వెళ్ళే బంగారం లాంటి చాన్స్ ను తామే కావాలని ఇచ్చినట్లు ప్రజలకు చెప్పరు  గాక చెప్పరు ! ఎo దుకంటే రేపు సిమాంద్రాలో  తమ కు దిక్కు కిరణ్ గారే కాబట్టి .

  మొన్నట్టి  దాక ఒరిజినల్  బిల్ అన్న కేంద్ర హొమ్ మంత్రిత్వ శాఖ వారు చివరి దశలో తాము రాష్ట్ర పతికి పంపింది ముసాయిదా బిల్ మాత్రమె అని చెప్పడంలో ఉన్న పరమార్దం ఏమిటి ? అది మాచ్  పిక్సింగ్ లో బాగం కాదా ?

సాంప్రాదాయం  ప్రకారం అయితే ముసాయిదా బిల్ , రాజ్యంగ ప్రకారం అయితే ఒరిజినల్ బిల్ పంపాలని కేంద్ర ప్రబుత్వ పెద్దలకు తెలియదా? తెలియదని ప్రజల్ని నమ్మ మంటారా? రాజ్యాంగం ప్రకారం ఒరిజినల్ బిల్ ని సమగ్రం గా  తయారు చేసి రాష్ట్ర అసెంబ్లీకి  పంపించాలి . అదే ఇతర రాష్ట్రాల విబజన విషయాలలో మాదిరి సాంప్రాదాయ  విదానం అయితే ముసాయిదా బిల్ పంపితే సరిపోతుంది . ఎందుకంటే సంప్రాదాయ విదానంలో రాష్ట్ర అసెంబ్లీ విబజన చేయమని తీర్మానించాకే  విబజన ప్రాసెస్ మొదలు అవుతుంది . అలానే చేద్దామని కేంద్రం వారు మొదట్లో అనుకున్నారు . అప్పుడు అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయి కాబట్టి అసెంబ్లీ నుండే ప్రాసెస్ మొదలు పెట్టొచ్చు అనుకున్నారు.అలా చేస్తే తెలంగాణలో T.R.S తోనూ , సిమామ్ద్రాలొ లో జగన్ తోను పొత్తుపెట్టుకుని ప్రతి పక్షాలను దుంప నాశనం చెయొచు అనుకున్నారు కాని సిమాన్ద్రా ప్రజలు కాంగ్రెస్ వారి మిద తీవ్రంగా ఎదురు తిరగడంతో ఏమి చెయ్యాలో అర్ధం కాక , చివరకు సిమాంద్రా  వారితో మాచ్ పిక్సింగ్ చేసుకుని కిరణ్ గారిని కెప్టైన్ గా బరిలోకి దించే కండిషన్ మిద గేమ్ మొదలు పెట్టారు . అందులో బాగమే ముక్య మంత్రి గారు ఈ  రోజు అసెంబ్లీలో బిల్ ని తిరస్కరించి "జై సమైక్యామ్ద్రా " అంటూ అసెంబ్లీలో నినాదాలు చేస్తూ బయటకు రావడం .

  ఇక ఈ  డ్రామా లోని రెండవ అంకం డిల్లీలో జరగ బోతుంది . అక్కడా అంతే ! సిమంద్రా ..M.P లు సబను సాగ బోనివ్వమంటూ విర పద్యాలు పాడుతుంటే ప్రబుత్వం  తమ కర్తవ్యంలో బాగంగా , ఎన్ని అడ్డంకులు  ఎదురయినా పార్లమెంటులో బిల్ పాసవ్వడానికి నానా ప్రయాస పడుతున్నట్లు యాక్షన్ చేస్తుంది . ఈ  లోపు సుప్రీం కోర్టు వారు  జ్యొక్యమ్ చేసుకుంటారు . తాము ఎంత చిత్త  శుద్దితో ఉన్నప్పటికీ కిరణ్ గారి వాళ్ళ అది సాద్యం కాలేదని చెపితే తెలంగాణా ప్రజలు నిజమే అని నమ్మి కనీసం 5 సీట్లు అయినా గెలిపిస్తారని , అలాగే తాము హిరోను చేసిన కిరణ్ గారు సిమామ్ద్రాలొ స్వీప్  చేసినా లేక అత్యదిక సీట్లు సాదిమ్చినా అవి తమకు మాత్రమే ఉపయోగ పడతాయని అధికార పార్టి వారి బావన . అందుకే కిరణ్ గారికి కోర్టు తలుపు లు తట్టే టెక్నికల్ అవకాసం కల్పించారు అనేది స్పష్టం అవుతుంది .

  కాబట్టి తెలుగు ప్రజలారా ఇంకా 4 నెలలు దాకా మనందరికీ ఉచిత డ్రామా ప్రదర్సనలు ఉండబోతున్నాయి అన్న మాట . మొత్తానికి తెలుగు  M.L.A లు మంత్రులు సురభి కళాకారులను మించి పోయారని పిస్తుంది . ,

Monday, January 27, 2014

ఒక్క రాత్రిలో ప్రజా నాయకుడు కి కావాల్సిన అర్హత సంపాదించా నంటున్న "తనిష్క్ జ్యయలరి" దొంగ !

                                                        


అయన పేరు కిరణ్ . ఊరు గుంటూరు జిల్లాలోని ఈపూరు. అయనకి సమాజ సేవ చేయాలన్న తపన ఎక్కువట. అ ఉద్దేశ్యంతోనే తమ గ్రామ సర్పంచిగా పోటి చేద్దామని తన ఆలోచన ఊరి వారికి చెపితే ఊల్లో వారందరూ నవ్వి ఇతనిని పిచ్చోడి క్రింద జమ కట్టారట. దానితో మనస్తాపం చెందిన అతను హైద్రబాద్ కి వచ్చేసి తనంటే ఏమిటో సమజానికి చెప్పాలనుకున్నాడు. కొన్నాళ్ళు బాగా ఆలోచించి నట్లుంది " ప్రజా నాయకుడు" కావాలంటే కావాల్సిన  ప్రాదమిక అర్హత ఏమిటా అని. అలా ఆలోచించగా , ఆలోచించగా ఒక రోజు బుద్దుడికి జ్ణానోదయం అయినట్లు అతనికి జ్ణనోదయం అయింది. ప్రజాసేవకుడు కావాలంటే కోట్లు కొల్లగొట్టగలిగిన గుండె దైర్యం కావాలని అతనికి కలిగిన జ్ణానోదయం. అందుకు తాను సమర్దుడా , కాదా అని చిన్న పరీక్ష తనకు తానే పెట్టుకుని అందులో ఘన విజయం సాదించాడు . ఆ తర్వాత తాను చేసిన పని ద్వారా తనకు ప్రజానాయకుడు అయ్యే అర్హత వచ్చిందని , కాబట్టి తాను చేసిన పనిని బట్టి అయినా తన సమర్దతను గమనించి తనకు "లీడర్" పొస్ట్ ఇవ్వాలని తెలుగు ప్రజలకు సంచలన టి.వీ. ద్వారా విజ్ణప్తి చేస్తున్నాడు.

 ఇంతకీ కి ఆయన చేసిన పని ఏమిటో తెలుసా? హైద్రాబాద్ లోని పేరెన్నిక గన్న బంగారం షాప్ లలో ఒకటైనా "తనిష్క్ జ్యూవలరీస్ షాప్" లో అర్ద రాత్రి కన్నం వేసి కోట్లు విలువ చేసే బంగారం దొంగతనం చేసాడు. దీనిని  పోలిస్ వారు అంతర్ రాష్త్రీయ దొంగల ముఠా  పని అయి ఉంటుందని చెప్పి, పోలిస్ వారిని బ్రుందాలుగా ఏర్పాటు చేసి వెతకడం  ప్రారంబించారు. మూడు రోజుల తర్వాత సదరు ప్రజాసేవక అభిలాషి కిరణ్  గారు టి.వి.9 చానల్ వారి దగ్గరకు వెళ్ళి తనేలా  ఆ  దొంగతనo  చేసింది, సొము ఎక్కడున్నది పూస గుచ్చినట్లు వివరించారు. దానితో ఎగిరి గంతేసిన సదరు చానల్ వారు "తనిష్క దొంగ మా ముందు సరెండర్ అయ్యాడు. అతనిని పట్టి ఇవ్వడానికి మేమె కారణం" అని ఈ రోజు పొద్దున్నుంచి తమ ఛానల్ లో ఒకటే ఊదరగొట్టడం మొదలు పెట్టారు. అంటే "సొమ్ము ఒకడిది, సోకు ఒకడిది" అన్నట్లు తను కష్టపడి చేసిన చోరి గురించి, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం గురించి ప్రజలకు చెపుతారని ముందుగా ఫొలిసుల వద్దకు వెళ్ళకుండా టి.వి. 9 వారి వద్దకు వస్తే, దొంగను పట్టించిన ఘనత తమదిగా ప్రసారమo  చేసుకుంటున్నారు.అప్ కోర్స్, దానికి ప్రతి పలంగా దొంగ గారి సద్దుదేశ్యాన్ని గూర్చి కూడా ప్రసారం చేస్తున్నారు అనుకోండి . చివరకు పోలిసులు సరెండర్ అయిన వాడిని అరెస్ట్ చేసి టి.వి9 వారికి క్రుతజ్ణతలు చెప్పారు. 

   మొత్తానికి తన అర్హత నిరూపించుకుని ప్రజల అభిమానం పొంది ప్రజా సేవకుడు కావాలనుకుంటున్న "కిరణ్ ది తీప్" గారిని గుర్తించి ఏ రాజకీయ పార్టీ సీటు ఇస్తుందో వేచి చూడాలి. ఇప్పటికైనా ఈపూరు గ్రామ ప్రజలు అతనిలోని సమర్దతను గుర్తించి , తమ నాయకుడు గా ప్రకటించాల్సిన అవసరం ఉంది. మరి ఆ ఊరి పేరు అంద్రప్రదేశ్ మొత్తం తెలిసిందంటే కిరణ్ చేసిన ప్రయోగమే కద! ఇంత కంటే సమర్దత ఉన్న నాయకుడు వారికి దొరకడం కష్టమే మరి! జై ప్రజా నాయకా!   దిని గురించి మరిన్ని వివరాలకు క్రింది విడియో చూడండి .   


           

         

Friday, January 17, 2014

ముంబాయి డాన్సర్ "రేప్" కేసు కున్న ప్రాదాన్యత, మచిలీపట్టణం ఇంజనీర్ అనూహ్య మర్డర్ కేసుకు లేదా ?

                                                             


 లేదనే అనిపిస్తుంది , ముంబాయి పోలిసుల తీరు  చూస్తుంటే . ఇక విషయానికి వస్తే , మొన్నీ  మద్య ,హైదరాబాద్ లో జనవరి 1 వేడుకల్లో డాన్స్ చెయ్యడానికని ముంబాయికి చెందిన డాన్సర్ ఒకామె హైదరాబాద్ కి వచ్చింది . ఆమెను ఎయిర్పోర్టులో పికప్ చేసుకోవడానికి వచ్చిన వారు ఆమెకు మత్తు  మందు ఇచ్చి , దూరంగా ఎక్కడి కో  తీసుకు వెళ్లి, ఆమె మిద సామూహిక అత్యాచారం జరపి , ఆమె దగ్గరున్నది దోచుకుని , అ తర్వాత ఆమెను ముంబాయి బస్ ఎక్కించారట . ఆమె కూడా మత్తులో ఉండటం వలన ఇవేవి గమనించక ఇంటికి పోయి చూసుకున్న తర్వాత గాని తనకు జరిగిన అన్యాయం అర్ధం కాలేదట . అక్కడి పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే వారు పట్టించుకో పోయేసరికి , తనకున్న ఇన్ప్లూయన్స్ తో ఒక సామాజిక సంస్ట  ద్వారా  ముంబాయి పోలీసులను కదిలించి , వారిని తీసుకుని హైదరాబాద్ కు వచ్చి , ఇక్కడి పోలీసులను కదిలిస్తే , అప్పటికప్పుడు 4 స్పెషల్ టీంలు  ఏర్పాటు చేసి నిందితులను పట్టుకుని కట కటాల  వెనుకకు నెట్టారు . ఈ  కేసు గురించి పోలిస్ అధికార్లు ఎంత శ్రద్ద తీసుకున్నారో పోలిస్ అధికారుల మాటల్లోనే ఈ విడియో  ద్వారా తెలుస్తుంది . ఇందుకు హైదరాబాద్ పోలిస్ వారిని అభినందించి తీరవలసిందే !


                                               

  అయితే ఇక్కడొక ప్రశ్న  ఏమిటంటే , ముంబాయికి చెందిన అమ్మాయి రెప కేసు గురించి హైదరాబాద్ పోలీసులు చూపించిన శ్రద్ద లో , మచిలీ పట్నానికి  చెందిన తెలుగు ఇంజనీర్ అనూహ్య ఘోరంగా మొన్న తగులపెట్టబడి శవంగా ముంబాయి సమీపంలో దొరికితే , ఆ  కేసు మిద ముంబాయి పోలీసులు వందవ  వంతైనా చూపించారా అని ?
  ఈ  కేసు వివరాలు లోకి వెళితే , మచిలీ పట్నానికి  చెందిన అమ్మాయి అనూహ్య ముంబాయి లో ఇంజనీర్ గా ఉద్యోగం  చేస్తుంది . క్రిష్టమస్ సెలవులకు ఇంటికి వచ్చిన అనూహ్య ,పండగ తర్వాత ముంబాయి వెళ్ళింది . కాని ఆమె ముంబాయి చేరినట్లు సమాచారం ఆమె తండ్రికి రాలెదు. అ రోజు నుంచి ఆమె ఏమైందో అర్ధం కాలెదు. దానితో విజయవాడ రైల్వే పోలిస్ స్టేషన్ లో ఆమె తండ్రి పిర్యాదు చేస్తే , మిస్సింగ్ కేసు నమోదు చేసిన విజయవాడ పోలీసులు కేసును ముంబాయి పోలీసులకు బదిలీ చేసారు . కానీ అక్కడి పోలీసులు ఈ  కేసును ఎ మాత్రం పట్టించుకోక పోవడం తో , అమ్మాయి తాలూకు వారె ఒక టీం  గా ముంబాయి వెళ్లి అక్కడి స్తానికుల సహకారం తో గాలింపు చేపట్టారు . చివరగా వారికి ఒక చోట తగుల పెట్టబడి కంపు కొడుతున్న స్తితిలో , అనూహ్య శవం  కనిపించగా , ఆ  సమాచారాన్ని తండ్రికి చెపితే అయన ముంబాయి వెళ్లి, దారుణంగా హత్య చేయబడిన తన కూతురు ని చూసి కన్నీరు మున్నీరు అయ్యారు . కాని ఈ విషయం  లో ముంబాయి పోలీసులు ఎ మాత్రం పట్టించుకోలేదని తెలుస్తుమ్ది..  దిని మిద అమ్మాయి తాలూకు వారి బాదను క్రింది విడియో లో చూడండి . కాబట్టి దిని వలన అర్దమయ్యేది ఒకటే , ముంబాయి డాన్సర్ గారికి ఉన్న ఇంప్లూయన్స్  ఆంద్రా  అమ్మాయి తల్లి తండ్రులకు లెదు. ఉంటే ఇంత నిమకు నిరెత్తినత్లు ఉంటారా పోలీసులు ?
ముంబాయి అయినా , హైదరాబాద్ అయిన అందరూ ఇండియన్ పోలీసులే . మరి డాన్సర్ గారి విషయంలో చూపిన శ్రద్ద , అబాగ్య ఇంజనీర్ విషయం లో ఎందుకు చూపించడం లేదు? ఈ  విషయం లో తెలుగు వారు అంతా అనూహ్య తల్లి తండ్రులకు సంగి బావం తో కూడిన సంతాపం తెలుపాల్సిన   అవసరం ఉంది . దానిలో బాగంగానే అనూహ్య తల్లి తండ్రులకు కల్కి ఖడ్గం బ్లాగర్ గా నా సంఘీ బావం ను మరియు సంతాపం ని తెలియ చేస్తున్నాను.