Saturday, November 30, 2013

స్త్రీ లకు స్వేచ్చ నిస్తే, సమాజం లో "కాల్ గాల్స్" కంటె "కాల్ బాయ్స్ " ఎక్కువ అవుతారా ?

        కొన్ని కొన్ని విషయాలు వింటుంటే సమాజం లో స్వేచ్చకు నిజమయిన అర్దం తెలుసుకునే శక్తీ ప్రజలందరికి ఉంటుదనుకోవటం చాలా పొరపాటు అనిపిస్తుంది. జ్ఞాన వంతులు 10% ఉంటారు . మిగాతా వారు వారిని అనుసరించడమే కరెక్టు తప్పా , మెజార్టీ అభిప్రాయాలు కు విలువ ఇచ్చి దానీ ప్రకారం సమాజం ని ఉంచాలంటే దాని అంత బేవకోఫ్ తనం మరొకటి ఉండదేమో అనిపిస్తుంది . ప్రజాస్వామ్యం అంటే ప్రజలకోసం ఆలోచించేదా? లేక మెజార్టీ ప్రజల చేత ఆలోచింపబడేదా? ఒక దొంగని మెజార్టీ ప్రజలు దొర  అంటే ఒప్పుకోవలసిందేనా? ఒక వేశ్యని మెజర్తీ ప్రజలు తమ రోల్ మోడల్ అంటుంటే అంగికరించ వలసిందేనా? ఒక్కడైన సరే పది మందికి ఉపయోగపడే మాట చెపితే అది ప్రజాస్వామ్య ఆలోచన కాదా? కాదు మనం అరువు తెచ్చుకున్న ప్రజాస్వామ్య బావనలో పాక్షిక సత్యం తప్ప సంపూర్ణం గా నిజం లేదు. of the people, by the people అనేవి ప్రజాస్వామ్య సూత్రాలు అయినా కాక పోయినా , for the people మాత్రం ఖచ్చితంగ ప్రజాస్వామ్య సూత్రం. కాబట్టి ప్రజలకు మేలు చేసే మాట ఒక్కడు చెప్పినా వినే వాడే నిజమైన విజ్ణుడు. అటువంటి ప్రజలు ఉన్న సమాజమే ప్రజాస్వామ్య సమాజం.

   ఈ  ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెపుతున్నాను అంటే , స్త్రీ స్వేచ్చ కోసం పోరాటాలు చేసి, చేసి, చివరకు పురుషునితో పాటు స్త్రీ కూడా  సమానం అని రాజ్యాంగం లో రాసుకున్న మనం నిజంగా స్త్రీ స్వేచ్చ  కొన్ని విషయాల్లో సంపూర్ణంగా సాదించినట్లే కనపడుతుంది. పురుషంకార సమాజంలో "కాల్ గాళ్స్ " ఉంటే సమ సమాజం లో "కాల్ బాయిస్ " కూడా  తయరయ్యారు. శబాష్!  స్త్రీ లకు  స్వేచ్చ నిస్తే పురుషుల తో పాటు అన్నీ రంగాల్లో అభివృద్ధి సాదిస్తారు అనుకుంటే అన్ని రంగాల్లో ఏమో "అనంగ రంగం లో మాత్రం సమానత్వం సాదించారు(కొంత మంది మాత్రమే సుమా). ఈ  విషయం లో మన హైదరాబాద్ లో "కాల్ బాయిస్ గా మారిన హైదరాబాద్ యువకులు గురించి ఈ  క్రింది విడియో లింక్ ని క్లిక్ చేసి చోడండి.

Wednesday, November 27, 2013

తెలివి గల "తెహెల్కా తేజ పాల్" స్వయం ప్రకటిత శిక్ష తో పోలిస్ ఉచ్చులో చిక్కుకున్నాడు !

                                                    
రంకు నేర్చినోడు బొంకు నేర్వకపోతే ఎటువంటి చిక్కుల్లో పడతాడో డి గ్రేట్ "తరుణ్ తేజ్ పాల్ " ఉదంతం తెలియ చేస్తుంది. నా ఉద్దేశ్యం అబద్దాలు చెప్పి కేసులు నుండి తప్పిచుకోమని కాదు. తప్పు జరిగాక బాదితుల అంగీకారం లేకుండా, వారితో సంబందం లేకుండా తనంతట తాను తను చేసిన నేరాలకు శిక్షను ప్రకటించుకోవటం,దానిని స్వయంగా అమలు పరచుకోవడం , పరివర్తన చెందిన గొప్ప మహానుబావుడిగా పోజులు కొట్టడం ఇవ్వన్నీఅతన్ని చివరకు డిఫెన్స్ తీసుకోలేని స్తితికి నెట్టి వేశాయి. వివరాలు లోకి వెలితే,

 అయన పేరు తరుణ్ తేజ్ పాల్ . స్టింగ్ ఆపరేషన్లతో పెద్ద పెద్ద మగాళ్ళ నే గడ గడ లాడించిన తెహెల్కా వీక్లీ  మేగజైన్ వ్యవస్తాపక చీఫ్ ఎడిటర్. ఇతను ఎంతో మంది యువ జర్నలిస్టులకు మోడల్ రోల్. అటువంటి పెద్ద మనిషి తన స్నేహితుని కూతురుతో అనుచితంగా ప్రవర్తించి తన కొంచపు బుద్దిని బయట పెట్టుకున్నాడు. గోవాలో జరిగిన ఒక పత్రికా కార్యక్రమంలో తనతో పాటు పాల్గొన్న తెహెల్కా పత్రికా లేడి జర్నలిస్ట్ ను అసబ్యంగా తాకరాని ప్రాంతాలలొ తాకి, ఆమె ప్రవైసీకి బంగం కలుగ చేసాడు. దీనితో ఖంగుతిన్న ఆ అమ్మాయి , ఆ పత్రికా లేడి చీఫ్ ఎడిటర్కు సెల్ మెసేజ్ ద్వారా విషయం తెలియచేసి బోరుమంది. దానితో దిమ్మ తిరిగి తేజ్ పాల్ తన పెద్దమనిషి తన్నాన్ని కప్పెట్టుకునేందుకు ఆ లేడి జర్నలిస్టుకు క్షమాపణ చెపుతున్నాను అని, అలాగే తను తెహెల్కా బాద్యతలు నుండి 6 నెలలు సస్పెండ్ అవుతున్నాని, కాబట్టి విషయాన్ని అంతటితో వదిలెయ్యమని ఆ ఎడిటర్ ని కోరాడట .

   తేజ్పాల్ చేసినది మాత్రం అతితెలివి పనే అని చెప్పవచ్చు. ఎందుకంటే మహిళా ఉద్యోగినుల వేదింపుల చట్టం ప్రకారం ఏ స్త్రీ ఉద్యోగిని పైన అయినా లైంగిక వేదింపులు జరిగితే బాదితుల అనుమతితో ఒక కాంప్రమైజ్ కు వచ్చి తదనుగుణంగా కాంప్రమైజ్ సెటిల్మెంట్ రాసుకుని దానిని అమలు చేయమని కోరవచ్చు. కానీ ఈ  కేసులో అమ్మాయిని సంప్రదించకుండా తనే క్షమాపణ చెప్పడం , తనే 6 నెలలు పత్రికా బాద్యతల నుండి తప్పుకోవడం ఇవ్వన్నీ విషయాన్నీ మసి పోసి మారేడు కాయ చేసే అతి తెలివి పనులు. ఆ పనులే ఇప్పుడు అతన్ని పీకల్లోతు కష్టాలలోకి నెట్టాయి. జాతీయ స్తాయిలో పోకస్ అయిన ఈ  వ్యవహారం పై గోవా ప్రభుత్వం సుమోటో గా స్పందించి విచారణ చేపట్టింది. అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయడమే కాక , చీఫ్ ఎడిటర్ నుంచి తేజ్పాల్ ప్రకటన కు సంబందించిన రికార్డులు స్వాదీనం చేసుకుంది. దానితో కళ్ళు తెరిచినా తేజ్పాల్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పెటిషన్ వేసి నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. కానీ స్వయం ప్రకటిత  శిక్షను విదించుకున్న అతని తెలివి అతనిని ఖచ్చితంగా కట కటాల్లోకి  నెట్టవచ్చు. కాబట్టి ఏ పని చేసినా కీడెంచి మేలెంచాలన్నారు పెద్దలు. ఎంతైనా పెద్దల మాట పెద్దల మాటే , అడునికుల చేష్టలు ఆటవిక చేష్టలే!

Monday, November 25, 2013

అమ్మాయిలూ కష్టపడి షేవింగ్ చేసి బ్రతికినా గౌరవమే ! చీటింగ్ లు చెస్తే మాత్రం కటకటాలు తప్పవని రుజువు చేసిన వైజాగ్ పోలిస్!

                                                           


  అమ్మాయిలూ పై పొటోలో మాదిరి బార్బర్ షాప్పుల్లో  పనిచేసి మగవారికి సైతం షేవింగ్ లు చేసి శారీరక శ్రమ తో జీవించడం నేటి సమాజం ఆమోదిస్తుంది. దీనికి ఏ మాత్రం బిడియపడవలసిన పనిలేదు. పనిపాట చెయ్యకుండా, కుటుంబాలకు వీసమెత్తు సహాయం అందించకుండ బలాదూర్ తిరిగే ఎంతోమంది కుర్రకారు ఇటువంటి   స్త్రీలను చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. "శ్రమయేవజయతే "

  కానీ కొంత మంది స్త్రీలు పురుషులలోని వీక్నెస్ ను అవకాశంగా తీసుకుని వారిని మోసం చేస్తూ జీవిశ్తుంటారు. ఇటువంటివరే ఇద్దరు ఐ మద్య వైజాగ్ లో ఒక సైట్ ఓపెన్ చేసి "అమ్మాయిలతో పరిచయాలు" కావాలా అంటూ పేపర్లలో, పేస్బుక్ లో ప్రకటనలు ఇచ్చేసరికి అమ్మాయి అని పేరు వినపడితే చాలు"సొల్లు కార్చుకునే" వారు కొంతమందా "మాకు కావాలి" మాకు కావాలి" అంటే ముందుగా రిజిస్ట్రేషన్ పిజ్ కట్టాలన్నారట! సరే అని కట్టిన తర్వాత ఇక కాంటాక్ట్ బంద్ చేసే సరికి ఎవరో ఓపిక ఉన్నవారు పోలిస్ కేసు పెడితే వారు ఆ అమ్మాయిలను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. ఆ అమయిలను చూడాలి అనుకుంటేఈ  వీడియో లింక్ ను చూడండి                                                               


Saturday, November 23, 2013

హిందూ సమాజ సంస్కరణలకు పరాయి మతాలూ , కిరాయి మతాలు అవసరం లేదు.

                                                           



 నిరంతరం సాగీపొయే పవిత్ర నదిలో అయినా సరే కల్మషం కూడుతూనే ఉంటుంది. దానిని తీసివేసి ఎప్పుడూ స్వచ్చమైన నీరు ప్రవహించేలా చెయ్యడం ఆ నది మీద ఆదారపడి బ్రతికే బిడ్డల  విది. అంతే  కానీ చెత్త పేరుకు పోయిందని వారి  నదిని బాగుచేసుకోవడం మానీ , వేరే దేశం లోని నదిని గూర్చి ఆలోచిస్తే లేక పూజిస్తే ఒరిగేదేముంది.అలాగే మనం గంగా నది కలుషితమైందని "ఓల్గా " నది నీరు తాగాలనుకుంటామా ? ఒక వేళా అవే తాగి జీవించాలనుకుంటే "ఆ నది ఉన్న ప్రాంతానికి వెళ్ళి పోవడం ఒకటే మార్గం. తాగేది గంగ నీరు పొగిడేది "ఓల్గా" ని అంటే అమ్మ పాలు తాగుతూ , పిన్నమ్మను పొగిడినట్లుంది. గంగా నదిని ఎలా ప్రక్షాలనం చేయవచ్చో "ఓల్గా " నది తీరం వారు వచ్చి  చెప్పవలసిన పనిలేదు.               
                   
                 హిందూ మతంలో ఉన్నదంతా హింస యేనని, మనుషులలో మానవత్వాన్నీ చూడగలిగేది ఒక బౌద్దమతమేనని భ్రమపడి "బొద్ద మతం స్వీకరించిన వారు ఇప్పుడు బౌద్దులను చూసి నవరంద్రాలు మూసుకోవలసిన పరిస్తితి.   ఈ దేశం లోని హిందూ మతానికి ప్రత్యామ్నాయం గా "బౌద్దం" అనుకున్నారు, "అభినవ మనువు" అంబేద్కర్ గారు. అందుకే ఆయన ఆ మతం స్వీకరించారు . కానీ ఆయనే బ్రతికి ఉంటే తన అభిప్రాయం తప్పు అని చెప్పే వారే . ఏందుకంటే , ఛీమకు కూడా హాని తల పెట్టవద్దన్న బౌద్దమతం లో నుంచి తుపాకులతో కాల్చి చంపుకుంటున్న్న "టెర్రర్ మాంక్" లు తయారయ్యారు. కాబట్టి ఆచరణకు అనువు కానీ దానిని అవలంభించి తద్వారా హిందూ సమాజం లోని  తప్పులను  సంస్కరిద్దాం అనుకోవటం   "మూర్కిసిజం " అవుతుంది తప్పా ," రేషనలిజం " అవదు అని విజ్ణానులు ఎంత తొందరగ గ్రహిస్తే అంత మంచిది. హిందువులలో తప్పులుంటే వాటిని సంస్కరించుకునే శక్తి హిందువులకే ఉంది. దాని కోసం పరాయి మతాలు,కిరాయి మతాలను ఆశ్రయించే వారు అజ్ణానులు.హిందూ సమాజం సంస్కరణలును అంగీకరిస్తుంది ఆ  సంస్కరణల   కోసమే 14 మంది మనువులు పుడతారు అని హీందూ గ్రందాలు చెప్పాయి. ఏ మతానికైనా ఒకడే ప్రవక్త.అవి మార్పులేనివి.  కానీ హిందువులకు అట్టి దుర్దశ లేదు. ఏందుకంటే ఒక కాలం లో జరిగిన లేక అభివ్రుద్ది చెందిన తప్పుడు బావాలను ఇంకొకరి కాలంలో సరి చేయబడతాయి. అదే హిందూ రుషుల ముందు చూపుకు తార్ఖానం. అందుకే కాలాన్ని లెఖ్ఖించి 14 మంది మనువుల జన్మ ఘడియలు, ఆ యా కాలాలలో వచ్చే అవతార పురుషుల జన్మములు , వారి నామములు ఇత్యాదీ వివరం లు అన్నీ తెలిపారు. అవి నిజమ కాదా  అనేది కాదు ప్రదానం . మన రుషులు అందరికి వలెనె ఒక్కడే "మనువు" ఉంటాడు అని చెప్పవచ్చు కదా? ఇంత మంది మనువులు , ఇంతమంది అవతారాలు ఉంటాయని ఎందుకు చెప్పారు? అదే హిందూ ఋషుల వాస్తవిక ద్రుష్టి. 

  ప్రతి సమాజం లో కాలగమనం లో ఎన్నో మార్పులు కలుగుతాయి. అన్నీ మంచి అని చెప్పలేము. చెడు అని తీసివేయలేము. మంచిని స్వీకరిస్తూ , చెడును తొలగిస్తూ ముందుకు సాగాలి . ఒకా నొక దశలో సమాజానికి ఉపయోగ పడినది , మరొక దశలో ఉపయోగపడక పోవచ్చు. అందుకే ఉపయోగపడని దానిని తొలగించి , నూతన విదానాలు స్వీకరించాలి. అయితే ఇది మంచి, చెడు అని ఎవరు చెప్పాలి. మన ఇంటికి పనికి వచ్చేది ఏదో  మన పెద్దలే చెప్పాలి , తప్పా పక్కింటి వారు కాదు. అలా చెప్పగలిగిన వారే "మనువులు" అని మన ఋషుల నమ్మక్కం. వారు మాత్రమే అవసరం అయిన వేళ , మన ధర్మానికి హాని కలుగుతున్న వేళ , జన్మింఛి , హిందూ ధర్మానికి సంస్కరణలు చేసి , సమాజ గతిని నిర్దారిస్తారు. ఆ ఉద్దేశ్యంతోనే అంబేద్కర్ గారిని "అభినవ మనువు" అని గౌరవించారే తప్పా , వేరుగా చూడలేదు. కానీ ఇప్పట్టి కొంతమంది  "స్వయంప్రకటిత విజ్ఞానులు".  ఆయన  ప్రవచనాలను పదే పదే వల్లే వేస్తూ , ఆయనని ఒక మత  ప్రవక్తను చేసారు. అప్పుడు అయన ఎం చెప్పాడు అన్నది కాదు , ఇప్పుడుంటే ఏమి చేప్పే వాడూ అన్నదే ప్రదానం. అయన బౌద్ద దర్మం గురించి తీసుకున్న నిర్ణయమే పేయిల్ అయినపుడు , ఇంకా అయన అప్పుటి వ్యాఖ్యలను పదే పదే వల్లే వేస్తే అదో "మత  ప్రవచనాలు" అవుతాయి తప్పా, మార్పు కు సహకరించవు. కాబట్టి హిందూ సమాజ సంస్కరణలకు పరాయి మతాలూ , కిరాయి మతాలు వాటి ప్రవచనాలు   అవసరం లేదు.

  ఇదే విషయం మీద నేను ఇదివరకు ప్రచురించిన టపాను కూడా  చూడండి బుద్దుడు గయా!తీవ్రవాది ఆయా! http://kalkiavataar.blogspot.in/2013/07/blog-post_10.html

Thursday, November 21, 2013

ఒక ప్రక్క రాజకీయ తుపానులు , మరొక పక్క ప్రక్రుతి తుపానులతో అల్లాడుతున్న సీమాంద్రులు!

                                                   

  నిన్న విజయవాడ నుండి నా మిత్రుడు ఒకరు పోన్ చేసారు. ఆయనగారి కొలీగ్ కి ఖమ్మం కోర్టుల్లో ఏవో సర్టిపైడ్ కాపీలు కావాలంటా , అందుకు ఖమంలో ఎవరైనా తెలిసిన లాయర్లు ఉన్నారా అని అడిగితే నా రిపరెంస్ ఇచ్చాడంట. కాబట్టి సదరు మిత్రుడికి కోరిన సహాయం చేయమని నాకు చెప్పడానికి నాకు పోన్ చేసాడు.నేను సిదార్దలో లా చేసేటప్పుడు నా క్లాస్ మేట్ తను. చానాళ్ళకి పోన్ చేసాడు కాబట్టి కాసేపు యోగ క్షేమాలు విచారించుకున్నాం. పాపం అతని  మాటల్లో కొంత నైరాశ్యం ద్వనించింది. నాలుగు నెలలు బట్టి సీమాంద్రలో కోర్టులు నడవటం  లేదు. ఉద్యోగులు అంటే ఎదో పైలిన్ తుపాన్  వంకతో  తిరిగి ఉద్యోగాల్లోకి చేరి పోయారు కానీ, తక్కిన వర్గాలకు ఏ దారీ కాన రాక బరువుగా ఉద్యమాన్ని ఈడ్చుతున్నట్లుంది. అయినా ఉద్యోగుల పార్టీస్పేషన్ లేని ఉద్యమాన్ని సీమాంద్రా మీడియా కూడా  పోకస్ చేయకపోవటం వలన సీమాంద్రాలో ప్రస్తుతం ఏ ఉద్యమాలు లేవు అని ఇక్కడి తెలంగాణా వారు , అక్కడి కేంద్రం వారు అనుకుంటున్నారు.

   ఈ  సంవత్సరం జనవరి 1 న ఎవరి ముఖం చూసారో కానీ , సీమాంద్రులకు అటు ప్రక్రుతి నుంచి, ఇటు వారు ఇష్టపడి ఎన్నుకున్న "అమ్మ హస్తం"నుంచి  తుపాన్ లను ఎదుర్కొంటూ నానా కష్టాలు పడుతున్నారు. వారి తరపున రాజకీయ నాయకులు కేంద్రం తో పిల్ల ఆటలు ఆడుతూంటే ప్రజలు వారిని కట్టడి చేయలేక పోయారు. తీరా ఇప్పుడు మునుం మీదకు వచ్చే సరికి ఎన్ని గగ్గోళ్ళు పెడితే మాత్రం ఏమి లాభం? నేను ఇదే బ్లాగులో పెబ్రవరి 1 వ తారీఖున చెప్పాను. సీమాండ్రా నాయకులు పిల్ల చేష్టలు చేస్తున్నారు, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు అని. సోనియా గాందీ ఖచ్చితంగా తెలంగాణా ఇస్తుందని కూడా  చెప్పటం జరిగింది. రాజకీయాలతో ఏ మాత్రం ప్రత్యక్ష సంబందాలు లేని నేనే సోనియాగాందీ గురించి ఒక వాస్తవ అంచనా వేయగలినపుడు , మహా మహులైన వారు , ఆమె తో సనిహిత సంబందాలు ఉన్న వారు ఆమె మనస్తత్వాన్ని అంచనా వేయడం లో ఎందుకు విపలమయ్యారో అర్దం కావడం లేదు.

  తెలంగాణా రాష్ట్ర విభజన ప్రకటించే రోజు వరకు సీమాంద్రా ప్రజలకు తప్పుడు భరోసలు ఇస్తూనే వచ్చారు. ఇప్పటికీ వారిది అదే తంతు. సీమాంద్రా మంత్రులు అయితే పూర్తిగా "అమ్మ" కాళ్ళ మీద సాగిలపడి, "పాకేజీలు ఇవ్వు తల్లీ" అని దీనాతీ దీనంగా అడుకుంటున్నారు. నిజం చెప్పాలంటే మాకు తెలంగాణ విభజన అనేది వస్తుందని నమ్మకం ఉన్న, అది సోనియా గాందీ  గారి పుట్టిన రోజు కానుకగా స్వీకరించడం అస్సలు ఇష్టం లేదు. కానీ సీమాంద్రా నాయకుల దోరణీతో, పస్ట్  ఏదో విదంగా తెలంగాణా తీసుకోవడమే మంచిదని మెదలకుండా ఉన్నారు తెలంగాణా ప్రజలు. అఫ్కోర్స్ మాలోను సోనియాకి గుడి కట్టి తమలోని  పిచ్చిని ప్రదర్శిస్తున్నారు అనుకోండి . రేపు తెలంగాణా ఇచ్చాకా మాత్రం అమ్మ పార్టీని తెలంగాణాలో కూడా  ఆనవాలు లేకుండా చేయడం ఖాయం. సీమాంద్రా నాయకులకు నిజంగా తాము తప్పు చేసాము అని బావిస్తే దానికి నష్ట నివారణ చర్యలు తెలంగాణా నుంచి మొదలు పెట్టాలి. కానీ ఎంత సేపు సీమాంద్రా ప్రజలతో సమఈఖ్యాంద్ర్రకు జై అనిపిస్తే ఒరిగేది ఏమిటి? ఒక తెలంగాణా వాడిగా ఇంత కంటే ఎక్కువ చెప్పలేను.

    ఏది ఏమైనా తోటి సోదరులు అయిన సీమాంద్రా ప్రజలు అటు ప్రకృతితో , ఇటు పనికి రాని  నాయకులతో నానా కష్టాలు పడుతున్నందువలన, వారిని ఆ "పైడి తల్లి, సింహాచలం అప్పన్న, అన్నవరం సత్తెన్న, బెజవాడ దుర్గమ్మ, పానకా ల నరసింహుడు, తిరుపతి వెంకన్న అందరూ చల్లగా చూచి వారికి మేలు చేయాలని ఒక తెలుగు సోదరుడుగా కోరుకుంటున్నాను.నేను సోనియాగాందీ తెలంగాణా ఇస్తుందని చెప్పిన టపాను క్రింది  లింక్ మీద క్లిక్ చేసి చూడవచ్చు.

నాన్నా "తెలంగాణా" వచ్చే! http://kalkiavataar.blogspot.in/2013/02/blog-post.html

Wednesday, November 20, 2013

ఇన్నాళ్ళు మా దేవాలయం "గార్లఒడ్డులో" లో ఉందనుకుంటే , గూగుల్ మాప్ తో అది "ఏన్కూర్" లో ఉన్నట్లు తెలుస్తుంది!

                                                           


సాదారణంగా ఊళ్లు , ఊరి సరిహద్దులు రెవెన్యూ సర్వే మాప్ లలో ఉంటాయి . కొన్ని ఊళ్ళ పరిస్తితి ఎలా ఉంటుందంటే  ఒక వీది ఒక ఊరికి చెందినది అయితే , రెండవ వీది వేరొక ఊరి పరిదిలో ఉంటుంది. పెద్ద గ్రామాలు అయితే వాటి మీద వచ్చే రెవెన్యూ, పంచాయతీలకు ఆసరా కాబట్టి సరిహద్దులు విషయం లో సంబదిత గ్రామ పంచాయితీలు ఖచ్చితమైన సరిహద్దులు తో గ్రామ పరిపాలన వ్యవహారాలు సాగిస్తుంటయి.

   కానీ శ్రీ శైలం ప్రాజెక్టు లాంటి ప్రాంతం కూడా  ఇన్నాళ్ళు ఏ ప్రాంత పరిదిలో ఉందో రాష్త్ర సర్కార్కి కానీ , సంబదిత జిల్లా పరిపాలానా విబాగం వారికి గానీ తెలియక పోవడం విచిత్రం లో బహు విచిత్రం. ఇన్నాళ్ళు శ్రీ శైలం డాం కుడి గట్టు కర్నూల్ ప్రాంతమం లో ఉంటే , ఎడమగట్టు మహబూబ్ నగర్ ప్రాంతం లో ఉందని ఘన మైన సర్కారీ అధికారులు సెలవిస్తూ వచ్చారు. దానిని బేస్ చేసుకునే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్య మంత్రి గారు, డిల్లీ పెద్దల ముందు ఒక డాం పరిది ఒక వైపు ఆంద్రాలో , మరొక వైపు తెలంగాణ లో ఉన్న పరిస్తితుల్లో , రాష్ట్ర విభజన జరిగితే ,ప్రాజెక్టు నిర్వహణ ఎలా సాద్యం అని బల్ల గుద్ది  వాదించారు. కానీ హత్టాతుగా కర్నూల్ అటవీ శాఖ వారు ఒక పురాతన మాప్ ఒకటి వెలుగులోకి తెచ్చి, దాని ప్రకారం ఎడమగట్టు కూడా  "కర్నూల్ జిల్లాలోనే ఉందని, కాబట్టి శ్రీ శైలం ప్రాజెక్టు మొత్తం సీమాంద్ర పరిదిలోనే ఉందనే సంచలనాత్మక విషయం ప్రకటించారు.సంబదిత మ్యాపును "ఈ నాడు" పత్రికలో ప్రముఖంగా ప్రచురించారు. ఆ మాప్ ను పరిశిలిస్తే ఎడమవైపు గట్టు ప్రాంతం లో కేవలం ప్రాజెక్టు , దాని సంబఅందిత కాలనీలు ఆపీసులు, జలవిద్యుత్ కేంద్రం ఉన్న ప్రాతం మాత్రమే నంది కొట్కోర్ రిజర్వ్ పారెస్ట్ ఏరియాలో ఉన్నట్లు చూపబడుతుంది. ఇది కొంచం అనుమానాలకు తావిచ్చే పటం లాగుంది. అయినా దీని మీద ఇంకా సమగ్ర పరిశీలన చెయ్యాలి అంటున్నారు కా బట్టి ఆ విషయం మీద తెలంగాణా వారు అప్పుడే స్పందించరేమో !ఇలా ఇంకా ఎన్ని ప్రాంతాలు తెలంగాణావి అనబడేవి , సీమాంద్రాలో చేరి పోనున్నాయో!
   ఈ  విషయం నిన్న పేపర్లలో చదివాకా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా ఇన్నాళ్ళు ఒక ముఖ్యమైన జలవిద్యుత్ ఉన్న ప్రాంతం ఏ జిల్లా పరిదిలో ఉందో తెలియ కుండానే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందా అని. కానీ నిన్న మా ఊరి గూగుల్ మ్యాప్ చూసిన నాకు దిమ్మ తిరిగి పోయింది. గూగుల్ మాప్ ల లో చూపబడే గ్రామాల సరి హద్దులు సంబదిత రెవెన్యూ సర్వే మాపల ఆదారంగా తయారు చేస్తారో లేదో నాకు తెలియదు. కానీ మా గ్రామం అయిన గార్లఒడ్డు , మా మండల కేంద్ర మైన ఏనుకూరు కి శివారు గ్రామమ్. అంటే  ఏనుకూరు కి మాకు ఒకటే గ్రామ పంచయతి.ఇన్నాళ్ళు  మా దేవాలయం అయిన శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయం గార్లవొడ్డు గ్రామం లోనే ఉందని అనుకుంటున్నాం. ఎండోమెంట్ రికార్డులలో సైతం అలాగే ఉండి సుమారు 30 సంవత్సరాలు నుంది అలాగే వ్యవరించబడుతుంది. మేము గ్రామ పంచాయతీ పర్మిషన్ సైతం గార్లఒడ్డు దేవాలయం నిర్మాణం కోసమే 1963 లో తీసుకుని గుడి నిర్మించడం జరిగింది.కానీ నిన్న గూగుల్ మాప్ చూస్తె మా దేవాలయం గార్లఒడ్డు పరిదిలో లేదు. దానిని ఎడిట్ చేదామన్నా గూగుల్ మాప్ మేకర్ ఒప్పుకోవడం లేదు. బహూశా గ్రామ సరిహద్దులు ప్రైవేట్ వ్యక్తులు కానీ, సంస్తలు కానీ సరి చేయజాలవు అనుకుంటా .
                             అయితే మా గ్రామం కూడా  ఏనుకూరు  గ్రామ పంచాయతీలోదే కాబట్టి పరి పాలన ఇబ్బందులు ఏమి లేవు. కానీ రేపు రాష్ట్ర విబజన మాదిరి గ్రామ విభజన జరిగితే , వైరా నియోజక వర్గం లోనే ప్రముఖ పుణ్య క్షేత్ర మైన మా దేవాలయం ఎవరి పరిదిలో ఉండాలి అనే ప్రశ్న ఉదయించవచ్చు కదా! అప్పుడు భద్రాచలం మాదిరి మా దేవాలయం ఉన్న ప్రాంతం సమస్యాత్మకం గా మారవచ్చు కదా! మరి ఇలా ముక్యమైన స్తలములు ఏ గ్రామ ప్రాంత పరిదిలో ఉన్నాయో సరి అయిన పరిశిలన చెయ్యకుండా గూగుల్ మాప్ లు ఆవిష్కరిస్తే ఎలా? కాబట్టి మా దేవాలయం ఏ గ్రామ పరిదిలో ఉందో ఆ దేవాలయ వ్యవస్తాపక దర్మకర్త నైన నాకు తెలియదు. శ్రీ శైలం ఎడమ గట్టు ఏ జిల్లా పరిదిలో ఉందో సంబదిత జిల్లా యంత్రాంగానికి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రికి గానీ తెలియదు. ఆర్టికిల్ 371-D  సవరించకుండా రాష్ట్ర విభజన చేయవచ్చో లేదో కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలియదు. ఇన్నీ తెలియక పోవటం వెనుక ఉన్న కారణాలు ఏమిటంటే మన ప్రభుత్వాల పాలానా విదానాలు . పాలన అంతా అమ్మగారి దయలు, అయ్యగారి హుకుంలుగా నడుస్తున్నంత కాలం ఐ అమాయకత్వం కొనసాగుతోనే ఉంటుంది.

   మా ఊరి దేవాలయ వివరాల కోసం ఈ  క్రింది లింక్ ను క్లిక్ చేసి చోడండి.http://ssmasramam.blogspot.in/2013/11/the-history-and-miracles-of-of-sri.html

     

Tuesday, November 19, 2013

Face Book లో లైక్ ల కోసం వేగంగా వస్తున్నా రైల్ క్రింద పడుకున్న పిల్లలు!



 సామాజిక సైట్ అయిన ఫేస్ బుక్ పిచ్చి పిల్లలను ఎంత ప్రమాదకరమైన పనులు చేయిస్తుందో ఐ క్రింది విడియో లింక్ ను చూస్తె తెలుస్తుంది. ఆడపిల్లలు ఏమో "నేను బాగున్నానా " అని కామెంట్ల కోసం పోటోలు పెడుతూ, అపరాచితులకు తమ అందాలు ప్రదర్శిస్తుంటే , మగ పిల్లలు ఏమో తమ వీరత్వాన్నీ ప్రదర్శిస్తూ, ప్రమాదకరమైన ఫీట్లు సెల్ పోన్ ద్వారా చిత్రీకరించి మరీ ఫేస్ బుక్ లో పెడుతున్నారు. ఇటువంటి చేష్టలను నియంత్రించడానికి తగిన నియమ నిబందనలు త్వరగా ఏర్పాటు చేయకపోతే ఈ  పిచ్చి ముదిరి పాకాన పడేటట్లుంది.

  మైనర్ లు సెల్ పోన్ లు ఉపయోగించకుండ చట్టం చేస్తే ఎలా ఉంటుంది? ఒక వేళ సెల్ ఇచ్చిన కేవలం ఒక నంబర్ కు మాత్రమే అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ ఉండే సెల్ లు మాత్రమే ఉపయోగించలి. అంతే కాక ఎట్టి పరిస్తితిలో మైనర్ ల సెల్ లకు నెట్ కనెక్షన్ ఉండ కూడదు.  అటువంటి సెల్ లను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పే అధికారం పబ్లిక్ కి ఉండాలి . అంటే మైనర్ లు నిషేదిత సెల్ లను ఉపయోగించడాన్ని "కాగ్నిజబుల్  అపెన్స్ " గా గుర్తించాలి. ఇలా చేస్తే కొంత నియంత్రణా భయం ఉంటుంది అనుకుంటా!

ఫేస్బుక్ లో లైకుల కోసం పిల్లలు చేసిన ఆ ప్రమాదకర ఫీటు కోసం క్రింది విడియో లింక్ ను చూడండి
                       


                                         

Sunday, November 17, 2013

ఇండియన్స్ అందరి లో ఉన్నది హిందూ D,N.A యే నట!

మొన్నీ మద్య ఒక విడియో చూసాను. ఆ వీడియో లో ప్రముఖ   B.J.P  రాజకీయ వేత సుబ్రమణ్య స్వామీ గారు మాట్లాడుతూ  , తాజా D.N.A  అద్యయనం వలన, భారతీయుల అందరిలో ఉన్నది ఒకటే D.N.A  అని అది మన పూర్వికులదైన  "హిందూ D.N.A " అని తెలిపారు. అయన చెప్పిన దాని ప్రకారం ఇంతవరకు చరిత్రకారులు చెపుతూ వస్తున్నా కదలు అయిన "ఆర్యుల దండ యాత్ర లు. , ద్రవిడుల సంస్క్రుతి ఇవ్వన్ని పనికి రాని  ఊహ వాదాలుగా అయన కొట్టి పారేశారు. కాబట్టి ఏ మతస్తులైన సరే ఇండియాలో ఉన్నవా రందరిది ఒకటే D.N.A  కాబట్టి మౌలికంగా వారంతా హిందువులే. కొన్ని ప్రత్యేక కారణాల వలన వివిధ మతాలూ అవలంబించి , తమ పూర్వికులు వేరే వారనే దురభి ప్రాయం లో ఉన్నారు అని శ్రీ సుబ్రమణ్య స్వామీ సెలవిచ్చారు. సైన్స్ ఆవిష్కరణ ల వల్లా , ఇప్పటి వరకు చదువుకున్న చరిత్రలు  తారు మారయ్యే అవకాసం ఉందని ఐ D.N.A.  ఆవిష్కరణలు రుజువు చేస్తున్నాయి. సుబ్రహ్మణ్య స్వామీ గారి ప్రసంగం తాలూకు ఐ క్రింది విడియో  లింక్ ను  క్లిక్ చేసి చూడగలరు .

Published on Jan 2, 2013
Muslims think of themselves as an international Community , they think they are the descendants of Arabs , this is not true DNA studies have shown they are of the same DNA as other Hindus , their ancestors were hindu . Aryan Invasion theory and Dravidian theory are all disproved by Dna Studies all Indians have same DNA

Saturday, November 16, 2013

పార్లమెంట్ కంటే ముందే రాష్ట్రాన్ని విడదీసిన A.P.S.R.T.C.

                                                       



సీమాంద్రా ప్రజలు ఎంత సమైక్యతా రాగం ఆలపిస్తూ ఇటు గల్లీ నుంచి డిల్లీ దాకా తమ గోడు వెళ్ళ బోసుకుంటున్నా , రాజకీయ నాయకులు, ప్రజలే కాదు ప్రభుత్వ రంగ సంస్తలు కూడా  రాష్ట్ర విభజన జరిగి పోయినట్లే బావిస్తున్నాయి. అందుకు మంచి ఉదాహరణ మొన్న A.P.S.R.T.C.  వారు  మరియు ఆంద్ర ప్రదేశ్ టూరిజం డెవలెప్మెంట్ వారు కార్తీక మాసం సందర్భంగా  ప్రకటించిన " పంచారామా సందర్శన పదకం ".
         టూరిజం డిపార్ట్ మెంట్ వారి ప్యాకేజీలో బాగంగా హైదరాబాద్ నుండి ప్రతి శని అది వారాలు "అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం మరియు సామర్ల కోట లోని శివ క్షేత్రాలు ఉన్నాయి . ఇవన్నీ సీమాంద్రా లోని శివ క్షేత్రాలు.
అలాగే రంగారెడ్డి  R.T.C డిపో వారి ప్యాకేజీలో తెలంగాణ లోని 5 శివ క్షేత్రాలు అయిన పాలకుర్తి , 1000 స్తంభాల గుడి, రామప్పా , వేముల వాడ, కాళేశ్వరం ఉన్నాయి. ఈ విదంగా అసలు పంచారామాలు అనబడే 5 శివ క్షేత్రాలు సీమాంద్రా లోనే ఉన్నాయి . కానీ రాష్త్రం విడి పోయిందనే బావనకు వచ్చిన A.P.S.R.T.C. వారు "డెక్కన్ మహా శివాలయాలు " అనే పేరుతో నూతనంగా "తెలంగాణా  పంచారామా" లను  ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు ప్యాకేజి కల్పించారు. అయ్యో శివుడా ! ఈ   రాష్ట్ర విభజన  నీ ఆలయాలను వదలిపెట్టటం లేదు కదా!

అయినా సరే ! పంచారామాలు అంటే ఏమిటో , వాటి గురించిన విశేషాలు ఇక్కడ బ్లాగులో ప్రచురించి , పంచారామా సందర్శన బాగ్యం కలిగినట్లు ఆనందిస్తాను. మీరు కూడా  తెలుసుకుని తరించండి. విభజనలు అనే రాజకీయ పరమైనవి. భక్తులకు భగవంతునికి మద్య అవి అడ్డు గోడలు కట్ట లేవు .

 ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు. పంచారామాలు ఏర్పడుటకు స్కంద పురాణంలో వాటి స్ధల పురాణం ఇలా వివరించబడినది.పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగము సంపాదిస్తాడు.దీనితో వర గర్వముతో దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా దీనితో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్ధించగా శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడు వల్లనే తారకాసురునిపై యుద్ధానికి పంపుతారు.యుద్ధమునందు కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మలింగమును చేదిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ లింగమును చేదిస్తాడు.దీనితో తారకాసురుడు మరణిస్తాడు.చేదించగా ఆ ఆత్మలింగము వేరై ఐదు ప్రదేశములలో పడుతుంది. తరువాత వాటిని ఆఅ ప్రదేశాలలో దేవతలు ప్రతిష్ఠ ఛేస్తారు. ఇవే పంచారామాలు.
1.దాక్షారామము -
పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు.స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పైఅంతస్తు నుండి పూజలు నిర్వహించాలి.ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు సగభాగం నలుపుతో ఉంటుంది.
ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం చాళుక్యరాజయిన భీముడు నిర్మించాడని తెలుస్తుంది.అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వకాలంలో ఎంతోమంది దేవతలు,రాజులు స్వామి వారిని దర్శించి తరించారని తన భీమేశ్వర పురాణంలో రాసాడు.ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
2.అమరారామము -
పంచారామల్లో రెండవదైన అమరారామము గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణా తీరమునందు కలదు.ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు.గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది.ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది.
గర్భగుడిలోని విగ్రహాన్ని తారకాసురుని సమ్హారం అనంతరం కంఠంలోని శివుని ఆత్మలింగం చెల్లాచెదురు అవ్వగా దానిలోని ఒభాగాన్ని అమరేశ్వరుడైన ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్టించి తన నగరమైన అమరావతినే దీనికి పెట్టాడంటారు.
3.క్షీరారామము -
క్షీరారామము పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీరారామ లింగేశ్వర స్వామి అని పిలుస్తారు.
ఇక్కడ స్వామి వారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు ఇద్దరూ ప్రతిష్ఠించారట.ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది. శివుడు తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమినుండి పాలదార ఒకటి వచ్చిందట క్షీరం అనగా పాలు దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది.క్రమంగా క్షీరపురి కాస్తా పాలకొల్లుగా మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు.ఆలయం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలుతో కట్టబడింది.
4.సోమారామము -
పంచరామాల్లో నాల్గవదైన సోమారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు.ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది.మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది.
ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్టించాడు.చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి సోమారామము అని పేరు వచ్చింది.
5.కుమార భీమారామము -
పంచారామాల్లో చివరిదైన కుమారభీమారామము తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు.ఇక్కడ స్వామిని కాల బైరవుడు అని పిలుస్తారు.
ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజయిన భీముచే ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చెయ్యబడింది.ఈ ఆలయంలో మహశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

Thursday, November 14, 2013

బ్లాగుల్లో గీత: పోస్టు లు పెట్టు వీరెవరు ? కామెంటులు పెట్టు వారెవ్వరు?!

                                                     

 ఈ  మద్య  కొన్ని బ్లాగులను నిశితంగా గమనిస్తే, ఒక విషయం బోదపడుతుంది. ఆ బ్లాగుల్లో పోస్టు పెట్టిన వారు  కానీ, వారి సంబదీకులు కానీ నాలుగైదు కామెంట్లు , సదరు బ్లాగు పోస్టులోని విషయానికి వ్యతిరేకంగా , లేక అనుకూలంగా పెడుతూ వీక్షకులను రెచ్చగొట్తీ  తమ బ్లాగు టపా వైపు ఆకర్షింప బడేలా చేస్తున్నారు అనిపిస్తుంది. మరి ఇటువంటి వాటికి పేరులు వేర్వేరు గా ఉండాలి కదా అంటే అవసరం లేదు. అందరిని ఆదుకునే ఆ "అజ్ఞాత " వ్యాఖ్యాత వీరికి సహాయం చేస్తుంటాడు. అజ్ఞాత పేరుతో చిన్నా ,పెద్దా , మంచి మర్యాద లేకుండా నానా బూతులు తిడుతూ  తమ అసహ్యకర దోరణిని బయట పెట్టుకుంటారు .

  ఒక విషయం మీద అనేక రకాల అభిప్రాయాలు ఉండవచు. ఉండాలి కూడా . అలాగే ఇతరుల అభిప్రాయాలతో ఏకీభవించవచ్చు. విబేదించవచ్చు. దీనికి వేరే బాష ప్రయోగించాల్సిన  అవసరం కానీ, తమ లోని కుసంస్కారన్ని తెలిపే విదంగా పద ప్రయోగం చేయవలసిన అవసరం ఏముంది? సంస్కారమైన  పదజాలంతోనే తమ లోని నిరసన స్తాయిని ప్రతిద్వనించేలా చేయవచ్చు. అలా చేయాలంటే ముందు మనలో సంస్కారం ఉండాలి. మన సంస్కారం ఏమిటో పదిమందికి తెలియ చేయటానికి మన అసలు పేరో, కలం పేరుతోనో బ్లాగుల్లో పోస్టులు , కామెంట్లు పెట్టే దమ్మూ , దైర్యమూ ఉండాలి. అంతే కాదు , అలా  దమ్ము దైర్యమూ ఉన్న వారి కామెంట్లనే అనుమంతించాలి. బ్లాగు నిర్వహణ అంటే కేవలం బావ ప్రకటనే కాదు అది సంస్కారవంతైన , పదిమందికి ఆమోద యోగ్యమైన బాషాజాలం తో కూడినది ఉండాలని నా అభి ప్రాయం. ఒక వేళ కాదు , నేను ఇలాగే రాస్తాను అంటే దానికి వేరే "అడల్ట్ " కాటగిరి బ్లాగులు ఉన్నాయి కాబట్టి అందులో చూపించవచ్చు, బాషా నైపుణ్యం.

   ఏది ఏమైనా ఇటువంటి బ్లాగులు తక్కువగానే ఉన్నా వాటిలోని విషయాలు మీద ఏదైనా కామెంట్ చేయాలంటే భయం అవుతుంది. ఎందుకంటే ఆ తర్వాతి కామెంటర్ చండలకరమైన పదజాలంతో తన అసహనం తెలియ చేస్తే? దానిని బ్లాగర్ అనుమతిస్తారు కాబట్టి, అలాంటి బ్లాగుల్లో కామెంట్ లు పెట్టక పోవడమే మంచిది అనిపిస్తుంది. కాబట్టి ఈ  విషయం లో సహా బ్లాగర్లు ఆలోచిస్తారని ఆశ . అంతే !.

చచ్చాడు అనుకున్న మొగుడు కాసేపు బ్రతికి , బార్యని ఆమె ప్రియున్ని కటకటాల లోకి నెట్టి చనిపోయాడు

                                                     

 కొన్ని కొన్ని సంఘటనలు "దేవుడు అనే వాడు  ఉన్నాడు అనిపిస్తుంటాయి".పాపులను శిక్షించటానికి దేవుడు అనే వాడు ఒకడు ఉన్నాడు అని తెలియ   పరచటానికి ప్రత్యేకించి కదలు చెప్పనవసరం లేదు. నిత్య జీవితంలో జరిగేవి కూడా  అందుకు సాక్ష్యంగా ఉంటాయి. అలంటి ఒక సంఘటణ మొన్న 8 వ తరీకున బెంగుళూర్ లో జరిగింది.

  అయన పేరు దయానంద స్వామి . చాలా ఏండ్ల క్రిందట బెంగలోర్ వచ్చి అక్కడక్కడ హోటల్లో పని చేస్తూ , అలా కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఒక బేకరీ పెట్టుకున్నాదు. ఆయనకి బార్య రత్నమ్మ , ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యకి ఆయనకి 20 ఏండ్ల అంతరం ఉంది. అందుకే ఆమెకి అతనితో అసంతృప్తి ఉండేది కాబోలు. అయన గారేమో తన బేకరీ చూడటానికి తన మేనల్లుని తెచ్చి పెట్టాడు. రత్నమ్మ కన్ను తనకంటే చిన్నొడైన ఆ కుర్రాడి మీద పడింది. మెల్లగా వాడిని ముగ్గులోకి దించింది. ఇది కనిపెట్టిన దయానంద స్వామీ ఆమెను, ఆ కుర్రాడ్ని మందలించి ,బేకరీ నుండి వెళ్ళ గొట్టి , బార్యను ఇక నుండి జాగర్తగా ఉండమన్నాడు అంట.

    రుచి మరిగిన కుక్క అలవాటు మానుకోవటం కష్టం కాబట్టి, వారు వారి సంబందానికి పుల్స్టాప్ పెట్టుకోవటం ఇష్టం లేక , దయనందా స్వామీ జీవితానికే పుల్స్టాప్ పెడదామని డిసైడ్ అయి పోయారు.అతని మేనల్లుడు వేరే బేకరిలో పని చేస్తున్నప్పటికీ , రత్నమ్మ తో అక్రమ సంబందం చాటు మాటుగా కోన సాగిస్తున్నాడు. ఒక రోజు ఆతను తిరిగి వారిద్దరిని రెఢాండెడ్ గా పట్టుకుని , పెద్ద గొడవ చేస్తే , ఆ రోజు అతను నిద్రలో ఉండగా బార్య , మేనల్లుడు కలిసి అతని గొంతు పిసికి చంపారు. అతను చని పోయాడు అని నిర్దారించుకున్నాక , అతని బందువులకు , చుట్టు ప్రక్కల వారికీ ఆతను నిద్రలో గుండె పోటు చని పోయాడు అని కదలల్లారు. అతని దహన సంస్కారాలకు ఏర్పాట్లు మొదలు పెట్టారు.

   ఇంతలో ఆ వచ్చిన బందువులలో ఒకరికి దయానంద స్వామీ లో ఎక్కడో చిన్న కదలిక కనపడి , అనుమానంగా  పరిక్షించి చూస్తె ఎక్కడో ఊపిరి ఉన్నట్లు కనిపెట్టి హాస్పిటల్లో చేర్చారు. అక్కడ హాస్పిటలో డాక్టర్లు సపర్యలతో కొంత సేపు బ్రతికిన దయానంద స్వామి తన బార్యా మేనల్ళుల బాగోతం గురించి "మరణ వాంగ్మూలం " ఇచ్చి మరీ చని పోయాడు. ఆ దెబ్బతో పోలిసులు అక్రమ ప్రియుడు , ప్రియురాలిని కటకటాల లోకి నెట్టి , విచారణ చేస్తున్నారు. అదీ కద!

 అందుకే అంటారు "తలచినదే జరగినదా , దైవం ఎందులకు? అని

Tuesday, November 12, 2013

దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అన్న K.C.R గారు విష్ణు మూర్తి అవతారమా !?

                                                    

నేను ఈ   మద్య  మన్వంతరాలు గురించి ఒక పురాణ బాగం చదివాను.హిందూ పురాణం  లోనివి అని అందులో చేప్పబడిన అంశాలు "దశవాతార" సిద్దాంతానికి కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. ఉదాహరణకు దశావతారాలలో వామన అవతారం 5 వది. అది నరసింహా స్వామీ అవతారం తర్వాత వస్తుంది. అయన తర్వాత వచ్చేది పరశురామావతారం . కానీ "మన్వంతర " సిద్దాంతం ప్రకారం ఏడవ మనువైన వైవస్వత మనువు పేరుతో ప్రారంభమైన ప్రస్తుత "వైవస్వత మన్వంతరం " లో అవతరించిన విష్ణుదేవుని అవతార స్వరూపమే వామనుడు .
 ఈ  వామన అవతారమే "బలి చక్రవర్తిని " పాతాళానికి త్రొక్కి  వేసి , అతని వద్దనుండి "ఇంద్ర " పదవిని "పురంద్రుడికి అప్ప చెపుతూంది. అయితే ఎంతో ధర్మ నిష్టుడైన "బలి చక్రవరి" దాన గుణానికి సంతసించి అతనికి రాబోయే మన్వంతరం లో అంటే "సూర్య సావర్ణిక మన్వంతరం " కాలం లో తిరిగి ఇంద్ర సింహాసనం అధిష్టింప చేస్తానని వరమిస్తాడు. అలా బలి చక్రవర్తికి  భగవాన్ విష్ణు మూర్తి  వరం ఓకటి  పెండింగ్ లో ఉంది .

ప్రస్తుతం రాజరికాలు పోయి ప్రజాస్వామ్యాలు వచ్చాయి .దళిత బావజాల వాదులు హిందూ సాంప్రాదాయక దేవుళ్ళును పూజించవద్దని, రాక్షస వంశజులైన రావణుడు, బలి చక్రవర్తి , నరకాసురుడు వంటి వారిని పూజించాలని నూతన బావాజాలాన్ని వ్యాప్తి చేస్తూ , కొన్ని విశ్వ విద్యాలయాలలో వారి పేరు  మీదనే "ఉత్సవాలు" చేస్తున్నారు. అయితే బలి చక్రవర్తికి స్వయంగా విష్ణు మూర్తే వరం ఇచ్చాడు కాబట్టి , అటు సాంప్రదాయక హిందూ సిద్దాంతం ప్రకారం కూడా  రాక్షస వంశజుడైన "బలి చక్రవర్తి" ఇంద్రుడు కావల్సిందే. ఇది దళిత నాయకులకు ప్లస్ పాఇంట్. కానీ మహా బలి ని ఇంద్రుడు చేయాలంటే భగవాన్ విష్ణు మూర్తి కూడా  తిరిగి అవతారం ఎత్తాలి. అయన అవతారం ఎత్తాలి అంటే మన్వంతరం మారాలి . కానీ సాంప్రదాయక హిందూ లెక్కల ప్రకారం ఇప్పట్లో మన్వంతరం మారదు.

   కానీ కోంత మంది సిద్దాంత కారుల ప్రకారం "వైవస్వత మన్వంతరం "  వెళ్లి  మనం "సూర్య సావర్ణిక మన్వంతరం " లోకి అడుగు పెట్టామట! అందుకే  బలి లాంటి రాక్షస వంశీయులకు పూజలు మొదలయ్యాయి అట. త్వరలో రాక్షస వంశీ యులే   ప్రజా నాయకులై అధికారాన్ని చేపడతారట! మరి దళిత నాయకులు కు ఇంత అనుకూలంగా ఉన్న హిందూ మతగ్రందాలలోని అంశాలు నమ్ముతారో , నమ్మరో ! అయితే మనకు త్వరలో ఏర్పడబోయే "తెలంగాణ రాష్ట్రం " కి ముఖ్యమంత్రిగా "దళిత వర్గం " నాకు చెందిన వారినే నియమిస్తాను అని  తె. రా . స అదినేత గతం లో దళితులకు వరం ఇచ్చారు . మరి ఆ వాగ్దానాన్ని అయినా దళిత నాయకులు నమ్మితే , రేపు వారి వర్గం వారే తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా K.C.R.  గారిని తమ కోసం అవతరించిన బగవంతుడు అనుకుంటే , పురాణాలలో చెప్పిన విష్ణు మూర్తి అవతారం K.C.R గారే అని అనుకోవచ్చా ?

  మొత్తానికి దళిత బావజాలికులు హిందూ పురాణాలను నమ్మక పోయినా , పురాణాలలో వారికే బవిష్యత్ ఇంద్ర పీఠం అని బగవంతుడు వరమిచ్చినట్లు ఉండడం ఆశ్చర్యకరమైన విషయమే! నేను చదవిన ఆ పురాణం తాలుకూ పేజి ని క్రింద చూడగలరు.(viii chap, 3rd para).

Monday, November 11, 2013

"క్షీర సాగర 'మదన'o " సూత్రం ఫేస్ బుక్ పరిచయాలకు వర్తిస్తుంది!

                                                

ఈ  మద్య ఫేస్ బుక్  ఖాతాదారులు అయిన కొంత మంది స్త్రీలు   మిత్రుల సమావేశం లో తమ బాదతో కూడిన అభి ప్రాయాలు  వెలి బుచ్చారు. వారి ఆవేదనలో అర్దం ఉంది. వారి మాటల ప్రకారం తమ కంటే ఎంతో చిన్న వారు అయిన మగపిల్లలు  , అందులో తమ పిల్లలు వయసు ఉన్న వారు కూడా  తమకు ప్రెండ్ రిక్వెస్ట్ పంపమని వత్తిడి తెస్తుంటారట. అలా ఒకరు  పోనీలే ఎంతో ఇదిగా అడుగుతున్నాడు కదా అని చెప్పి ఆ కురాడినిమ్ ప్రెండ్ గా ఆడ్  చేసి వాడి పోస్టింగ్ లు చూస్తె మైండ్ బ్లాంక్ అయినంత పని అయిందట. ఆ విషయ్యాన్ని ఆవిడ గారు చెపుతూ , అలా చేయవద్దని ప్రాదేయపడే దోరణిలో కోరుతుంటే నాకు ఆమె అమాయకత్వానికి జాలి వేసింది.

   పేస్ బుక్ ని మనం ఏ దృష్టితో చూస్తున్నాం అనేది ముఖ్యం కాదు, మనం స్నేహితులుగా ఎంచుకో బోతున్న వారు ఏ దృష్టితో వాడుతున్నారు అనేదే ప్రధానం. పేస్ బుక్ లో ఒక్కప్పుడు కంటే ఇప్పుడు కొంత పరిపక్వత చెందిన వారు ఖాతా దారులుగా ఎక్కువుగా చేరుతున్నప్పటికి కుర్ర కారు మత్రం దానిని ఇంకా తమ లోని వికారాలు ప్రదర్శించ దానికే వినియోగిఒస్తున్నారు అని చెప్పక తప్పదు. ఈ  పేస్ బుక్ విషయం లో "క్షీర సాగర మదనo సూత్రం " వర్తిస్తుందని ఎందుకు అంటున్నాను అంటే దానికి దీనికి కొంత పోలిక ఉంది . అదేమిటంటే:-

   "పూర్వం దేవతలు ,రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెట్టారు. అజరామరులు గా  ఉండడానికి  ఇరు వర్గాలకు "అమృతం " అవసరం కాబట్టి , ఒక అవగాహనా మేరకు మందర పర్వతాన్ని కవ్వం గా, వాసుకి ని తాడు గా చేసి పాల కడలిని మదించడం మొదలు పెట్టారు. అప్పుడు ముందుగా ఉద్బవించింది "హాలా హలం" అంటే విషం . దాని దెబ్బకు ముల్లోకాలు తల్లడిల్లాయట . దానిని స్వీకరించడానికి ఎవరికీ శక్తి లేదు. స్వికరిమ్చక పోతే  సాగర మదనం కుదరదు. అప్పుడు మహా దేవుడైన శివుడు ఆ గరళాన్ని తను మింగి అది లోపలకు పోకుండా కంఠం లోనే దాచుకుని గరళ కఠుండైనాదు.  అ విదంగా క్షీర సాగర మదనం కోన సాగించి అమృతాన్ని సాదిస్తారు దేవ దానవులు . ఆ తర్వాతి కద మనకు అవసరం లేదు.

    ఈ  కదను నేను ఎందుకు పేస్ బుక్ తో పోల్ఛానంటే ఒక మంచి  కోసం ముందుకు పోతున్నపుడు ముందుగా ఎదురయ్యేది చెడే కావచ్చు . కానీ దానిని అదిగమిస్తేనే మంచి అనేది దొరకదు. ఫేస్ బుక్ లో అకౌంట్ ఓపేన్ చేసే వారిలో చాలా మంది తమ ఒరిజినల్ పోటోలు కానీ , అడ్రెస్ కానీ ఇవ్వరు. ఆడపిల్లలు అయితే సరే. కానీ మగపిల్లలు కూడా  ఆడపిల్లల పేరుతో అకౌంట్ లు ఓపెన్ చేసి ఆడపిల్లలతో స్నేహాలు కలిపి చాటింగ్ లు చేస్తూ ఉంటారు. ఇది లేని పోని వ్యవహారాలకు దారి తీసి  తమ జీవితాలు నాశనం చేసుకున్న వారి గురించి పేపర్లలో చదువుతున్నాం. కాబట్టి ఇటువంటి వారి అకౌంట్ ల పట్ల జాగర్త గా ఉంటే, ఫేస్ బుక్ విషయ సేకరణకు, సామజిక అవగాహనకు బాగా పనికి వస్తుంది. ప్రజల  అభిప్ర్రాయాలు తెలుసుకోవడానికి సామాజిక వెబ్సైట్లు ను ప్రభుత్వ వర్గాలు ఉపయోగించడం గమనార్హం.మీ బావాలను , మీ లోని నైపుణ్యాలను పది మందితో పంచుకుని , మీ విషయ పరిదిని పెంచుకోవడానికి , మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఇది తప్పకుండా పనికి వస్తుంది. కాకపొతే దానిలో ఉన్న రాక్షసుల అకౌంట్ లను పట్టించుకోకుండా , ఎవరి అకౌంట్ అయినా కొంత కాలం పరిశీలించాకే వారిని మిత్రులుగా స్వీకరింఛి వారితో మీ బావాలు షేర్ చేసుకోవడం  మంచిది.మీ ఫేస్ బుక్ మిత్రులు గురించి మీ కుటుంబం లోని వారికి కూడా తెలియటం మంచిది. అప్పుడే మీకు పేస్ బుక్ జ్ణానామ్రుతం  పంచగలగటం  తో పాటు స్వాంతన చేకూర్చగల మాద్యమం అవుతుంది. పేస్ బుక్ దానవులు ని నిరోదించటానికి సాంకేతిక అవగాహన కలిగిఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే వారి నుండి బెడద ఉండక పోవచ్చు.

Friday, November 8, 2013

తెలంగాణా వాదుల "వసూల్ దందా " నుండి వ్యాపారస్తులని రక్షించడానికే "తెలంగాణా " ప్రకటిస్తున్నారా? !

                                                     


మొన్నటి దాక చిరంజీవి గారు హైదరాబాద్ ని "U.T " చేయాల్సిందే అంటే, ఏమో లే సీమాంద్రుల కోరికను ద్రుష్టిలో పెట్టుకుని ఆ విదంగా డిమాండ్ చేసి వారి మెప్పు సంపాదించుకోవాలి అనుకుంటున్నారేమో అనుకున్నాను. కానీ మొన్న మాజీ I.P.S  అధికారి విజయ్ కుమార్ నేతృత్వం లోని "టాస్క్ పోర్స్ " బృందం , వారం రోజులు కసరతు చేసి ,కేంద్ర  హోం శాఖ కు  ఇచ్చిన నివేదిక చూస్తుంటే "తెలంగాణా" రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ వాదులు కంటే సీమాంద్ర మరియు హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటున్న ఇతర వర్గాల వారే ఎక్కువుగా కోరుకుంటున్నట్లు స్పష్టమవుతుంది చ

  ఆ మద్య ఒక సారి చిరంజీవి గారు t.r.s  మిద ఆరోపణలు చేస్తూ, వారు సినిమా వర్గాల వారి  దగ్గర  బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసిన అక్రమ వసూలకు గురించిన సమాచారం తన దగ్గర ఉందని చెప్పినట్లు గుర్తు . కాని దాని గురించి రాదాంతం చేస్తే చివరకు దాని ప్రభావం వలన తమ సినిమాలు తెలంగాణా లో నష్టపోతాయి అనే ఉద్దేశ్యంతోనే కాం గా ఉండి , తెర  వెనుక పైరవీలు చేసి "తెలంగాణ" ఏర్పాటు ప్రకటనతో తమ బాధలకు పుల్స్టాప్ పెట్టాలను కుంటునట్లుంది . మొన్న టాస్క్ పోర్స్ వారు హోO శాఖకు ఇచ్చిన నివిదేకలో 'తెలంగాణా వాదుల బలవంతపు వసూలు" నుండి సీమాంద్రుఅను రక్షించడానికి హైదరాబాద్ ని గవర్నర్ అజమాయిషిలో ఉంచాలి అని చెప్పారట. అంతే కాకుండా తెలంగాణా వ్యాప్తంగా ఉన్న సీమాంద్రుల ఆసక్తుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం అవసరం అని కూడా  నివేదికలో పొందుపర్చారు అట!

   వారు నివేదికలో ఇచ్చిన అంశాలు మరియు సీమాంద్రా మంత్రులు కోరుతున్న కోరికలు చూస్తుంటే తెలంగాణా వారికి "తెలంగాణ" అనే పేరు తప్పా ఏమి దకేటట్లు లేదు. అలగే సీమాంద్రుఅకు ఒక సమైక్యం అనేది తప్పా అన్నీ లాభాలు వారికే అనిపిస్తుంద సీమాంద్రుల రక్షణ పేరుతో పదేండ్ల పాటు కేంద్ర అజమాయిషిలో ఉన్న హైదరాబాద్ను పదకొండో సంవత్సరం అయినా  తెలంగాణ రాష్ట్రానికి ఇస్తారని గ్యారంటీ ఏమిటి? అప్పటికి మరో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును తెలంగాణాలో ప్రోస్తాహించి ఆ వంక తో హైదరాబాద్ ని శాస్వతంగా కేంద్ర అజమాయిషిలో ఉంచుకుంటే కాదనే దమ్మున్న వాడు ఎవరు? ఈ  తతంగం అంతా  చూస్తుంటే తెలంగాణా సాయుడ విముక్తి పోరాటం సమయంలో జరిగిన కదా అని ఒక పెద్దాయన చెప్పిన సంగటన గుర్తుకు వస్తుంది. అదేమిటంటే :-

      తెలంగాణా లో రజాకర్ల మీద పోరాటం తర్వాత కమ్మోనిస్ట్ దళాలు తెలంగాణ లోని బూస్వాముల మీద తమ పోరాటం కొనసాగిస్తుంటే , వారిని అణచి వేయడానికి భారత ప్రభుత్వం పోలిస్ ఆక్షన్ ని రజాకర్ల లొంగుబాటు తర్వాత కోడా కొనసాగించిందట. అటువంటి సమయం లో స్తానిక కమ్మ్యూనిస్ట్ దళాలను అణచి వేయడానికి ఒక రెడ్డీ దొర  గారు పైరవీ చేసి కొంత పోలిస్ బలగాన్ని రప్పించుకుని తన బంగ్లా  లోనే  వారికి బస కల్పించి, కమ్మ్యునిస్ట్ దాడుల నుండి భయం లేకుండా చేసుకున్నాడు అంట. ఆ తర్వాత కమ్మ్యూనిస్ట్ లు కూడా  ఆ ప్రాంతాల నుండి ,కనుమరుగైనా ,ఆ పోలిస్ బెటాలియన్ కమాండర్ మాత్రం ఆ రెడ్డిగారి భవనం విడచి వెళ్ళడానికి ఇష్టపడక , పైకి తప్పుడు నివేదికలు పంపుతూ తన బలగంతో సహా అక్కడే ఉండేలా ఆర్డర్ లు తెచ్చుకున్నాడట. అను మానం వచ్చిన ఆ" దొర గారు " ఆరా తీస్తే నమ్మ లేని చేదు నిజం బయట పడిందట! ఆ దొరగారి తాలూకు "దొరసాని" కి ఆ కమాండర్ కి అక్రమ సంబందం ఏర్పడటం వలన ఆ సుఖాలను వదులుకోలేక తప్పుడు నివేదికలతో తను అక్కడే ఉండేలా ఆర్డర్ లు తెచ్చుకున్నాడట. దానితో అటు భార్యను ఏమనలేక, ఇటు పోలిస్ వారిని ఎదిరించే దమ్ము లేక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడట ఆ "దొరగారు". అదీ కద.

   రేపు తెలుగు వారి పరిస్తితి అంతే . ఒకరి మీద ఒకరు  అనుమానాలతో, ఏదో వస్తుందన్న పేరాశతో రాజదాని నగరాన్ని వదులుకుంటే దానీ మీద శాశ్వతంగా ఆశ వదులు కోవాల్సిందే! తస్మాత్ జాగర్త  

Thursday, November 7, 2013

వెలగని "ఒలంపిక్స్ కాగడ " ని అంతరిక్షం లో ప్రదర్శించాలనుకోవడం ని సైన్స్ వాదుల "పిచ్చి" కి పరాకాష్ట అనుకోవచ్చా!?

                                                       

పెబ్రవరి7 , 2014 లో సోషలిస్ట్ దేశమైన రష్యా లోని సోచి స్టేడియం లో వింటర్ ఒలంపిక్స్ గేమ్స్ 2014 మొదలు కాబోతున్నాయి . ఇవి పెబ్రవరి 23 వరకు సాగుతాయి. ఒలంపిక్స్ సాంప్రదాయం ప్రకారం "ఒలంపిక్స్ టార్చ్ " ని వెలిగించి అది ఆరకుండా వివిధదేశాల  క్రీడాకారుల బాగస్వామ్యంతో అన్ని ప్రాంతాలలో తిప్పి, చివరకు ఆ టార్చ్ తోనే స్టేడియం లో లోని జ్వాలను రగిలించడం  ద్వారా, ఒలంపిక్స్ గేమ్స్ ప్రారంబిస్తారు. ఇందులో ప్రదానమైన  మైన విషయం ఏమిటంటే "ఒలంపిక్స్ జ్యోతి" బయలు దేరిన నాటి నుండి స్టేడియం కు తిరిగి చేరే వరకు వెలుగుతూనే ఉండాలి.  

   కానీ ఈ  సారీ గేమ్స్ నిర్వహిస్తుంది ఘనత వహిస్తున్న సోషలిస్ట్ దేశం గా ప్రకటితమైన రష్యా వారు కాబట్టి, వారికి సాంప్రఫ్దాయలు అంటే అసలు పడదు కాబట్టి ఒక కొత్త ఆలోచన చేసి దానిని అమలు చేస్తున్నారు. తాము నిర్వహించే "వింటర్ఒలంపిక్స్ 2014 " తర తరాలు గుర్తుండి పోయేలా ఒలంపిక్స్ జ్యోతి ని బూమి మీదే కాక అంతరిక్షం లో కూడా  తిప్పాలని సంకల్పించారట. మరి అక్కడ మనుషులు ఉండని ప్రాంతం కదా అంటే ఎవరైనా అనుకోవచ్చు. మనుషులు ఉండక పోతే ఉండక పోయారు కనీసం ఒలంపిక్స్ జ్యోతి వెలగడానికి అవసరమైన గాలి కూడా  ఉండదు. అంతే కాదు స్పేస్ క్రాప్ట్ లోకి వెళ్లగానే ఆ జ్యోతి ని అర్పి వేయాలి. ఇందుకు బద్రతా పరమైన అంశాలు కారణం. అలాగే వ్యోమ నౌక నుండి బయటకు వెళ్లి అంతరిక్ష నడక నడచేటప్పుడు , అక్కడ ఆక్సిజెన్ ఉండదు  కాబట్టి 'ఒలంపిక్స్ జ్యోతి " వెలిగే ప్రశ్నే లేదు. అంటే ఎప్పుడైతే  ఒలంపిక్స్ జ్యోతి తో వ్యోమగాములు స్పేస్ క్రాప్ట్ లో ప్రవేసిస్తరో అప్పుడే ఒలంపిక్స్ జ్యోతి ఆరిపోతుంది. ఇక ఆ ఆరిపోయిన జ్యోతి ని అంతరిక్షం లో తిప్పి తమ "పిచ్చి" ని ప్రదర్సీమ్పబోతున్నారన మాట ఘనత వహించిన వ్యోమగాములు , వారిని ప్రోస్తహిస్తున్న సైంటిస్ట్ లు, మేదావులు, ప్రభుత్వాలు.అలా మద్యలో ఆర్పివేసిన "ఒలంపిక్స్ జ్యోతి"తో బ్రహ్మాండంగా "వింటర్ ఒలంపిక్స్ 2014" ప్రాంబిస్తారట.

  అదే పని ఏ మత వాదులో చేస్తే , వారిని దుమ్మెత్తి పోసే వారే.కానీ ఈ  పని చేస్తుంది సైన్స్ వాదులమని చెప్పుకునే సోషలిస్టులు కాబట్టి ఎవరూ ఏమి అనరు. పిచ్చి అనేది ఎవరికైనా ఒకటే . సైన్స్ వాదులు , సోషలిస్ట్ వాదులు దీనికి మినాహాయింపు కాదని ఈ  తాజా ఉదంతం తెలియ చేస్తుంది. అందుకే మన ప్ర్పెద్దలు అంది "అతి సర్వత్రా వర్జ్యయేత్" అని. అందుకే అనేది "హూజ్ మాడ్  థోస్  హప్పి"

Wednesday, November 6, 2013

'మానవుడు' వచ్చింది 'మంకీ ' నుండా ? ,' మార్స్ ' గ్రహం నుండా ? !!!..


                                                         

 మంగళ యాన్ ! భారతీయులు తరపున మొట్ట మొదటిసారిగా మంగళ లేదా అంగారక గ్రహం చుట్టూ తిరగి విషయ సేకరణ చేయట్టానికి పంపిన స్పేస్  క్రాఫ్ట్ పేరు అది. దాని బరువు 1350 కిలోలు. దీని ని నిన్న మద్యాహ్నం P.S.L.V 25 ద్వారా భూ కక్ష్యలో  ప్రవేశ పెట్టారు. దీనితో తోలి దాస పూర్తయింది. ఇంకా ఎనిమిది నెలలు జాగర్తగా పర్యవేక్షిస్తూ అంగారక గ్రహ కక్ష్యలోకి వెళ్ళేలా చేయగలిగితే అప్పుడు భారతీయుల కల నెరవేరుతుంది. ఇప్పటికే కొన్ని దేశాలు అంగారకుడి మీద రోవర్లు దించి పరిశోదన చేస్తున్నాయి . మనం మాత్రం అంగారకుడి పై కాలు మోపకుండా దాని కక్ష్యలో తిరుగుతూ , అంగారకుడి గురించి మరింత సమాచరం తెలుసుకోవడమే" మంగళ యాన్ " ప్రయోగ ఉద్దేశ్యం.

 అసలు నాకనిపిస్తుంది "డార్విన్" చెప్పిన "జీవ పరిణామ " సిద్దాంతం తప్పేమో అని . ఎందుకంటే ఆ సిద్దాంతం ప్రకారం ఇప్పటి ఆదునిక మానవుదు "కోతి " నుండి అనేక మార్పులు పొందుతూ చివరకు మనిషి లా రూపొందాడు అట. ఇలా రూపొందటానికి గరిష్టం గా 20,000 సంవత్సరాలు కాలం సేరి పోతుందని ఒక అంచనా. మరి ఒక లెక్క ప్రకారం ఆప్రికా ఖండం లో ఆదునిక మానవుడుకి మూల రూపమైన 'హోమో సేపియన్" ఆవిర్బవించి 2,00,000 {రెండు లక్షలు ) సంవత్సరాలు అయిందట. కానీ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళబట్టి కేవలం డెబ్బై యేండ్ల క్రితమే మొదలయింది అందంటారు.ఆసియా ఖండానికి వచ్చి 15,000 యేంద్లేనట. మరి కోతి నుండి మనిషిగా పరిణామం చెందటానికి 20,000 సంవత్సరాలు సరిపోతే సుమారు 1,50,000 సంవత్సరాల పాటు ఒకే ప్రాంతం లో ఎలా ఉండగలిగాడు మానవుడు అంటే ఇప్పటికి సమాదానం దొరకని ప్రశ్నే. కోతి నుండి మానవుడు పరిణామా క్రమం చెందితే ఇంకా కోతులు కనపడడానికి కరణం ఏమిటి? అని చాల మంది ప్రశ్నిస్తుంటారు. ఒకే ప్రాంతం లో పరిణామ క్రమం చెందిన జీవులు, చెందకుండా మూల రూపాలోనే మిగిలి పోయిన జీవులు కలసి  ఉండటానికి అవకాశం ఉందా ? ఒకవేళ మనం ఆప్రికా నుండి రూపాంతరం చెంది వచ్చిన కోతులుకు వారసులం అయితే , ఆప్రికాలో కోతులు ప్రస్తుతం లేవా? అని ప్రశ్న. మరి ఇండియా లో ని పూర్వపు కోతులు ఏ రూపాంతరం చెందకుండా అలాగే ఎలా ఉన్నాయి ?

    మనకు రామాయణం లో వానర  వీరులు  ప్రస్తావన ఉంది. మన అంజనేయ స్వామి వారు సాక్షాత్తు వానర జాతికి చెందిన వారు. అది పూర్తిగా కవి కల్పన అని అనవచ్చు కొందరు. కానీ రామాయణ రచనా  కాలం డార్విన్ ఆవిష్కరణ కంటే కొన్నీ వేల  సంవత్సారాల ముందు ది.ఒకవేళ అది ఊహే అనుకున్నా , నరులతో వానరులు స్నేహసంబందాలు కలిగిఉండటం ని,కలసి మెలసి సంచరించడాన్నీ ,   విదేశి శాస్త్రజ్ఞులు కంటే వేల సంవత్సరరాల పూర్వమే మన రామాయణ కర్త అయిన వాల్మీకి ఊహించగలగడం  గ్రేటే కదా!   ఒక సిద్దాంతం ప్రకారం శాస్త్రజ్ణులు కంటే ముందే  ఆద్యాత్మిక వాదులు విశ్వ రహస్యాలు తెలుసుకోగలుగుతారు.  ఆ విషయాన్నీ వారు వారి కర్దం  అయిన రీతిలో వివరిస్తారు. కొంచం కల్పనా శక్తి ఉన్న వారు కధలూ  , కావ్యాలుగా వాటిని ఆవిష్కరిఇంచారు . ఆ తర్వాతనే శాస్త్రీయ బావనలు అభివృద్ధి చెందటం ప్రారంబం అయ్యాక వాటిని నిరూపించడానికి ప్రయత్నిచడం ప్రారంభించారు శాస్త్రజ్ఞులు

             అసలు కోతి నుండి మనిషి వచ్చాడు అనే దానికంటే ఒకప్పుడు వానరాలను పోలిన జీవ జాతి ఒకటి మానవులతో సమకాలీనులుగ ఉండే వారు అనిపిస్తుంది. మరి వారెవరూ ? ఈ  మానవు లెవరు? అనేది   తరవాతి టపాలో చెపుతాను. .     

Monday, November 4, 2013

ప్రజల మనసులోదీ చెప్పలేరు! తమ మనసులోది అసలు చెప్పలేరు! ఎవరికీ పనికి రానీ ఈ సీమాంద్రా పార్టీలు ఎందుకు?

                                                                          

మొన్నట్టి దాక తమకు చెప్పకుండా హఠాత్తుగా "రాష్ట్ర విభజన ' నిర్ణయం తీసుకోవడమేమిటని దీర్గాలు తీసారు. ఒక వేళ రాష్ట్రం ఏర్పాటు చెస్తే రెండు ప్రాంతాలిక్ "సమ న్యాయం" చేయాలన్నారు.  డెబ్బై రోజులకు పైగా సమ్మె చేయించారు. సాక్షాతూ ముఖ్యమంత్రి గారు రెండు ప్రాంతాల సమస్యలకు పరిష్కారం చూపించాకే   విభజన పై ముందుకు కదలాలి అనటమే కాక భారత రాష్ట్ర పతి  గారికి అధికారిక లేఖ రాశారు. అయన గారీ సూచనలకు తల ఒగ్గిన కేంద్ర ప్రభుత్వం మళ్లి  అఖిల పక్షం మీటింగ్ కు రమ్మని రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పక్షాలు అన్నింటిక్ కబురు పంపింది.

  ఇక ఇప్పుడేమో అఖిల పక్ష మీటింగ్ కు వెళితే రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నట్లేనని కొత్త రాగం అందుకుని దానికి వెళ్ళేది లేదని భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నారు. రాష్ట్రం లో T.D.P. , కాంగ్రెస్ పార్టీలు రెండు ప్రాంతాలలో పట్టు ఉన్న పార్టిలు కాబట్టి వారు గోడ మీది పిల్లి వాటం ప్రదర్శిస్తున్నారు. అసలు పార్టీల నుంచి ఒకే అభిప్రాయం చెప్పాలని రూలేమన్నా ఉందా ?  లేదు కదా ! మరి అఖిల పక్షం మీటింగ్ కు రెండు ప్రాంతాల ప్రతినిధులు హాజరయి అభిప్రాయాలు చెప్పొచ్చు. ఇక్కడ రాజకీయ పార్టీల అభిప్రాయాలు కాదు, రెండు ప్రాంతాల ప్రజల అభి ప్రాయలు తెలియచేయల్సిన గురుతరమైన బాద్యత రాజకీయ పార్టీల మీద ఉంది. రెండు ప్రాంతాల అభిప్రాయాలు విన్న తర్వాత కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా , దానికి రాజ్యంగా బద్దత ఉంటుంది కాబట్టి ఎవరూ చేయగలిగేది ఏమి ఉండక పోవచ్చు. మరి అలా ఒక పద్దతి ప్రకారం నడచే అవకాశం వచ్చినపుడు ఆ అవకాశాన్ని చేజార్చుకోవడం ఎందుకు?

 అసలు ప్రజల మనో బావాలను తెలియచెప్పలేక నిత్యం అయోమయానిక్ గురయ్యే ఈ  అవకాశవాద పార్టిలు తెలుగు ప్రజలకి అవసరమా? ఆలోచించండి?

Sunday, November 3, 2013

నరకాసురుడ్ని చంపబట్టి "నరక చతుర్దశి ",మరి దరాసురుడుని చంపకుండా చేయగలరా "దీపావళీ" !?

                                                               
                                                                  


మా చిన్న తనంలో దీపావళీ పండగ అంటే పిల్ల లందరికి ఎంతో సంబరంగా ఉండేది. పండుగకు అయిదు రోజుల ముందు నుంచే టపాసులు కాలూస్తూ ఆనందించే వారం. వంద రూపాయలకు బుట్టెడు టపాసులు వచ్చేవి. మరి ఈ రోజులో , పండగ వస్తుండంటే పెద్దలు  గుండెలు బేజారు అవుతున్నాయి. టపాసుల దరలు చూసి ఒక విదమైన వైరాగ్యం వస్తుంది వారికి .కమ్మగా పిండివంటలు వండుకుని తినక ఎందుకు అంతంత డబ్బులు పోసి కొని తగలెయ్యడం అని వైరాగ్య జ్ఞానం ప్రదర్శిస్తున్నారు.నిజమే మరి దేనికైనా ఒక పరిమితి ఉంటుంది.  వేల రూపాయలు ఖర్చు చేసినా చిన్న క్యారీ బ్యాగులోకి రాణి ఆ టపాసులు ని తగలేసి పండగ చెయ్యాలంటే మధ్యతరగతి వారికి ఎలా మనసొప్పుతుంది?

   సత్యబామ నరకాసురుడుని చంపింది కాబట్టి "నరక చతుర్దర్శి " వరకు చేసుకుంటున్నారు. ఆ రోజు తలకు పోసుకుని పిండి వంటలు చేసుకుని తిని ఆనందిస్తున్నారు. మరి ఈ   " దరాపతులు" (ప్రభుత్వాలు) ఆ దరాసురులు {అధిక దరలు) ని అదుపు చేయలేరు కాబట్టి దీపావళీ మాత్రం "తుస్ " మనక తప్పటం లేదు.అందుకే ఈ  రోజున ఆ దన లక్ష్మి తల్లి పూజ చేసి ,శాస్త్రానికి నలుగు టపాసులు కాల్చి కూర్చోవడమో, టి.వి.లు చూస్తూ కాలం గడపడమో  జరుగుతుంది.

 కల్కిఖడ్గం బ్లాగు మిత్రులకు , వీక్షకులకు, అగ్రిగ్రేటర్లకు దీపావళీ శుభాకంక్షలతో .....

Friday, November 1, 2013

తెలంగాణా ఇవ్వం! అని కేంద్రం హామీ ఇస్తేనే సీమాంద్ర ఉద్యోగులు "సమ్మె " విరమించి కాం గా ఉన్నారా?

                                                                


 ఈ  మద్య ముఖ్య మంత్రి గారి మాటల్లో, సీమాంద్రా నాయకుల మాటల్లో కొంత దైర్యం కనపడుతుంది. ఎట్టి పరిస్తుతుల్ల్కో రాష్ట్ర ఏర్పాటు ఎన్నికల లోపు జరగదు అంటున్నారు. ముఖ్యమంత్రి గారి కి కేంద్రం నుండి దీనికి సంబందించిన అనుకూల సంకేతాలు వచ్చినట్లు కనపడుతుంది. అందుకే అయన సీమాంద్రా ఉద్యోగుల సమ్మెను విరమింప చేసారా? అనే సందేహమూ కలుగుతుంది. అయన గారు రాష్ట్రపతి గారికి లేఖ రాయడం , ఆ లేఖ మీద రాష్ట్ర పాటి గారు హోం శాఖకు తగు సూచనలు ఇవ్వడం, ఆ తర్వాత మరొక్క సారీ తెలంగాణా పై అఖిల పక్ష పార్టీ మీటింగ్ కు అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించడం చక చక జరిగిపోతున్నాయి.

    ఇక పోతే ఇంకొక ప్రక్క కేంద్ర  హోం శాఖ వారు గ్రూప్ అప్ మినిస్టర్స్ కి పంపిన 85 పేజీల రహస్య బాక్ గ్రౌండ్ నోట్ కావాలనే మీడియాకు లీక్ చేసినట్లు తెలుస్తుంది. అందులో హైదరాబాద్ విషయం, నీటి వనరుల విషయంతో పాటు ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. అది ఏమిటంటే ఆర్టికిల్ 371-D సవరణ అనివార్యం కావచ్చు అనే సంకేతాలు ఇవ్వడం. దీని అర్దం అది సవరించాలంటే కావలసిన 2/3 మెజార్టీ , కాంగ్రెస్ వారికి ప్రస్తుత పార్లమెంటులో లేదు కాబట్టి, వచ్చే ఎన్నికలలో కష్టపడి ఆ మెజార్టీ సాదించాకా తెలంగాణ ఇస్తాం అని చెప్పకనే చెపుతున్నారు అన్న మాట. అందుకే కాబోలు ఎన్నికల లోపు తెలంగాణా రాదు అని సీమాంద్రా ఉద్యోగులు, నాయకులు డంకా బజాయించి చెప్పడం.

   ముఖ్యమంత్రి గారు కూడా  మొన్న్ననే "దుమ్ముగూడెం టేయిల్ పాండ్" కి అనుమతులు ఇచ్చేసినట్లు చెప్పడం వెనుకాల ఉన్న మతలబ్ అదే. ఒక ప్రక్క తెలంగాణ ఇస్తాం అని చెపుతూనే, హైదరాబాద్ లో వాటా , గోదావరి నదీ జలాల్లో  వాటా సీమాంద్రులకు ఇస్తే, ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరం ఏమిటి? "ఒరే బాబూ ,'తెలంగాణ ఆవు'నీకే , కానీ దానిలో సగం పాడి నీ  సీమాంద్రా అన్నకు ఇవ్వు " అన్నట్లుంటుంది. దాని వలన తెలంగాణా ప్రజలు నిరాశకు గురి అయి ,అసలు రాష్ట్ర ఏర్పాటు మీదే ఆసక్తి చూపక పోవచ్చు. అధికార పార్టికి కావాల్సింది అదే . అందుకే అటు చేసి, ఇటు చేసి తెలంగాణా వారికి టోపి పెట్టె దిశగా కేంద్రం అడుగులు మార్చుకుందని బావించవచ్చు! చూదాం ఎం చేస్తుందో?