Friday, April 26, 2013

మంత్రాలకు పిల్లలు పుడితే, మగవాళ్ళెందుకు?

                                                                    
                                                          
  ఈ మద్య ఖమ్మం జిల్లాలో  ఒక సంఘటన  జరిగింది. గుడి పూజారి ఒకాయన తాను మంత్రాలతో  సంతాన బాగ్యం కలిగిస్తాను అని ప్రచారం చేసుకున్నాడట! అలా ఆ పేరు మోసిన పూజారి గారి "సంతాన సాఫల్య కేంద్రానికి" ఒక వివాహితను తీసుకు వచ్చిన కుటూంబ సబ్యులు ఆమెకు సంతాన బాగ్యం కలిగించమని ప్రాదేయ పడగా అందుకు పదివేలు కర్చవుతుంది అన్నాడట. సరే అని వారు ఆ పది వేలు ముట్ట చెప్పాకా సదరు మహిళను చీకటి పడ్డాకా రమ్మన్నాడట. అలాగే అని చెప్పి వారు చీకటి పడ్డాక ఆమేను తీసుకుని ఆ పూజారి దగ్గరకు వెలితే, పూజల పేరుతో ఆమేను ఒంటరిగా గదిలోకి తీసుకు వెళ్ళి అత్యాచారం చెయ్యబోయాడట! ఆ దెబ్బతో పిల్లలు ఎలా కలుగుతారో జ్నానోదయమైన ఆమే ,తేరుకుని కేకలు వెయ్యగ సదరు పూజారి పారిపోయాడట!

  అయ్యా ఇదీ కథ లాంటి నిజం. అసలు ఇటువంటి జనాల్ని చూస్తుంటే, మన వెనుకటి వాళ్ళ కున్న శాస్త్రీయ ద్రుక్పదం నేటి తరం వారికి లేదనిపిస్తుంది. వెనుకటి కాలంలో  "కుల గురువు" అనే వారు ప్రతి కులానికి ఉండే వారట. కులంలో ఎవరఈనా సంతాన బాగ్యం లేకపోతే, ఆ కుల గురువునే "కుల పురుషుడు" గా ఆరాదించి అతనితో సంతానం పొంది కుటుంబ అబిరుద్ది చేసుకునే వారట. సరే ఈ విదానంలో నైతిక దర్మం మాట కాసేపు ప్రక్కన పెడితే, పిల్లల్ని కనాలంటే పురుషుడు అవసరం తప్పని సరి అనే ఇంగిత జ్నానం వారిలో ఉంది. అసలు నన్నడిగితే నమ్మక్కం లేని "సంతాన సాఫల్య కేంద్రం" లకు పోయి లక్షలు వదిలించుకుని  తెలియని వారసత్వాన్ని ఇంట్లోకి తెచ్చుకునే దాని కంటే యోగ్యుడైన "కుల గురువు" పద్దతే స్వచ్చమైనది అనుకుంటా. !   

No comments:

Post a Comment