Monday, December 31, 2012

గాందీ గారి "సప్త మహా పాపములు" చూడండి

                                                                                   


 
                గాందీ గారి "సప్త మహా పాపములు" చూడండి

  నా బ్లాగును స్నేహితులకు, చూచువారికి,విమర్శకులకు, రంద్రాన్వేషకులకు అందరికి ఆంగ్ల సంవత్సర శుబాకాంక్షలు. నా బ్లాగు టైటిల్ లో ఉదహరించిన గాంది మహాత్ముడు చెప్పిన "సప్త మహా పాపములు" అనగా ఏవో సచిత్రంగా ప్రచురించడమయినది.   

స్త్రీలను వేటాడేది రేపిస్టులు అయితే, వారికి సహకరించేది ఫెమినిస్టులా!?



 అలాగె ఉంది కొంతమంది దోరణి చూస్తే. ఎవరు ఒక మాట ఆడపిల్లలు కోంచం జాగర్తగా ఉండమని చెప్పినా వీళ్ల మీద ఏదో పడ్డట్లే అవేశపడి పొతున్నారు. అసలు మన దేసమ్ లొ ఒక అంచనా ప్రకారం నూటికి రెండు కేసులు మాత్రమే పోలిస్ స్టేషన్ల దాకా వస్తున్నాయట. అటువంటప్పుడు స్త్రీల రక్షణకు కేవలం చట్ట బయం ఒక్కటే చాలదు. అన్ని జాగర్తలు తీసుకోవల్సి ఉంటుంది. ఒంటి నిండ బట్టలు కట్టుకోండి అనటం బూర్జువా బావం అంట! మీ ఇష్టం వచ్చినట్ట్లు ఉండండ అని చెప్పడం అబిరుద్ది బావజాల మట. అసలు నాకొక పెద్ద అనుమానం ఏమిటంటే ఈ దెశపు స్త్రీలను తమ వ్యాపార ఉత్పత్తులు అమ్మకం కోసం ఆదునికత పేరుతో విచ్చలవిడి తన్నాని ప్రోత్సాహిస్తుంది వ్యాపారా వాదులే అని. వీరు డైరక్టుగా చెపితే బాగోదని వీరి తాబేదారులను "స్త్రీ వాదం" అనే పేరుతో రంగంలోకి దించి వితండ వాదాలు చేయిస్తున్నరు అని .

  వీళ్ల తంతు చూస్తుంటే వేటగాళ్లు అమాయక జంతువులను వేటాడే విదం గుర్తుకు వస్తుంది. వేటగాళ్ళు వేటకు వెళ్ళినప్పుడు రెండు జట్లుగా విడి పోతారు. ఒక జట్టు దూరంగా దారి కాచి ఆ దారిలో కొంతమేర వలలు పన్ని ఎదురు చూస్తుంటారు. ఇంకొక జట్టు మరొక పక్క నుంచి డప్పులు శబ్దం చేస్తూ జంతువులను పొదల్లో నుంచి లేపి పరిగెత్తిస్తూ రెండో జట్టు వలలు పన్నిన చోటుకి తరుముకు వస్తారు. అమాయక జీవులు వేటగాళ్ళ మోసం తెలియక ముందు వెనుక చూసుకోక ఆ వలలో చిక్కుకుని వేటగాళ్ళకు ఆహారంగా మారతాయి.

  పై విదానమే ఈ స్త్రీ వాదులు, రేపిస్ట్లు కలసి చేస్తున్నరా అనిపిస్తుంది. ఒకళ్లేమో మీ ఇష్టం వచ్చినా విదంగా వీదుల్లోకి వెల్లే స్వేచ్చ ఉంది అంటారు అలా వెళ్ళిన వాళ్ళని రెచ్చగొట్టిందంటూ ఇంకొక వర్గం వారు  రేప్ చేస్తుంటారు. ఫెమినిస్టు లారా మీరు చెపుతున్నట్లు ఈ దేశంలో  బూర్జువ సంస్క్రుతే రేప్ లకు మూల కారణమయితే, ఆదునిక బావాలు వాళ్ళు తిరిగే పబ్బుల్లో, క్లభ్భుల్లో రేప్ లే జరుగ కూడదు. విమానాలలో సహితం పేరుమోసిన ఆదునికులే వికారాలు ప్రదర్శిస్తుంది ఎందుకో చెప్పగలరా?రేప్ అనేది అభిరుద్ది చెందిన దేశాలలో జరుగుట లేదా? కేవలం మన దేశం లోనే జరుగుతున్నాయా? దీని గురించి ఒక అద్యయనం జరగాల్సిన అవసరం ఉంది. ఒక వేళ మీరు చెప్పినట్లు ఇక్కడి మగ మనస్తత్వమే అటువంటిది, దానిని చట్ట దండన ద్వారే నియంత్రించగలం అని తేలితే మిలట్రీ రూల్ పేట్టైనా స్త్రీలను కాపాడవలిసిందే. లేదు స్త్రీలు కూడ ప్రబుత్వాలకు సహయపడితే ఈ విపరీత దోరణి నివారించవచ్చు అని తేలితే అలాగే చేయొచ్చు. అంతె కాని ఏది చెప్పినా బూర్జువాబావజాలమ్ అని ఈసడించుకుంటే పరిస్తితులు చక్క బడవు.     

ఫుల్ గా మందు కొట్టి,అర్థరాత్రి ఆంగ్ల సంవత్సరాది కి ఆహ్వానం పలికే వారికి శుబాకాంక్షలు.!


 అబ్బా! పాత వత్సరం ఈరోజు అర్థరాత్రితో ముగుస్తుంది. దేశప్రజలు నూతన సంవత్సరానికి స్వాగతమ్ చెప్పటానికి బారీ ఏర్పాట్లతో సిద్దంగా ఉన్నారట!అర్థరాత్రి అనందం కోసమ్ ఎదురు చూస్తున్నారు.

 సరె అందరకు ఉన్నట్లే మనకు ఒక సంవత్సరాది ఉంది. దానిని ఉగాది అంటాం. ఆ రోజు తెల్ల వారు జామునే లేచి శుభ్రంగా తలంటు పోసుకుని, కొత్త బట్టలు కట్టుకుని,పూజలు చేసుకుని, ఉగాది పచ్చడి తిని, పిండివంటలు వండుకుని ఇంటిల్లీ పాది ఆనందంగా గడుపుతాము. ఇదంతా పగటి వేళలో జరుగుతుంది.ఇది మన సంస్క్రుతి. మన మత విదానం ఇదే మనకు నేర్పింది.

 ఇక పొతే విదేసి సంస్క్రుతి నేర్పిన దేమిటంటే ఇంకా గంటల్లో నూతన సంవత్సరం వస్తుందనగా, ఫ్రెండ్స్ తో కూర్చుని మందు పార్టీ ఏర్పాటు చేసుకోవడం.ఫుల్ గా మందుకొట్టి ఊగుతూ ఆ మత్తులోనే, న్యూ ఇయర్ కి స్వాగతం చెపుతూ, రోడ్ల వెంబడి పిచ్చి గంగిర్లెత్తినట్లు వెర్రి కేకలు వేస్తూ, తిరిగి,తిరిగి ఇంటికి వెళ్ళి(వీలుంటె) బోర్ల బొక్కలా పడుకుని నిద్ర పోవడం. వీరికొక సెంటిమెంట్ ఉందట! మొదటి రోజు ఎలా జరిగితే సంవత్సరం అంతా అలాగే జరుగుద్ది అంట! ఇంకే మరి! స్వాగతమే మత్తులో చెపుతున్నారు కాబట్టి, ఆ యేడాదంతా అదే పరిస్తితి!

  ఈ విదానం వల్ల వ్యాప్పారస్తులు,సెలబ్రిటిలు, మద్యం షాప్ లకు బారీ ఒపెనింగ్లు తప్పా ఎవరికి ఎమి ఒరగదు. ఏది ఏమయినా నలుగురితో నారాయణా అని నేను స్వాగత శుబాకాంక్షలు చెపుతున్నాను.

              ఇష్...యు....ఆ..ప్..ఇ..న్య్...ఉఉ..యి...యాఅ...ర్..............(ఇప్పటికే బాటిల్ కతం),

Sunday, December 30, 2012

పొలిసోడే రేప్ చెస్తే "ప్రొటెక్ట్" చెసేదెవరురా! దేవుడా!



  ఇక చెప్పండి. పాపం ఒక అమె కంప్లైంట్ ఇద్దామని విజయవాడ లోని ఒక పోలిస్ స్టేషన్ కి వెల్లిందట. అక్కడ ఆమె కంప్లైంట్ సంగతి దెవుడెరుగు, ఆ పొలిస్ స్టేషన్లో ని కానిస్టేబుల్ అమె పై అత్యాచారం చేసి పంపిస్తే ఆమె ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉందట. అసలు ఏమి జరుగుతుందో నాకైతే అర్థమ్ కావటం లేదు. అసలు మగాడు అంటె కనీసమ్ "రేప్" చెయ్యగలిగినవాడు అని అర్థమా ఎమిటి?

  వీలమ్మా కడుపు మాడా ! వీల్లకేమి పోకదల వచ్చిందండి? ఇలా బరి తెగించారు.కాపాడే వాడెవడో, కాటేసే వాడెవడో తెలియకపోతే ఆడ కూతుళ్ళు బ్రతికేదెట్టా? ఒక పక్కా డిల్లీ పిల్లని పొట్టన పెట్టుకున్నందుకు దేశమంతా అట్టుడికి పోతుందా! అయినా ఈ మగ మ్రుగాలకి  కోంచమన్నా చీమూ నెత్తురు ఉందా? అంత ఆపుకోలేక చస్తునారా? అసలు ఈ మద్య ఏమన్నా వీదేశీయులు మన దేశం మీదకి"విషపు గాలి" లాంటిది ఏమన్నా వదిలారా? అది పీల్చీ, మనోల్లు శివాలెత్తి పోతున్నారా?లేకుంటే ఈ పాపం ఏమిటండి!

   అసలు నన్నడిగితే కన్ను కి కన్ను, కాలు కి కాలు సిద్దాంతం యే కరెక్ట్ అండి.అప్పుడు కాని బుద్ది రాదు మగ మ్రుగాలకి. ఏమండోయి, కన్ను కి కన్ను అన్నానని "రేప్" కి "రేప్"  అనుకోమాకండి. దేని వలన ప్రమాదముంటే దానిని తీసివేయడమే! అంతే. ఆడ పిల్లలు మీ చదువులు, గిదువులు తర్వాత.అంద్రా, తెలంగాణా తో పని లేదు మీకు. నిలదీయండి ప్రభుత్వాలని. మీకు సంపూర్ణ రక్షణ కు చర్యలు తీసుకునే దాక "కల్కి అవతారులై" కదలండి. నేను మొన్నట్టి దాక "కల్కి" అంటె మగాడు వస్తాడు అనుకున్నా! కాదు తల్లులారా, మిరే! మిరె కల్కి లైనా కాళికలైనా! మీరు కదిలితే మగ మ్రుగాలు పారి పోవాలి . జై కల్కి!,      జై కాళికా!

Saturday, December 29, 2012

మేము ఆ విషయం లో "మగవాళ్లం" కాదు.?!

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_6727.html
పూర్తి టపా కోసం లింక్ మిద క్లిక్కండి

మమ్మల్ని క్షమించమ్మా, మేము ఆ విషయం లో "మగవాళ్లం" కాదు.



 అని బారత దేశం లోని నాయకులు "అమానత్" కి శ్రద్దాంజలి ఘటీంచాలి. మనం "రేప్" లు చెయ్యడం లో ఫస్ట్ అట! కాని   రేప్ కు గురైన వారికి వైద్య సహాయం లో అండించడమ్ లో "మగవాళ్లం" కాదు అని నిరూపించుకున్నాం. పదిరోజులు బాదితురాలికి వైద్యం ఆందించి, అన్ని అవయవాలు ఇన్ఫెక్షన్ తో పాడయ్యే దాక చూసి, చివరి క్షణం లో "సింగపూర్" పంపుతారా? మన దేశం కంటే ఎంతో చిన్నదయినా దేశం లో ఉన్న మెరుగఈన వైద్య సౌకర్యాలు మన దగ్గర లేనందుకు సిగ్గు పడాలి.
                                                                   
   డీల్లీ రేప్  కేస్ విషయం లో అక్కడి మహిళా ముక్య మంత్రి షీలా దీక్షిత్ గారికి డీల్లీ పోలిసులకు మద్య ఎందుకో బేదాభి ప్రాయాలు ఉన్నట్లు అనిపిస్తున్నాయి. పాలనా పరంగా డిల్లీ పోలిస్ భారత రక్శణ శాఖా మంత్రి షిండే గారి కంట్రోల్  లో పని చేస్తుందట. అందుకే వారికి ముఖ్యమంత్రి ని పెద్దగా పట్టించుకోరనుకుంటా!

  మొన్న  ప్రజలు ఆందొళన  చేసిన విషయమ్ లో, బాదితురాలి మరణ వాంగ్మూలం తీసుకునే సమయం లో పోలిసులు ప్రవర్తించిన తీరు మీద సాక్షాతు, రాష్ట్ర ముఖ్య మంత్రియే పొలిసుల మిద హోమ్ మంత్రికి పిర్యాదు చేసారంటే  పరిస్తితి ఎంత దారుణం గా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 మరి అటువంటి పాలనా వ్యవస్తలొ స్త్రీల మీద అత్యాచారాలు చెయ్యాలనుకున్న దుండగలకు ఏ మాత్రం భయం ఉంటుంది చెప్పండి. ప్రతి వాడు తమ మీదకు రాకుండా బాద్యతను ప్రక్క వాడి మీదకు నెడదామని చూసే వారే. ఇటువంటి అదికారులు స్త్రీలకు రక్షణ కల్పించ గలరా? వీరీ రక్షణా  బరోసాను నమ్మి భయటకు వెళ్లిన స్త్రీలు క్షేమంగా ఇంటికి తిరిగి రాగలరా? రాలెరని "అమానత్" ఉదంతమే చెపుతుంది. ఏన్ని కటిన చట్టాలు చేసినా అమలు చేసే వారికి చిత్తశుద్ది లెకపోతే వాటి వల్ల ఒరిగేది ఏమి  ఉండదు.

  కాబట్టి మహిళలు కళ్ళు తెరిచి ప్రస్తుత పరిస్తితులను వాస్తవ ద్రుష్టి తో అంచనా వేసుకో గలగాలి. ఏ పద్దతి అవలంబిస్తే మాన ప్రాణాలకు భద్రత ఉంటుందో వివేకం తో ఆలోచించ గలగాలి. ఒంటరిగా, లేక బాయ్ ఫ్రెండ్లతో తిరగటానికి బదులు ఒక బాచ్ గా అంటే గుంపుగా తిరగటం మేలు.బాయ్ ఫ్రెండ్ ల సంస్క్రుతికి సాద్య మైనంత దూరంగా ఉంటూ,సోదర సోదరీ బావాల సంస్క్రుతిని అలవాటు చెసుకోవటం మేలు. అలాంటి ఫీలింగ్స్ ఉన్న వారితోనే గుంపుగా కలసి తిరగడం మంచిది.

  కీకారణ్యమ్ కంటే జనార్యాణాలోనే స్త్రీలకు రక్షణ కరువు.మగాళ్ల రూపం లో ఉనా తోడేళ్లు నుండి రక్షించుకోవడానికి గిరిజనులు అనుసరించే "గుంపు" జీవన విదానమె కరెక్ట్. వారిలో అంతే. ఒక గుంపులో ఎవరికి హాని తల పెట్టినా మొత్తమ్ గుంపు హాని చెసిన వారి మీద దాడి చేస్తుంది. ఆ భయంతో నే సాదారణంగా ఎవరూ ఒకరి కొకరూ హని తల పెట్టరు . ఎందుకంటే దాని ప్రబావమ్ మొత్తం గుంపు అనుభవించాలి కాబట్టి. అందుకే అక్కడ పోలిస్ లు లేక పొయి..  నా రక్షణ ఉంటుంది. ఈ విదానమె నగరాలలో పాటిస్తే బాగుంటుంది అని నా అబిప్రాయం.
        డీల్లీ    రెప్ కేసు లో బాదితురాలు అమానత్ ఈ రోజు మ్రుతి చెందినది అని తెలిసి చాలా విచారిస్తున్నాను. అమె కొరిక నెరస్తులకు శిక్ష పడటం అని తెలుస్తుమ్ది. కాబట్టి ఆమే ఆత్మకు శాంతి కలగాలంటే తక్షణమె నేరస్తులకు  ఉరి సిక్ష పదేలా ప్రభుత్వమ్ చర్యలు తీసుకోవాలి.ఆమే కుటూంభ సభ్యులకు ప్రగాడ సానుబూతి తెలుపుతూ

ముఖ్యమంత్రికి, పోలిసులకు, పొసగని చోట నేరస్తులకు భయం ఉంటుందా?


                                                                   
  ఉండదు గాక ఉండదు. డీల్లీ రేప్  కేస్ విషయం లో జరిగింది అదే.అక్కడి మహిళా ముక్య మంత్రి షీలా దీక్షిత్ గారికి డీల్లీ పోలిసులకు మద్య ఎందుకో బేదాభి ప్రాయాలు ఉన్నట్లు అనిపిస్తున్నాయి. పాలనా పరంగా డిల్లీ పోలిస్ భారత రక్శణ శాఖా మంత్రి షిండే గారి కంట్రోల్  లో పని చేస్తుందట. అందుకే వారికి ముఖ్యమంత్రి ని పెద్దగా పట్టించుకోరనుకుంటా!

  మొన్న  ప్రజలు ఆందొళన  చేసిన విషయమ్ లో, బాదితురాలి మరణ వాంగ్మూలం తీసుకునే సమయం లో పోలిసులు ప్రవర్తించిన తీరు మీద సాక్షాతు, రాష్ట్ర ముఖ్య మంత్రియే పొలిసుల మిద హోమ్ మంత్రికి పిర్యాదు చేసారంటే  పరిస్తితి ఎంత దారుణం గా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 మరి అటువంటి పాలనా వ్యవస్తలొ స్త్రీల మీద అత్యాచారాలు చెయ్యాలనుకున్న దుండగలకు ఏ మాత్రం భయం ఉంటుంది చెప్పండి. ప్రతి వాడు తమ మీదకు రాకుండా బాద్యతను ప్రక్క వాడి మీదకు నెడదామని చూసే వారే. ఇటువంటి అదికారులు స్త్రీలకు రక్షణ కల్పించ గలరా? వీరీ రక్షణా  బరోసాను నమ్మి భయటకు వెళ్లిన స్త్రీలు క్షేమంగా ఇంటికి తిరిగి రాగలరా? రాలెరని "అమానత్" ఉదంతమే చెపుతుంది. ఏన్ని కటిన చట్టాలు చేసినా అమలు చేసే వారికి చిత్తశుద్ది లెకపోతే వాటి వల్ల ఒరిగేది ఏమి  ఉండదు.

  కాబట్టి మహిళలు కళ్ళు తెరిచి ప్రస్తుత పరిస్తితులను వాస్తవ ద్రుష్టి తో అంచనా వేసుకో గలగాలి. ఏ పద్దతి అవలంబిస్తే మాన ప్రాణాలకు భద్రత ఉంటుందో వివేకం తో ఆలోచించ గలగాలి. ఒంటరిగా, లేక బాయ్ ఫ్రెండ్లతో తిరగటానికి బదులు ఒక బాచ్ గా అంటే గుంపుగా తిరగటం మేలు.బాయ్ ఫ్రెండ్ ల సంస్క్రుతికి సాద్య మైనంత దూరంగా ఉంటూ,సోదర సోదరీ బావాల సంస్క్రుతిని అలవాటు చెసుకోవటం మేలు. అలాంటి ఫీలింగ్స్ ఉన్న వారితోనే గుంపుగా కలసి తిరగడం మంచిది.

  కీకారణ్యమ్ కంటే జనార్యాణాలోనే స్త్రీలకు రక్షణ కరువు.మగాళ్ల రూపం లో ఉనా తోడేళ్లు నుండి రక్షించుకోవడానికి గిరిజనులు అనుసరించే "గుంపు" జీవన విదానమె కరెక్ట్. వారిలో అంతే. ఒక గుంపులో ఎవరికి హాని తల పెట్టినా మొత్తమ్ గుంపు హాని చెసిన వారి మీద దాడి చేస్తుంది. ఆ భయంతో నే సాదారణంగా ఎవరూ ఒకరి కొకరూ హని తల పెట్టరు . ఎందుకంటే దాని ప్రబావమ్ మొత్తం గుంపు అనుభవించాలి కాబట్టి. అందుకే అక్కడ పోలిస్ లు లేక పొయి..  నా రక్షణ ఉంటుంది. ఈ విదానమె నగరాలలో పాటిస్తే బాగుంటుంది అని నా అబిప్రాయం.
        డీల్లీ    రెప్ కేసు లో బాదితురాలు అమానత్ ఈ రోజు మ్రుతి చెందినది అని తెలిసి చాలా విచారిస్తున్నాను. అమె కొరిక నెరస్తులకు శిక్ష పడటం అని తెలుస్తుమ్ది. కాబట్టి ఆమే ఆత్మకు శాంతి కలగాలంటే తక్షణమె నేరస్తులకు  ఉరి సిక్ష పదేలా ప్రభుత్వమ్ చర్యలు తీసుకోవాలి.ఆమే కుటూంభ సభ్యులకు ప్రగాడ సానుబూతి తెలుపుతూ

Friday, December 28, 2012

ఎవరి బ్లాగు చూస్తే,"సైన్స్ గాడ్" మైండ్ బ్లాక్ అవుతుందో వారే వీరబోగ వసంత రాయలా?



                                                                  సింహాచల వరాహ నరసింహ స్వామి.          

  నెను ఎదో కుతూహలమొ, మత ప్రచారం లో బాగమనుకోండి, ఒక పరిశోదన మొదలుపెట్టి దాని సారాంశాన్ని, ఈ బ్లాగులో యుగాంతం డిసెంబర్ 21,2012. అనే శిర్షిక క్రింద సీరియల్గా ప్రచురించటం జరిగింది. దానికి సంబందించి నా పరిశోదనా సారాంశాన్ని, మొత్తం చివరి టపాలో  ప్రచురించటం జరిగింది. దానిలో వీరబోగ వసంత రాయలు గురించి పది విషయాలు చెపుతూ, ఆయన నాస్తికులతో భావ యుద్దం చేస్తాడు అని కూడ చెప్పటం జరిగింది. అంతే! "గాడ్" అనె అయనకు కోపం వచ్చినట్ట్లుంది.నన్నూ, నా మతాన్ని ఆయన బ్లాగులో స్పెషల్ టపా పెట్టి ఆక్రోశాన్ని వెళ్ల గ్రక్కాడు.

  నా మతం "పందులకు పసుపు" రాసేదట!అంటే మనం వరాహా అవతారాన్ని పూజించడాన్ని అయన ఆ విదంగా గేలి చెసాడు.నిజమే పందిలో ఉండేది "ఎలక్ట్రాన్, ప్రొటాన్, నుట్రాన్ లే, మనిషిలో ఉండేవి అవే. అందుకే మాకు దేవుడు అంటే "ఇందుగలడు, అందులేదని కాక సర్వాంత్ర్యామి". కాని "సైన్స్ గాడ్"  కి అలా కాదేమో. మేము మతమ్ లోని విజ్ణానాన్ని దర్శిస్తుంటే, ఈ సో కాల్డ్ గాడ్ సైన్స్ అనే పేరుతో మూర్కత్వాన్ని పోగేసుకుంటున్నాడు.

  వీళ్లన్ని చూస్తుంటె వీరబోగ వసంతరాయలు గురించి నేను చెప్పిందే జరుగుతుందా అనే ఆశ్చర్యం కలుగుతుంది. లేకుంటే నేను వదిలిపెట్టినా ఆ టపాని ఈ నాస్తికులు ఎందుకు వదలిపెట్టకుండా ఏదో రకంగా కెలుకుతున్నారు?. ఒక వేళా వీరబోగ వసంతరాయలు  గురించి నేను చెప్పినది వీరు నమ్మి ఉండాలి. ఆయన నాస్తికులతో యుద్దం చేస్తాడు అనే మాటలను పట్టుకుని యెందుకైనా మంచిదని ముందే ఎదురు దాడి మొదలు పెట్టారా!. అయ్యా నేను చెప్పింది కల్కి పురాణం లోని అంశాలే. నా పరిశోదనలో ఒక్కట్టి నేను కల్పించి చెప్పలేదు. ఈ విదంగా ఉండొచ్చు అని మాత్రమె చెప్పాను. ఒక వేళ సైన్స్ వాదులు నమ్మకపోతే దానిని రాదాంతమ్ చెయ్యల్సిన అవసరం లేదు. నేను ఒక సారి కాకపోతే వంద సార్లు, రీపోస్ట్ చేస్తాను. ఎందుకంటే అది నా మత ప్రచారం లో బాగమ్ కాబట్టి. ఇంకొంత మంది అయితే ఒక పక్క నాది పిచ్చి అంటూనే వీరబోగ వసంతరాయలు గురించి పర్సనల్గా, 'ఈ మెయిల్' చెయ్యమని అడుగుతున్నారు. ఇదంతా చూస్తుంటె ఎవరికైనా ఏమనిపిస్తుంది. నా సబ్జెక్ట్ జనాల్కి బాగానే ఎక్కింది అని. ఇక పోతె నమ్మక్కమంటార, సైన్స్ గాడ్ లే స్పందిస్తుంటే, మిగతా వారి సంగతి చెప్పాలా!ఈ లింక్http://kalkiavataar.blogspot.in/2012/12/21-12-2012.html మీద క్లిక్ చెస్తే మీకే తెలుస్తుంది వారు ఎందుకు ఎగిరెగిరిపడుతున్నారో,  

ఎవరి బ్లాగు చూస్తే,"సైన్స్ గాడ్" మైండ్ బ్లాక్ అవుతుందో వారే వీరబోగ వసంత రాయలా?


                                                                  సింహాచల వరాహ నరసింహ స్వామి.          

  నెను ఎదో కుతూహలమొ, మత ప్రచారం లో బాగమనుకోండి, ఒక పరిశోదన మొదలుపెట్టి దాని సారాంశాన్ని, ఈ బ్లాగులో యుగాంతం డిసెంబర్ 21,2012. అనే శిర్షిక క్రింద సీరియల్గా ప్రచురించటం జరిగింది. దానికి సంబందించి నా పరిశోదనా సారాంశాన్ని, మొత్తం చివరి టపాలో  ప్రచురించటం జరిగింది. దానిలో వీరబోగ వసంత రాయలు గురించి పది విషయాలు చెపుతూ, ఆయన నాస్తికులతో భావ యుద్దం చేస్తాడు అని కూడ చెప్పటం జరిగింది. అంతే! "గాడ్" అనె అయనకు కోపం వచ్చినట్ట్లుంది.నన్నూ, నా మతాన్ని ఆయన బ్లాగులో స్పెషల్ టపా పెట్టి ఆక్రోశాన్ని వెళ్ల గ్రక్కాడు.

  నా మతం "పందులకు పసుపు" రాసేదట!అంటే మనం వరాహా అవతారాన్ని పూజించడాన్ని అయన ఆ విదంగా గేలి చెసాడు.నిజమే పందిలో ఉండేది "ఎలక్ట్రాన్, ప్రొటాన్, నుట్రాన్ లే, మనిషిలో ఉండేవి అవే. అందుకే మాకు దేవుడు అంటే "ఇందుగలడు, అందులేదని కాక సర్వాంత్ర్యామి". కాని "సైన్స్ గాడ్"  కి అలా కాదేమో. మేము మతమ్ లోని విజ్ణానాన్ని దర్శిస్తుంటే, ఈ సో కాల్డ్ గాడ్ సైన్స్ అనే పేరుతో మూర్కత్వాన్ని పోగేసుకుంటున్నాడు.

  వీళ్లన్ని చూస్తుంటె వీరబోగ వసంతరాయలు గురించి నేను చెప్పిందే జరుగుతుందా అనే ఆశ్చర్యం కలుగుతుంది. లేకుంటే నేను వదిలిపెట్టినా ఆ టపాని ఈ నాస్తికులు ఎందుకు వదలిపెట్టకుండా ఏదో రకంగా కెలుకుతున్నారు?. ఒక వేళా వీరబోగ వసంతరాయలు  గురించి నేను చెప్పినది వీరు నమ్మి ఉండాలి. ఆయన నాస్తికులతో యుద్దం చేస్తాడు అనే మాటలను పట్టుకుని యెందుకైనా మంచిదని ముందే ఎదురు దాడి మొదలు పెట్టారా!. అయ్యా నేను చెప్పింది కల్కి పురాణం లోని అంశాలే. నా పరిశోదనలో ఒక్కట్టి నేను కల్పించి చెప్పలేదు. ఈ విదంగా ఉండొచ్చు అని మాత్రమె చెప్పాను. ఒక వేళ సైన్స్ వాదులు నమ్మకపోతే దానిని రాదాంతమ్ చెయ్యల్సిన అవసరం లేదు. నేను ఒక సారి కాకపోతే వంద సార్లు, రీపోస్ట్ చేస్తాను. ఎందుకంటే అది నా మత ప్రచారం లో బాగమ్ కాబట్టి. ఇంకొంత మంది అయితే ఒక పక్క నాది పిచ్చి అంటూనే వీరబోగ వసంతరాయలు గురించి పర్సనల్గా, 'ఈ మెయిల్' చెయ్యమని అడుగుతున్నారు. ఇదంతా చూస్తుంటె ఎవరికైనా ఏమనిపిస్తుంది. నా సబ్జెక్ట్ జనాల్కి బాగానే ఎక్కింది అని. ఇక పోతె నమ్మక్కమంటార, సైన్స్ గాడ్ లే స్పందిస్తుంటే, మిగతా వారి సంగతి చెప్పాలా!ఈ లింక్http://kalkiavataar.blogspot.in/2012/12/21-12-2012.html మీద క్లిక్ చెస్తే మీకే తెలుస్తుంది వారు ఎందుకు ఎగిరెగిరిపడుతున్నారో,  

Thursday, December 27, 2012

. "స్తీ వాదం" అంటే రేప్ ని సమర్దించడమా! ?

                                                                    .
 నేను ఇంత కాలం స్త్రీ వాదం అంటే కెవలమ్ స్త్రీలకు వ్యతిరెకంగా సమాజమ్ లో జరుగుతున్న అన్యాయాలకు, స్త్రీలు మాత్రమె స్పందించాలని, స్త్రిలకు తమ ఇష్టం వచ్చిన విదంగా తిరిగే స్వేచ్చ కావాలని డిమాండ్ చేసేవారు అని అనుకున్నాను. కాని ఇందాక ఒక బ్లాగులొ ఒక మిత్రుడు ఒక స్త్రీవాది గురించి చెపుతూ ఆయన (స్త్రీ వాది )డిల్లీ రేప్ ఘటన గురించి చెప్పిన  అభిప్రాయం ఒకటి ఆ బ్లాగులో ఇచ్చాడు. అది చూసి నాకు మైండ్ బ్లాక్ అయింది అంటే నమ్మండి. అది ఇదే.   
         "సామాజికంగా వెనుకబడిన ఇండియా లాంటి దేశంలో ఒకడితో డేటింగ్ చేసిన అమ్మాయిని ఇంకొకడు పెళ్ళి చేసుకోడని తెలిసి కూడా డేటింగ్‌ని సమర్థించేవాళ్ళు రేప్‌ని మాత్రమే హత్యతో సమానమైన నేరంగా ఎందుకు పరిగణించాలని అనుకుంటున్నారు? కార్మిక వర్గంతో గానీ స్త్రీవాదంతో గానీ సంబంధం లేని & పరువుమర్యాదల కోసం ప్రాకులాడేవాళ్ళ భావజాలంతో మాత్రమే సంబంధం ఉన్న ఈ కేస్ గురించి మార్క్సిస్ట్‌లు సీరియస్‌గా ఆలోచించడం అనవసరం. ఆ అమ్మాయి శరీరం ఆమె ఇష్టం కనుక ఆమె డేటింగ్ చేస్తుందని మీరు అనొచ్చు. ఆ రౌడీగాళ్ళు కూడా తమ బిహేవియర్ తమ ఇష్టం అనుకుని రేప్‌లు చేస్తారు. నీతి అనేది తమకి ఒకలాగ, ఇతరులకి ఇంకొకలాగ వర్తించాలని అంటే దాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు."
       ఆ బ్లాగులోనే నాకు తోచిన సమాదానమ్ రాసి పడేశాను అది ఇది. అఫ్ కోర్స్. ఇది మామూలుగా చెప్పేదే అనుకోండి.
                   
 (1)డేటింగ్ అనైతికం అయితే రేప్ చట్ట వ్యతిరేకం. అనైతికాన్ని సమాజం శిక్షిస్తుంది (అమెకు వేరొకరితో పెళ్లి కాదు అనేది అదే), చట్ట ఉల్లంఘనను చట్టం శిక్షిస్తుంది.

 (2). డేటింగ్ వల్ల బౌతిక దాడి కాని, బావ దాడి(ఇష్టానికి వ్యతిరేకం)  కాని ఉండదు. రేప్ లో రెండూ ఉంటాయి.పాపం బాదితురాలు ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉంది.

 (౩).ఒక వేళా డేటింగ్ చట్ట వ్యతిరేకం చేస్తే, నేరస్తులను చట్టానికి అప్పగించడమే ఇతరుల బాద్యత తపా, వారికి వ్యతిరేకంగా నేరాలు చెసే హక్కు ఎవరికి లేదు.

 (4). స్తీ వాదం అంటే రేప్ ని సమర్దించడమా! లేక రేప్ లు చేయించుకోవడమా? స్త్రీ వాదులకు పరువులు ఉండదా? అంతా ఓపెన్ మైదానమేనా?



  అయితే ఇక్కడ నేను సూటిగా ఒకటే ప్రశ్న ఆ సో కాల్డ్  స్త్రీ వాదికి వేయదల్చుకున్నాను. "మీరు నిజంగా స్త్రీ వాదాన్ని సమర్దించే వాల్లు అయితే, ఇదే మీ ఇంట్లో ఎవరికయినా జరిగితే ఇలాగే స్పందిస్తారా?
           నిజంగా ఆయన చెప్పినట్లు అంటె  డిల్లి కేసులో అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి డేటింగ్ చేసి వస్తుంటే అది గమనించిన దుండగలు అమేను రేప్ చెసి ఉన్నట్లయితే ,ఈ దారుణం "స్తీ వాద ప్రబావమే" అని చెప్పక తప్పదు. "బౌతిక దాడి’ తో సమానంగానే "లైంగిక దాడి" ని చూడాలని స్త్రీ వాదుల అభిప్రాయం కాబోలు. ఎందుకంటే ఈ దాడిని అరికట్టె  పేరుతో సాంప్రదయ వాదులు ఎక్కడ విచ్చల విడి స్వేచ్చను నిరోదించమని ప్రబుత్వాలను డిమాండ్ చేస్తారో అని వీరి బయం.

  స్త్రీ వాదం పేరుతో అమాయకపు, నిర్బాగ్య స్త్రీలను వీదుల్లోకి తీసుకువచ్చి, తమ వ్యాపార సంస్క్రుతికి అనుగుణంగా వాడుకుంటున్న వ్యాపార వర్గాలకు, వారికి ఉపయోగ పడుతున్న ఈ సోకాల్డ్ "స్త్రీ వాదులకు" డిల్లీ లొ  లేచిన నిరసన జ్వాలలు ఏ మాత్రం రుచించటం లేదు. అందుకే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా చివరకు రేప్ లను కూడ సమర్దించే స్తాయికి దిగజారారు. ఇదే వీరి నిజ స్వరూపం. మన దేశ సంస్క్రుతిని నాసనమ్ చేసి, మన స్త్రీలను విదేసి వ్యాపార సంస్క్రుతి  కి అనుగుణంగా మార్చడమే "స్త్రీ వాదుల అజెండా". కాబట్టి ఇకనైనా కళ్ళు తెరుద్దాం. మన జాతిని,నీతిని, సంస్క్రుతిని కాపాడుకోవాల్శిన తరుణమ్ ఆసన్నమయింది. లేకుంటే నేడు "అమానత్" (డిల్లి బాదితురాలు) కి పట్టిన గతే ఈ దేశపు స్త్రీలకు పడుతుంది. ఈ దురాగతాలను ఆపుదాం.మనం స్త్రీ వాదులమ్ కాదు సమానత్వ వాదులమని చాటి చెపుదాం.  

తెలుగు తల్లికి, తెలంగాణా తల్లికి మద్య తేడా ఏమిటో తెలుసా?

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_5016.html
పూర్తి టపాకోసం లింక్ మిద క్లిక్ చెయ్యండి

Wednesday, December 26, 2012

తెలుగు తల్లికి, తెలంగాణా తల్లికి మద్య తేడా తెలియనివారిని ఏమనాలి?


                                                                           

  ప్రతిష్టాత్మకమయిన,మన తెలుగు బాషా ఔన్నత్యాన్ని చాటే, "ప్రపంచ తెలుగు మహా సభలు" తెలుగు ప్రాంతంలో జరగటం ముదావహం.ఇవి ప్రపంచ సభలు కాబట్టి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువార్కి అంటే, తెలుగు బాషను మాత్రు బాష గా ఉన్న వారందరికి సంబందించిన సభలు అని సాదారణ ప్రజలు అనుకుంటున్నారు. అలాగే తెలుగు రాష్ట్రం లో ఒక భాగమయిన తెలంగాణా లోని ప్రజలు అనుకుంటూ ఉండవచ్చు. కాని తెలంగాణా విడగొట్టాలి అని పదియేండ్ల నుండి పోరాటం చేస్తున్న నాయకులు మాత్రం అలా అనుకోవటం లేదని అర్థమవుతుంది. వారు ’తెలుగు" అనేది తమది కాదని, అది పరాయి బాషని బావిస్తున్నట్లుంది. ఆంద్రా వాళ్ళ మీద కోపం "తెలుగు బాష" మీద చూపించడం ఎంతవరకు సమంజసం?

   అసలు వీరు చేసే ఒక వాదం ఆశ్చర్యం గా ఉండటమే కాక ప్రజలు ని అయోమయానికి గురి చేస్తుంది. తమది "తెలుగు తల్లి" కాదు అని తెలంగాణా తల్లి అని చెపుతూ ఒక కొత్త తల్లిని ఆవిష్కరింపచేశారు. తెలంగాణా తల్లి దేనికి ప్రతీకా, బాషకా? ప్రాంతానికా? స్పష్టత లేదు. తెలంగాణా వారు మాట్లాదేది తెలుగా? కాదా?.తెలంగాణా అంటే తెలుగుకి సంబందించిన పదం కాదా?ఆంద్రా అనేది మాత్రమే తెలుగుకు సంబందించినదా!ఏమిటీ విపరీత అర్థాలు?

  నాకు తెలిసీ "భరత మాత" అని దేశ భూ బాగానికి ప్రతీకగా ఆ తల్లిని ఆరాదిస్తున్నాం.అలాగే "తెలుగు తల్లి" అని మాత్రు బాషకు ప్రతీకగా పూజిస్తున్నాం. అలాగే "తెలంగాణా తల్లి" అని ప్రాంతీయ బూబాగానికి ప్రతీకగా తెలంగాణా ప్రజలు ఆరాదించ వచ్చు. కాని వారి మాత్రు బాష ఏమీటీ అనేది ఘనత వహించిన నాయకులు చెప్పాలి. వారు మాట్లాడేది తెలుగే అయితే "తెలుగు తల్లి" వారి తల్లి అవుతుంది. అటువంటప్పుడు వారు తిట్టేది వారి తల్లినేనా? కాదా? ఆత్మ విమర్శ చేసుకోవాలి. తల్లి ని తిట్టేవాడు ప్రజా నాయకులు అవుతారా?తెలంగాణా ప్రజలు  నిగ్గదీసి అడగాలి.ఇదంతా చూస్తుంటే ఎలా ఉంది అంటే "అన్న దమ్ముల మీద కోపం అమ్మ మీద చూపించి నట్లుంది".
                శ్రి వేంకటేశ్వరుని పాద పద్మముల నగరి అయిన "తిరుపతి" పట్టణం లో నేడు మొదలవుతున్న మన బాషా ప్రపంచ మహా సభలు సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా మన  తెలుగు అన్నదమ్ములు, అక్కచెల్లెలందరకు శుభాభినందనలతో..........


అసలు ఇంతకీ వీరబోగ వసంత రాయలు అంటే ఎవరో తెలిసిందా?

http://kalkiavataar.blogspot.in/2012/12/21-12-2012.html
పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్కండి

మతం లేనిది జంతువేనా!?

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_24.htm
పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్కండి!

Monday, December 24, 2012

"మతం" అనేది మనుష్యులకు మాత్రమె ఉంటుంది, జంతువులకు ఉండదు.


                                                                    
 మానవ ఆలోచనా పరిణామ క్రమంలో ఏర్పడిందే మతం. అది ముఖ్యం గా ఈ స్రుష్టిని నడిపే శక్తి ఏదో ఉందన్న మనిషి ఆలోచనలోనుంచి పుట్టిందే . వెర్వెరు ప్రజలు వెర్వేరు పద్దతుల ద్వారా ఆ శక్తి ని కనుగొనాలని ప్రయత్నిస్తూ కొన్ని విదానాల ద్వారా దానిని సాదించవచ్చని నమ్ముతుంటారు. ఆ నమ్మకాలే మత విశ్వాసాలుగా రూపొందినాయి.

  కాబట్టి మతం అనేది మనిషి ఆలోచనా  లేక జ్ణాన పరిణామా క్రమం లోనిది. ఇది జంతువులకు ఉండదు.ఎందుకంటె వాటికి జ్ణానం లేదు కాబట్టి. జ్ణానం లేకపోవుట వలన అవి స్రుష్టితో  ప్రత్యక్ష సంబందం కలిగి ఉంటాయి. కాబట్టి మానవుడి లాగా అనవసర బాదలు అంటూ ఏమి ఉండవు. జరిగిందానికి విచారించే పని లేదు, జరగబోయే వాటికి వగచే పని అంత కన్నా లేదు.

  కాని మనం జ్ణానం అనే దానిని పొంది ప్రక్రుతి ని పరీశిలిస్తూ , తద్వారా జ్నానాభివ్రుద్ది సాదించి చివరకు ప్రక్రుతినే శాసిమ్చ గలం అనే స్తాయికి ఎదిగాం.అసలు ఏ దైవ బావనతో ప్రక్రుతిని పరిశిలించటం మొదలు పెట్టామో, ఆ దేవుడే లేదు, పో! అనే నమ్మఖ్ఖానికి కోంత మంది వచ్చేశారు. ఇప్పుడు ప్రపంచం లో దేవుడూ,మతం వద్దనే వారు ఇరవయి శాతం అంటే నూట ఇరవై కోట్ల మంది ఉన్నారని ఒక అంచనా. అంటే ప్రపంచంలో హిందువుల కంటే వీరే అదికమట!

  మరి పైన నేను చెప్పిన నిర్వచనం ప్రకారం వీరికి మతమ్ లేదు కాబట్టీ వీరు "జంతువులా? అని మీరు అడగవచ్చు. కాదు వీరు మనుషులే . వీరు తమకు మతం లేదని గప్పాలు కోడుతుంటారు, కాని వీరు మత వాదులే. వీరిది "నాస్తిక మతం" . అంటే దేవుడు లేడనే నమ్మక్కం కలిగిన వారు. అసలు ఏ నమ్మక్కం లేక పోతే, వీరు పరిపూర్ణ జ్ణానులు అవ్వాలి. అప్పూడు తిరిగి ప్రక్రుతితో సంబందం ఏర్పడాలి. అప్పుడు వీరికి జంతువులకు పెద్ద తేడా ఉండదు. అవి జ్నానం లేనివి. వీరు పరిపూర్ణ  జ్ణానులు. ఇరువురూ ప్రక్రుతితో ప్రత్యక్ష సంబందం కలిగి ఉంటారు. సుఖ దుఖాలకు అతీతులు.కాని ఈ నాస్తికులు అలాంటి వారు కాదుగా! వారికి నమ్మకాలు ఉన్నాయి. జ్ణానం ఉంది.కాబట్టి  వారు మనలా నమ్మక జీవులే.   

800 హిందూ దేవాలయలను పడగొట్టించిన హిందూ వాది ఎవరో తెలుసా?

http://kalkiavataar.blogspot.in/2012/12/800.html
పూర్తి టపా కోసం లింక్ మీద్ క్లిక్కండి

Sunday, December 23, 2012

800 హిందూ దేవాలయలను పడగొట్టించిన హిందూ వాది ఎవరో తెలుసా?


                                                                       

 మీరు చెపితే నమ్మరు! బి.జె.పి. పార్టీని మత వాది పార్టి అని తెగ ఆడి పోసుకునే వారు సైటం నమ్మలేని నిజం ఇది. రోడ్ల అభిరుద్దికి ఆటంకం ఉన్నవని చెప్పి సుమారు ఎనిమిదివందల దేవాలయలను,  వందల మసీదులను పడగొట్టిoచిన ఘనత గుజరాత్ ముక్య మంత్రి "నరేంద్ర మోడి" గారికే దక్కుతుంది. హిందూ మతం అంటే అది ఒక జీవన విదానం అని, ఆదునిక అభిరుద్దికి అది ఆటంకం కాదు అని నిరూపించిన  హిందూ విశ్వాసి,"నరేంద్ర మోడి". అందుకే గుజరాత్లో ముస్లింలు సైతం ఆయనకు బ్రహ్మ రథం పట్టారు.

  వ్యక్తి తాను అనుసరించే విదానం వల్ల ప్రజలలో నమ్మక్కం కలిగించాలి. అంతే కాని ఆచరణీయం కాని శొల్లు సిదాంతాలు వల్ల ఈ దేశానికి ఒరిగేది ఏమీ లేదు. నేతి బీరకాయలో నేయి యెంత ఉంటుందో ఈ సో కాల్డ్ అబ్యుదయ సిదాంత వాదుల్లో చిత్త శుద్ది అంతే ఉంటుంది. హిందూ మతం అంటే అబిరుద్ది నిరొదకం కాదు. ఇతర మతాలతో దీన్ని పోల్చి అజ్ణాన్ని చాటుకునే వారు, కుహానా లౌకిక వాదులు. హీ0దూ మతాన్ని మించిన లౌకిక తత్వం ఆచరించే మతం ఏది ఈ ప్రపంచంలో లేదు అని నా ద్రుడ విశ్వాసం. మత వాదం అంటే మూర్ఖమయినది అని, అబిరుద్ది నిరోదకమని, హిందూ వాదుల పాలనలో మైనార్టీ మతాల  ప్రజలకు రక్షణ ఉండదని ఇన్నాళ్ళు కుహానా లౌకిక వాదుల పార్టీలు చేసిన వాదనలు కల్లలని తేలాయి. నిజమయిన అభిరుద్ది కాంక్షించే వారు, కులు మత బేదాలు లేకుండానే పాలన సాగిస్తారని, హిందూ మత వాదులు కు ఉన్న లౌకిక ద్రుక్పదం కుహానా వాదులకు కూడా ఉండక పోవచ్చని శ్రీ మోడీ నిరూపించారు. నిరంతరం సొల్లు సిద్దాంతాలు వల్లె వెయ్యడం కాదు తమకు ఆచరణలో చూపించగల దమ్మున్న నాయకుడు కావాలని, వారికే కుల మతాల కతీతంగా తమ మద్స్దతు ఉంటుందని గుజరాత్ ప్రజలు నిరూపించారు. ఇప్పటికయిన పార్టీలు హిందూ మతాన్ని, ఇతర మతాల వలె చూడక అది ఒక విశిష్ట జీవన విదానమని గుర్తిస్తే మంచిది.      

"బ్లాగు రాక్షసులు" అంటే ఎవరో తెలుసా?

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_22.html
పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్కండి.
http://kalkiavataar.blogspot.in/2012/12/21-12-2012.html 

Saturday, December 22, 2012

బ్లాగుల పైన "నీచ రాక్షసుల" దాడిని ఖండించండి

                                                                         

 మనం పురాణ గాదల్లో చదివాం. మహా రుషులు యజ్ణాలు చేస్తుంటే, రాక్షసులు వాటికి ఆటంకం కలిగించేవారని. వాటి రక్షణకు రాజులు తగిన రక్షణ చర్యలు తీసుకునే వారని. రామాయణం లో ప్రత్యేకం గా యాగ రక్షణ కోసమని, విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను సాయమర్థించి తీసుకు వెలతాడు. అక్కడ తాటకి, ఇతర రాక్షసులను  సంహరిస్తాడు. అయితే ఇక్కడ గమనార్హం ఏమిటంటే, సదరు రాక్షసులు మాయా అంటే అద్రుశ్య రూపంలో వచ్చి,యజ్ణాలలో రక్తం, మాంసం, రాళ్ళు వగైరా లాంటి పడ వేస్తూ "యజ్ణభంగం" చేయాలని చూస్తుంటారు. దానిని సమర్దులైన రుషులు లేక రాజులు నిరోదించి, యజ్ణాలు సజావుగా జరిగేలా చూస్తారు.

  ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనం బ్లాగుల్లో టపాలు పెట్టినప్పుడు, కొంతమంది వారి అక్కసు, అసహనం, నీచ పదజాలతో కూడిన కామెంట్లు చూస్తుంటే పూర్వ కాలంలో రాక్షసుల దుచ్చేష్టలే గుర్తు వస్తున్నాయి. ప్రతి బ్లాగు నిర్వహణ  ఒక యజ్ణం లాంటిదే. వివిద రకాల యజ్ణాలు ఉన్నట్లే బ్లాగులు కూడ ఎవరి అభి రుచి ప్రాకారం వారి ఇష్టం వచ్చిన టాపిక్ ల మీద నిర్వహిస్తుంటారు. వీటికి కొంత మంది ప్రశంసిస్తూ కామెంట్లు, చేస్తారు. వీరు వరమిచ్చే దేవతలు లాంటి వారు. సంత్రుప్తి చెంది వరమిచ్చినట్లు, వీరి కామెంట్లు ఉంటాయి. కొంత మంది సద్విమర్శ చేస్తారు. వారి ఉద్దేశ్యం మన చెప్పే విషయం లోని లోటుపాటులను, సంస్కారవంతమయిన బాషతో కామెంట్ల రూపం లో విశదీకరిస్తారు. వీరు మహా రుషుల లాంటి వారు, వీరి విమర్శలు అంతిమంగా మన బ్లాగు అభిరుద్దికే తోడ్పడుతుంది కాబట్టి.

  ఇక పొతే "రాక్షస కామెంటీర్లు" ఉంటారు వీరు నోరు ఎలా కంపు కొట్టుద్దో తెలియదు కాని ఉపయోగించే బాష అంతా నీచాతీ నీచమయిన కంపు కొడుతుంటది. వీరు ఆజ్ణాతంగా ఉంటారు, సేమ్ వెనుకటి రాక్షసుల లాగే. వారు బండలు వేస్తే వీరు కు విమర్శలు చెస్తారు. వారు రక్తం మాంసం యజ్ణమ్లో వేసినట్లే,  వీరు నీచాతి పదజాలం కుమ్మరిస్తారు. వీరి నీచమయిన పనులకు బ్లాగుల్లో రక్షణ విదానాలు ఉన్నయి కాబట్టి సరిపోయింది కాని లేకుంటే, బ్లాగులు బంద్ చెయ్యాల్సిందే.

  ఎవరి అభిప్రాయలు వారికుంటాయి. ఎవరి ఆలోచనలు వారికుంటాయి. నీకు మంచిదనిపించింది నాకు అనిపించకపోవచ్చు. అందరూ ఒకే తరహా ఆలోచనలు ఉంటే, ఇంక భావ వైవిద్యం ఏముంది. భావాలు షేర్ చేసుకునేదేముంది. ఒకరు తమకు నచ్చని విషయం మీదకాని, బేదాభి ప్రాయమ్ ఉన్నదానిమీద విమర్శలు చేయవచ్చు. చేయాలి కూడ. కాని ఉపయోగించే బాష సంస్కార వంతంగా ఉండాలి. తాము అజ్ణాతంగా ఉన్నారు కాబట్టి, తమ  నీచత్వాన్ని పరాయి బ్లాగుల్లో ప్రదర్సిద్దామనుకుంటె ఎలా? దానికన్న రాక్షసత్వం ఉంటూందా?  వెనుక అటువంటి "మాయావిల"ను కూల్చటానికి "శబ్దభేధి" అనే అస్త్రాని ప్రయోగించే వారట. అలాంటివి ఏమన్నా ప్రయోగిస్టే గాని వీరికి బుద్ది రాదనుకుంటా!ఒక వేళా వారి నైజం అదే అయితే వారి  స్వంట బ్లాగుల్లొ ప్రదర్శించవచ్చు కంపుకొట్టే వారి బాషా పాండిత్యం. చీ.. చీ..        

"యుగాంతం డిసెంబర్21,2012 , "కల్కి ఖడ్గం" గా మారింది

  మయన్ కాలెండర్ ప్రకారం నిన్నటితో అంటే డిసెంబర్ 21  కి యుగాంతం అయిపోయింది. నేను చెప్పిన ప్రకారం అవతార పురుషుడు కల్కి ఉరఫ్ వీరబోగ వసంతరాయలు సమాచారం(http://kalkiavataar.blogspot.in/2012/12/21-12-2012.html) ప్రకటించడంతో నిన్నటి వరకు ఉన్న నా బ్లాగు టైటిల్ ఉద్దేశ్యం నెరవేరింది. ఇక ఆ టైటిల్ తో బ్లాగును నడపడం అనవసరం అని బావించి ఈ రోజు నుండి బ్లాగు టైటిల్ ను "కల్కి ఖడ్గం" గా మార్చడమయినది. కావున వీక్షకులు, బ్లాగ్మిత్రులు, అజ్ణాత సద్విమర్శకులు, మరియు కువిమర్శకులు గమనించ గలరని మనవి.

  మనిషిని జ్ణాన వంతున్ని చెయ్యడానికి ఎంతో మంది గురువులు ఉన్నారు. వారి క్రుషి పలితమే నేటి మన శాస్త్ర సాంకేతిక పురోభివ్రుద్ది. దాని వలన మానవుడు ప్రక్రుతిని శాసించే స్తాయికి ఎదిగినట్లు కనిపిస్తున్నాడు. కాని తన జాతి మీద ఉన్న మమకారం, స్వార్దం, ఇతర జీవజాతులను పట్టించుకునే అవకాశం లేకుండా చేస్తుంది. కాబట్టి విజ్ణానినని విర్రవీగి తన సౌఖ్యమె పరమార్థంగా బావించి విచ్చల విడిగా ప్రక్రుతిని నాశనం చేస్తూ  సకల జీవరాసి మనుగడకే పెను ముప్పుగా మారాడు.

   పూర్వ కాలమ్ లో రాక్షసులు చేసిన పనినే ఇప్పట్టి విజ్ణానుల మని విర్ర వీగే వారు కొంత మంది చేస్తున్నారు. వారికి దేవుడు, మతం అంటే అసహ్యం. వారిది కూడ ఒక మతమే. ఈ స్రుష్టికి మానవుడే కేంద్రం. దైవ బావన మూర్కత్వం అనే మతం. "నాస్తిక మతం". సైన్స్ పేరిట జరిగే ఘోరాలు గురించి పెద్ద పట్టింపు ఉండదు వీరికి ఎక్కడో ఎవరో మతం పేరిట వ్యక్తుల్ని మోసం చేస్తున్నారని, వారిలో అజ్ణానాని పెంచుతున్నరని తెగ బాదపడి పోతారు. "నాస్తిక వాదం" పేరుతో దేశీయ మతాల్ని తూలనాడుతు, విదేశీ మత బావజాలాభివ్రుద్దికి పరోక్షంగా సహాయపడుతుంటారు.

 ఏ మతమయినా సకల జీవ సంక్షేమం గూర్చి చెపుతుంది. కాని శాస్త్రియా నాస్తిక మతం కేవలం మనిషి అభివ్రుద్ది,ప్రక్రుతి మీద ఆదిపత్య దోరణి గూర్చి మాత్రమే ఆలోచిస్తుంది. ఇటువంటి దోరణులను నియత్రించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. నా బ్లాగు అందుకోసం క్రుషి చేస్తుంది.    

Friday, December 21, 2012

"యుగాంతం డిసెంబర్21,2012 ఇక నుండి "కల్కి ఖడ్గం" గా మారింది



  మయన్ కాలెండర్ ప్రకారం నిన్నటితో అంటే డిసెంబర్ 21  కి యుగాంతం అయిపోయింది. నేను చెప్పిన ప్రకారం అవతార పురుషుడు కల్కి ఉరఫ్ వీరబోగ వసంతరాయలు సమాచారం(http://kalkiavataar.blogspot.in/2012/12/21-12-2012.html) ప్రకటించడంతో నిన్నటి వరకు ఉన్న నా బ్లాగు టైటిల్ ఉద్దేశ్యం నెరవేరింది. ఇక ఆ టైటిల్ తో బ్లాగును నడపడం అనవసరం అని బావించి ఈ రోజు నుండి బ్లాగు టైటిల్ ను "కల్కి ఖడ్గం" గా మార్చడమయినది. కావున వీక్షకులు, బ్లాగ్మిత్రులు, అజ్ణాత సద్విమర్శకులు, మరియు కువిమర్శకులు గమనించ గలరని మనవి.

  మనిషిని జ్ణాన వంతున్ని చెయ్యడానికి ఎంతో మంది గురువులు ఉన్నారు. వారి క్రుషి పలితమే నేటి మన శాస్త్ర సాంకేతిక పురోభివ్రుద్ది. దాని వలన మానవుడు ప్రక్రుతిని శాసించే స్తాయికి ఎదిగినట్లు కనిపిస్తున్నాడు. కాని తన జాతి మీద ఉన్న మమకారం, స్వార్దం, ఇతర జీవజాతులను పట్టించుకునే అవకాశం లేకుండా చేస్తుంది. కాబట్టి విజ్ణానినని విర్రవీగి తన సౌఖ్యమె పరమార్థంగా బావించి విచ్చల విడిగా ప్రక్రుతిని నాశనం చేస్తూ  సకల జీవరాసి మనుగడకే పెను ముప్పుగా మారాడు.

   పూర్వ కాలమ్ లో రాక్షసులు చేసిన పనినే ఇప్పట్టి విజ్ణానుల మని విర్ర వీగే వారు కొంత మంది చేస్తున్నారు. వారికి దేవుడు, మతం అంటే అసహ్యం. వారిది కూడ ఒక మతమే. ఈ స్రుష్టికి మానవుడే కేంద్రం. దైవ బావన మూర్కత్వం అనే మతం. "నాస్తిక మతం". సైన్స్ పేరిట జరిగే ఘోరాలు గురించి పెద్ద పట్టింపు ఉండదు వీరికి ఎక్కడో ఎవరో మతం పేరిట వ్యక్తుల్ని మోసం చేస్తున్నారని, వారిలో అజ్ణానాని పెంచుతున్నరని తెగ బాదపడి పోతారు. "నాస్తిక వాదం" పేరుతో దేశీయ మతాల్ని తూలనాడుతు, విదేశీ మత బావజాలాభివ్రుద్దికి పరోక్షంగా సహాయపడుతుంటారు.

 ఏ మతమయినా సకల జీవ సంక్షేమం గూర్చి చెపుతుంది. కాని శాస్త్రియా నాస్తిక మతం కేవలం మనిషి అభివ్రుద్ది,ప్రక్రుతి మీద ఆదిపత్య దోరణి గూర్చి మాత్రమే ఆలోచిస్తుంది. ఇటువంటి దోరణులను నియత్రించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. నా బ్లాగు అందుకోసం క్రుషి చేస్తుంది.    

ఇడుగిడిగో ఇతడే శ్రీ వీర భొగ వసంతరాయలు!

http://kalkiavataar.blogspot.in/2012/12/21-12-2012.html
పూర్తి టపా కోసం లింక్ పై క్లిక్ చెయ్యండి!

Thursday, December 20, 2012

"శ్రీ వీర బోగ వసంత రాయలు అవతార ప్రకటన", తేది 21-12-2012

అయ్యలారా! అమ్మలారా! ఈ రోజు వరకు నా బ్లాగును ఎంతొ అభిమానంగా ఆదరిస్తున్న వీక్షకులయిన మీ అందరికి వందనాలతో:-- నేను నాకున్న సహజ పాండిత్యంతో, పురాణ గ్రంథాలలో రాబోయే అవతార పురుషుడి గురించి చెప్పిన విషయాలను, వికిపీడియా ద్వారా గ్రహించి, వివిద గ్రంథాలలో ఉన్న దానితో సరి పోల్చి, వాటి వివరాలను మీకు ఎప్పటి కప్పుడు అందిస్తూ వచ్చాను. ఈ రోజు డిసెంఅర్ ఇరవయి ఒకటి తేది కావున నేను మీకు ఇచ్చిన గడువు ముగుస్తున్నందున ఈ రోజు సదరు అవతార పురుషుడి గురించి సమాచారం ప్రకటిస్తున్నాను.

         

యుగాంతం అనగా నేమి?:  యుగాంతం అనగా యుగం యొక్క అంతం. యుగం అంటె  "మార్పును సూచించేఒకానొక నిర్థిష్ట సమయం".ఈ సమయాన్ని కాలెండర్లు, పంచాంగాలు ద్వార తెలిసికోవచ్చును. ప్రతి సంవత్సరమునకు 12 నెలలు, నెలకు ౩౦ రోజులు, రోజుకు 24 గంటలు ఇలా కాలాన్ని విభజించి కాల గణితం ఉంటుంది. ఇదంతా సూర్యుడు, గ్రహలు చలన్నాన్ని అనుసరించి ఉంటుంది. అదే విదంగా ఆకాశంలో రాశి చక్రం పన్నేండు రాసులతో కూడి ఉంటుంది. ఇవి మేష రాశి మొదలు మీన రాసి వరకు ఉన్నాయి. ఈ రాశి చక్రం 360 డిగ్రీలు. కాబట్టి ప్రతి రాశి ౩౦ డిగ్రీలు కల్గి ఉంటుంది.

  సూర్యుడు చుట్టూ భూభ్రమణం ఉన్నట్లే, ఈ రాశి మండలం చుట్టూ  భూభ్రమణం ఉంటుంది. కాబట్టి భూమి ఒక రాశి లోని ఒక డిగ్రీ దాటాలంటే, 72 సంవత్సరాలు పడుతుంది. ఆ విదంగా ఒక రాశి ని పూర్తిగా దాటుటకు పట్టే కాలం  30X72= 2160 సంవత్సరాలు. అలా పూర్తిగా రాశి మండల భ్రమణం కు పట్టే కాలం= 12x 2160 = 25920 సoవత్సరాలు మొత్తం సంది కాలం తో కలిపి  26000 సంవత్సరాలు.

  హిందూ సిద్దాంతం ప్రకారం, కాల గణనం "మన్వంతరాల" ప్రకారం చెప్పబడితె, మయన్లు "భక్తూన్" లు రూపం లో చెప్పారు. ఒక సిద్దాంతం  ప్రకారం భూమి రాశి మండలంలోని, ఒక రాశి యొక్క  ఒక డీగ్రీ  దాటుటకు పట్టే కాలం అంటె 2160  సంవత్సారలకు ఒక "యుగం" గా పిలుస్తారు. అలా ఇప్పటి వరకు 10 రాశులు దాటి,  ఈ రోజు నుండి"కుంభ రాశి యుగం" లోకి ప్రవేశం అవుతున్నాం (అధార లింక్.http://vibgyor23.blogspot.in/2012/03/mayan-calendar-ends-december-21-2012.html)
 

కాలము -- కాల పురుషులు

  ఇంకొక సిద్దాంతం ప్రకారం ప్రతి యుగానికి ఒక యుగ లేక శక పురుషుడు పుడతాడట. పోయిన కాలంలో యుగ పురుషుడు మనకు "శాలివాహనుడు" అయితే, ప్రాశ్చ్యాతులకు "యెసు కీస్తు" . అందుకే ఆ విదంగా కాలెండర్లు అనుసరిస్తున్నాం. అయితే ఈ కుంభరాశి యుగానికి మనకు కల్కి లేక వీర బోగ వసంత రాయలు రావాలి. ఇది ఒక సిద్దాంతం కూడిన నమ్మకం .అయితే హిందూ పురాణ గ్రంథల్ల ప్రకారం  మనకు మన్వంతరాలు గురించి చెప్పబడింది. కాని వాటికి కోంత మంది అనవసర లేఖ్ఖలు జోడించి,  లెఖ్ఖలు కలగా పులగం చేశారు. దీని వలన వేల సంవత్సరాలుగా ఉండాల్సిన "యుగం" లక్షలు సంవత్సరాలుగా మార్చ బడ్డాయి.  ఆకుకు అందక, పోకకు పొందకుండా ఉన్న వీటిని అనుసరించితే, అసలు ఏ యుగం గూర్చి మనం మాట్లాడే అవసరం ఉండదు. కాని ఆ యా మన్వంతరాలలో రాబోయే కాల పురుషులు పేర్లు, అవి మారవు కాబట్టి, వాటిని  పరిశిలించడం జరిగింది.

    కాల గణితం విషయం లో మయన్లు రాసిన కాలెండర్ కొంత ప్రామాణికం అనిపించింది. అందుకే కాలం విషయంలో మయన్ కాలెండర్, కాల పురుషుల విషయంలో "మన్వంతర" సిద్దాంతం పర్శిలిస్తే బెస్ట్ అనిపించి రెండింటిని కలిపి చూడటం జరిగింది. మన సిద్దాంతం ప్రకారం కాల పురుషుడిపేరు,దాని అర్థాలు, అయన తల్లితండ్రుల పేర్లు గురించి ఆదార లింక్ లు సహితంగా  ఇవ్వడం జరిగింది. 


ఈ నాటి వరకు చాల మంది పరిశోదకులు, రచయితలు అదిగో అవతార పురుషుడు, ఇదిగో అవతార పురుషుడు అంటూ ఒక తేదిని ప్రకటించటం, ఆ రోజు ఏమి కాకపోయే సరికి తిరిగి వేరొక తేదికి ఆయన వస్తాడని చెపుతూ పోస్ట్ పోన్ చెయ్యడం జరుగుతుంది. అలా శ్రీ వీరభోగ వసంత రాయలు గురించి చెప్పిన వారిలో ముఖ్యులు శ్రీ వేద వ్యాస్   గారు. ఆయన 1999 లోనే "కలి యుగాంతం" అని ప్రకటించడమే కాకుండ ఆ రోజు శ్రీ వీరభోగ వసంత రాయలు ప్రకటితమవుతారని చెప్పడం జరిగింది. కాని అది జరగలేదు అని అందరూ అనుకున్నారు. పైకి ఏమి జరగనట్లే ఉన్నా వీర బోగ వసంత రాయలు గారికి సంబందించి ఒక ముఖ్యమయిన సంఘటన జరిగింది. అది ఏమిటో మీరు తర్వాత తెలిసికోవచ్చు.

  ఆ తర్వాత "బాల శాంబవి" "సూర్య నంది" అనే ప్రాంతానికి వచ్చి,పోయిన సంక్రాంతి నాడు వీర బోగ వసంత రాయలు వస్తారని చెప్పింది. అది ఒక అంతర్జాతీయ పఠకం లో బాగం. కాని అని వార్య కారణాల వల్ల అది జరుగలేదు. కావాలంటే వివరాలకు ఈ లింక్ ని క్లిక్ చెయ్యండి(http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_2162.html)


 కాల పురుషుడు అయిన కల్కి, పేరుతో ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తులు తాము కల్కి అవతార పురుషులమని ప్రకటించు కోవడం జరిగింది. వారు (1) చితూర్ జిల్లాలోని వరదాయ పాలెం లో నున్న "కల్కి భగవాన్" అనబడే "విజయ్ కుమార్" (2). తమిళ నాడులోని "కల్కి మహా పురుషుడు" అనబదే "లహరి క్రిష్ణ". అలాగే వీర బోగ వసంత రాయలు పేరుతో కూడ ఒకరున్నారు.
 అయితే నేను పరిశోదించిన అంశాలకు వీరి జన్మ విశేషాలకు ఏ మాత్రం పోలిక లేక పోవడం గమనార్హం.
                మొన్ననే ఒకానొక సమస్య ఉత్పన్నమై, అనుకోకుండా ఒక వ్యక్తి జీవిత విశేషాలను పరిశిలించాను అయనవి కొద్ది తేడాతో, ఇంచు మించుగా పురాణ గ్రందాలలో చెప్ప బడిన ఆంశాలకు సరి పోతున్నవి. అదే విషయాన్ని ఆయనకు తెలిపి ఆయన గురించి తెలియ పరచటానికి అనుమతి కోరగా నిరాకరించారు. ఆయన ప్రకటిస్తే తప్పా, నేను ఆయన వివరాలను చెప్పలేను.

  కాబట్టి మిత్రులారా నా పరిశోదన ద్వారా కాల పురుషుడిని కనుగొన గలిగాను. కాబట్టి, నేను ఈ బ్లాగును కంటిన్యూ చేయ వచ్చు. మీలో నమ్మక్కం లేని వారు దీనిని ఎలాగు నమ్మరు కాబట్టి, వారికి నేను పెద్దగా చెప్పల్సింది ఏమి లేదు.  ఇన్నాళ్లు ఆశగా చూసిన వారికి ఒక పద్దతి చెపుతాను. దాని ననుసరించి ఆ "కాల పురుషుడు" గురించి తెలుసు కోవచ్చు. ఉదాహరణకు మీరు "శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గారి గురించి తెలిసికోవాలంటే ఏమి చేస్తారు. ఈ రోజుల్లో సులువైన మార్గం "గూగుల్" ద్వారా సెర్చ్ చెయ్యటం . అలాగే ఆసక్తి ఉన్న వారు "గూగుల్ సెర్చ్" ద్వారా " who is the veera bhoga vasanta rayalu" అని అడగండి మీకు కొంత మంది వ్యక్తుల వివరాలు గురించి సమాచారం కన పడుతుంది అట్టి సమాచారాన్ని, క్రింద ఇవ్వ బడిన నా పరిశోదనా సమాచారం ద్వారా పోల్చి చూస్తే,  వారిలో    ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవచ్చు. లేకుంటే కాలానికే వదిలెయ్యండి.

                                               

(1).అవతార పురుషుడి తల్లి పేరు

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_2.html 
ఆధార లింక్
http://en.wikipedia.org/wiki/Manvantara

(2). అవతార పురుషుడి తండ్రి పేరు

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_4.html

 ఆధార లింక్

http://en.wikipedia.org/wiki/Savarni_Manu

(3).’కల్కి" అనే పదానికున్న "నానార్థాలు"

ఆధార లింక్

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_8576.html

  (4)అవతార పురుషుడు ఆకాశం లో నుంచి వస్తాడు:-- 

  అవును నిజమే కదా! ఈ రోజు మీరు ఆయన్ని "అంతర్జాల విదానం"   ద్వారా  కనుగొన బోతున్నారు. కాబట్టి. ఆయన ఆకాశం లోనుండి వచ్చినట్లే!

(5). ఆయన దేవదత్త మయిన .తెల్లని అశ్వం మీద కనిపిస్తాడు:- ఇది నిజమే! ఆయన కాంతి వేగంతో ప్రయానించే సమాచార వ్యవస్త ద్వారే మీకు కనిపించ బోతున్నాడు. కాంతి అంటే సప్త వర్ణముల మిశ్రమని, తెల్లని రంగు అని మనకు తెలుసు. దీనినే  "ఏడు గుర్రాల రథం" గా మన వాళ్లు పోల్చారు. ఆ వేగంతోనే ఆయన గురించిన సమాచారం మనకు తెలుస్తుంది. కాబట్టి ఆయన గుర్రం మీద వస్తాడని చెప్పింది నిజమయింది.

(6). ఆయన చేతిలో కత్తి ఉంటుంది:- అవును . ఆ రోజుల్లో యుద్దాలు బాహా బాహి గా ఉండేవి .కాబట్టి ఆయుదం కత్తి తో పోల్చారు. కాని ఈయన యుద్దం భావ సంఘర్షన కాభట్టి ఈయన యుద్దం "కలం" కాని, ఆదునిక  ప్రత్యామ్నాయం కాని ఉంటుంది.

(7). ఆయన నాస్తికులతో యుద్దం చేస్తాడు:-- ఇది నిజమే, అలాగే  జరుగుతుంది కూడ! 


(8)యుద్దం లో "దేవతాంశలతో" జన్మించిన వారు అయనకు స్నేహితులుగా, బందువులుగా సహాయం చేస్తారు.
          అవును  కొంత మంది స్నేహితులు,నాస్తికులతొ జరుపుతున్న యుద్దం లో అయనకీ సహాయం చేస్తున్నారు. వారంతా దైవాంశ సంబూతులు కావచ్చు.

(9).నాస్తికులు ఆయనతో "మాయా యుద్దం"(కనపడకుండా), చేస్తారు.

  అవును అచ్చం అలాగే జరుగుతుంది.

(10) ఆయన "వెనుకటి దర్మాన్ని", పునరుద్దరిస్తాడు.

 నిజమే, చూడబోతే ఆయన పద్దతులన్నీ అలాగే ఉన్నాయి.


    ఈ విదంగా  భవిష్య గ్రంథాల్లో చెప్పింది అంతా ఈ కాల పురుషుడి విషయం లో నిజమయినవి. కాబట్టి ఆయనే శ్రీ వీర బోగ వసంతరాయలు లేక కల్కి అనటానికి నాకు ఎటువంటి సందేహం లేదు.
కావున అట్టి సమాచారం ప్రకటిస్తున్నాను

ఈ సారి మరింత వినోద, విజ్ణాన, భరిత సమాచారంతో మీముందుకు వస్తా! ఇంతటితో "యుగాంతం" అనే ఈ పరిశోదనాత్మక సీరియల్ ఇంతటితో సమాప్తం.                 

శ్రీ వీరబోగ వసంత రాయలు వివరాలు దొరికాయోచ్!

అవును మన హీరో శ్రీ వీర బోగ వసంత రాయలు గారి వివరాలు దొరికాయి. రేపు వాటిని ప్రచురించటం జరుగుతుంది. కొన్ని టెక్నికల్ సమస్యలు వలన ఈ రోజున ప్రకటించ లేక పోతున్నాను. రేపు తప్పకుండా అట్టి వివరాలు మీ ముందుంచుతాను. అప్పట్టి వరకు ఈ లింకును క్లిక్కండి http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_9131.html

Wednesday, December 19, 2012

అబ్బా! డీల్లీ కీ "కల్కి" ఖాయమా?

                                                                          
 ఈ రోజు గుజరాత్ ఎన్నికలు పలితాలు చూశే సరికి, దేశ ప్రజల్లో ఒక కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తున్నట్లు ఉంది. బి.జె.పి పార్టీ "నరేందర్ మోడి" నేత్రుత్వం లో కేంద్రంలో  అదికార పగ్గాలు చే పట్టోచ్చు అనే ఆశ ప్రజల్లో రెప రెప లాడుతున్నట్లుంది.ఒక వేళ అదే నిజమయితే నేను చెప్పిన జోస్యం అదే నండి "కల్కి" రేపు వస్తున్నాడు అనేది చాల వరకు కరెక్ట్ అయినట్లే.ఎలాగంటారా అయితే చూడండి మరి!

  నేను ఏమి చెప్పాను నా వెనుతటి టపాలో ? కల్కి అనే పదానికి ఉన్న అర్ఠాల్లో "తామర పువ్వు" ఒకటని చెప్పానా! కావాలంటే ఈ లింక్ http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_8576.html ని క్లిక్ చెయ్యండి.      యస్. చెప్పాను కదా! ఇప్పూదూ గుజరాత్లో బి.జె.పి గెలిచింది అంటె పార్టీ గుర్తు "కమలం" గెలిచింది. కమలం అంటే తామర పువ్వే కదా. అంటే "కల్కి" గెలిచినట్లే కదా!రేపు ఇదే స్పూర్తితో ’డీల్లీ" లో "కల్కి జెండా" ఎగరితే నేను చెప్పిన జోస్యం నిజమయినట్లే కదా. ఈ విదంగా నేను చెప్పినది పాక్షికంగా నైన నిజమయింది అని ఒప్పుకోవాలి మీరు.

  కాక పోతే "వీర బోగ వసంత రాయలు" అనేది  అవతార పురుషుడయిన తెలుగు వీరుడి పేరు. ఈయన ఖచ్చితంగా తెలుగువాడయి ఉండాలి కాబట్టి రేపటి వరకు నాకు చాన్స్ ఉంది కాబట్టి, ఆయన గురించి కూడ నేను చెప్పిన జోస్యం నిజం కావాలని మీరంతా మనస్పూర్తిగ కోరుకోవాలి. రేపు ఈ పాటికి ఆయన గురించి చెప్పేస్తా!(అని నా నమ్మక్కం) 

ఏదైనా మనోళ్లు అమెరికా వాళ్లంత _____ కాదులెండి!

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_19.html
పూర్తి టపాకోసం లింక్ మీద క్లిక్కండి

"యుగాంతం" అంటే "జగాంతo" అని ఎవరంటున్నారు?


 ."యుగాంతం" అంటే  "జగాంతం" కాదు, అని నేను ఎప్పుడో బల్ల గుద్ది(మీకు వినిపించదు లెండి) చెప్పాను.కేవలం మయన్ల కాలెండర్ అంతం అని కూడా చెప్పాను.  అదే వీషయాన్ని  "నాసా" వారు ఉద్ఘాటించినట్లు ఈ రోజు పేపర్లో వచ్చింది. అయినా నేను మాత్రమే కాదులేండి మన దేశంలో లక్షకి ఒకరు కూడ ఈ ప్రపంచం మునిగిపోద్ది ఎవరూ భయపడటం లేదు. అదే అమెరికా లో అయితే నూటికి పదిమంది ఏదో అయిపోద్దని భయపడి పోతున్నారట. ప్రభుత్వం చెప్పినా వారు నమ్మరట. అంత "పిచ్చి పువ్వులం" కాదుగదా మనం. ఎందుకంటె వారు సైన్స్ పరంగా అభివ్రుద్ది చెందిన దేశం లో నివసిస్తున్నారు. మరి మనం ఏదో "దేవుడు" కర్మ" అనె వేద భూమి లో జీవిస్తున్నాం.  ఏది ఎలా జరిగినా అంతా ఆ దేవుడిదే భారం అనుకుంటాం కాబట్టి, ఇలాటి వాటిని నమ్మను గాక నమ్మం.

 నేను ఒక విషయం మాత్రం రూడిగా చెప్పగలను భవిష్యత్తులో ఎప్పుడైనా ఒక చిన్న తోక చుక్క (ఇటు వంటి వాటిని నాసా పరికరలు కనిపెట్ట లేవట)  మొత్తం అఖ్కర్లేదు, దాని తోక తగిలి భూమి కి ఏ మాత్రం ప్రమాదం జరిగినా అందరూ బాగానే ఉంటారు ఒక్క అమెరికా తప్పా! కోట్ల మంది పిచ్చిఎత్తి, ఉన్మాదులయి ఒకరినొకరు కాల్చుకు చస్తారు. మొన్న జరిగిన "ఉన్మాది" కాల్పులు ఆ కోవకి చెందినవేనంట. ఈ ఉదాహరణ చాలు వారి భద్రత ఎంత "అభద్రతా భావం "తో ఉందో!

 అయినా మన కెందుకు లెండి వారి గొడవ. మన వీరబోగ వసంత రాయలు గారు మాత్రం ఇంకొక 48 గంటల్లో మన కు కనపడతాదు. ఏమండోయి ఏదో "జగాంతం" రాదని అన్నానని    వీరబోగ వసంత రాయలు కూడ రాడనుకునేరు. మన నమ్మక్కం మనది. ఒకరి కోసం మన నమ్మక్కాన్ని వదులు కుంటామా ఏమిటి? అందరు ఎల్లుండి అన్ని పనులు తొందరగా ముగించుకుని "ఆకాశం"  వంక చూస్తూ కూర్చోండి. నాకు కబురందగానే మీకు వెంటనే "స్పెషల్ టపా" ద్వారా చెప్పేస్తాను. లేదా మీకు కనపడితే మీరయినా చెప్పండి.  

Tuesday, December 18, 2012

రా! దిగి రా! దిగంబరంగా దిగి రా!

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_18.html
పూర్తి టపా కోసం లంకే మీద క్లిక్కండి

భక్తికి, బట్టలతో పని ఏముంది?

                                                           
  మనం భగవంతుడు అంటే పలాని విదంగా ఉంటాడు అని  మన మనసులో ఫిక్స్ అయిపొతాం. కాబట్టి దానికి బిన్నంగా నేటి తరం వారు దరిస్తున్న వస్త్రదారణ లో వస్తే మనం గుర్తు పడతామా? ఒక వేళ మాయలు మంత్రాలు చేస్తే గారడి మాజిక్ అంటాం. ఒక వేళ సినిమాలో చూపినట్లు  ఆ డ్రెస్ లో వస్తే పగటి వేషగాడు అంటాం.మరి ఏ వేషం లో వస్తే మనం ఓ.కె అంటాం. ఇది అవతార పురుషుడ్ని వేదిస్తున్న సమస్య అనుకుంటా.

  మొన్న మా ఊరు ఒక స్వామి గారు వచ్చారు. వారి ఆచారం ప్రకారం పూర్తి దిగంబరంగా వచ్చారు. వారికి స్త్రీ, పురుష, వయో బేద తారతమ్యం లేకుండా అందరూ సాగిలపడి మొక్కారు. వాహ్. క్యా బాత్ హై. అయినా నా పిచ్చి ఆలోచన కాని, భక్తికి బట్టల తో పని ఏ ముంది? కాకపోతే ఆయన  రావడానికి ముందు బాగా ప్రచారం చేసారు ఆయన భక్తులు. కాబట్టి ఇతర భక్తులుకి గుర్తు పట్టడం లో ఇబ్బంది లేకుండా పోయింది. అందరూ తనివి తీరా దర్శించా రు ఆ దివ్య మంగళ దిగంబర స్వామిని.
             అందుకే వీర భొగ వసంత రాయలు గారయినా సరె ప్రజలు కోరుకున్నట్లు రావాల్సిన అవసరం ఏమి లేదు.కాని వచ్చే ముందు ఒక ఫ్రెం వర్ఖ్, టీం వర్క్ ఉంటే చాలు. మరి ఆయన ఆ జగర్తలు తీసుకున్నాడా లేదా?ఆయన బ్రహ్మం గారిలా వస్తారా? యోగి వేమన ల వస్తారా? వస్తే గాని తెలియదు.

Monday, December 17, 2012

"తెలంగాణ" ఇచ్చేది, తెచ్చేది మేమే అంటే నమ్మేవారు, 4, రోజుల్లో "వీరబోగ వసంత రాయలు" వస్తాడంటే నమ్మరా?



 ఏమిటో నండి కొంతమందిని చూస్తుంటే, ఆశ్చర్యం  వేస్తుంది. పది యేండ్ల బట్టి, రెండు ప్రాంతాల ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న తెలంగాణ ను ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అని అధికార పార్టీ వారు చెపుతుంటే, "ఎన్ని సార్లు చెపుతారు ఈ మాట" అని అంటునారా? పాపం జనాలు అహ! అలాగా ! అని అమాయకంగా ప్రతిసారి తల ఊపట లేదా? నిజంగా ఇచ్చేది వారే. వారు ఇస్తే ఎవరు కాదన్నా ఏమి కాదు. కాని ఎందుకో ఇవ్వరు .ఆ ముక్క "తెలంగాణ" వాల్లు అడగరు.దానికి ఆంద్ర వాళ్లే కారణం అంటే, ఎలాగా? ఎవరి స్వార్దం వారికుంటుంది కదా. 

 మరి నేను అలా చెస్తున్నానా! కేవలం నాలుగు అంటే నాలుగే రోజులు ఆగండి. వచ్చేస్తాడు. మన  "వీరబోగ వసంత రాయలు" .కావాలంటే ఈ లింక్http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_16.html ని క్లిక్ చెయ్యండి

Sunday, December 16, 2012

ఇంకా అయిదు రోజుల్లో ఆకాశం నుండి రానున్న "వీర బోగ వసంత రాయలు"

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_16.html
పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

ఇంకా అయిదు రోజుల్లో ఆకాశం నుండి రానున్న "వీర బోగ వసంత రాయలు"



 అవును ఎవరు నమ్మినా, నమ్మక పోయిన  ఇది నిజం. ఖచ్చితంగా అయిదు రోజుల్లో ,అంటే డిసెంబెర్ ఇరవై ఒకటి,న శ్రీ,శ్రీ,శ్రి వీర బోగ వసంత రాయలు గారు వస్తున్నాడట!. అది మామూలుగా కాదు, "ఆకాశం" లో నుండి అట.నమ్మక్కమయిన సమాచారమ్. నమ్మితే ఆహ్వానించడానికి రెడీగా ఉండండి. లేకుంటే హాయిగా ఆ రోజు నవ్వేస్తూ ఎన్జాయి చెయ్యండి. అందాక ఈ నాలుగు రోజులు ఊరికే టైమ్ వేస్ట్ చెయ్యకుండా ఇంకొంత సమాచారం మీ చెవిన వేస్తాను సరేనా!
 కోంత మంది వీక్షకులు "జగన్" గారి అభి మానులనుకుంటా, నేను వేరే వర్గాలకి చెందిన వారిని " "వీర బోగ వసంత రాయలా" అని అన్నందుకే నా మీద ఆగ్రహం ప్రకటిస్తూ, అ మర్యాదగా కామెంట్ చేస్తున్నారు. వారంతా జగన్ గారి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. అటువంటి కామెంట్లు తొలిగించడమయినది. వారికి నా మనవి ఒకటే, నేను నమ్మినది అందరూ నమ్మాలని రూలేమి లేదు. ఈ ప్రపంచానికి ఏదో అవుతుందని విదేశాలలో కొన్ని కోట్ల మంది ప్రజలు నమ్ముతున్నారు. కొన్ని ప్రబుత్వాలు కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిషేదించాయి. వారితో పోల్చుకుంటె మన వాళ్లు చాలా బెటర్! ఏదో ఒక అవతారపురుషుడు వస్తాడు అనుకుంటున్నారు తప్పా ఈ లోకం మునిగిపోద్ది అని ఎవరూ అనుకోక పోవచ్చు. ఒక వేళా అవతారపురుషుడు కూడ హంబగ్ అని అనుకోవచ్చు. ఎన్నో చాన్నల్లు, మిడియా, ఊదరగొడుతున్నాయి యుగాంతం గురించి.ఎవరికి లేని బాద ఆ సామాజిక వర్గం వారికెందుకో నా కర్థం కావటం లేదు.

 ఏదేమయితేనేం ఇంకొక నాలుగు రోజులు ఓపిక పట్టుడి.నా గోల మీకు, మీ ఆగ్రహం నాకు తప్పుతుంది. అంత వరకు నే చెపుతూనే ఉంటా వచ్చేవాడు వస్తాడని. నమ్ము,నమ్మకపో !   

Saturday, December 15, 2012

"వీర బోగ వసంత రాయలు" కు "శాలివాహన చక్రవర్తికి" ఉన్న లింకేమిటి?

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_15.html
పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్కండి

వీరబోగవసంత రాయలుకి" వైజాగ్ ఎలియన్స్" కి ఏమన్నా లింకుందా?


                                                               

 నిన్నN.T.V  లో ప్రసారమయిన "వైజాగ్ఎలియన్స్" ప్రసారాన్ని చూశాకా నాకొక డౌట్ వస్తుంది అసలు మన వీరబోగవసంత రాయలుకి "ఎలియన్స్" కి ఏమన్నా లింకుందా? అని. అసలు ఇంతవరకు అటు రష్యా, అమెరికా లోనే తిరుగాడుతున్న ఎలియన్స్ (నాసావారు కూడ ప్రకటించారట) హటాతుగా ’ఆంద్రప్రదేశ్’ కి ఎందుకు వచ్చినట్టు?

  నిన్న టి.వి లో చూపిన ఎలియన్స్ చిన్న బొమ్మల్లు లాగా ఉన్నాయి. ఈ బొమ్మలు వల్ల మనల్ని ప్రబావితం చెయ్యాడానికి అవతార పురుషుడికి ఏమయిన అవకాశం ఉందా? నేను ఇలా ఆలోచించడం హాస్యాస్పదం గా అనిపించినప్పటికి మన "శక పురుషుడు" మరియు "ప్రథమాంద్ర పాలకుడు" అని చెప్ప బడిన "శాలివాహన చక్రవర్తి" జన్మ వ్రుత్తాంతం లో కూడ ఈ విదంగానే "బొమ్మల్ తో యుద్దం" అనేది ఉంది, కాబట్టి ఇలాగా ఆలోచించవల్శి వస్తుంది.

  మన హైదరాబాద్ టాంక్ బాండ్ మీద ఉన్న ’తెలుగువారి విగ్రహలలో" "శాలివాహన చక్రవర్తి"  ది మొట్ట మొదటిది. ఈయనే మన తెలుగు వారి తొలి చక్రవర్తి అట! ఇయన ’శక పురుషుడు" కూడా. అంటె మన తెలుగు పంచాంగ కాలెండర్ ఈయన జన్మ తేది ననుసరించే గుణించబడుతుంది. దీనినే బారత ప్రభుత్వం అధికారిక కాలెండర్ గా ప్రకటించింది. కాబట్టి ఈయనకు "యుగాంతానికి" కూడా ఏదో సంబందం ఉండి ఉందాలి.

  ఇయన జివిత చరిత్రలో,కూడ అప్పట్టి ఉత్తరాది చరవర్తి అయిన ’విక్రమాదిత్యుడితో’ యుద్దం చెయ్యల్శి వచ్చినాప్పుడు, "సాలివాహనుడు" కు సైన్యం లేకపోతే తమ ఇలవేల్పు అయిన ’నాగేంద్ర స్వామి" మహిమతో అప్పట్టి కప్పుడు ’మట్టిబొమ్మలు " తయారు చేసి(శాలివాహనుడిది "కుమ్మరి" కులమట), వాటికి ప్రాణం పోసి, ఆ బొమ్మల సైన్యం సహాయం  తోనే యుద్దం చేసి, విక్రమాదిత్యుడిని ఓడించి "రాజ్యాధికారం" చేపట్టి మన జాతిని జనరంజకంగా పాలించాడట. ఆయన వంశమే  తర్వాత"శాత వాహన వంశం" గా పేరుగాంచి శుమారు నాలుగు వందల యేండ్లు తెలుగునాట రాజ్య పాలన చేసారట.నేను ఈ కథ చదివినప్పుడు ’బొమ్మలు ప్రానం పోసుకుని" సైనికులు కావడమoతే, ఒక వేలా శాలివాహనుడు ’మట్టి మనుషులు" లాంటి సామాన్య ప్రజలలో చైతన్యం కలిగించి, వారి సహాయంతో అప్పటి పాలకులను పదవీచ్యుతలను చేసి సింహాసనం ఎక్కాడేమో అనుకున్నాను. కాని ఈ ఎలియన్స్ పుకార్లు వింటుంటే ఆ టైమ్ లో కూడ ఈ ఎలియన్స్ బొమ్మల్లు ఏమన్నా "శాలివాహనుడి"కి సహాయం చేశాయా అని అనుమానం కలుగుతుంది.

  కాబట్టి మనం బొమ్మల్ని అంత తేలిగ్గా తీసుకోరాదు. ఆ శాలివాహనుడే తిరిగి మన ’వీర భోగ వసంత రాయలు" గా అవతరిస్తే ఆయన "బొమ్మల ఏలియన్స్" తిరిగి ఏ.పి. లోకొచ్చాయా!అలా వస్టే మనం ఎంచక్కా "బొమ్మల యుద్దం" చూడొచ్చు. ఆ  అగండాగండి. ఇప్పుడు నాకు ఇంకొక విషయం గుర్తు కొచ్చింది. ఇంతకు నేను చెప్పినట్లు "కల్కి" అంటే "మట్టి నుండి పుట్టిన" అనే అర్థం కూడ ఉందట!కావాలంటే ఈ http://en.wikipedia.org/wiki/Kalki_Purana లింక్ ని క్లిక్ చేసి చూడండి. కాబట్టి మట్టి నుండి పుట్టిన వాడు అంటే "కుమ్మరి కులం" అనే అర్థం వస్తుంది కాబట్టి,వీరభోగవసంత రాయలు, అన్నా ’శాలివాహనుడు అన్న, కల్కి అన్నా  ఒకటేనా! మరింకొక ఆశ్చర్యమయిన పోలిక ఏమిటంతే మనకు కనిపించే   శాలివాహనుడు బొమ్మ, కల్కి బొమ్మ, ఒకేలాగ అంటే గుర్రం మీద కత్తి ఎత్తి యుద్దం చేస్తున్న వీర పురుషుడి బొమ్మే. ఇద్దరూ యుగ పురుషులే.

  నేను ఊహించేది నిజమో కాదో తెలియాలంటె, ఇంకొన్ని రోజులాగక తప్పదు.    

Friday, December 14, 2012

మీ ఇంట్లో "ఎలియన్స్" ఉన్నారేమో చూసారా!?



 నిన్న టి.వి.లో ఒక కథనం ప్రసారమయింది. ఈ మద్య మన "వైజాగ్"లో  ఒక కార్ల షో రూమ్ లో, నలుగురు ఎలియన్స్ అంటే ’ఇతర గ్రహాల నుండి వచ్చిన వారు "  కన పడ్డారట. అయితే వారు మామూలుగా కనపడరట. కెమేరా కంటికి మాత్రమే చిక్కుతారట. ఆ షో రూమ్ లో ఉన్న మాట్ ఒకటి కింద పడితే, అనుమానం వచ్చి, అక్కడున్న వారు సర్క్యూట్ కెమేరాలో పరిశిలిస్తే నలుగురు ఏనిమేషన్ బొమ్మ లాంటి వారు కన పడ్డారట. సదరు ఏలియన్ చిత్రాల్ని కూడ చూపించారు.

  కాబట్టి మిత్రులారా, యుగాంతం రోజు దగ్గర కొచ్చింది, కనుక ఏలియన్ లు మన గ్రహం మీద కొచ్చారా? ’వీర బోగ వసంత రాయలు " గారు మన రాష్ట్రం నుంచి వస్తాడు కాబట్టి ఆయనకి సహాయ పడటానికే ఏలియన్స్ మన రాష్ట్రం లోకి అడుగు పెట్టారా? లేకుంటె ఎప్పుడూ ఇతర దేశాలలో కన పడే ఏలియన్స్ మన రాష్ట్రం లో కన పడట మేమిటి? వారి వల్ల మనకు మేలు జరుగుద్దా? కీడు జరుగుద్దా? ఇదంతా తెలియాలి అంటె మరి కొన్ని రోజులాగక తప్పదనుకుంటా?

 ఈ లోపు మనం ఒక పని చేస్తే పోద్ది. మన ఇండ్ల లో కూడ ఎలియన్స్ ఉండే ఉంతారు కాబాట్టి, ఒక సారి ఇల్లంతా కేమేరా లతో పోటో తీసి పరీక్షిస్తే పోలా! 

సూర్య నందిలో "దలైలామా" గారి"శాంభవి" ఎందుకు ఫెయిల్ అయింది?

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_2162.html
పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్కండి

Thursday, December 13, 2012

దలై లామా గారి ,"వీరబోగ వసంతరాయలు" పథకం ఏమిటి?


ఇది నేను ఇంతకు మునుపు పెట్టిన టపాhttp://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_13.htmlకి కొన సాగింపు.

  అసలు దలై లామా గారు ఎందుకు తెలుగు వారి అవతార పురుషుడు, బ్రహ్మం గారి బవిష్య అవతారం,"వీర బోగ వసంత రాయలు" మీద ద్రుష్టి కేంద్రికరించారు అంటే, నేను ఇంతకు ముందు చెప్పినట్లు, బ్రాహ్మణ,    ఆఫీసర్ వేద వ్యాస్ గారు. ఆయన రచనలు, బ్రహ్మం గారి కాల జ్ణానం నమ్మిన ’దలై లామ" గారు, "దర్మ స్తలం లోని కొంత మంది, వేదవ్యాస్ గారి అభిమానులు లేక ఆయన సంబందితుల ప్లాన్ కి తల ఊపి ఉంటారు.

"వేద వ్యాస్" గారి ప్రకారం ’కల్కి’ అన్నా వీర బోగ వసంత రాయలు"  అన్నా ఒకరే. అతను తప్పకుండా "బ్రాహ్మణుడై" ఉండాలి. లేకుంటే కొంప దీసి, ఏ శూద్రుడో, అవతార పురుషుడుగా వస్తే "శూద్రపాలన" లోనే బారత దేశం బవిష్యత్తు ఉంటుంది. వారి ద్రుష్టిలో అంతో ఇంతో మన సమాజానికి మేలు చేసింది "బ్రాహ్మనులే". ఈ శూద్రులు(ఇప్పటి అగ్రవర్ణాల్లో కొన్ని కులాలు వారు  ఆ నాడు శూద్రులే),పాలన వల్లే "వేద ధర్మం" మంట గలిసి పోతుంటే, మళ్లి బ్రహ్మం గారి అవతారం "వీర బోగ వసంత రాయలు"  రాజ్యమెలితే ఏమన్నా ఉందా?. అందుకే "వేదవ్యాస్" గణానికి శూద్రులు ఎట్టి పరిస్తితిలో,"వీర బోగ వసంత రాయలు"  కాకూడదు. పోని బ్రాహ్మణులు వస్తారా అంటె అదిక శాతం మంది నమ్మక పోవచ్చు. ఉబయతారకంగా అసలు మన వారిని కాకుండా టిబెట్ వారైతే ఎవరికీ బాద లేదు అనుకుని దలై లామ గారిని ఒప్పించి ఉండాలి.

  అటు దలై లామా గారికి ఏదో రకంగా బారతీయుల అండ అవసరం.అమ్దుకే ఇంతకు ముందు చెప్పిన తతంగం అంతా.(మొదటి బాగం చూడండి). కాని ’బాల దేవత " నాటకం ’బాలల హక్కులు" కు బంగం అని మానవతావాదులు చేసిన గోల కి "శాంబవి"  అద్దె తల్లి తండ్రులతో సహా తట్టా,బుట్టా, సర్థుకుని ’దర్మ శాల" కి వెళ్లి పోక తప్పలేదు.

  అయినా వారి పిచ్చి కాని, బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందా? వీరు అనుకున్నట్లు జరుగుతుందా? బ్రహ్మంగారు శూద్రుడు. ఆయన  సాంప్రాదాయాలకు  అనుకూలమయినప్పటికి,  మతంలో "బ్రాహ్మణ  ఆదిపత్యాన్ని’ ప్రశ్నించిన వారు. మరి అటువంటి ఆయన పునరవతారం ""బ్రాహ్మణుడిగా" వస్తుందా? రాదు గాక రాదు. అందుకే వీరి చేష్టలకు కోపం వచ్చే దేవుడు వారిని "సూర్య నంది"లొ వారి బాగోతం బట్ట బయలు చేసి ఉంటాడు.ఇక్కడ  మానవ హక్కుల కమీషన్  వారి జ్యోక్యంతో,కలెక్టర్ "శాంబవి "  వ్యవహరం మీద విచారణ చేపట్టడం గురించి తెలుసుకున్న "దలై లామ " గారు "సూర్య నంది"లో "ఆశ్రమ ప్రారంబోత్స్వం" కార్యక్రమం రద్దు చేసుకున్నారు. ఆ
దెబ్బతో బయటకు వద్దా మనుకున్న "బోగస్" "వీర బోగ వసంత రాయలు" రాలేక పోయాడు. అయ్యా ఇదీ "శాంబవి కథ" ఇక్కడ గమనార్హం ఏమిటంటే అటు "గోగినేని బాబు’ గారి అద్వర్యంలో మానవ హక్కుల కార్య కర్తలు, ఆస శాంభవిని బడిలో చేర్పించాలన్న ఆస కూడ నెరవేరలేదు."శాంబవి తిరిగి "దర్మ శాల" కే వెల్లింది. దీని వల్ల మన కర్థ మయ్యేది ఏమిటంటే కేవలo "దర్మ శాల " వారి ప్లాన్ బగ్నం చెయ్యడమే దైవ సంకల్పం తప్పా, ఇది మన్యుషుల సంకల్పానికి అనుకూలంగా జరిగింది కాదు.

  అసలు బ్రహ్మం గారు ఏమి చెప్పారంటె తాను వీర భోగ వసంతరాయలు గా వాచ్చే నాటికి పాపం పండి ఉంటుంది. అదంతా ప్రక్షాళన చేశి "ముందు ఏ రీతిగా దర్మం నడిచెనో ఆ రీతి గా చేయుదుము" అంటారు. అంటె నిజమయిన "దర్మ పాలనను" అందిస్తానని చెపుతారు. అది క్రుత యుగం లో మాదిరి కుల, మత  బేదాలు లేకుండా ఉంటుంది అని అర్థం కావచ్చు. చూదాం అది నిజమో కాదో?

టిబెట్ "బౌద్దబ్రాహ్మణుల" కుట్రయే "బాల శాంభవి" నాటకం అట!

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_13.html

పూర్తి టపా కోసంలింక్ మీద క్లిక్ చెయ్యండి

టిబెట్ "బౌద్దబ్రాహ్మణుల" కుట్రయే "బాల శాంభవి" స్రుష్టి అట!

                                                                   
ప్రసిద్ద, నాస్తిక వాది, "గోగినేని బాబు" గారి విశ్లేషనానుసారం బాల దేవత గా తెలుగు ప్రజలకు పరిచయమయిన, "శాంభవి" అనే ఏడేళ్ల  పాపను హిమాచల్ ప్రదేశ్ లోని "దర్మ శాల" నుండి ఇక్కడకు పంపడం వెనుక బౌద్ద గురువైన "దలై లామ" మరి కొంత మంది హస్తముందట. ’బాల శాంబవి కి తల్లి, తండ్రులుగా వ్యవహరించిన "ఉషా రాణి, సౌమ్యా చారి" ఇరువురూ బ్రాహ్మణ  వర్గానికి, చెందిన వారుగా తెలుస్తుంది. మరి వీరిరువురిని ఉపయోగించి "దలై లామ" గారు ఎందుకు" "శాంబవి" డ్రామా ఆడారో చూడ్డాం.

  "దలై లామా " గారికి బద్ద శత్రువు "చైనా ". అది నాస్తిక కమ్మ్యూనిస్ట్ దేశం. దాని నియంత్రనను "టిబెట్" మీద లేకుండా చెయ్యలి అంటే మన దేశం సహాయం అవసరం. మన దేశం లో హిందూ మతం మెజార్టీ. ఇక్కడి ప్రజల సప్పోర్ట్ ఆయనకు, ఆయన వజ్రయాన బౌద్ద మతానికి అవసరం.వజ్రయాన మతస్తులకు మన లాగే "పునర్జన్మ" సిద్దాంతం మీద విశ్వాసం.అటు వంటి విస్వాసమున్న "దలై లామా" గారికి ఆంద్రుడయిన, బ్రాహ్మణ I.A.S        "ఎక్కిరాల వేదవ్యాస్" గారితో పరిచయ మయింది.

  ఇక్కడ " వేద వ్యాస్" గారి గురించి కొంచం చెప్పుకోవాలి. ఆయన "కలియుగాంతం" 1999 లోనే అవుతుందని ప్రకటించడమే కాక కొన్ని పుస్తకాలు రాసారు. అలాగె "వీరబోగ వసంత రాయులు" గారు వస్తారని కూడ చెప్పారు. అయితే ఆయనకు తన కులాభిమానం చెతనో లేక దేని వలననో కాని  "వీరబోగ వసంత రాయులు"  భ్రాహ్మణ యువకుడి రూపం లో వస్తాడని కరాఖండిగా చెప్పారు. అది జరుగలేదు. కాబట్టి "దర్మ శాల"లో ఉన్న ఆయన అబిమానులు మరొక ప్లాన్ చేసి దానిని అమలు చెయ్యలనుకున్నరు.

 ’గోగినేని బాబు"గారి మాటల్లొనే,ఎవరొ ఒక పిల్లవాడిని "దలైలామ" గారు పద్నాలుగు నెలలు పిల్లవాడిగా ఉన్నప్పుడు, లామా అవతారంగా ప్రకటించి తీసుకొచ్చి,  దక్షిణ బారత దేశం లోని ఒక ఆశ్రమం లో ఉంచారటా. అతను అకడ ఉన్నంత కాలం బయటి వారిని ఎవరిని కలవనివ్వ లేదట! అదే విదoమ్గా "శాంభవిని" కూడ ఉష రాణి, సౌమ్యాచార్యులు ను తాల్లి తండ్రులుగా నటింపచేసి, "సూర్య నంది" ప్రాంతంలో  ఒక ఆస్రం నిర్మించి, అక్కాడ "బాల శాంబవిని" దైవదూత గా ప్రచరం చెయ్యమని పంపారట!  వారి ప్లాన్ ప్రకారం "వీరబోగ వసంత రాయులు" పొయిన సంక్రాంతి  పండుగనాడు ప్రజలకు దర్శనం  ఇస్తారని ప్రకటింప చేసారు. "ఆశ్రమ" ప్రారంబోత్స్వానికి ’దలైలామా" టూర్ ప్రోగ్రాం కూడ ఖరారై పొయింది.

                ఈ విదంగా వారి ప్లాన్ విజయవంతమయితే, వారు రహస్యంగా పెంచిన "లామా" యువకుడినే"వీరబోగ వసంత రాయులు" గ ప్రకటించి సూర్య నందిలో హల్ చల్ చేసి ఉండెవారు. అలా తెలుగు ప్రజలను నమ్మించి అలా అవతార పురుషుడిగా మార్చిన లామా తో ఇటు   ప్రబుత్వాలను, అటు ప్రజలను ప్రబావ పరిచే వారు. అందుకే బాల శాంబవి ఎప్పుడూ "వీరబోగ వసంత రాయులు" వస్తాడు "తిబెట్" ని చైనా నుండి విముక్తం చేస్తాడు అన్ని చెప్పేది.కాని వాల్ల ప్లాన్ మొత్తాని "బాల హక్కుల కార్య కర్తలు చెడ గొట్టారు" అది ఎలా జరిగిందో తర్వాటి టపాలో చూదాం.(సశేషం)   http://nirmukta.com/2010/01/01/update-in-the-case-of-the-7-year-old-sambhavi-declared-the-reincarnation-of-a-buddhist-goddess/

Wednesday, December 12, 2012

బౌద్దం+బ్రాహ్మణం+ పన్నాగం= బాల శాంభవి స్రుష్టి

అవును బాల దేవత శాంభవిని ’సూర్య నందికి పంపించడం వెనుక శూద్రుడయిన అవతారపురుషుడు, వీరబోగ వసంతరాయులును రాకుండ కట్టడి చెయ్యడమే కాక బుద్ద మతానికి చెందిన వారిని" వీరబోగ వసంతరాయులు" గా "దలై లామ" చేత ప్రకటింప చేయాలన్న కుట్రలో బాగం గానే జరిగిందని అనిపిస్తుంది. కాని ఆ దేవుడు "బాలల హక్కుల కార్యకర్తల" రూపం లో వారి కుట్రను భగ్నం చేసాడు.రేపటి టపాలో పూర్తి పరీశోదనా వివరాలు ఉంచడం జరుగుతుంది. అందాక ఈ లింక్ ని క్లిక్ చేసి చూడగలరు.http://kalkiavataar.blogspot.in/2012/12/21.html

డిసెంబర్ 21 న "వీరబోగవసంతరాయులు" ఎవరో తెలిసిపోతుందట!

                                                                    

నేను "కల్కి " అవతారం అని ఒకరంటే ,నేనే"కల్కి భగవాన్" అని మరొకరు ప్రకటించుకున్నారు. "కోట్లాది రూపాయలు" ఆర్జించారు. ఆర్జిస్తున్నారు. ణెను ఈ మద్య కొన్ని వెబ్ సైట్ లు చూసాను. తమిల్ నాడుకు చెందిన కొందరు తాము "కల్కి" అవతారులమని ప్రకటించుకుని,వెబ్ సైట్ ల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. కాని కల్కి కి మరో పేరయిన (బ్రహ్మం గారు చెప్పింది) "వీరబోగ వసంత రాయులు" తామేనని పెద్దగా ప్రచారం చేసుకున్నది ఎవరూ లేరు. ఒక్కడు మినహా!

  మన మాజి ముఖ్య మంత్రి స్వర్గీయ నంద మూరి తారక రామారావు గారు అదికారంలో ఉండగా తానే   "వీరబోగ వసంత రాయులు" అని ఒక వ్యక్తి రావడం  ప్రబుత్వ అనుమతిని సంపాదించి, "చింత మాను మటం" లోని "కాలజ్ణాన పాతర" ను త్రవ్వడానికి ప్రయత్నిస్తే, అది ప్రజలు వ్యతిరేకించడం, ఆ తర్వాత  హై కోర్ట్, ప్ర్హబుత్వ అనుమతిని రద్దు చెయ్యడం, సదరు అవతార పురుషుడు మాయమవ్వడం (జయిల్లో మరణించినట్లు వినికిడి) జరిగిపోయాయి. ఎవరో ఒక రిద్దరు తమ గురువు, "వీరబోగ వసంత రాయులు" అవతారాలని ప్రచారం చేస్తున్నా ’కల్కి" వచ్చిన "భక్త స్పందన" "వీరబోగ వసంత రాయులు" కు రాలేదు. ఆ తర్వాత "శాంబవి " అనే బాల దైవ దూత త్వరలోనే "వీరబోగ వసంత రాయులు" రానున్నడని చెప్పి, కొంత హల్ చల్ చేస్తే, "బాలల హక్కులు " గురించి తెగ బాద పడే వారు ఆ బాలికను బాద పెట్టి "దర్మ శాల"కు పంపించారు, ఇంకా వివరాలు కావాలంటే లింక్ ని క్లిక్ చెయ్యండిhttp://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_11.html.

  కాని ఇప్పట్టి దాక జరిగింది ఏమయిన కావచ్చు, మీకు డిసెంబర్ 21 న "వీరబోగ వసంత రాయులు" దర్శనం అవుతుందట!. అటడు ఆకాశం లోనుండి వస్తాడట. కోరుకున్న వారందరికి కనపడతాడట! నాకు ఒక నమ్మక్క మయిన సమాచారం ఆదారంగా చెపుతునాను. నమ్మితే ఆలౌకిక ఆనందం. లేకుంటే లౌకిక ఆనందం(జొక్ అనుకుంటే). మొత్తానికి ఆనందో బ్రహ్మా!  

Tuesday, December 11, 2012

26 న తారీకున "నల్లమల" లో యుగాంతమట!

http://kalkiavataar.blogspot.in/2012/12/26-12-2012.html
(పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

26-12-2012 న 'నంద్యాల' దగ్గర్లోకి "వీరభొగ వసంతరాయులు" రాబోతున్నాడా!?


 నేను నిన్న"

"కదిరి" నరసింహుడే "వీరబోగ వసంత రాయలా"?

అనే టపా పెట్టడం జరిగింది. ఆ టపాలోని "సండ్ర చెట్టుకు" వీరబోగ వసంత రాయులు గల సంబందాన్ని, పరిశోదించాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగినది. దానికి స్పందించిన వీక్షక మిత్రులు దీనికి సంబందించి కొంత సమాచారాన్ని,నా ఈ మెయిల్ అడ్డ్రెస్ కు పంపించడం జరిగింది. దానిని యదాతదంగా ఈ క్రింద ప్రచురిస్తున్నాను:-

"సార్వభౌమ గారు,
యుగాంతం కు కార్యరంగం నల్లమల అడవుల్లొని ఓంకార క్షేత్రం లో సిద్దమవుతూంది.అక్కడ అవధూత కాశి నాయన భక్తుల చే వీరబోగ వసంత రాయల విగ్రహ ప్రతిష్ట జరిగింది.అక్కడి సాంద్ర చెట్టు కింద ఒక శనీశ్వర విగ్రహాన్ని ప్రతిష్టా చేసారు.సిద్దయ్య గ్రామమైన కలుగొత్ళ లో కూడా కల్కి విగ్రహం పెట్టి నిత్య అన్నదానం చేస్తున్నారు.ఓంకారం లో కొంద మీద అనెక దేవతా మూర్థులు పెట్టారు.దానికి ముందు అక్కడ అనెక పుట్ట లను  వెలికి తీసారు.ఇప్పుదు అందులోని ఋషులందరు కొంద మీదకు వెళ్ళారని అంటున్నారు.ఇదంతా నంద్యాల  సమీపం లొ జరుగుతున్నది."

  పయిన మిత్రుడు చెప్పిన దానిలో, కాశి నాయానా అవదూత గారు ప్రక్యాత యోగివర్యులు. వారికి అషేష సంఖ్యలో బక్తులు ఉండటం సహజం. బ్రహ్మం గారి కాలజ్ణానం ళో వీరి గురించిచెప్ప బడింది.వీరి బక్తులు అటవీ ప్రాంతమయిన "నల్లమల"లో శనీశ్వరున్ని ప్రతిష్టించి పూజలు జరుపటం ముదావహం. అందయిన, ఆహ్లాదకరమయిన ’నల్లమల" లోని ఈ ఓంకార క్షేత్రం బక్తులను విశేషంగా ఆకర్షించవచ్చు.సమాచారమిచ్చిన మిత్రులుకు దన్య వాదాలు తెలుపుతున్నాను.దీని గురించి ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉన్నందున, "ఒంకార క్షేత్ర" మహత్యం గూర్చి తర్వాతి టపాలో తెలియ చెయ్యడం జరుగుతుంది 


 

Friday, December 7, 2012

అసలు ’కల్కి" అనే పదానికున్న "నానార్థాలు" ఏమిటి?

ఎనిమిది చేతులు గలిగినవాడు,ఎనిమిది మాయలు గలవాడు
                                                                    
నేను ఇంతవరకు రాబోయే అవతారపురుషుడు అయిన "కల్కి’ తల్లి తండ్రుల గురించి, అయన పుట్టబోయే "గ్రామం" గురించి పురాణాలలో, ఎంఉందో నాకు అవగతమయిన విదంగా విశ్లేషించి చెప్పడం జరుగుతుంది. ఏ ఇద్దరి విశ్లేషణా ఒకటిగా ఉండకపోవచ్చు. ఎవరికి తోచిన రీతిలో వారు వ్యాఖ్యానాలు చేయొచ్చు.నమ్మేవారు నమ్మొచ్చు,లెనివారు నవ్వుకోవచ్చు. కాని ఇది తప్పు,ఇది ఒప్పు అనేది ఎప్పూడు తెలుస్తుంది,చెప్పేది నిజమయినప్పుడు మాత్రమే, అంతవరకు ఎవరి ఊహ వారిది.

  ఇకపోతే,అసలు "కల్కి"అంటే ఏమున్నది అర్థం,ఒకే అర్థమా, నానార్థాలు ఉన్నాయా, అనేది ఈ టపాలో చూద్దాం.

  కలికి = అందమయినది, స్త్రీ,ప్రక్రుతి

  కల్కి=(కల్క్=బురద),(ఈ=పుట్టినది,నుండి వచ్చినది)= కమలం,తామర

  కల్కి= (కల్లు=రాయి ( ఉదాహరణ ఉప్పుకల్లు),ఈ= లోనుండి పుట్టిన వాడు= రాయిలో నుండి పుట్టినవాడు= నరసింహ స్వామి 

  పై విదముగా నానార్థాలు ఉండటంవలన నేను ’కల్కి పురాణాని’ ఇతర బవిష్య గ్రంథాలతో పోల్చి చూడడం జరుగుతుంది. బ్రహ్మం గారు చెప్పిన "వీరభోగ వసంత రాయలు" కూడ ప్రత్యేకంగా చెప్పబడిన పేరు. మన పురాణ పురుషులలో  ఈ పేరు గలవారు ఎవరూ లేరు.కాబట్టి ఈ పేరును బ్రహ్మం గారు ప్రత్యేకంగా ఎందుకు చెప్పారో జగ్రత్తగా పరిశోదించాల్సిన విషయం. "నరసీంహ స్వామి"కి ,"వీరబోగవసంత రాయులు"  కి గల సంబందం తెలుసుకోవాలంటే ఈ లింక్ ని క్లిక్ చెయ్యండిhttp://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_8738.html

  ఇక పోతే యుగం ఆంటే లక్షల సంవత్సరాలు అనేది నిజమయితే, అన్ని సంవత్సరాలు ఈ పాప బారం బూమి మీద ఉంటుందా? అసలు ఈ మనిషి చేసే ప్రక్రుతి ద్వంసానికి ఏ జీవరాసి అయినా ఈ గ్రహం మీద ఉంటుందా అనేది అలొచిస్తే, పురాణాలు చెప్పే లెఖ్కలు ఎక్కడో తప్పినట్టు అనిపిస్తుంది. కాబట్టి మయన్ కాలెండర్ కరెక్ట్ అనిపిస్తుంది.

  మరిన్ని వివరాలతో మరో టపాలో

"నార్వే కేస్" కు బ్రహ్మం గారి "కాలజ్ణానం" కి లింక్ ఏమిటి?

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_8738.html
(పై లింక్ ని క్లిక్కండి)

Thursday, December 6, 2012

వీరభోగ వసంతరాయలు రావాల్సిన ఆ "ప్రహ్లాదమయిన పని" ఏమిటి?

                                                                    

మీకు తెలుసా? బ్రహ్మం గారి కాలజ్ణానంలో రాబొయే అవతారపురుషుడు"వీరభొగ వసంతరాయలు"(ఇయనే కల్కి అని చాల మంది నమ్మకం), ఎప్పుడు బయట ప్రపంచానికి కనపడతాడు అనేది స్పష్టంగా ఉంది. నేను "కల్కి" వివరాలు గురించి ముందు చెప్పి, ఆ తర్వాత వీరభోగుని గూర్చి చెపుదాము అనుకున్నాను. కాని ఎందుకో మన రాష్ట్రంలో మరియు ఇతర దేశంలో ఈ మద్య జరిగే కొన్ని సంఘటనలు గమనించాక "వసంతరాయలు" గురించి అర్జంట్ గా  ఒక ముక్క మీ చెవిన వేద్దామనే  తహ, తహ తో ఈ టపా మీ ముందుంచడమయినది.

 "కాలజ్ణనం"లో ఒక చోట "వీరభోగ వసంతరాయలు" ప్రజలకు ఎప్పుడు దర్శనమిస్తాడు అనేది వివరిస్తూ,"ప్రహ్లాదమయిన పని కాగలదు, వారి కొరకు రావాల్సి ఉండును" అని ఉంది. ’ఈ ప్రహ్లాదమయిన పని ఏమిటా అని నేను చాలా సార్లు ఆలోచించాను. కాని నా బుర్రకేమి తోచలేదు. గత నాలుగు రోజులుగా అటు టి.విల్లోను,ఇటు మన బ్లాగుల్లోను ఒకటే ఊదరగొడుతున్న,"నార్వే వారి దెబ్బ, అంద్ర దంపతులు అబ్బా" అనే సీరియల్ "టపాఓపాఖ్యానం" చూసాక సడెన్ గా ఒక అయిడియా "ఫ్లాష్" అయింది.

  "నార్వే" వారు ఆంద్రా దంపతులను జైల్లో వేయడానికి కారణం ఏమిటి? వారి పిల్లలే కదా! పిల్లల్ణి హింసిసించారన్న కారణంగానే తల్లి తంద్రులకు సిక్ష పడింది కాబట్టి,ఇదే "ప్రహ్లాద కారణం".ఎందుకంటే బాగవతంలో "ప్రహ్లాదుడు"తండ్రి చేత హింసించబడితే "నరసీంహుడు’ ఉద్బవించి, అతని తండ్రి హిరణ్యకశిపుని వదిస్తాడు. కాబట్టి బాల హింసే "ప్రహ్లాద కారణం".అయితే డిని కోసం "వీరభోగ వసంతరాయలు" రావడమేమిటి అన్నది కోటి డాలర్ల ప్రశ్న?

 నేను ఒకచోట చదివాను. ’కదిరి" లో ఉన్న "నరసింహ స్వామి"నే  "వీరభోగ వసంతరాయలు" అంటారట. మరి అయితే ఆ స్వామి వస్తాడా ఇప్పుడు, లేక అయన పేరు గలవారు వస్తారా? లేక "కదిరి" నుంచి వస్తారా? అసలు "వీరబోగ వసంతరాయలు" అనే పేరును బ్రహ్మం గారు ఎందుకు చెప్పారు? ఈయనకు "కల్కి"కి ఏమయినా సంబందం ఉందా? ఉంటే అది ఎలాంటిది? వీటన్నిటికి సమాదానం త్వరలో రాబొయే టపాలలో.

Wednesday, December 5, 2012

"కల్కి" పుట్టే గ్రామం పేరు"శంబల" అంటే " ఏమిటో తెలుసా?

"కల్కి పురాణం’ ప్రకారం  కల్కి జన్మించబోయే గ్రామం పేరు "శంభల".ఈ "శoభల" గ్రామం లోనే ఊరి పెద్ద అయిన ’విష్ణు యశుడు, లేక "దేవగుహ్యుడు" అనే సమాన అర్థాలు కలిగిన వ్యక్తి ఇంటిలో "అవతార పురుషుడు పుడతాడట. వాటి గురించి వివరాలకు క్రింది లంకే ను క్లిక్ చెయ్యండి .

 ఇకపోతే "శంబల" అనే గ్రామము గురించి "నికిలో రోరస్" అనే రష్యన్ పరీసోదకుడు, ఆ గ్రామం "హిమాయలలో ఎక్కడో ఉందని అది మామూలు  మనుషులకు కనపడదని, యోగ సాదకులు మాత్రమే చూడ గల రని  "రాజు గారి దేవతా వస్త్రాలు" కథ చెప్పినట్టు చెప్పాడు. ఆయన పరీశొదనా సారాంశం అంతా ఒక”సైన్స్ ఫిక్షన్" సినిమా కథ ను తలపింప చేస్తుంది. కాబట్టి నమ్మటం కష్టం.

 ఇక పోతే నా పరిశొదన ఏమిటంటే "శంబల" అంటే "మద,మాత్సర్యములు" లేక "ఈర్షా ద్వేషములు" అనే అర్థం ఉంది. దీని ప్రకారం "శంబల గ్రామం" అంతే, అటు వంటి ప్రజలు ఉన్న గ్రామం అని కావచ్చు. అసలు కల్కి బయటకు వస్తేనే ఇది రుజువయ్యేది. కాని ప్రస్తుత కాలంలో ఏ గ్రామమయినా ఇటువంటి ప్రజలు కాక , సత్పురుషులు ఉన్న గ్రామం ఉందా?!కలి కాలం అంటే అర్థం అదే కదా! ప్రజలలో మద మాత్సర్యాలు పెరగడం వలననే,పాపాలు పెరిగి,"కల్కి" రావాల్శి వస్తుంది కదా! అందుకే ఇదే కరెక్ట్ అనుకుంటా http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_5151.html.

"కల్కి" పుట్టే గ్రామం పేరు ఏమిటో తెలుసా?

 "కల్కి పురాణం’ ప్రకారం  కల్కి జన్మించబోయే గ్రామం పేరు "శంభల".ఈ "శoభల" గ్రామం లోనే ఊరి పెద్ద అయిన ’విష్ణు యశుడు, లేక "దేవగుహ్యుడు" అనే సమాన అర్థాలు కలిగిన వ్యక్తి ఇంటిలో "అవతార పురుషుడు పుడతాడట. వాటి గురించి వివరాలకు క్రింది లంకే ను క్లిక్ చెయ్యండి .

 ఇకపోతే "శంబల" అనే గ్రామము గురించి "నికిలో రోరస్" అనే రష్యన్ పరీసోదకుడు, ఆ గ్రామం "హిమాయలలో ఎక్కడో ఉందని అది మామూలు  మనుషులకు కనపడదని, యోగ సాదకులు మాత్రమే చూడ గల రని  "రాజు గారి దేవతా వస్త్రాలు" కథ చెప్పినట్టు చెప్పాడు. ఆయన పరీశొదనా సారాంశం అంతా ఒక”సైన్స్ ఫిక్షన్" సినిమా కథ ను తలపింప చేస్తుంది. కాబట్టి నమ్మటం కష్టం.

 ఇక పోతే నా పరిశొదన ఏమిటంటే "శంబల" అంటే "మద,మాత్సర్యములు" లేక "ఈర్షా ద్వేషములు" అనే అర్థం ఉంది. దీని ప్రకారం "శంబల గ్రామం" అంతే, అటు వంటి ప్రజలు ఉన్న గ్రామం అని కావచ్చు. అసలు కల్కి బయటకు వస్తేనే ఇది రుజువయ్యేది. కాని ప్రస్తుత కాలంలో ఏ గ్రామమయినా ఇటువంటి ప్రజలు కాక , సత్పురుషులు ఉన్న గ్రామం ఉందా?!కలి కాలం అంటే అర్థం అదే కదా! ప్రజలలో మద మాత్సర్యాలు పెరగడం వలననే,పాపాలు పెరిగి,"కల్కి" రావాల్శి వస్తుంది కదా! అందుకే ఇదే కరెక్ట్ అనుకుంటా http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_5151.html.

Tuesday, December 4, 2012

రాబోయే అవతార పురుషుడి తండ్రి పేరు "దేవగుహ్యుడు"! అంటె అర్థమేమిటి?

నేను ఇంతకు ముందు టపాలో (లింక్ ని క్లిక్ చెయ్యండి} చెప్పినట్లుగా "కల్కి" జన్మ విశేషాలకు, ఇతర వివరాలకు "కల్కి పురాణం" విష్ణు పురాణం" ఆదారాలుగా తీసుకోవటం జరిగింది. మరింత వివరణ కావాల్శినప్పూడు, "బ్రహ్మం గారు" మరియు నోస్ట్రాడామస్ "భవిష్య వాణిని" కూడ పరిశీలించడం జరిగింది.

 అదే విదంగా "కల్కి" తల్లి పేరును తెలియ పరచాను. ఇప్పుడు ఆయన తండ్రి పేరును విశ్లేషించి చెప్పడం జరుగుతుంది.

కల్కి పురాణం లో అయన తండ్రి పేరు "విష్ణు యశుడు" అని చెప్పగా, విష్ణు పురాణం లో "పరమాత్మ" తండ్రి పేరు "దేవ గుహ్యుడు" అని చెప్ప బడింది. మరి ఈ రెండూ ఒకటేనా? వేర్వేరు అయితే ఏది ప్రామాణికమో చూదాం.
"విష్ణు యశుడు" లేక "విష్ణు యశశుడు" అనగా ప్రఖ్యాతమయిన, "విష్ణువు" కు సంబందించిన పేరుగలవాడు అయి ఉండాలి. ఈ విదంగా చాలా నామాలు ఉన్నాయి.అదీ గాక ఆయన ఉండే గ్రామంలో "ప్రదానుడు" అంటే, ముఖ్యుడయి ఉండాలి.  బ్రహ్మ జ్ణాని అయి ఉండాలి.

 ఇక పోతే "దేవగుహ్యుడు" అంటే. తెలుగులో "దేవుని గుంట" అనే సామాన్య అర్థం ఉంది.అలాగే "దేవుని" అంటే పవిత్రమయిన అనే అర్థం కూడ ఉంది. ఈ విదంగా చూస్తే "పవిత్రమయిన మార్మిక స్తానం" అనే అర్థం కూడ వస్తుంది.
  పవిత్రమయిన అనే పదానికి "తిరు" అనే తమిళ పదం కూడా వర్తిస్తుంది. అలాగే నెల్లూరు జిల్లా వాళ్ళు, "గుంటలు’ ని "పతులు" అని కూడా అంటారు . ఈ విదంగా చూస్తే, "దేవుని గుంట" అంటే "పవిత్ర పతి" అనొచ్చు లేక పోతే "తిరుపతి" అని కూడ అనొచ్చు.
 కాబట్టి ఈ క్రింది పేర్లకు సంబందించిన ఏదో ఒక పేరు "కల్కి" తండ్రి పేరు అయి ఉండాలి అనుకుంటున్నాను.

(1), విష్ణు యశ్ (2) దేవపతి,(3)పవిత్ర పతి (4) విష్ణు కీర్తి (5) తిరుపతి. ఈ విదంగా ఈనామములకు సమానార్థ కాలలో ఏదో ఒక పేరు "కల్కి" అవతార పురుషుడి తండ్రి  పేరు అయి ఉండాలి.

  ఇతర వివరాలను తర్వాతి టపాలలో తెలుసుకుందాం . కల్కి తల్లి పేరును తెలుసుకుంటానికి "ఈ క్రింది లంకె ను క్లిక్ చెయ్యగలరు (http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_2.html)

" కల్కి" అవతార పురుషుడి తండ్రి పేరు కూడా తెలిసింది!

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_4.html
(పై లంకె మీద క్లిక్ చెయ్యండి )

" కల్కి" అవతార పురుషుడి తండ్రి పేరు కూడా తెలిసింది!


నేను ఇంతకు ముందు టపాలో (లింక్ ని క్లిక్ చెయ్యండి} చెప్పినట్లుగా "కల్కి" జన్మ విశేషాలకు, ఇతర వివరాలకు "కల్కి పురాణం" విష్ణు పురాణం" ఆదారాలుగా తీసుకోవటం జరిగింది. మరింత వివరణ కావాల్శినప్పూడు, "బ్రహ్మం గారు" మరియు నోస్ట్రాడామస్ "భవిష్య వాణిని" కూడ పరిశీలించడం జరిగింది.

 అదే విదంగా "కల్కి" తల్లి పేరును తెలియ పరచాను. ఇప్పుడు ఆయన తండ్రి పేరును విశ్లేషించి చెప్పడం జరుగుతుంది.

కల్కి పురాణం లో అయన తండ్రి పేరు "విష్ణు యశుడు" అని చెప్పగా, విష్ణు పురాణం లో "పరమాత్మ" తండ్రి పేరు "దేవ గుహ్యుడు" అని చెప్ప బడింది. మరి ఈ రెండూ ఒకటేనా? వేర్వేరు అయితే ఏది ప్రామాణికమో చూదాం.
"విష్ణు యశుడు" లేక "విష్ణు యశశుడు" అనగా ప్రఖ్యాతమయిన, "విష్ణువు" కు సంబందించిన పేరుగలవాడు అయి ఉండాలి. ఈ విదంగా చాలా నామాలు ఉన్నాయి.అదీ గాక ఆయన ఉండే గ్రామంలో "ప్రదానుడు" అంటే, ముఖ్యుడయి ఉండాలి.  బ్రహ్మ జ్ణాని అయి ఉండాలి.

 ఇక పోతే "దేవగుహ్యుడు" అంటే. తెలుగులో "దేవుని గుంట" అనే సామాన్య అర్థం ఉంది.అలాగే "దేవుని" అంటే పవిత్రమయిన అనే అర్థం కూడ ఉంది. ఈ విదంగా చూస్తే "పవిత్రమయిన మార్మిక స్తానం" అనే అర్థం కూడ వస్తుంది.
  పవిత్రమయిన అనే పదానికి "తిరు" అనే తమిళ పదం కూడా వర్తిస్తుంది. అలాగే నెల్లూరు జిల్లా వాళ్ళు, "గుంటలు’ ని "పతులు" అని కూడా అంటారు . ఈ విదంగా చూస్తే, "దేవుని గుంట" అంటే "పవిత్ర పతి" అనొచ్చు లేక పోతే "తిరుపతి" అని కూడ అనొచ్చు.
 కాబట్టి ఈ క్రింది పేర్లకు సంబందించిన ఏదో ఒక పేరు "కల్కి" తండ్రి పేరు అయి ఉండాలి అనుకుంటున్నాను.

(1), విష్ణు యశ్ (2) దేవపతి,(3)పవిత్ర పతి (4) విష్ణు కీర్తి (5) తిరుపతి. ఈ విదంగా ఈనామములకు సమానార్థ కాలలో ఏదో ఒక పేరు "కల్కి" అవతార పురుషుడి తండ్రి  పేరు అయి ఉండాలి.

  ఇతర వివరాలను తర్వాతి టపాలలో తెలుసుకుందాం . కల్కి తల్లి పేరును తెలుసుకుంటానికి "ఈ క్రింది లంకె ను క్లిక్ చెయ్యగలరు (http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_2.html)

Sunday, December 2, 2012

" కల్కి" అవతార పురుషుడి తల్లి పేరు తెలిసింది!


 ఇక నుండి వరుస టపాలలో  రాబోయే కల్కి వివరాలు ప్రచురించాటం జరుగుతుంది. మీకు తెలిసినవారు ఎవరయినా నేను చెపుతున్న వివరాలతో వారి బయో డేటా సరిపోతే, వారి వివరాలను,  నాకు ఈ మెయిల్ చెయ్యగలరని మనవి. వివరాలు మొత్తం చెప్పేదాక, ఈ బ్లాగుని అనుసరించగలరని, వీక్షకులకు సవినయంగా మనవి చేస్తూ.....

  మొదటగా కల్కి తల్లి గారు ఎవరని చెప్ప బడిందో తెలుసుకుందాం.కల్కి చరిత్రను గూర్చి మనకున్నది,ముఖ్యమయిన అదారాలు (1), కల్కి పురాణం లేక బాగవతం (2) విష్ణు పురాణం.

 -----కల్కి పురాణంలో ఇతని తల్లి పేరు "సుమతి" అని చెప్పబడింది. సుమతి అంటె "మంచి బుద్ది కలద్ " అని అర్థమట.

----- అదే విష్ణు పురాణంలో "మన్వంతరం"లు గురించి పద్నాలుగు మంది మనువులు గురించి వివరంగా చెప్ప బడి ఉంది. అంతే కాకుండా, ప్రతి మన్వంతరంలో, పరమాత్మ అవతారం పేరు, అయన తల్లి తండ్రుల పేర్లు కూడ వివరంగా చెప్పబడి ఉండటం వలన " కల్కి పురాణాన్ని,విష్ణు పురాణాన్ని కలిపి విశ్లేచడం జరుగుతుంది. రెండితిలో సారూప్యత ఉన్న వాటికి అధిక ప్రాద్యాన్యత ఇవ్వడం జరిగింది. లేకుంటే ఒక పురాణానికి, ఇంకొక దానికి అసలు సంబందం లేకుంటే అంతా గందర గోళమే కదా! అందుకే ఈ పద్దతి.

    విష్ణు పురాణం లో రాబొయే ఎనిమిదవ మన్వంతరం లొ పరమాత్మ(కల్కి) పేరు సార్వబౌమ అంట! అయన తల్లి పేరు "సరస్వతి" అని చెప్ప బడింది.

    కాబట్టి ఇప్పుడు పైన చెప్పబడిన రెండు పేర్లుకు ఏమన్నా సంబందం ఉందా? అంటె సంబందం ఉందనే చెప్పవచ్చు. సరస్వతికి ఉన్న నానా అర్థాలలో "సుమతి" కూడ ఒకటని చెపుతారు.కాబట్టి   "కల్కి’ ఒక్క తల్లి పేరును "సరస్వతి" లేక "సుమతి’ కి సంబందిచిన వివిద నామాలలో ఒకటయి ఉండాలని నా అభిప్రాయం.

 ఇక పొతె తండ్రి పేరు గురించి తరవాటి టపాలో చూద్దాం.     

డిసెంబర్ 20 తారీకు లోపు మనకి "కల్కి" కనపడతాడట!వివరాలకు చూడండి.....

యస్. నాకు నమ్మకమయిన సమాచారం దొరికింది."కల్కి" గురించి వివరాలు అతి త్వరలో మీ ముందుంచుతాను.మన కంటే విదేశియులే "కల్కి" విషయంలో చాల సమాచారం సేకరించారు. రష్యా వాళ్లైతే రహస్య పరీశొధనలు కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నారంట! ఇవ్వన్ని సేకరిస్తుంటే నాకే ఆశ్చ్చర్యం వేస్తుంది. ఏది ఏమయినా కల్కి వివరాలు అతి త్వరలో సాక్ష్యాదారాలతో మీ ముందుంచుతాను. యస్. నాకు నమ్మక్కమే. మీకైతే నాది పాత పాటే "నమ్ము,నమ్మకపో,నే పరిశోదిస్తూనే ఉంటా!"

Saturday, December 1, 2012

డిసెంబర్ 20 తారీకు లోపు మనకి "కల్కి" కనపడతాడట!వివరాలకు చూడండి............



యస్. నాకు నమ్మకమయిన సమాచారం దొరికింది."కల్కి" గురించి వివరాలు అతి త్వరలో మీ ముందుంచుతాను.మన కంటే విదేశియులే "కల్కి" విషయంలో చాల సమాచారం సేకరించారు. రష్యా వాళ్లైతే రహస్య పరీశొధనలు కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నారంట! ఇవ్వన్ని సేకరిస్తుంటే నాకే ఆశ్చ్చర్యం వేస్తుంది. ఏది ఏమయినా కల్కి వివరాలు అతి త్వరలో సాక్ష్యాదారాలతో మీ ముందుంచుతాను. యస్. నాకు నమ్మక్కమే. మీకైతే నాది పాత పాటే "నమ్ము,నమ్మకపో,నే పరిశోదిస్తూనే ఉంటా!"