Saturday, November 16, 2013

పార్లమెంట్ కంటే ముందే రాష్ట్రాన్ని విడదీసిన A.P.S.R.T.C.

                                                       



సీమాంద్రా ప్రజలు ఎంత సమైక్యతా రాగం ఆలపిస్తూ ఇటు గల్లీ నుంచి డిల్లీ దాకా తమ గోడు వెళ్ళ బోసుకుంటున్నా , రాజకీయ నాయకులు, ప్రజలే కాదు ప్రభుత్వ రంగ సంస్తలు కూడా  రాష్ట్ర విభజన జరిగి పోయినట్లే బావిస్తున్నాయి. అందుకు మంచి ఉదాహరణ మొన్న A.P.S.R.T.C.  వారు  మరియు ఆంద్ర ప్రదేశ్ టూరిజం డెవలెప్మెంట్ వారు కార్తీక మాసం సందర్భంగా  ప్రకటించిన " పంచారామా సందర్శన పదకం ".
         టూరిజం డిపార్ట్ మెంట్ వారి ప్యాకేజీలో బాగంగా హైదరాబాద్ నుండి ప్రతి శని అది వారాలు "అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం మరియు సామర్ల కోట లోని శివ క్షేత్రాలు ఉన్నాయి . ఇవన్నీ సీమాంద్రా లోని శివ క్షేత్రాలు.
అలాగే రంగారెడ్డి  R.T.C డిపో వారి ప్యాకేజీలో తెలంగాణ లోని 5 శివ క్షేత్రాలు అయిన పాలకుర్తి , 1000 స్తంభాల గుడి, రామప్పా , వేముల వాడ, కాళేశ్వరం ఉన్నాయి. ఈ విదంగా అసలు పంచారామాలు అనబడే 5 శివ క్షేత్రాలు సీమాంద్రా లోనే ఉన్నాయి . కానీ రాష్త్రం విడి పోయిందనే బావనకు వచ్చిన A.P.S.R.T.C. వారు "డెక్కన్ మహా శివాలయాలు " అనే పేరుతో నూతనంగా "తెలంగాణా  పంచారామా" లను  ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు ప్యాకేజి కల్పించారు. అయ్యో శివుడా ! ఈ   రాష్ట్ర విభజన  నీ ఆలయాలను వదలిపెట్టటం లేదు కదా!

అయినా సరే ! పంచారామాలు అంటే ఏమిటో , వాటి గురించిన విశేషాలు ఇక్కడ బ్లాగులో ప్రచురించి , పంచారామా సందర్శన బాగ్యం కలిగినట్లు ఆనందిస్తాను. మీరు కూడా  తెలుసుకుని తరించండి. విభజనలు అనే రాజకీయ పరమైనవి. భక్తులకు భగవంతునికి మద్య అవి అడ్డు గోడలు కట్ట లేవు .

 ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు. పంచారామాలు ఏర్పడుటకు స్కంద పురాణంలో వాటి స్ధల పురాణం ఇలా వివరించబడినది.పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగము సంపాదిస్తాడు.దీనితో వర గర్వముతో దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా దీనితో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్ధించగా శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడు వల్లనే తారకాసురునిపై యుద్ధానికి పంపుతారు.యుద్ధమునందు కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మలింగమును చేదిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ లింగమును చేదిస్తాడు.దీనితో తారకాసురుడు మరణిస్తాడు.చేదించగా ఆ ఆత్మలింగము వేరై ఐదు ప్రదేశములలో పడుతుంది. తరువాత వాటిని ఆఅ ప్రదేశాలలో దేవతలు ప్రతిష్ఠ ఛేస్తారు. ఇవే పంచారామాలు.
1.దాక్షారామము -
పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు.స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పైఅంతస్తు నుండి పూజలు నిర్వహించాలి.ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు సగభాగం నలుపుతో ఉంటుంది.
ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం చాళుక్యరాజయిన భీముడు నిర్మించాడని తెలుస్తుంది.అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వకాలంలో ఎంతోమంది దేవతలు,రాజులు స్వామి వారిని దర్శించి తరించారని తన భీమేశ్వర పురాణంలో రాసాడు.ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
2.అమరారామము -
పంచారామల్లో రెండవదైన అమరారామము గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణా తీరమునందు కలదు.ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు.గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది.ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది.
గర్భగుడిలోని విగ్రహాన్ని తారకాసురుని సమ్హారం అనంతరం కంఠంలోని శివుని ఆత్మలింగం చెల్లాచెదురు అవ్వగా దానిలోని ఒభాగాన్ని అమరేశ్వరుడైన ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్టించి తన నగరమైన అమరావతినే దీనికి పెట్టాడంటారు.
3.క్షీరారామము -
క్షీరారామము పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీరారామ లింగేశ్వర స్వామి అని పిలుస్తారు.
ఇక్కడ స్వామి వారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు ఇద్దరూ ప్రతిష్ఠించారట.ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది. శివుడు తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమినుండి పాలదార ఒకటి వచ్చిందట క్షీరం అనగా పాలు దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది.క్రమంగా క్షీరపురి కాస్తా పాలకొల్లుగా మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు.ఆలయం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలుతో కట్టబడింది.
4.సోమారామము -
పంచరామాల్లో నాల్గవదైన సోమారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు.ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది.మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది.
ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్టించాడు.చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి సోమారామము అని పేరు వచ్చింది.
5.కుమార భీమారామము -
పంచారామాల్లో చివరిదైన కుమారభీమారామము తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు.ఇక్కడ స్వామిని కాల బైరవుడు అని పిలుస్తారు.
ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజయిన భీముచే ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చెయ్యబడింది.ఈ ఆలయంలో మహశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

No comments:

Post a Comment