Tuesday, April 30, 2013

ముఖ్య మంత్రి గారూ, "బంగారు తల్లి"కి లక్షలు కంటే బయట "రక్షణ"ముఖ్యం.

                                                               

                                                                       

  అయ్యా ముఖ్య మంత్రి గారూ, తమరు నిన్న ఆంద్ర ప్రదేశ్ లోని ఆడపిల్లల కోసం "బంగారు తల్లి" అనే పదకాన్ని ప్రవేశ పెట్టి, వారికి ప్రోత్సాహక బహుమానంగా, బిడ్డ పుట్టినది మొదలు 21  వ సంవత్సరములు నిండేవర్కు సుమారు రెండు లక్షల పై చిలుకు ముట్టేట్టట్లు చట్టం చేస్తామనడం అందరికి ఆనందం కలిగించే విషయమే. కాని మీకు తెలుసు ప్రస్తుతం ఆడపిల్లల్ని వేదించే సమస్య "రక్షణ". కామ ప్రకోపిత మ్రుగాళ్ళ నుండి రక్షణ. అది కరువై ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తెలియని అత్యంత దీన పరిస్తితులో ఆడపిల్లలు ఉన్నారు అనేది మీరు కాదనలేని విషయం.

   తల్లి తండ్రులకు చెప్పుకుని రక్షణ పొందలేని స్తితిలో ఈ రాష్ట్రంలో కొంత మంది ఆడపిల్లలు, అది ముఖ్యంగా మీరుండే హైదరాబాద్ లోనే ఉన్నారని, వారు విదేశి "షేకులకు"," వన్ మంత్ వైఫ్" లుగా మారి చివరకు ఏమవుతున్నారో తెలియని పరిస్తిలో ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం. ఇది వారి వారి, అమ్మా బాబుల దన్నుతోనే జరుగుతుందని తెలిసి, మీ ఏలుబడిలో ఇటువంటివి కూడా జరుగుతున్నాయా అని ఆశ్యర్యపోతున్నాం.

  ఇకపోతే పసిపిల్ల నుండి, పండు ముదుసలి వరకు వావి వరసలు మరచి, పరమ నీచంగా వారి మీద ఎక్కడబడితే అక్కడ, చివరకు మరుగుదోడ్లలో కూడ "లైంగిక దాడులు జరుపుతున్న "కామ కీచకులు" నుండి రక్షించే వారెవరో తెలియక "ఓరీ బగవంతుడా! మమ్మల్నెందుకు మమ్మల్నెందుకు ఈ గడ్డ మీద ఆడబిద్దగా పుట్టించావు?మేమేమి పాపం చేశాం"అని మూగగా రోదిస్తుంటే అందరికి దిక్కనుకునే ఆ దేవుడు కూడా చేష్టలుడిగి చూస్తున్నాడు.మరి ఇటువంటి ఆక్రందనలు ఆ బగవంతుడి భూరూపమైన(రాజు దేవుడితో సమానం) తమకు వినిపించడం లేదా? పోని ప్రతిపక్షాలకు చెపుదామంటే వారు సీరియస్ గా పాదయాత్రలలో మునిగి పోయారు.వారు అధికారంలోకి వస్తే తప్పా ఏమి చెయ్యలేరట!. ఇక తెలంగాణా వారైతే వీటన్నిటికి మూల కారణం వలస పాలనే కాబట్టి, తెలంగాణా వస్తే తప్పా ఈ కీచక పర్వం ఆగదంటారు.

  మరి ఇటువంటి పరిస్తితులున్నఫుడు తమరు ఆడపిల్లలకు "రక్షణ" ఇచ్చే పదకాలు ప్రవేశ పెట్టకుండా, ఇరవైఒక్క సంవత్సారాల కాల పరిమితితో  "లక్షల" పధకం "బంగారు తల్లి" వల్ల ఒరిగేదేముంది?. మీరిచ్చే ఆ బహుమతిని అందుకోవడానికైనా స్వేచ్చగా ఆడపిల్లలు బయటకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళగలరా? అందుకే ముందు రక్షణ ఇవ్వండి. ఆ తర్వత ఏమిచ్చినా ! వాటిని అందుకోవడనికి "నిర్భయం"గా ముందుకొస్తారు.  అందరికీ సంతోషమే

దీనికి మేము సర్వదా క్రుతజ్ణులమై ఉండగలము. 

                                                                   ఇట్లు
                                                ఆంద్ర ప్రదేశ్   ఆడపిల్లల  శ్రేయోభిలాషులు   
                                                         

Monday, April 29, 2013

జగన్ గారు అదికారంలోకి వస్తే "చంద్రబాబు" గారి కి చెరసాల తప్పదా?

                                                                       
  ఇది కేవలం ఊహ జనితమైన ప్రశ్న అని కొట్టివెయ్యడానికి వీలు లేనిది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పరిస్తితులను లోతుగా పరిశీలిస్తే తప్పా ఇది బోదపడదు.

  ఉదాహరణకు మన పొరుగున ఉన్న తమిళనాడు నే తీసుకోండి. అక్కడ ప్రాంతీయ పార్తీలదే అధికార పీటం. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బి.జె,పి లు చెరొక ప్రాంతీయ పార్టీలకు కొమ్ము కాస్తాయి. అక్కడ ప్రాంటీయ పార్టీ అధినేతలైన జయలలిత, కరుణానిది గార్ల మద్య పచ్చ గడ్డి కాదు కదా ఏ గడ్డి వెయ్యకున్న భగ్గుమంటుంది. కరుణానిధి అధికారం లో ఉన్నప్పుడు అసెంబ్లీలో జయలలిత చీర గుంజి పరభవించారని పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత జయలలిత అధికారంలోకి వచ్చాక కరుణానిది ని పంచ ఊడిపోతున్నా కట్టుకునే అవకాశం ఇవ్వకుండా పోలిసులు అరెస్ట్ చేసి హింసించారని దుమారం చెల రేగింది. ఇదంతా ఒకరి పై ఒకరు వ్యక్తి గత, పార్టీ గత కక్షలతోనే చేయించారని తమిళ పత్రికల బోగట్టా!

  ఇప్పుడు మన రాష్ట్రం లో కూడ అదే సీనులను మనం చూడ వచ్చనుకుంటా!. రాజశేఖర్ రెడ్డి గారి మరణం వలన ఈ రాష్ట్రంలో రెండవ ప్రాంతీయ పార్టీ అవిర్భావం జరగటం, దానికి ఆయన కుమారుడు అధిపతి కావటం,చక చకా జరిగిపోయాయి. కాని ఆయన గారి ఖర్మ బాగోక అవినీతి కేసులలో విచారణ నిందితుడిగా జైల్ కెళ్ళవలసి వచ్చింది. ఇదంతా ఒక కుట్ర అని, ఆ కుట్ర వెనుక  అధికారపక్షం మాత్రమే కాక, చంద్రబాబు గారి హస్తం కూడ ఇందులో ఉందని జగన్ గారి వర్గం బలంగా విశ్వసిస్తుంది. దీని తార్ఖాణంగా "చిదంబరం, చంద్రబాబు" ల సీక్రేట్ మీటీంగ్ ని వై.కా.పా. వర్గాలు ఉటంకిస్తాయి. కాబట్టి ఇప్పుడు జగన్ గారి వర్గానికి టార్గెట్ టి.డీ.పి. దాని అదినేత చంద్ర బాబుగారు మాత్రమే అన్నది తేటతెల్లం. మరి దీనికి ప్రతీకారం ఎలా తీర్చుకోవడం?.ఇది జగన్ వర్గాన్ని నిద్రపోనివ్వని సమస్య!

  ఇక ఈ రెండు పార్టీలు, రాష్ట్రంలోని రెండు బలమైన సామాజిక వర్గాల అధికార ఆకాంక్షలకు ప్రతీకలు. పైకి ఎవరేమి చెప్పినా సగటు పార్టీ కార్యకర్తలు ఇదే బావాన్ని కలిగి ఉన్నారు.కాబట్టి ఈ పార్టీల మద్య  అన్ని విషయాలలో పోటీ డీ,అంటే డీ అన్నటే ఉంటుంది. అందుచేత అవినీతి ఆరోపణలతో జైలు పాలైన జగన్ గారి సహజ కోపం చంద్రబాబు గారు ఏదో రకంగా చెరసాల కు వెళితే తప్పా చల్లారదు. అందు చేత ఒక వేళా జగన్ అధికారం లోకి వస్తే "టీ.డి.పి" అధినేత కు ఆరళ్ళు తప్పవు అనుకుంటా!       

Sunday, April 28, 2013

"తెలంగాణా " వస్తే "దేవాదాయ శాఖ" రద్దట!


                                                              
                                                          
  మొత్తానికి సంచలన నిర్ణయాలు ప్రకటీంచడంలో కె.సి.అర్. గారికి ఉన్న దమ్ము ఎవరికి ఉండదనుకుంటా! సాంప్రాదాయ పార్టీలైన వారెవ్వరికి అసలు ఈ ఆలోచన కూడ వచ్చి ఉండదు. ప్రబుత్వం ఖజానా నుండి ఒక్క రూపాయి కూడ దేవాలయాలకు ఇవ్వనవసరం లేకుండా, దొడ్డి దారిలో దేవుడి సొమ్మును ప్రభుత్వ శాఖలకు,రాజకీయ అవసరాలకు వినియోగించుకునేందుకు ఒక"వర ప్రసాదిని" లా ఉపాయోగ పడుతున్న హిందూ దేవాదాయ మంత్రిత్వ శాఖను రద్దు చెయ్యాలంటే ఎంత సాహసం ఉండాలి?

   దీని వల్ల దేవాదాయ వనరుల మీద పూర్తీగా హిందూ మతానికి చెందిన సంస్తలు స్వయం ప్రతిపత్తి తో కూడిన ఆజమాయిషి కలిగి ఉండి, పూర్తిగా స్వాతంత్రం పొందుతాయి. దేవాలయ వ్యవస్త కు స్వర్ణ యుగం అంటే కాకతీయుల కాలమనే చెప్ప వచ్చు. ఆ రోజుల్లో దేవాలయ "బాంక్" లు రైతులకు సైతం అప్పులిచ్చేటంత ఆర్థిక స్వయం సమ్రుద్ది కలిగి ఉండేవట. దిక్కు మాలిన నైజాం ప్రబుత్వం వచ్చాకే వాటికి దుర్దశ మొదలై, ఇప్పటి పాలకుల చేతిలో పూర్తిగా నాశనం అయిందని చెప్ప వచ్చు. ఊరిలో పని పాట లేకుండా తిరిగే బలాదూర్ గాళ్ళు,ఏ మాత్రం నైతిక చింతన లేని వాళ్ళు, దేవాలయాలకు దర్మకర్తలుగా చేసిన పాపం ఈ సర్కార్ కి ఉంది. ఇక పూర్తీగా అవినీతి మయమైన  దుస్తితి నుంచి తప్పించడానికి ఆ శాక రద్దు ఒకటే తక్షణ కర్తవ్యం. సరి అయిన నియంత్రణ కొరకు ఒక స్వయం ప్రతిపత్తితో కూడిన సంస్త ఉంటే చాలు. పైసా ఇవ్వని ప్రభుత్వ నియంత్రణ అనవసరం.

  ఈ విషయం లో సాహసోపేత నిర్ణయం తీసుకున్న తెలంగాణా రాష్ట్ర సమితికి,కె.సి.అర్ గారికి,హిందూ సంస్తలు అభినందనలు తెలపాల్శిన అవసరం ఉంది.  

Friday, April 26, 2013

మంత్రాలకు పిల్లలు పుడితే, మగవాళ్ళెందుకు?

                                                                    
                                                          
  ఈ మద్య ఖమ్మం జిల్లాలో  ఒక సంఘటన  జరిగింది. గుడి పూజారి ఒకాయన తాను మంత్రాలతో  సంతాన బాగ్యం కలిగిస్తాను అని ప్రచారం చేసుకున్నాడట! అలా ఆ పేరు మోసిన పూజారి గారి "సంతాన సాఫల్య కేంద్రానికి" ఒక వివాహితను తీసుకు వచ్చిన కుటూంబ సబ్యులు ఆమెకు సంతాన బాగ్యం కలిగించమని ప్రాదేయ పడగా అందుకు పదివేలు కర్చవుతుంది అన్నాడట. సరే అని వారు ఆ పది వేలు ముట్ట చెప్పాకా సదరు మహిళను చీకటి పడ్డాకా రమ్మన్నాడట. అలాగే అని చెప్పి వారు చీకటి పడ్డాక ఆమేను తీసుకుని ఆ పూజారి దగ్గరకు వెలితే, పూజల పేరుతో ఆమేను ఒంటరిగా గదిలోకి తీసుకు వెళ్ళి అత్యాచారం చెయ్యబోయాడట! ఆ దెబ్బతో పిల్లలు ఎలా కలుగుతారో జ్నానోదయమైన ఆమే ,తేరుకుని కేకలు వెయ్యగ సదరు పూజారి పారిపోయాడట!

  అయ్యా ఇదీ కథ లాంటి నిజం. అసలు ఇటువంటి జనాల్ని చూస్తుంటే, మన వెనుకటి వాళ్ళ కున్న శాస్త్రీయ ద్రుక్పదం నేటి తరం వారికి లేదనిపిస్తుంది. వెనుకటి కాలంలో  "కుల గురువు" అనే వారు ప్రతి కులానికి ఉండే వారట. కులంలో ఎవరఈనా సంతాన బాగ్యం లేకపోతే, ఆ కుల గురువునే "కుల పురుషుడు" గా ఆరాదించి అతనితో సంతానం పొంది కుటుంబ అబిరుద్ది చేసుకునే వారట. సరే ఈ విదానంలో నైతిక దర్మం మాట కాసేపు ప్రక్కన పెడితే, పిల్లల్ని కనాలంటే పురుషుడు అవసరం తప్పని సరి అనే ఇంగిత జ్నానం వారిలో ఉంది. అసలు నన్నడిగితే నమ్మక్కం లేని "సంతాన సాఫల్య కేంద్రం" లకు పోయి లక్షలు వదిలించుకుని  తెలియని వారసత్వాన్ని ఇంట్లోకి తెచ్చుకునే దాని కంటే యోగ్యుడైన "కుల గురువు" పద్దతే స్వచ్చమైనది అనుకుంటా. !   

Wednesday, April 24, 2013

పర్యాటకం అంటే "దానికి రమ్మని" అర్దమా?

                                                               

 ఈ రోజు పేపర్లో చూశిన ! బలే మజా వార్తొచ్చింది! మన బాగ్య నగరం "సెక్స్ పర్యాటక కేంద్రం గా" బడాశేట్లను ఆకర్షిస్తుందట! కాసుల్లున్నోడికి  "కామితార్దము" లు తీర్చుదరట ఇచ్చట!. దానికోసం వ్యభిచారానికి కొత్త బాష్యం చెపుతూ ఇక్కడ ఏజంట్లు,వెలిసారట. విమానాలలో దిగుతున్న షేకులు కు సలాం చేస్తూ, తమ పేదరిక దౌర్బాగ్యాన్ని వారికి పక్కలుగా మార్చి, అది కూడ పర్యాటక అభివ్రుద్దికి తోడ్పడుతుందనే దగుల్బాజి తనాన్ని ఏమనాలి.?

  ఇలా అలోచిస్తున్న నాకు అసలు పర్యాటకం అంటే ఏమిటి అనే ఆలోచన వచ్చింది. నాకు తెలిసిన తెలుగు పంతులు గారిని అడిగా "పర్యాటకం" అనగానేమి అని. దాని అర్దాన్ని ఆయన నాకు విడమర్చి చెప్పేసరికి నాకు మైండ్ బ్లాంక్ అయింది! ఆయన చెప్పింది ఇది

         పర్రె+ ఆట కి కం.(రా.)= పర్యాటకం. నిజమే నా అనిపిస్తుంది.

Tuesday, April 23, 2013

మంత్రిని ఉరి తియ్యమన్న ముఖ్యమంత్రి అక్కడా! కళంకిత మంత్రులను కాపాడుతున్న ముఖ్యమంత్రి ఇక్కడ!

                                                                        
                                                                
                      

                                                                          
                                                                           

  లౌకికవాద పార్టీ నాయకుడిగా చెప్పుకుంటున్న మన ముఖ్యమంత్రి గారి సి.బి.ఐ. చార్జ్ షీట్ దాఖలు చేయ్యబడిన మంత్రులపై ఎట్టి చర్యలు తీసుకోకుండా "కళంకిత మంత్రులను కాపాడుతున్న ముఖ్యమంత్రి" గా కొనియాడబడుతుంటే, అక్కడ గుజరాత్ లో "మత వాది పార్టీ " గా ముద్రపడిన పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి "మోడీ" గారు మాత్రం తన కాబినెట్ మంత్రి గారికి క్రింది కోర్టు వేసిన శిక్ష  చాలదు "ఉరి" తీయాలని  సుప్రీం కోర్టును కోరవలసిందిగా అధికారులను అదేశించాడట!

 ఔరా! ఏమి ఈ విచిత్రం. లౌకిక వాదమంటే తప్పు చేసిన వాడిని , చెయ్యని వాడిని ఒకేరీతిగా చూడటమా! అలా చూడరు కాబట్టె మతవాదులంటె ఈ ఉదార పురుషులకు ఇంత లోకువా!.ప్రజలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఎవరు ఏమిటో "వారు చెప్పే శ్రి రంగ నీతులు బట్టి కాక, చేసే పనులు ద్వారా గుర్తించండి". లేకుంటె మనం చెయ్యగలిగేది ఏమి ఉండదు, వారు వేసే డ్రామాలు చూడటం  తప్ప!  

Thursday, April 18, 2013

చీర" కట్టుకోవడం చేత కాని తనానికి నిదర్శనమన్న మహిళా మంత్రి!


                                                                   

                                                                       

  మంత్రులు అంటే ఎలా ఉండాలో , తెలిసికోవాలంటే మన రాష్ట్ర మంత్రులని కొంతమందిని చూసి నేర్చుకోవాలనుకుంటా! ఒక పక్క కళంకిత మంత్రులతో మన పాలనా వర్గం ఇలా తగలబడిందేమిటా అని బాదపడే వారికి మొన్న ఒక మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు వింటే నోరెళ్ళబెట్టక తప్పదు.

  సదరు మహిళా మంత్రిణికి అమె నియోజక వర్గానికే చెందిన ఒక మాజి మంత్రితో తగవులు ఉన్నాయి. వారిద్దరి మద్య అసలు గడ్డి వెయ్యకుండానే భగ్గుమంటుండవచ్చు. కాని అంత మాత్రానికే సదరు మాజి మంత్రి మగ తనాన్ని చాలెంజ్ చేస్తున్నట్లు "మగాడివైతే నా ముందుకు వచ్చి మాట్లాడు" అనాలా? అంతే కాదు తాను గౌరవప్రదంగా, సాంప్రదాయ చీర కట్టుకున్న విషయం కూడా మరచి" చేత కాకపోతే చీర కట్టుకుని ఉండు" అని అనడం ఎంతవరకు బావ్యం. అదే ఏ పురుషుడో ఈ మాట అని ఉంటే మహిళా సంఘాలు ఒక్క పెట్టున గోల చెయ్యరా?

   సాక్షాతు ఒక మహిళా మంత్రిణియే, చీర కట్టుకోవడాన్ని చేతకాని తనంగా అభివర్ణిస్తుంటే, సాంప్రదాయ స్త్రీ లోకంను అవమానించినట్లు కాదా? అంతెందుకు ముందు వెనుక కానక తనని కూడా సదరు మహిళా మంత్రి అవమానించుకున్నారు.ఎందుకంటే ఆమె అప్పుడు చీరను కట్టుకుని అన్ని మాటలు అంటున్నారు మరి!

ఒక  వ్యక్తి యొక్క సంస్కారం అంచనా వేసేది వారు ఉపయోగించే బాషయే!    అసలు ఒక మంత్రి హోదాలో ఉండి పుబ్లిగ్గా ఒక మాజి మంత్రి మగతనాన్ని కించ పరిచేలా మాట్లాడడం సబ్య సమాజం హర్షించదు. ఆ తర్వాత మన సాంప్రదాయం  అయిన చీర కట్టుడుని అలా చేతకాని తనంగా అభివర్ణించడం అసలు బాగో లేదు.మన సంస్క్రుతికి ప్రతీక స్త్రీలు అని మనం బావిస్తుంటాం. ఆ బావనలు తప్పు అనేలా పెద్ద పెద్ద హోదాలో ఉన్న వారు ప్రవర్తించడం కడు అక్షేపణీయం.  

Wednesday, April 17, 2013

వై.కా.పా పార్టీ వారికి తగ్గుతున్న జనాదరణ సూచిక దేనికి సంకేతం?

                                                                                                    
  సంవత్సరం క్రితం వై.కా.పా పార్టీ వారికి ముప్పై పైనే పార్లమెంట్లు సీట్లు వస్తాయని, సర్వే లు తేలిస్తే, ఇప్పుడేమో అది కాస్తా పన్నెండు సీట్లుగా తగ్గి పోయినట్లు ప్రస్తుత సర్వేలు చెపుతున్నాయి. సంబదిత పార్టీ వారి ఆలోచన ఎలా ఉన్నా, సి.బి.ఐ. వారు వేస్తున్న చార్జ్ షీట్లను, అందులోని అభియోగాలను జనం నమ్ముతున్నట్లే కనిపిస్తుంది.

  అందుకే ఏ నిర్ణయమైనా ఆవేశంతోనో, వీరాభిమానంతోనో తీసుకోకూడదు. ఆలోచించి తీసుకునే నిర్ణయమే సత్పలితాలను ఇస్తుంది. అసలు ఒక ముఖ్యమంత్రి స్తాయిలో పదవి కావాలనుకున్న వ్యక్తి మీద తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఉన్నపుడు వాటిని సత్వరమే పరిష్కరించడం ఉత్తమం. దాని వలన ప్రజలు ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒక ఉద్యోగి మీద వచ్చిన అవినీతి ఆరోపణల లాగా "జగన్" గారి కేసును పరిగణించకుండా సత్వరమే చార్జ్ షీట్లు దాఖలు చేసి, నేర విచారణ కొన సాగించాలి.

  ఒక వేళా అతడు నిర్దోషి అయితే, తక్షణమే విడుదల చేసి,  సి.బి,ఐ. ని తగిన నష్టపరిహారం జగన్ కి చెల్లించ వలసిందిగా ఆదేశించ వచ్చు. లేకా అతడు దోషిగా రుజువు అయ్యే పక్షంలో తగిన శిఖ్షలను విదిస్తే, తెలుగు ప్రజలు ఒక నేరస్తున్ని అధికారపీటం మీద కూర్చో పెట్టే పాపం నుండి విముక్తులను చేసిన వారవుతారు.

  ఏది ఏమైనా అతని మీద మోపబడిన నేర అభియోగ తివ్రత ద్రుష్ట్యా, జగన్ గారి కేసులను తక్షనమే పరిష్కరించాల్సిన  అవసరం ఎంతైనా ఉంది.     

Monday, April 15, 2013

మంత్రిగారికి ఇన్నాళ్లకి మండింది కాబోలు!


                                                                   

  మొన్నటి దాక" మా నాయకుడు, మడమ తిప్పని వాడు,వీరాధి వీరుడు, శూరాధి శూరుడు" అని పొగిడిన మంత్రులే ఈ రోజున ఆయన కొడుకుని "ద్రోహి,ఉరితీసిన పాపం లేదు, తండ్రిని అడ్డం పెట్టుకుని అడ్డంగా దోచాడు" అని సాక్షాతు ఒక రాష్ట్ర మంత్రి జైలులో ఉన్న జగన్ గారిని తిడుతుంటే, తక్కిన మంత్రులు అభినంధించారట!

   పాపం ఇన్నాళ్ళు జగన్ అవినీతి కుంభ కోణాలు గురించి బారత అత్యున్నత నేర పరీశోదక సంస్త చార్జి షీట్ లు ఒక దాని తర్వాత ఒకటి దాఖలు చేస్తున్నా, ఇవ్వన్నీ రోటీన్ వర్క్లో బాగమేలే, ఏ నాటి కైనా జగన్ తమ పార్టీలోకి రాక పోతాడా, ఈ కేసులన్ని అటకెక్కకపోతాయ, అని ఉపేక్ష వహించినట్లుంది పాపం. అమ్దుకే అధికార పార్టీ కి చెందిన మంత్రులెవరూ జగన్ ని ఏమి అనే దైర్యం చెయ్యలేక పోయారు. కాని తీరా మంత్రులను సైతం వదలకుండా సి.బి. ఐ. వారు చార్జ్ షీట్ లో స్తానం కలిపిస్తుండడంతో, ఎప్పుడు ఏమి జరుగుద్దో తెలియక అయోమయంలో పడిపోయారు అమాత్యులు. ఇక ఇలా ఉంటే లాబం లేదని డిఫెన్స్ చర్యలు మొదలు పెట్టినట్లుంది. అందులో బాగమే "ఆనం"గా గారి సంచలన వ్యాఖ్యాలు. దానికి సంబందిత మంత్రుల వత్తాసు. ఏదైనా తమదాక వస్తే గాని తెలియదు మరి.

   సంతకాలు చెయ్యడం వరకే సహచర మంత్రుల పని కాని, జైల్లో సహచర ఖైదీలుగా ఉండమంటే ఏలా? కోట్లేమో వారికి,కటకటాలేమో మాకా? అని సంబడిత మంత్రులు వాపోతున్నరట. అందుకే వెంటనే ఆనం గారి డైలాగులకి జై కొట్టారు కాబోలు. మొత్తానికి సంబదిత మంత్రులు మాత్రం "ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు" అని మౌన గీతం పాడుకుంటుంనట్లుంది!    

Sunday, April 14, 2013

స్వచ్చమైన పాలన ఎలాగూ ఇవ్వలేరూ! కనీసం "స్వచ్చమైన పాలు’ అయినా ఇప్పించలేరా?

                                                                            

   సైన్స్ పరిజ్ణానం వల్ల ప్రజలకు లాబం మాట ఎలా ఉన్నా,స్వచ్చమైన బ్రతుకు కి  దూరమైపోతున్నారు. ముఖ్యంగా పట్టణాలో ఉన్న ప్రజలు బ్రతికేది కూడ ఒక బ్రతుకేనా అనిపిస్తుంది.ప్రతి మనిషికి  మంచినీరు, స్వచ్చమైన గాలి, స్వచ్చమైన పాలు కావాలి. ఇప్పుడు కార్పోరేషన్ వారు సరపరా చేసే నీరు త్రాగితే రోగాలు ఖాయం అనుకుని, ప్రైవేట్ సంస్తలు సరపరా చేస్తున్న మినరల్ వాటర్ మీదే "మనీ జీవులు" ఆదారపడుతున్నారు. ఇలా ఈ నీరు అతిగా త్రాగడం కూడా  మంచిది కాదు అని చెపుతున్నారు. స్వచ్చమైన గాలి పట్టణాలో ఎలాగు దొరకదు కాబట్టి, దానికోసం అప్పుడాపుడు చుట్టు ప్రక్కల నున్న  పల్లేటూళ్ళకు వేళ్ళి పైరగాలితో సేద దీరుదామంటే, మన రైతన్నలు దండిగా పైరులపై చిమ్ముతున్న పురుగు మందుల దాటికి ముక్కులు మూసుకుని,దీనికన్న మన పట్టణ  కాలుష్య కంపే నయమనిపించి వెళ్ళలేక పోతున్నారు.

  ఇక పాల విషయానికొస్తే, పట్టాణాలలో పాల ఫాకెట్ల లో దొరికే పాలను తోడు పెట్టి,ఆ పెరుగును తింటే మనిషన్న వాడికి జీవితం మీద విరక్తి పుడుతుంది. కారణం పాలను నిల్వ చెయ్యడానికి అందులో కలిపే రసాయన పదార్థం కారణం అట!రసాయనాలు కలిపేసైన్స్ పరిజ్ణాన్మం కేవలం డైరీలు నడిపే వ్యాపారస్తులకే కాకుండా, సాదరణ పాలు అమ్మే వారికి కూడ తెలియడమ్తో, పాకేట్లు పాలలోనే కాకుండా, పల్లెటూళ్ల నుండి తెచ్చిపోసే పాలు కూడ ఈ కల్తీకి గురికాక తప్పడం లేదు. టీ లూ, కాఫి,లు లో పెద్ద తేడా పట్టించుకోపోయినా పెరుగు విషయం లో మాత్రం కాంప్రమైజ్ కాలేక పోతున్నారు. "సప్త సముద్రాలు ఈది వచ్చిన ఘనుడు ఇంటి వెనుక మురికి కాలవలో పడి చచ్చినట్లు ఉంది" .మన సైన్స్ అభివ్రుద్ది.సంతోషంగా బ్రతుకుదామన్న మన ప్రస్తానం చివరకు "కల్తీ బ్రతుకు" కు బలి కాక తప్పడం లేదు.

  ఏది ఏమఈనా అన్నిటికి మనకు కనపడే మూల కారణం  పాలకులే కాబట్టి వారినే అదుగుదాం. " అయ్యా  పాలకులారా   స్వచ్చమైన పాలన ఎలాగూ ఇవ్వలేరూ! కనీసం "స్వచ్చమైన పాలు’ అయినా ఇప్పించలేరా?

Friday, April 12, 2013

సత్యమేవ జయతే’ అంటున్న దేశంలో అబద్దం కేసులు పెట్టడ్డం కూడ ఒక వ్యాపారమే!

                                                                        
  ఈ రోజుల్లో నిజం ఏదో, అబద్దం ఏదో తెలియకుండా పోతుంది.ఒక వ్యక్తి కి అన్యాయం జరిగి కేసు పెడితే, సదరు కేసును నీరు కార్చడానికి వేంటనే "కౌంటర్ కేసు" పెట్టేస్తున్నారు. దీనికి కావాల్సింది వెరీ సింపుల్.ఒక ఇద్దరు తప్పుడు సాక్షులు ఉంటే చాలు.దీని వలన నిజమైన బాదితులు కూడ తప్పుడు కేసు హింస తట్టుకోలేక రాజీకి రావాల్సిన దౌర్బాగ్య పరిస్తితులు ఏర్పడుతున్నాయి.

  ఈ విదానానికి  ఆద్యులు, ప్రోత్సాహ కర్తలు రాజకీయ పార్టీలే. ఎడుటిపార్టీలొని వారిలో నేరానికి  సంబదం లేని వ్యక్తులినా సరే తమకు అడ్డంకిగా ఉన్నారని బావిస్తే వారిని కేసుల్లో ఇరికించడం, అది చూసి ఇవతలిపార్టివారు కూడ అదే పని చెయ్యడం చివరకు రెండు వర్గాల వారు రాజి పడ్డడం, కేసు కొట్టివెయ్యడం, ఈ విదంగా మన న్యాయ ప్రక్రియనే బ్రష్టు పట్టిస్తున్నారు. ఈ ప్రహసనంలో అటు పోలిస్ వారికి ఇటు న్యాయవాదులకు డబ్బు బాగానే ముడుతుంది కాబట్టి అందరూ తలొక చేయి వేసి ఈ విదానాన్ని ప్రోత్సాహిస్తున్నారు.

  ఇలా రాను రాను ఈ విదానం వేశ్యా వ్రుత్తి చేపట్టిన  అమ్మాయిలకు కొంతమందికి లాబసాటి వ్యాపారంగా మారింది. అబ్బాయిలను ఆకర్షించడం, వారితో అన్ని కార్యక్రమాలు కాన్నిచేసి, తీరిగ్గా వారి మీద కేసులు పెట్టడం, చివరకు లక్షలు గుంజి కాంప్రమైజ్ కావడం, ఇలా వేల రూపాయల కు బదులు లక్షల రూపాయలను వారి బిజినెస్ లో పొందడం జరుగుతుంది. దీనిని కూడ పోలిస్ లు తమకు నజరాణాలు బారీగ ముడుతున్నందు వల్ల ప్రోత్సాహిస్తున్నారు. అక్కడక్కడ నీతి పరులు ఉన్నారు. వారికి మాత్రం మినాహాయింపు.

 అందుకే ఏ కటిన చట్టం అమలులోకి వచ్చిన, ఈ తప్పుడు కేసులు విదానం వల్ల నీరుకారి పోతున్నాయి. చివరకు బార్యబర్తల మద్య కెసులు పరిష్కరించే" గ్రుహ హింస" చట్టం కూడ ఈ విదానానికి మినాయింపు కాదు. ఈ విషయం లో తప్పుడు కేసుల నిరోదానికి కటిన విదానం ఉంటే తప్పా ఇది ఇలాగే కొనసాగుతు మన వ్యవస్తనే   తప్పుడు  వ్యవస్తగా మారుస్తుంది.

   "సత్యమేవ జయతే’ అన్న అధికార చిహ్నం కల్గిన మనం ఇటువంటీ అబద్దపు వ్యవస్తను  కొనసాగించడం సిగ్గుచేటు. మొన్న చేసిన "నిర్బయ" చట్టం ఆశయం కూడ ఈ ప్రక్రియలవల్ల నీరుకారక మానదు. ఈ మద్యనే జరిగిన ఒక సంఘటన దీనికి మంచి ఉదాహరణ . పూర్తి సమాచరం కొరకు లింక్ మీద క్లిక్ చెయ్యండి http://kalkiavataar.blogspot.in/2013/04/blog-post.html            


                                                                           

ఈ హై డ్రామాకు "అంజలి" ఘటించే వారెవరు?


                                                                

  సినిమా వాళ్ల బ్రతుకులు తెరమీద కనపడేంత అందంగా, ఆనందంగా ఉండవని ఎన్నో మార్లు రుజువైంది. నాటి సావిత్రి నుండి నేటి అంజలి వరకు ఒకటే స్టోరీ.అయినవాళ్లే ఆరళ్లు పెట్టిన వైనం. నటిమణులను డబ్బు సంపాదించే యంత్రాలుగా బావించి వారి మీద ప్రేమ రహిత అధికారం చెలాయించడం,అది తట్టుకోలేక వారు ఇతరుల రక్షణలోకి వెళ్లడాలు, అక్కడా వారి ఖర్మ బాగుంటే ఓ.కె, లేకుంటే ఆత్మ హత్యలు, ఇవ్వన్నీ మామూలే సినిమా వారికి అనిపిస్తుంది.

  అసలు సినిమా రంగమే చాలవరకు క్రుత్రిమ మనుషుల కలయికతో కూడినది అనిపిస్తుంది. వారు ముఖాలకే కాదు, మనసులకు కూడ రంగు వేసుకుంటారు. సీనిమా షూటింగ్ మొదలు అది విడుదలయ్యే దాక అంతా ఫాల్స్ పుబ్లిసిటి మీదే దాని బవిత్యం ఆదారపడి ఉంటుంది. ఒక్క సారి ఆ ఇండస్ట్రిలోకి అడుగు పెట్టాక ఎవరైనా సరే, ఒక రకమైనా  మానసిక రోగానికి గురి కాక తప్పదేమో. పేరున్న నటీ నటులకు ఎప్పుడూ చుతూ భజనలు చేసే బాకా గాల్లు,పిచ్చి అభిమానుల సంఘాలు కంపల్సరి. ఎక్కువ కాలం ఈ రకమైన వాతవరణమ్ లో ఉన్న వారు ఎవరైనా సరే క్రుత్రిమ మనుషులుగా మారి పోతారు. బ్రతుకులో స్వచ్చత ఉండదు. ఇది తెలియబట్టే మనసున్న  నటుడు  శోబన్ బాబు గారు తమ పిల్లల్ని నటన వైపు కన్నెతి చూడనివ్వ లేదనుకుంటా.

  ఇక తెలివి గల నటులు కొంతమంది తమకు అవకాశాలు తగ్గుతున్నాయి అని తెలియగానే, సినిమా రంగం లాంటి లక్షణాలున్న రాజకీయ రంగానికి షిఫ్ట్ అవుతున్నారు. రెండిటికి కావల్సింది పుబ్లిసిటి, వెర్రి అభిమానమే కాబట్టి డైరెక్ట్ గా జనం ముందు నటించడానికే వస్తున్నారు. ఇలా ఈ రెందు రంగాలు ఈ క్రుత్రిమ వ్యక్తులతో చాల వరకు బ్రష్టు పట్టి పోయాయి.

  ఇక వర్డమాన నటి అని చెపుతున్న "అంజలి" మిస్సింగ్ కేసులో ఈ హై డ్రామా ఎందుకో అర్థం కావటం లేదు. ఒక వేళా ఆ అమ్మాయి బాబాయి కొడితే పోలిసులకు చెప్పిచట్ట రక్షణ తీసుకోవచ్చుగా. ఏవరో నిర్మాత రక్షణలోకి ఎందుకు వెళ్లడం? బహూశా ఈ ఉదంతాన్ని కూడ సినిమా తీసి ప్రేక్షకుల జేబులు లూటి చెయ్యడానికి వేసిన ప్లాను కాదు గదా! ఆ మద్య ఎవరో ఒక పాట( అనిత ఒ అనితా)  రాసిన అజ్నాత ప్రేమికుడు ఎవరా అని టి.వి. చానల్ లో వారం రోజులు ఊదరగొట్టి,లేని పబ్లిసిటి క్రియేట్ చేసి, చివరకు అతనిని గుర్తించినట్లు ఒక హై డ్రామా నడిపారు. చివరకు అదే కదాంశంగా సినిమా కూడ తీశారు. ఇలా చెయ్యడం సినిమా వాళ్లకే చెల్లింది. ఇది అలాంతిదేనేమో!

   మొన్నటిదాక సినిమాలే మనల్ని పిచ్చోళ్లను చేశాయి. ఇప్పుడు కొన్ని వందల చానల్లు  మనల్ని వెర్రి వాళ్ళని చెయ్యడానికి మన ఇంట్లోకే వచ్చాయి.అతి త్వరలో అందరు గుడ్డలు చించుకుని రోడ్ల మీదకు రా వచ్చేమో!                 

Wednesday, April 10, 2013

ఉగాది పచ్చడి. పండుగ శుభాకాంక్షలతో...........

                                                                     





                                                   ఆరు రుచుల ఉగాది పచ్చడి సేవనం ,

                                                     మనిషికి ఎంతో ఆరోగ్య కరం.


                                                       ఆరుమతాలు కలిసి జీవించడం,

                                                         మన సమాజానికి ఎంతో శుభప్రధం.

        ( ’ఆకాశం ఏర్రనౌను, ఆరు మతాలు ఒక్కట్టవును ’ అన్న బ్రహ్మం గారి కాలజ్గ్నాన వ్యాఖ్యల స్పూర్తితో)


 మా బ్లాగు మిత్రులకు, వీక్షకులకు, మమ్మల్ని పొగిదేవారికి, తిట్టే వారికి అందరికి పెడుతున్నాం, ఉగాది పచ్చడి. పండుగ శుభాకాంక్షలతో...........






Tuesday, April 9, 2013

గాందీ గారి బొమ్మే పెట్టుకుంటే లేని అభ్యంతరమ్ N.T.R గారి బొమ్మ మీదెందుకు బాబు గారు!

                                                             
                                                                         అప్పుడప్పుడు మాట్లాడే కొంత మంది మేదావుల మాటలు సైతం మనకు నవ్వూ, ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.ఈ మద్య Y.S.R    పార్టీ వారుN.T.R   గారి బొమ్మ ప్లెక్సీ ల మీద పెడితే పెద్ద దుమారమే రేగింది. మా నాయకుడి బొమ్మ పెట్టడానికి మీరెవరు అని తెలుగు దేశం వారు ప్రశ్నిస్తే, N.T.R   గారిని వెన్నుపోటు పొడిచి అధికారం లోకి వచ్చిన చంద్రబాబు గారి నాయకత్వం లో ఉన్న పార్టీకి ఆ ప్రశ్న అడిగే హక్కు లేదని    Y.S.R   పార్టీ వారు కౌంటర్ ఇచ్చారు.సరే ఇంతవరకు బాగానే ఉన్నా, తెలుగుదేశం అదినేత గారు లేవనెత్తిన అబ్యంతరం కొంచం నవ్వు తెప్పిస్తుంది.

   లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డ, Y.S.R  పార్టీ వారికి నీతి, నిజాయతికి మారు పేరైన N.T.R   గారి బొమ్మ ని, జగన్ గారి పక్కన పెట్టడం బాధ కలిగిస్తుందన్నారు. ఒక వేళా చంద్రబాబు గారు చెప్పేది నిజమయితే ఈ దేశ ప్రజలు బాదతో ఎప్పుడో క్రుంగి క్రుశించి పోయి ఉండే వారు. నిజంగా ప్రస్తుతమున్న రాజకీయ పార్టీలో "గాంది" గారి బొమ్మను పెట్టుకునే నైతిక అర్హత ఎంత మందికుంది?మరి వీరంతా పెట్టుకుంటుంటే బాదపడని ప్రజలు, లేక వారి నాయకులుN.T.R   గారి బొమ్మ జగన్ గారి పక్కన పెడితే ఎందుకు బాద పడాలి?

  తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీక N.T.R   గారు. అసలు తెలుగుదనమే రాష్ట్రం నుండి మాయమవుతుంటే ఇక అన్న గారి బొమ్మ ఎక్కడపెడితే ఏముంది!ఆయన బొమ్మ కొంతమందికి సినిమాల రూపంలో కాసులు కురిపిస్తే, మరి కొంత మందికి వోట్లు రాలుస్తుంది.మనలో తెలుగుదనం ఉన్నంత కాలం మన గుండేల్లో  N.T.R       ఉంటారు.             


స్నేహితుడు అని నమ్మితోడుగా "గోవా" వెళితే,"రేప్" చేసి తీసుకొచ్చాడట!


   

  పాపం ఒక అమ్మాయి, హైద్రాబాద్  పోలిస్ స్టేషన్ పరిధిలొ ఉన్న  ఒక దాంట్లో పిర్యాదు చేసింది అంట! సదరు పిర్యాదు సారాంశం ఏమనగా " అయ్యా! పోలీస్ వారూ, నేను నా స్నేహితుడొకడు "గోవా" వరకు వెళ్లి వద్దాం వస్తావా? అని అడుగగా, సరే స్నేహితుడే కదా, పాపం ఎవరూ తోడు లేక, భయమేసి రమ్మంటున్నాడేమో  అని బావించి, తోడుగా గోవా వరకు వెళ్లగా అక్కడ ఆ స్నేహితుడికి, ఏమి మాయ రోగం పుట్టిందో ఏమో, నన్ను  తన లైంగిక కోరిక తీర్చమనగా, నేను నిరాకరించాను. దానికి అతను పాశవికంగా దాడి చేసి నన్ను "రేప్" చేసాడు. కాని నేను నిస్సహాయ స్తితిలో ఉన్నాను కాబట్టి గోవా లో కేసు పెట్ట లేదు. ఇక్కడి కొచ్చి కేసు పెడుతున్నాను. కావున చట్ట పరంగా చర్యలు తీసుకోగలరు".

  పై కేసు గురించి విన్నాకా మనకు సహజంగా ఒక డౌట్ వస్తుంది . స్నేహితులైన స్త్రీ పురుషులు ఇరువురు గోవా లాంటి చోటుకి పోయి అక్కడి చర్చ్ లో ప్రార్థనలు చేసి వస్తారా?.అక్కడి వాతావరణం వారి స్నేహ బందాన్ని భంగపరచకుండా ఉంటుందా? "తాటి చెట్టు క్రింద కూర్చొని పాలు తాగుతున్నామని" చెపితే నమ్మ శఖ్యంగా ఉంటుందా? గోవా వెళ్ళింది కబుర్లు చెప్పుకుంటానికి అని చెపితే ఎవరైనా  నమ్మి నట్లు నటిస్తారు కాని, చచ్చినా నమ్మరు. "అవకాశం ఇవ్వనేలా? భంగ పడి బాద పడనేలా?.

  ఇక్కడ మగాళ్లు  కూడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు "నిర్భయ" చట్టం చాల కటినంగా ఉంది. ఒక వేలా స్నేహితులు అంగీకారం తెల్పినా సరే, సాక్ష్యాదారం  బలంగా ఉంటే తప్పా, మీరు శిక్ష నుండి తప్పించుకో లేరు. తస్మాత్ జాగ్రత్త!