Friday, October 7, 2016

తన వీపు ఎక్కడ పగిలిందో చూపమంటున్న పాకీఖాన్ !!

                                                                       

మీకొక చిన్న కధ  చెపుతాను . విసుగు అనుకోకుండా ఆ సాంతం వినండి .

   రామయ్య , పాకి ఖాన్ లవి ఇరుగు పొరుగు ఇళ్ళు . స్వభావ రీత్యా రామయ్య మిత బాషి శాంత పరుడు అయితే , పాకిఖాన్ ది  అసూయా తో కూడిన దుందుడుకు స్వభావం . రామయ్య గారి కుటుంబం పెద్దదే అయినప్పటికీ , ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ క్రమ శిక్షణ తో కష్టపడటం వలన ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా ఉంది .ఆ ఇంట్లోని పిల్లలు బాగా చదువుకొని వారిలో కొంతమంది డాక్టర్లు , ఇంజనీర్లు , శాస్త్రవేత్తలు అయ్యారు. 


 కానీ పాకిఖాన్ ఇంట్లో ఇంట్లో క్రమశిక్షణ కొరవడటం వలన , పెద్దలు మాట పిల్లలు ఆలకించే వారు కారు . ఇంటి పెద్ద పెత్తనం నామ్ కె వాస్తే . తేడా వచ్చినప్పుడల్లా ఇంట్లో బలవంతులైన దుందుడుకు పిల్లలే ఇంటి పెత్తనం తీసుకుని ఇంటి పెద్దని రూములో పడేసి తాళాలు వేస్తుంటారు. దీని వలన ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక ,పిల్లలుకు చదువు అబ్బక  రౌడీలుగా గుండాలుగా మారి ఇంట్లోని వారికి మాత్రమే కాక ఆ చుట్టూ ప్రక్కల ఉండే ఇండ్లలోని వారికీ కూడా నానా ఇబ్బందులు కలిగిస్తూ రాక్షసులుగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. పాకీ ఖాన్ ఇంటి ప్రక్కనే రామయ్య గారి కుటుంబం ఉండటం వలన వారి దాష్టీకాలకు ఎక్కువుగా నష్టపోతోంది రామయ్య గారి కుటుంబమే . 

      ఆ ఊళ్ళోనే ఉన్నమరొక ఆసామి  చిన్నయ కుటుంబానికి , రామయ్య కుటుంబానికి వ్యాపార రీత్యా పోటీ ఉంది. రామయ్య గారి కుటుంబం ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటుంటే వారిని పోటీలో ఎదుర్కోవడం కష్టం కాబట్టి ఎలా చేసి అయినా రామయ్య గారికి దొడ్డి దారిన చికాకులు కల్పించాలని నిత్యం ప్రయత్నిస్తుంటాడు . ఈ  విషయం లో చిన్నయ్య కి పాకి ఖాన్ బాగా ఉపయోగ పడుతున్నాడు. పాకి ఖాన్ కి ఆర్థిక సహాయం చేస్తూ తరచూ రామయ్య గారి తో గొడవలు పెట్టుకోమని ప్రోత్ససహించే వాడు. ఆర్థికంగా దిగజారి ఉన్న పాకి ఖాన్  చిన్నయ్య ఇచ్చే డబ్బును స్వీకరిస్తూ రామయ్య గారి తో తరచూ గొడవలు పెట్టుకునే వాడు. అంతే కాక గ్రామం మొత్తం ని తమ పాలనా లోకే తెచ్చుకోవాలనుకుంటున్న తీవ్రవాద ముఠాల దగ్గర డబ్బులు తీసుకుని వారికి తమ ఇంట్లో ఆశ్రయం కల్పించడమే కాక వారిని గ్రామం లో ఎవరికీ కనపడకుండా చేసి , వారి తీవ్రవాద కార్యకలాపాలు నిరాటంకంగా చేసుకోవడాన్ని సహాయం చేస్తున్నాడు . 

                                                                         

  
           పాకి ఖాన్ ఇంట్లో ఉన్న తీవ్రవాదుల ఆశయం లో భాగంగా పక్కనే ఉన్న రామయ్య గారి ఇంట్లోకి రహస్యంగా జొరపడి వారికి తరచూ నష్టం కలిగిస్తున్నారు. దీని గురించి పాకి ఖాన్ ని ప్రశ్నిస్తే తమకి వారికి సంబంధం లేదని బుఖాయించడం చేసే వాడు. అలాంటి పరిస్తుతుల్లో ఒక రోజు రాత్రి పాకీఖాన్ ఇంట్లోని తీవ్రవాదులు కొంత మంది అర్ధరాత్రి రామయ్య ఇంట్లో ప్రవేశించి  వారి కుటుంబ సభ్యులను కొట్టారు . ఆ కొట్లాటలో ఆ తీవ్రవాదులు కూడా దెబ్బలు తగిలినప్పటికీ  , తరచూ ఇలాంటి దొంగ దెబ్బలు తీస్తున్న పాకి ఖాన్ కుటుంబానికి సరి అయిన బుద్ధి  చెప్పకపోతే   లాభం లేదనుకున్న రామయ్య గారు అందుకు తమ కుటుంబం లోని సమర్థులైన సబ్యులకు ఆ పని అప్ప చెప్పారు. 

      సదరు రామయ్య గారి పిల్లలు అర్ధరాత్రి రహస్యంగా పాకి ఖాన్ ఇంట్లోకి వెళ్లడమే కాక అక్కడే ఉన్న తీవ్రవాదులను మరియు పాఖిఖాన్ కుటుంబ సబ్యలను వీపులను విమానం మోత  మోగించి   తిరిగి తెల్లారే సరికి తమ ఇంట్లో పడ్డారు. ఈ విషయాన్ని రామయ్య గారే స్వయంగా చెప్పే దాకా పాఖిఖాన్ కి అసలు ఏమి జరిగిందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉండి  పోయాడు. మొదట మా వీపులు పగల లేదన్నాడు . తర్వాత కొంత సేపటికి దీనికి ప్రతీకారం తీర్చుకుంటాం అని బింకాలు పలికాడు . అంతలోనే నాలుక కరుచుకుని "అబ్బే మా ఇంట్లో అల్లాంటిదేమీ జరుగలేదన్నారు. సంఘటన జరిగిన రూములు అన్ని  శుభ్రంగా కడిగిన తర్వాత ఇతరులని  పిలిచి "ఏది ఎక్కడా ఆధారాలు ? రూములు అన్ని ఇంత క్లిన్ గా ఉంటేను అని నక్క జిత్తుల మాటలు మాట్లాడాడు. పాకీ  ఖాన్ ఇలా అనటానికి ప్రధానమైన కారణం ,రామయ్య గారు చెపుతున్న "వీపులు విమానం మోత " సంఘటన జరిగిందని ఒప్పుకుంటే తమ ఇంట్లో తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చానని ఒప్పుకున్నట్లు అవుతుంది కాబట్టి ఆ బుకాయింపులు . కాబట్టి , రామయ్య గారి పిల్లలు ఎవరు తమ ఇంట్లికి రాలేదని, వచ్చి వీపులు విమాన మోత  మోగించలేదని , ఒక వేళా అది నిజమయితే రుజువులు చూపాలని ఎదురు మాటల దాడి ప్రారంబించాడు . 


     ఇక్కడ రామయ్య గారి సదరు సంఘటనకు సంబంధించి అన్ని వీడియో రుజువు ఉన్న వాటిని భయట  పెడితే తమ మెరుపు దాడుల టెక్నీక్ ని పాకి ఖాన్ కనిపెట్టి భవిష్యత్ లో జాగ్రత్త పడే అవకాశం ఉన్నందున వాటిని బహిర్గత పరచడానికి ఆలోచిస్తున్నారు . అయితే ఆ గ్రామం మొత్తంకి  రామయ్య గారి మాట మీదే కాక సమర్థత మీద కూడా నమ్మకం ఉన్నందు వలన పాకి ఖాన్ ఇంట్లోని వారి వీపులు విమానం మోత మోగే ఉంటాయని నమ్మడమే కాక, పాకి ఖాన్ ఇంట్లోని తీవ్రవాదుల నుతక్షణమే వేళ్ళ గొట్టాలని లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని , పాకి ఖాన్ ను హెచ్చరించడంతో దిక్కు తోచని స్థితిలో దిగాలు ముఖం వేసుకుని కూర్చున్నాడు పాకి ఖాన్. 

   ఇందులో కోసం మెరుపు ఏమిటంటే తమ ఇంట్లోనుంచి తీవ్ర వాదులను వేళ్ళ గొట్టామని తన కుటుంబ సబ్యులకు పాకి ఖాన్ చెప్ప్పాడట . అది నిజమో కాదో కాలమే చెప్పాలి మరి!.ఏది ఏమైనా రామయ్య గారి దెబ్బకు పాకీ  ఖాన్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది అనడం లో సందేహమే లేదు .  


Sunday, October 2, 2016

గొర్రె కొవ్వితే కసాయి వాడిని కుమ్మేసుద్ది !!


గొర్రె క్రొవ్విన కొద్దీ కసాయి వాడికి లాభమే అనేది  పాత సామేత. క్రొవ్విన గొర్రె ను కసాయి కత్తి కూడా ఏమి చేయలేదు అని నిరూపించింది ఒక గొర్రె పొట్టేలు. అది ఏమిటి క్రింది వీడియోలో  చూడండి . 

                                                                         


                              

Friday, September 30, 2016

బ్రహ్మం గారు తన దివ్యదృష్టితో ఈ దృశ్యం చూడటం వలన ఆ మాట అన్నారా !!?

                                                                   


                           బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో అనేక వింతలు విశేషాలు గురించి చెప్పారు .16 వ శతాబ్దానికి చెందిన  అయన గారు చెప్పిన వింతలు విశేషాలు అన్ని అయన స్వయంగా తన దివ్యదృష్టితో చూసి చెప్పినవే . కాకపొతే అయన చూస్తున్న భవిష్య దృశ్యాన్ని ఆయనకు అర్ధమైన రీతిలో చెప్పడం జరిగింది కాబట్టి , ఇప్పటి మనకు అయన చెప్పేవి  అర్ధం కాక అయోమయంగా ఉండవచ్చు. ఉదాహరణకు :

   అయన గారి కాలజ్ఞానం లో  ఒక చోట "రెక్కల కోడి వచ్చును, దాని రెక్క విసురుకు వేల  మంది చచ్చును అని చెప్పినట్లు ఉంది. కోడి రెక్క విసురుకు వేలమంది చావడమేమిటి? ఇదేదో అభూత కల్పన కాకపొతే అనుకోవచ్చు ఎవరైనా . కానీ ఆధునిక కాలం లో  యుద్దాలు జరిగే సమయం లో ఉపయోగించే బాంబర్ విమానాలు చూడటానికి ఎలా ఉంటాయి ? రెక్కలు విప్పి ఎగురుతున్న కోడి లేక పక్షి లాగా  ఉంటుంది కదా! మరి ఆ బాంబర్ విమానాలు నుండి ప్రయోగించే బాంబులు వలన భూమి మీద ఉన్న జనం హతం అవుతుంటే , అదేదో రెక్క విసురు వలననే చేస్తున్నట్లు అనిపించడం వలననే బ్రహ్మం గారు ఆ విధంగా చెప్పి ఉండాలి. 

                                                                             

 అలాగే బ్రహ్మము గారు చెప్పిన ఇంకొక వింత . "ఆవు కడుపున పంది పుట్టును" అనేది . ఇదెలా చెప్పి ఉంటారో ఊహిస్తే,  అయన  గారి దివ్య దృష్టిలో ఆవు పందికి జన్మ ఇస్తున్న దృశ్యం కానీ , లేక పై చిత్రం లో చూపిన విధంగా ఆవు పాలు తాగుతున్న పంది   దృశ్యం కానీ కనిపించి ఉండాలి. అందుకే అయన ఆ విధంగా తన కాల జ్ఞానం  లో చెప్పి ఉంటారు. మరి ఆ విధంగా చుస్తే బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమయినట్లే కదా ! కరీం నగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణం లో జరిగిన పై వింతను  గమనిస్తే "ఆవు కడుపున పంది పుట్టిందా " అని అనిపించక మానదు కదా?!!

Wednesday, September 28, 2016

అమ్మా! ఈ నలబై యేళ్ళుగా నేను లైంగిక దోపిడికి గురవుతూనే ఉన్నాను!


                                                                 
                                                               

 రోజూ ఉదయం ఆరు ఇంటికి వచ్చే పనిమనిషి "రాములమ్మ" రాలేదు. నాకు చచ్చేంత విసుగ్గా ఉంది. రాములమ్మ పనికి కుదిరిన దగ్గర్నుంచి, నాకు చాలా  పని బారం తగ్గి సుఖానికి అలవాటు పడటం వలన ,ఒక్క రోజు పని మనిషి రాకపోయినా న గుండేల్లో రైళ్లు పరుగెడ్తూ ఉంటాయి. టైం ఏడు అయింది. ఇక ఈ రోజు రాములమ్మ రాదని నిర్ణయించుకుని మనసుకి సర్ది చెప్పికి ఒళ్లు ఒంచాను.

 ఈసురో మంటూ పనులన్నీ అయిపోయాయి అనిపించేసరికి పన్నేండు అయింది. ఇక కోంచం నడుం వాలుద్దామని మంచం మీద పడుకున్నానో లేదో, బయట తలుపు కొట్టిన చప్పుడు అయి, చిరాకుగా వెళ్ళి తలుపు తీసాను. ఎదురుగా రాములమ్మ!

  ఒక్క సారిగా అరచినంత పని చేసాను"ఏమైంది రాములమ్మ? పొద్దునే రాలేదు"

  "అన్యాయం అయిపోయానమ్మా" ఒక్క సారిగా నన్ను కావలించుకుని ఘొల్లు మంది రాములమ్మ.

  "ఏమైంది రాములమ్మా" మనసెందుకో కీడు శంకిస్తుంటే అడిగాను.

  "అయ్యో నన్నాడు  నలబై  యేండ్లుగా  దోపిడి చెస్తుండటమ్మా" బోరుమంది

 రాములమ్మా.

 అదిరి పడ్దాను  నేను. "ఎవడే వాడు" కోపంగా అడిగాను.

 ఇంకెవడూ , నా మొగుడే.

 ఏమిటీ? నీ మొగుడా? అనుమానంగా అడిగాను.

  అవునమ్మా ఆడే,అని తలచుకుని తలచుకుని ఏడవ సాగింది రాములమ్మ.

  రాములమ్మ ఏడుపు వెనకాల  ఏదో పెద్ద కదే ఉందనిపించింది. నెమ్మదిగా ఆమెను కూర్చోబెట్టి బోజనం పెట్టాను. తిన్న తర్వాత అసలు ఏమి జరిగిందో చెప్ప మన్నాను. ఆమె చెప్పినది విన్న తర్వాత నాకు నోట మాట రాలేదు. అలాగే మ్రాన్పడి పోయాను. రాములమ్మ తెల్లారి టైం కి వస్తాను అని చెప్పి వెళ్ళి పోయింది. ఇంతకీ ఆమె చెప్పిన విషయం ఏమీటంటే,

  రాములమ్మకు చిన్న తనంలోనే పెండ్లి సంబందం వచ్చింది.  ఆమె మొగుడు భద్రయ్య కొంచం చదువుకోవటమే కాక గడుగ్గాయి గా  పేరు పడిన  కుర్రాడు. అందుకు రాములమ్మని ఇవ్వడానికి తల్లితండ్రులు సందేహిస్తుంటే, మద్య వర్తి" అమ్మాయి యుక్తవయస్కురాలు అయ్యాకే  పెండ్లి చెద్దాం. ముందు పప్పన్నాలు తినండి. ఒక వేళ పెండ్లి నాటికి మీకు ఇష్తం లేక పోతే అప్పుడే సంబందం కాన్సిల్ చేసుకోవచ్చు, మీ రెండు కుటుంబాలు కలిస్తే ఇద్దరికి మంచిగుంటుంది. ఆ పైన మీ ఇష్టం".అంటే సరే అని సంబందం కుదుర్చు కున్నారట. ఆ తర్వాత రాములమ్మ యుక్త వయస్కురాలవడం, ఆ పైన ఏ అబ్యంతరం లేకుండా వారి పెండ్లి జరగటం అయిపోయాయి. ఆ తర్వాత అందరి సంసారాల మల్లేనే అప్పుడప్పుడు కీచులాడుకోవడం, అలిగి పుట్టిటీంటికి వెళ్ళడం, బ్రతిమాలో, పెద్దల జ్యోక్యంతోనో  తిర్గి కాపురానికి రావడం, ఇలా గడుస్తూనే ముగ్గురు బిడ్డల తల్లి అయింది రాములమ్మ.

  నిజానికి రాములమ్మకు పని చేసి పొట్ట పోసుకోవలసిన అవసరం లేదు. పెడ్ద అబ్బయి కాలరీస్ లో పని చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. తక్కిన ఇద్దరు ఆడపిల్లలకు పెండ్లిల్లు అయి వారి మొగ్గుల్లతో చక్క గా కాపురం చేసుకుంటున్నారు. కొడుకు కూడా తల్లితండ్రులకు నెల నెలా ఖర్చులకి సరి పోను పంపిస్తున్నా, రాములమ్మే కోడుకు కి తెలియకుండా మా ఇంటిలో పని చేస్తుందట. రాములమ్మ మొగుడికి ఇప్పుడు అరవైఅయిడేళ్లు. ఇంటి దగ్గరే ఉంటాడు.

  ఈ మద్య రాములమ్మ ఉండే కాలనీలోని ఆడాళ్లందరికి కలిపి ఒక సంఘం పెట్టారట. ఆ సంఘం లో ఆడాళ్ళ హక్కులు, ఆడోళ్ళు మీద మొగుళ్ళు చేసే దౌర్జన్యాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలిపారట! వారందరిలో ఒకామె చెప్పిన ఉపన్యాసం రాములమ్మని ఆలోచనలో పడేసిందట. ఆమె చెప్పిన దాని ప్రకారం "ఆడదానికి దేనిలోను స్వాతంత్ర్యం లేదు. అన్నిటీ లోను మగాడే జులుం చేసి తన కోరినట్లు ఆడది నడిచేలా చేస్తున్నాడు. చివరకు పడకింట్లో కూడా మాగాడిదే పై చేయట(?). అందుకని అటువంటి సంసారం ఇష్ట పూర్వకంగా చేసినది కాదు కాబట్టి, అది కూడా దోపిడి క్రిందే లెఖ్ఖట!కాబట్టి ఇప్పుడు అటువంటి మొగుళ్ళకి  ఎదురు తిరగాలట, అవసరమైతే విడాకులు ఇవ్వాలట!

 ఇది విన్న తర్వాత రాములమ్మకి తను రోజు మొగుడి క్రింద ఎంత దోపిడికి గురి కాబడిందో తెలిసి గుండే చెరువు అయిందట! ఎంత అవమానం! ఇక ఈ అవమానం భరించడం తన వల్ల కాదట. అందుకే తన ముసలి మొగుడికి విడాకులు ఇద్దామని పెద్దమనుషులు పంచాయితి పెడితే, కాలనీ స్త్రీల సంఘం ఒత్తిడితో కాలనీలోని పెద్ద మనుషులు విడాకులు ఇప్పిస్తాను అని ఒప్పుకున్నాడట. దానికి రాములమ్మ మొగుడు తన కొడుకు ఇచ్చే డబ్బులతో ఎలాగో బ్రకుతాను అంటే దానికి రాములమ్మ తరపు వారు ఒప్పుకోలెదట. ఇన్నాళ్ళు రాములమ్మని దోచుకుందే కాక, ఇప్పుడు రాములమ్మ కొడుకు డబ్బులు దోచుకోవడానికి ముసలాడు కుట్ర పన్నాడు అని అన్నారట. పంచాయితీ వచ్చే వారం కి వాయిదా వేసారట. అందుకే రాములమ్మ ఈ రోజు పని లోకి రాలేదట. అదీ రాములమ్మ మొగుడి  నలబై యేండ్ల దోపిడి కద.

 ఆమె కద వింటుంటే నాకెక్కడో ఇలాంటి కదే ఈ మద్య విన్నట్లు ఉంది, ఎక్కడబ్బా? అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను.          
                                                                                                                                                                    (28/9/2013 Post Republished).                      



Sunday, September 25, 2016

హఠాతుగా ప్రత్యక్షమైన దెయ్యం కారు! ఎక్కడి నుండి వచ్చిందో చెప్పగల విజ్ఞానులు ఎవరు?

                   
                                                                           
                               

                                 ఆస్ట్రేలియాలో ని ఒక రోడ్డుమీద గొప్ప విచిత్రం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తూ తన ఎదురుగా వెళుతున్న కారు గమనాన్ని వీడియో షూట్ చేస్తున్నాడు. ఒక మలుపు దగ్గర హఠాతుగా తన కారు ముందు ఉన్న కారు ఆగింది. కారణం ఏమిటంటే సదరు  కారు ముందు వెళుతున్న వ్యాన్ ను బూడిద రంగు ఆస్ట్రా కారు ఒకటి హఠాతుగా ఢీకొనడమే కాక 180 డిగ్రీ లలో తిరిగిపోయింది. ఆ తర్వాత ముందున్న కారు చిన్నగా టర్నింగ్  తీసుకుని ఆ ఢీకొట్టిన కారు పక్కనుంచి వెళ్లడం తో ఈ  వీడియో ఉన్న కారు కూడా కదలి వెళ్లి పోయింది. ఇది మాములు విషయమే కదా? ఇందులో విశేషం ఏమిటంటారా? అయితే చూడండి .

     మీరనుకున్నట్లే అది మామూలు విషయమే అని వీడియో తీస్తున్న మిత్రుడు కూడా వెళ్ళిపోయాడు. కానీ ఇంటికి వెళ్లి వీడియో పరిశీలిస్తున్నప్పుడు ఆ విచిత్రం తెలిసింది.  సదరు మలుపు దగ్గర  ముందు నుంచి టర్న్ అవుతున్న కారు , వ్యాన్,  మరియు  ఎదురుగా వస్తున్నా అన్ని కారులు కనిపిస్తున్నాయి. కానీ వ్యాన్ ను డి కొట్టిన కారు మాత్రం అందులో కనిపించలేదు. అది హఠాతుగా ప్రత్యక్షమై వ్యాన్ ను డి కొట్టి ఆగాక మాత్రమే కనిపించింది. అందులోనుంచి ఎవరో దిగారు కూడా . మరి అప్పటి వరకు రోడ్డు మీద కానీ , ఆ పరిసరాలలో కానీ లేని కారు హఠాతుగా ఎలా ప్రత్యక్షమైంది ? అది ట్రాఫిక్ లో వ్యాన్ ను ఢీకొట్టబట్టి ఆగింది కానీ నిర్మానుష ప్రాంతం లో అయితే దానిని గుర్తించే అవకాశం  లేదు.

                    అటువంటి కారు ను తెలుగు సినిమాలు చూసే  మనం  "దెయ్యం కారు " అంటామేమో కానీ , సదరు వీడియో తీసిన వ్యక్తికీ ఇంగ్లీష్ సినిమాలు చూస్తాడు అనుకుంటా , అందులో  చూపించే అడ్వాంస్డ్ సైన్స్ లాగా  "టెలిఫోర్టేషన్  " విధానం ద్వారా ప్రత్యక్షమైన కారు అంటున్నాడు . అంటే మనం దృశ్య , శ్రవణాలను ఎలాగైతే ఒక చోట నుండి మరొక చోటుకి ప్రసారం చేస్తున్నామో  , అలాగే వస్తువులను కూడా   ఒక చోటు నుండి మరొక చోటుకి క్షణాల్లో లేక నిమిషాల్లో  పంపే ప్రక్రియ అన్న మాట . ఇదేలాగో వివరంగా తెలుసుకోవాలంటే గూగుల్ సెర్చ్ ద్వారా తెలుసుకొండి. లేదూ , నేనే చెప్పమంటే నాకు వీలున్నప్పుడు వివరంగా చదివి ఇదే బ్లాగులో చెపుతాను . అందాక ఈ విచిత్రాన్ని క్రింది వీడియోలో చూచి అశ్చర్య పడుడి !..





                                                                    

Friday, September 23, 2016

."కల్లూరి గుట్టల" మీద బ్రతుకుతూ , "కల్ల కొండలకు " మొక్కడమేందిరా?

                                                          

                                              మా వూరి ప్రక్కనే నరసింహ రావు పేట అనే ఊరు ఉంది . అ ఊరిలో తెలగ వారి కుటుంబాలు ఎక్కువుగా ఉన్నాయి . మా పొలం ప్రక్కనే వారి పొలాలు ఉండేవి కాబట్టి వారితో మాకు పరిచయాలు ఉన్నాయి . అప్పుడప్పుడు  వారు పిలిస్తే వాళ్ళ ఇండ్లకు కూడా  వెళ్ళటం జరిగేది. ఒక రోజు అప్పయ్య  అనే స్నేహితుడు పిలిస్తే వారింటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో కల్లూరు గుట్ట దేవతకు సంబందించిన కొలువు కొలిచారట , దాని సందర్బంగా జరుపుఇతున్న పంక్షన్ అది. దానికే నాతో పాటు మరి కొంత మంది ప్రెండ్స్ ని పిలిస్తే వెళ్ళటం జరిగింది.

ఇక్కడ "కల్లూరు గుట్టలు " గురించి కొంత తెలుసుకోవాలి. మా ఊరికి తూర్పున పది కిలో మీటర్లు దూరంలో వ్యాపించి ఉన్న గుట్టల శ్రేణిని "కల్లూర్ గుట్టలు" అని పిలుస్తారు. ఈ  గుట్టలను అనుకుని అనేక గ్రామాలు ఉన్నా , పెద్ద గ్రామం , ఇప్పట్టి మండలం అయిన కల్లూరు కు దగ్గరలో ఉన్నందు వలన వీటికి ఆ పేరే వచ్చింది. ఈ  గుట్టలు మీద "టేకు" జాతి తప్ప , మిగతా అన్ని వృక్ష జాతులు లభిస్తాయి. మా ఊరుకు దగ్గరలో చిన్న చిన్న గుట్టలమీద సహితం టేకు చెట్లు ఉంటాయి కానీ, అంత పెద్ద గుట్టలమీద టేకు చెట్లు కనపడక పోవటం విశేషం. మా చుట్టు ప్రక్కల ఊర్లు అయిన అన్నారు గూడెం, నరసింహా రావు పేట, ఏనుకూరు గ్రామ రైతులకు కావలసిన కలప , వెదురు, చిల్లమండ, బడితెలుకు ఎక్కువుగా ఈ  గుట్టల మీదే ఆదారపడే వారు. ఇక పోతే అన్నారుగోడేం, నరసింహా రావు పేట గ్రామానికి చెందిన చాలా కుటుంబాల వారు ఈ గుట్టల మీదే ఆదారపడి బ్రతికే వారు. వారు ఉదయం కోడి కూయగానే లేచి , గొడ్డళ్ళు బుజాన వేసుకుని , కల్లూరు గుట్టలకు వెళ్లి , అక్కడ రైతులకు కావాల్సిన కలపను తీసుకుని వచ్చి, గ్రామాలలో రైతులకు ఇస్తూ తమ జీవనోపాది సంపాదించుకునే వారు. కాబట్టి ఆ కుటుంబాల వారందరికి "కల్లూరు గుట్టలు" తమకు బ్రతుకు తెరువు చూపుతున్న దేవతలు . అందుకే వాటిని దేవత రూపం లో కొలుపులు కొలుస్తూ పూజించడం వారికి ఆచారం. వారి ఇండ్లలో ఎవరైనా మగ పిల్లలు పుడితే ముందుగా ఆ పిల్ల వాడిని కల్లూరు గుట్టల వైపు పెట్టి నమస్కరించి, తమ పిల్లవాడికి ఏ లోటు లేకుండా చూడాలని మొక్కే వారట. అంత సెంటిమెంట్ వారికి!

                         అయితే ఇక్కడ మేము వెళ్ళిన మా మిత్రుడి ఇంట్లో ఒక చిన్న పాటి గొడవ మా మిత్రుడు తండ్రికి , తమ్ముడికి జరుగుతుంది. మా మిత్రుడు తమ్ముడు డు కొంత కాలం క్రితం వేరే మతం లోకి వెళ్ళాడట. ఆ మత  పద్దతుల ప్రకారం వేరే దేవతను కానీ, దేవుళ్ళను కాని పూజించకూడదు అంట. కనీసం బొట్ట కూడా  పెట్టుకోకూడదు అంట! అటువంటి వాటికి చాలా దూరంగా ఉండాలట . లేకుంటే సైతాన్ పట్టి పీడీస్తాడట! అందుకే ఇంటి పక్కన  ఉన్న ఆతను ఈ  పంక్షన్ కి రాలెదు. కానీ మా మిత్రుడు ఇంటికి వచ్చిన బందుమిత్రులను చూసి వారి పిల్లలు పెదనాన్న  ఇంటికి వెళతామని గొడవ చేస్తుంటే , వారు ఇక్కడకు  రాకుండా చెయ్యటానికి వారి మత ఆచారాల ప్రకారం పూజించే "విదేశి  కొండలు " పోటో ఒకటి పెట్టుకుని పూజలు చెయ్యడం మొదలుపెట్టాడు. అది చూసిన మా మిత్రుడు తండ్రికి కోపం నసాళానికి అంటి చిన్న కొడుకుతో గొడవ పెట్టుకుంటున్నాడు. " ఒరే వెదవా , పొద్దున్న లేచింది మొదలు సాయం కాలం వరకు నువ్వు గడిపేది కల్లూరు గుట్టల మీద. నీకు, నీ పెళ్ళాం బిడ్డలకు ఇంత  కూడు  పెట్టేది ఆ కల్లూరు గుట్ట దేవత అయితే నువ్వేదో ఆ "కల్ల  గుట్టలు " కు మొకుతావేందిరా అని తిడుతూ నానా హంగామా చేస్తుంటే మేము సర్ది చెప్పి, ఎవరి విశ్వాసాలు వారివి అని నచ్చ చెప్పటానికి ప్రయత్నించిన ఆ పెద్దాయన శాంతించలేదు. " మీకు తెలియదయ్యా, నవాబుల కాలం నుండి మాకు కల్లూరు గుట్టలే దేవతలు. వారు కూడ మా నమ్మక్కాన్ని గౌరవించారు కానీ ఇదేమి మాయదారి కాలమో , ఆ గుట్ట ల మీద ఆదారపడి బ్రతుకుతూ , వేరే దేశంలో  ఉన్న గుట్ట దేవతను కొలవడమేమ్ది? అలా అంత నమ్మక్క్జం ఉంటే ఆడికే పోయి బ్రతకాల , ఈడేందుకు ? అలా చేసి అలా చేసి , ఏదో ఒక నాడు మా ఆచారం అంత మాయం చ్జేస్తారు,   . అని ఆ ఆ పెద్దాయన అంటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆ పెద్దాయనకున్న ఆలోచనలో పదవ వంతు కూడా  మనలో చాలా మందికి లేదనిపించింది.

                                     ఇది జరిగి చానాళ్లు అయింది. మన ఆచారాలు సంప్రదాయాలు మాత్రమే దాడికి గురవుతూ , అన్య మతాలూ మరింతగా విస్తృత మవడానికి అవి కారణమవుతున్నాయి. ఈ  దేశ వనరుల మీద బ్రతుకుతూ, అన్య దేశాలను , అక్కడి ప్రాంతాలను ఆరాద్య ప్రాంతాలుగా కొలవడం అంటే అది కచ్చితంగా ఈ  ఇంటి తిండి  తిని ఎదురింటోడికి ఉపయోగపడటం లాంటిది . ఎప్పటికైనా ఇటువంటి విదానలతో మన దేశ సమగ్రతకు ముప్పే అని గ్రహించటం విజ్ఞుల లక్షణం. స్తానిక పరిసరాలను, నదులు, కొండలును ఆరాదించడం అనేది మనలోని దేశ భక్తికి కూడా నిదర్శనం.

                           మా ఊరు ప్రక్కనే ఉన్న గుట్ట ని నరసింహ స్వామి గుట్ట అంటారు. కారణం ఆ గుట్ట మీదే మా ఇల వేల్పు శ్రీ లక్ష్మి నరసింహా స్వామి వెలిసాడు కాబట్టి. అందుకే ఆ గుట్ట ని ఎంతో పవిత్రంగా చూస్తారు భక్తులు. ఆ గుట్ట మరియు నరసింహా స్వామీ దేవాలయ విశేషాల కోసం ఈ  క్రింది వీడియో లింక్ ని క్లిక్ చెయ్యండి
                                                   


                   

                                           (8/12/2013 Post Republished).

Thursday, September 22, 2016

తిరుమల కొండ మీద "పంది " సంచరిస్తుందని "వీర బ్రహ్మం " గారు చెప్పిన మాట ఈ విధంగా నిజం అయిందా!!

                            


హిందువుల ఆరాధ్య దైవమైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామీ వేంచేసిన  తిరుమల  పరమ పుణ్య పవిత్ర క్షేత్రం . ప్రపంచం లోని అన్ని మతాల వారు ఆ దేవ దేవుని భక్తీ ప్రపత్తులతో కొలుస్తున్న తీరు ఆ స్వామీ మహత్యానికి నిదర్శనం . మరి అటువంటి తిరుమల కొండ మీదకు వెళ్ళడమే కాక , సాక్షాత్తు ఆ దేవ దేవున్ని తూలనాడి , కోట్లాది హిందూ భక్తుల మనోబావాలను గాయపరచిన వాడు  ఈ తెలుగు గడ్డ మీద ఇంకా శిక్షింప బడకుండా  ఉన్నాడు అంటే అది  ఇండియా లాంటి కుహానా సెక్యులర్ వాదులు  ఉన్న దేశం లొనే  సాద్యం . 

    మాజీ ముఖ్య మంత్రి గారి పుణ్యమా అని  తెలుగు గడ్డ మీద విచ్చలవిడిగా కిరస్తానీ మతం కు చెందిన  కొంత మంది  మత మార్పిడి  కార్యక్రమాలు పెచ్చు మీరి పోయాయి.   సాక్షాత్తు ఏడుకొండల స్వామీ నే రెండు కొండలుకు పరిమితం చేసే తెంపరి తనం అన్య మతస్తులకు కలిగిందంటె అది ఖచ్చితంగా ఆ మహానుబావుని చలవే. హిందూ మత విస్వాసాల మీద నమ్మక్కం లేని వ్యక్తులను ధర్మకర్తలుగా, ఎండోమేంట్ అధికారులుగా నియమించబట్టె ఇటువంటి ఆగడలు ఏడుకొండలు మీద ఏదో ఒక రూపం లో నిత్యం జరుగుతున్నాయి. ఇంత వరకు మత మార్పిడి వ్యవహారాలలో చట్ట విరుద్దంగా ప్రవర్తించిన వారికీ శిక్షలు విదించిన దాఖ్హాలలు లేవు. కారణం అటువంటి విషయాలలో కేసులు పెట్టె టప్పూడు ఉన్న శ్రద్ద, ప్రాసిక్యూట్ చేసేటప్పుడు ఉండక పోవడమే. మరి అటువంటప్పుడు చట్టాలు ఎందుకు? ఎవరి కళ్ళ నీళ్ళు తుడవడానికి? తిరుల కొండ మీద ప్రభుత్వ జ్యోక్యం తొలగించి నిఖార్సైన హిందూ సంస్తలకు పాలనా బాద్యత అప్పగించి చూడండి. ఇటువంటి తప్పుడు మత ప్రచారాలు చేసే వారు కొండ ఎక్కడానికి సాహసించగలరా ? దేవ దేవున్ని ధూషించి బ్రతికి బట్ట కట్ట గలరా?

  ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటె  కిరస్తాని మతం  న చెందిన వ్యక్తి ఒకతను తిరుమల కొంద మీదకు వేళ్ళి ఆ దేవ దేవున్ని, ఆయనను పూజించే భక్త కోటి వీస్వాసాలను చాలా తీవ్రంగా అవమానిస్తూ, దానిని ఒక వీడియోగా తీయడమే కాక, దానిని వీదేశాలలో ఉన్న మత మార్పిడి స్పాన్శర్ లకు పంపి అక్కడ నుండి డబ్బు తెప్పించుకుని ఇక్కడ తన దుష్ట కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. దానిని అతడు య్యూ టూభ్ లో పెట్టి మరీ హిందూ జాతిని అవమానిస్తున్నాడు అంటె అది ఇండియాలో మరియు తెలుగు గడ్డ మీదే సాద్యం అని అతనికి గట్టి నమ్మఖ్ఖం కాబట్టి. వీడియోలో అతను ఏమి వాగాడొ తెలుసుకోవాలంటె క్రింది విడియోను క్లిక్ చేసి చూడవచ్చు. ఈ వీషయంలో అతను, అతనితో ఉన్నవారి మీదే కాక ఇతువంటి అప్రాచ్యపు పనులకు ప్రోత్సాహించిన అతని విదేశి స్పాన్సర్ ల మీద కేసు బుక్ చేసి వారిని శిఖ్షింప చేయగలందులకు తగిన చర్యలు తీసుకోవలసిందిగా ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడమైనది.

 బ్రహ్మం గారి  కాల జ్ణానం లో ఒక చోట ఒక "పంది" తిరుమల కోండ మీద సంచరించి ఆ ప్రదేశాన్ని పాడు చేస్తుందని ఉంది. బహూశా అది ఈ వ్యక్తి గురించే కావచ్చు. ఎందుకంటె పంది సంచారమ్ ని మలినానికి ప్రతీక గా బావిస్తాం. ఇటువంటి దైవ దూషకుడు వలన తిరుమల అపవిత్రం అయింది. కాబట్టి శుద్ది కార్యక్రమాలు చేపట్ట వలసిన అవసరం ఉంది. ఇకనుండి ఇతువంటి వారి పట్ల దేవస్తానం అధికారులు అలెర్ట్ గా ఉండాలి.         

                                                                        

                                                                       

Wednesday, September 21, 2016

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "చండాల" పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.


                                                            
                                                            

 నిన్న దమ్మున్న చానల్, దుమ్మురేపే చానల్ లో ఒక స్వామి గారి లీలలు ప్రసారం చేసారు. పాపం, చానల్ వారు ఊహించినట్లు అది బ్లాస్ట్ కాకపోవడానికి కారణాలు ఎన్నున్నా అవి మనకు అనవసరం. కాని వారు ప్రసారం చేసిన అంశాలలో మాత్రం ఒకటి ఆస్చ్యర్యం కలిగించింది.

 ఒక స్వామీ వారు. చిన్నప్పుడు జులాయ్గా తిరిగినా పెద్దాయ్యకా, ఆయన ఒడ్డూ, పొడుగూ చూసి మూడు సినిమాలలో చాన్సులు ఇస్తే అవి కాస్తా ప్లాప్ అయ్యాయట. అంతే ఒక బ్రహ్మాండమైన నెట్వర్కుతో స్వామీజీ అవతారం ఎత్తితే కోట్లరూపాయసంపాదన అట. ఈయన గారిదగ్గరకు సంపన్న వర్ఘాల స్తీలు వచ్చే వారట. వారి సమస్య ఏమిటంటే , వారి కాపురాలు సజావుగా సాగడం లేదు కాబట్టి, వారి భర్తల మనసు మార్చేలా ఏదైనా పూజలు చెయ్యమని స్వామీ వారిని అడిగే వారట!.

  దాన్కి సదరు స్వామ్ వారు "యోని పూజ" ఒక్కటే మార్గమని సెలవిస్తే అందుకు సరే అని చేయించేవారట ఆ కలిగిన కాంతలు. యోని పూజకు ముందు వారు ఒంటిమీద నూలుపోగు లేకుండా నగ్నంగా స్వామీవారి సమక్షంలో కాళీకా మాత విగ్రహం ముందు కూర్చో వాలట. ఆ తర్వాత పూజ చేసి పంపించేవాడట. అలా పూజ చేయించుకున్న వార్ కాపురాలు కుదుటపడ్డాయో లేదో కాని, అత్యాచారం(?) మాత్రం గ్యారంటీగా జరిగేదట స్వామీగారి చేత.

 ఏమండీ! నాకు తెలియకడుగుతా! భర్తతో సంసారం బాగుండాలని ఏ ఆడపిల్లైనా  పరాయిమగవాడి ముందు నగ్నంగా పూజలు చేయించుకుంటుందా? నాకు తెలిసి అటువంటివి తంత్ర విద్యలు అంటే బ్లాక్ మాజిక్ ఒకరి మీద ఆదిపత్యం కోసం చేసే పూజలు అవి. అంటే తన భర్త తన చెప్పుచేతుల్లో ఉండాలని బావించే డబ్బున్న వారు చేసే వికారపు చేష్టలు ఇవి. వారు దానికోసం ఏదైనా చేస్తారు. నిజంగా భర్తని  కావాలనుకుంటే, ఒక్కరోజు ఆయనకి మనసు మెచ్చేలా ప్రేమతో  పూజ చేస్తే, పాపం పిచ్చి మొగుడు మీ జీవితాంతం  మీరు కోరుకున్న రీతీలో పూజలు చెయ్యడూ!

   దాంపత్యానికి  కావల్సింది ప్రేమా అనురాగాలు. సంసారానికి కావల్సింది సర్దుబాటు గుణం. ఇవి లేకుండా మొగుడు తమ గుప్పెట్లో ఉండాలని సన్నాసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి "చండాల" పూజలు చేస్తే ఒల్లు గుల్ల! ఇల్లు గుల్ల! మెడలు మెరిపించే బంగారం కాదు ఆడదానికి కావాల్సింది, మెదళ్ళు మెరిపించే జ్ణానం. అది లేకపోతే బ్రతుకు "చండాలమే"!

                                             (11/7/2013 Post republished)

Tuesday, September 20, 2016

అక్కినేని గారు దేవుణ్ణి నమ్మారు అనటానికి "నాగ దేవుడు" సెంటిమెంటే సాక్ష్యం . .

                 

                                       (స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినోత్సవ సందర్భంగా పునః ప్రచురణ చేయడమైనది .)                                   

చాలామంది, దివంగత నటులుశ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారికి దేవుడు అంటే నమక్కo లేదు అనుకుంటారు . అయన గారు కూడా ఒక ఇంటర్వ్యూ లో తనకు దేవుడు అంటే పెద్దగా నమ్మకం లేదని చెప్పారు తప్పా , తనకు అసలు నమక్కం లేదని చెప్పలెదు. అయన గారికి దేవుడు మిద అపారమైన నమ్మక్కం  ఉందని చెప్పటానికి అయన గారికి ఉన్న "నాగ" సెంటిమెంటే ఉదాహరణ .
 శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారు , ఆయన 1923 సెప్టెంబర్ 20 వ తేదీ కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురం లో జన్మించాడు. చిన్ననాటినుండే నాటకరంగంవైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించాడు. అక్కినేనితో అన్నపూర్ణ వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు లో 1933 ఆగస్టు 14న ఆమె జన్మించారు. ఆమెపేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా, కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు నాగచైతన్య ,  సుమంత్, అఖిల్ సహా పలువురు నటీనటుల్నీ, దర్శకుల్నీ పరిచయం చేశారు.

 అయితే నాగేశ్వర రావు గారికి ఉన్న" నాగ " సెంటిమెంట్ పాజిటివ్ పలితాలు ఇచ్చిందనే చెప్పాలి. అయన తన సంతానం లో ఒక కుమారుడు పేరు నాగార్జున కాగా , కుమార్తె పేరు నాగ సుశీల . అలాగే నాగార్జున గారి కుమారుడి పేరు కూడా నాగ చైతన్యయే . అక్కినేని నాగేశ్వర రావు గారి తర్వాత ప్రజలలో మళ్లి  అంత పాపులారిటి సంపాదించిన వారు కుమారుడు నాగార్జున మరియు మనుమడు నాగ చైతన్యయె కావడం గమనార్హం . మిగతా వారు వీరంతా పాపులార్టి పర్సన్స్ కాదు. కాబట్టి నాగేశ్వర రావు గారి నమక్కాన్ని "నాగ దేవుడు" లేక నాగ దేవత వమ్ము  చెయలెదు.అని చెప్పవచ్చు.  అక్కినేని నాగేశ్వరరావు 91 సంవత్సరాల వయసులో 22-1-2014న మరణించారు. అయన గారి ఆత్మకు శాంతి కలగాలని అ దేవ దేవుణ్ణి ప్రార్దిస్తున్నాను.

          "మడిసన్నాకా కూసింత కళా పోసనే కాదు , కాస్తంత దైవ బక్తి కూడా ఉంటే లాబమే కాని , నష్టం ఏమి లేదు" అని అక్కినేని గారి కుటుంబాన్ని చూస్తె తెలియడమ్లా ?

                                                (24/1/2014 Post Republished).


  

Monday, September 19, 2016

'మానవుడు' వచ్చింది 'మంకీ ' నుండా ? ,' మార్స్ ' గ్రహం నుండా ? అని నేను ఊహించింది నిజమే అని రుజువు చేస్తున్న సైన్స్ ఆర్టికిల్ !

                                                           


నేను గత నవంబర్ 6 న క టపాని "'మానవుడు' వచ్చింది 'మంకీ ' నుండా ? ,' మార్స్ ' గ్రహం నుండా ? " అనే టైటిల్ తో ప్రచురించటం జరిగింది. ఆ రోజు ఎందుకో నాకు మనిషి అనేవాడు కోతి నుండి కాక మార్క్స్ గ్రహం మీద అభివృద్ధి చెందిన మానవుడిగా ఉండి అక్కడ పరిస్తితులు జీవించడానికి వీలు లేనంతగా మారి పోయాక అంటే అతి శీతలం   వలన కానీ ఇతరత్రా కారణాల వలన కానీ , స్పేస్ షిప్ ల ద్వారా సూర్యకుటుంబం లో తర్వాతి గ్రహం మరియు జీవరాసి మనుగడకు అనుగుణంగా ఉన్న భూమి మీదకు వచ్చి ఉంటాడని ఒక ఆలోచన వచ్చింది.

      ఒక వేళ అదే నిజమయితే భూమికి  కూడా కొన్నేళ్ళకి అదే పరిస్తితి కలిగితే  తిరిగి మానవుడు వెళ్ళవలసింది శుక్ర గ్రహానికే కానీ తిరిగి అంగారక గ్రహానికి కాదు కదా అని కూడా అనిపించింది. నా ఆలోచనకు ఆదారం ఏమిటంటే ఏ గ్రహం అయినా సరే సూర్యుడు లేక నక్షత్రానికి , ప్రస్తుతం భూమి ఎంత దూరంలో ఉందో అంతే దూరంలో ఉండి ఉంటే అక్కడ జీవరాసి కి అనువైన వాతా వరణం ఉండి ఉండాలి. మరి విశ్వం వ్యాపిస్తుంది నిజమే అయితే తప్పకుండా గ్రహాలు సూర్యుడికి రాను రాను దూరంగా వెళుతుండాలి కదా. అలాంటప్పుడు ఏ గ్రహం కూడా  స్తిరంగా ఒకే కక్ష్యలో తిరగటానికి వీలు లేదు. అలాంటి పరిస్తితుల్లో ప్రస్తుతం ఉన్న పొజిషన్ కి  భూమి ఏ మాత్రం సూర్యుడుకి  దూరంగా వెళ్ళిన వాతావణం మార్పులు చెంది భూమి మానవ  నివాసయోగ్యానికి పనికి రాకుండా పోతుంది. అప్పుడు అభివృద్ధి చెందిన మానవుడు తప్పకుండా వేరే గ్రహానికి వలస పోవడానికి ప్రయత్నిస్తాడు. అలా ఒకప్పుడు ప్రయత్నించి ,ఆ ప్రయత్నంలో బాగంగానే అంగారక గ్రహం మీద నుండి భూ గ్రహం మీదకు మానవుడు అడుగు పెట్టి ఉంటాడని నాకు కలిగిన ఊహ.దానిని తర్వాతి టపాలో రాద్దామనుకున్నాను. కానీ కొన్ని అనుమానాలు నివృత్తి కాక టపా రాయడం వాయిదా వేసాను.

  అయితే  ఈ  మద్య ఒక చోట ఒక విషయం చదివాను.ఎవరో స్పేస్ ట్రావల్  కంపనీ వారు 2023 నాటికి అంగారక గ్రహం మీద నివాస గృహాలు ఏర్పరచి, అక్కడికి మానవులను తీసుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారని, దానికి ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలు మంది అప్లికేషన్లు పెట్టుకున్నారని , అందులో మన హైదరాబాద్ వారు కూడా  ఉన్నారని చదివి ఆశ్చర్య పోయాను. ఇది నా ఊహకు విరుద్దం.ఒక సారి నివాస అర్హత కోల్పోయిన గ్రహంని అంటే సూర్యుని నుండి నియమిత దూరంలో ఉండాల్సినదానికంటే కొంచం దూరంగా జరిగి అక్కడి వాతావరణం శీతలంగా మారిపోయి, వాయువులు సైతం ఘనీబవించే స్తితిలో ఉన్న గ్రహాన్ని తిరిగి నివాసయోగ్యం చేయడం ఎలా సాద్యం.అక్కడి వాతావరణం ని మార్చడం అసాద్యం.  అదంతా సైన్స్ కు పేరున ప్రజల్ని మోసం  చేసి తమ స్పేస్ వ్యాపారం సంబందించి అసత్యాలు ప్రకటిస్తున్నారు అనిపిస్తుంది. లేదా . బహూశా ఇది మార్స్ గ్రహం పట్ల ప్రజలలో ఆసక్తి కలిగించేందుకు కొంతమంది పని కట్టుకుని ఇలా చేస్తుండవచ్చుఅని కూడా   అనిపిస్తుంది. కాబట్టి వీటి గురించి ఇంకా ఏమన్నా కొత్త సాక్ష్యాలు బయల్పడతయా అని ఎదురు చూ స్తున్నాను.

  నిన్న ఒక ఆర్టికిల్ చదవి చాలా ఆశ్చర్యం వేసింది. ఆ ఆర్టికిల్ ఏమిటంటే   Evidence suggests life on Earth could have started on Mars.  దానిలో మొదటి లోనే ఎమున్నదంటే "There is a theory that’s gaining a bit of traction in the scientific community, a theory which suggests that life on Earth could have come from Mars. Evidence in favor of this theory has been building over the last couple of decades, and it indicates that we all (could be) Martians." అని.

   కాకపోతే సైంటిస్టుల ఊహ ఏమిటంటే అంగారక గ్రహం మీద జీవం  పరిణామ దశలో ఉండగా అక్కడి  శిలలు కొన్ని అంగారక కక్ష్యలో నుండి తప్పి భూమి మీదకు వచ్చి పడ్డాయని,అట్టి శిలలు మీద ఉన్న జీవరాశి భూ గ్రహం మీద అభివృద్ధి చెంది ఇప్పటి జంతుజాలంగా ఆవిర్భవించిందని సూత్రీకరిస్తున్నారు. దిని ప్రకారం డార్విన్ సిద్దాంతం కూడా కరక్టే అని వారి ఊహా కావచ్చు. . ఇది నా ఊహకు విరుద్దం. ఖచ్చితంగ మానవుడు అంగారక గ్రహం మీద అభివృద్ధి చెందాకే ఈ  గ్రహం మీదకు అంతరిక్ష  నౌకల ద్వారా వచ్చి ఉండాలి. మన పురాణాలలో చెపుతున్న కదలకు అంగారక గ్రహం కు ఏదో సంబందం ఉండి ఉండాలి అనిపిస్తుంది. నా ఊహ నిజమే అయితే విశ్వంలో భూమి ని పోలిన  జీవ సహిత గ్రహాలు ఇంకా చాలా  ఉండి ఉండాలి. వాటి మీద జీవులు కూడా ఇప్పుడు మనం ఆలోచిస్తున్నట్లు ఆలోచిస్తూ ఉండాలి. వారి మద్య, మన మద్య ఏదో రకమైన కమునీకేషన్ సిస్టం ఉండి ఉండాలి. అవే మనకు ఆలోచనలు గ ఫ్లాష్ అవుతూ ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సైన్స్ పిక్షన్ సినిమా కద అవుతుంది .

  కానీ నాకు తెలిసినంత వరకు ఒకటి మాత్రం నిజం . సైంటిస్ట్ కంటే అద్యాత్మికంగా ఆలోచించే వారికే విశ్వ రహస్యాలు ముందుగా తెలుస్తుంటయి. వాటిని నిరూపించడమే సైంటిస్టులు చేసే క్రుషి .అంతే! మన పూర్వికులు కుజ గ్రహాన్ని బూమి పుత్రుడు గా బావించారు.ఏ పరిశోదనలు చెయ్యకుండా , సైన్స్ అనేది తెలియని రోజుల్లో వారికి ఆ ఆలోచన ఎలా వచ్చింది? భూమికి అంగారకుడుకి సంబందం ఉంటుందని ఎలా ఊహించారు? అదే విశ్వ రహస్యం. మనిషికి, ప్రక్రుతి కాలానుగుణంగా  అట్టి జ్ఞానాన్ని ఎరుక పరుస్తుంది అని నా దృడ అభిప్రాయం. అందుకే చాలా మందికి ఆపిల్ పండ్లు చెట్టునుండి క్రింద పడడం అనుభవమే అయినా , ఒక న్యూటన్ మాత్రమే దానిలోని రహస్యాన్ని కనుగోగలిగాడు. అయిన్స్టీన్ సైతం ఏ రోజు లేబరిటరిలోకి అడుగు పెట్టకుండానే విశ్వం యొక్క  రహస్యాలు కనిపెట్టగలిగాడు. ఇవ్వన్నీ సాద్యమవటానికి దృష్టిని సంబదిత విషయం మీద లగ్నం చేసి ఆలోచన చెయ్యడం లేదా ద్యానం  చెయ్యడం. . దానినే సమాది స్తితి అంటారు. అదే మన పూర్వికులు చేసింది! 

    పై ఆర్టికిల్ కోసం ఈ  లింక్ మీద క్లిక్ చెయ్యండి. http://www.fromquarkstoquasars.com/evidence-suggests-life-on-earth-could-have-started-on-mars/

 నేను ఇదివరకు పెట్టిన'మానవుడు' వచ్చింది 'మంకీ ' నుండా ? ,' మార్స్ ' గ్రహం నుండా ? టపా  కోసం ఈ  లింక్ మీద క్లిక్ చెయ్యండి. http://kalkiavataar.blogspot.in/2013/11/blog-post_6.html

                                                   (2/1/2014 Post Republished).