Friday, September 30, 2016

బ్రహ్మం గారు తన దివ్యదృష్టితో ఈ దృశ్యం చూడటం వలన ఆ మాట అన్నారా !!?

                                                                   


                           బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో అనేక వింతలు విశేషాలు గురించి చెప్పారు .16 వ శతాబ్దానికి చెందిన  అయన గారు చెప్పిన వింతలు విశేషాలు అన్ని అయన స్వయంగా తన దివ్యదృష్టితో చూసి చెప్పినవే . కాకపొతే అయన చూస్తున్న భవిష్య దృశ్యాన్ని ఆయనకు అర్ధమైన రీతిలో చెప్పడం జరిగింది కాబట్టి , ఇప్పటి మనకు అయన చెప్పేవి  అర్ధం కాక అయోమయంగా ఉండవచ్చు. ఉదాహరణకు :

   అయన గారి కాలజ్ఞానం లో  ఒక చోట "రెక్కల కోడి వచ్చును, దాని రెక్క విసురుకు వేల  మంది చచ్చును అని చెప్పినట్లు ఉంది. కోడి రెక్క విసురుకు వేలమంది చావడమేమిటి? ఇదేదో అభూత కల్పన కాకపొతే అనుకోవచ్చు ఎవరైనా . కానీ ఆధునిక కాలం లో  యుద్దాలు జరిగే సమయం లో ఉపయోగించే బాంబర్ విమానాలు చూడటానికి ఎలా ఉంటాయి ? రెక్కలు విప్పి ఎగురుతున్న కోడి లేక పక్షి లాగా  ఉంటుంది కదా! మరి ఆ బాంబర్ విమానాలు నుండి ప్రయోగించే బాంబులు వలన భూమి మీద ఉన్న జనం హతం అవుతుంటే , అదేదో రెక్క విసురు వలననే చేస్తున్నట్లు అనిపించడం వలననే బ్రహ్మం గారు ఆ విధంగా చెప్పి ఉండాలి. 

                                                                             

 అలాగే బ్రహ్మము గారు చెప్పిన ఇంకొక వింత . "ఆవు కడుపున పంది పుట్టును" అనేది . ఇదెలా చెప్పి ఉంటారో ఊహిస్తే,  అయన  గారి దివ్య దృష్టిలో ఆవు పందికి జన్మ ఇస్తున్న దృశ్యం కానీ , లేక పై చిత్రం లో చూపిన విధంగా ఆవు పాలు తాగుతున్న పంది   దృశ్యం కానీ కనిపించి ఉండాలి. అందుకే అయన ఆ విధంగా తన కాల జ్ఞానం  లో చెప్పి ఉంటారు. మరి ఆ విధంగా చుస్తే బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమయినట్లే కదా ! కరీం నగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణం లో జరిగిన పై వింతను  గమనిస్తే "ఆవు కడుపున పంది పుట్టిందా " అని అనిపించక మానదు కదా?!!

Wednesday, September 28, 2016

అమ్మా! ఈ నలబై యేళ్ళుగా నేను లైంగిక దోపిడికి గురవుతూనే ఉన్నాను!


                                                                 
                                                               

 రోజూ ఉదయం ఆరు ఇంటికి వచ్చే పనిమనిషి "రాములమ్మ" రాలేదు. నాకు చచ్చేంత విసుగ్గా ఉంది. రాములమ్మ పనికి కుదిరిన దగ్గర్నుంచి, నాకు చాలా  పని బారం తగ్గి సుఖానికి అలవాటు పడటం వలన ,ఒక్క రోజు పని మనిషి రాకపోయినా న గుండేల్లో రైళ్లు పరుగెడ్తూ ఉంటాయి. టైం ఏడు అయింది. ఇక ఈ రోజు రాములమ్మ రాదని నిర్ణయించుకుని మనసుకి సర్ది చెప్పికి ఒళ్లు ఒంచాను.

 ఈసురో మంటూ పనులన్నీ అయిపోయాయి అనిపించేసరికి పన్నేండు అయింది. ఇక కోంచం నడుం వాలుద్దామని మంచం మీద పడుకున్నానో లేదో, బయట తలుపు కొట్టిన చప్పుడు అయి, చిరాకుగా వెళ్ళి తలుపు తీసాను. ఎదురుగా రాములమ్మ!

  ఒక్క సారిగా అరచినంత పని చేసాను"ఏమైంది రాములమ్మ? పొద్దునే రాలేదు"

  "అన్యాయం అయిపోయానమ్మా" ఒక్క సారిగా నన్ను కావలించుకుని ఘొల్లు మంది రాములమ్మ.

  "ఏమైంది రాములమ్మా" మనసెందుకో కీడు శంకిస్తుంటే అడిగాను.

  "అయ్యో నన్నాడు  నలబై  యేండ్లుగా  దోపిడి చెస్తుండటమ్మా" బోరుమంది

 రాములమ్మా.

 అదిరి పడ్దాను  నేను. "ఎవడే వాడు" కోపంగా అడిగాను.

 ఇంకెవడూ , నా మొగుడే.

 ఏమిటీ? నీ మొగుడా? అనుమానంగా అడిగాను.

  అవునమ్మా ఆడే,అని తలచుకుని తలచుకుని ఏడవ సాగింది రాములమ్మ.

  రాములమ్మ ఏడుపు వెనకాల  ఏదో పెద్ద కదే ఉందనిపించింది. నెమ్మదిగా ఆమెను కూర్చోబెట్టి బోజనం పెట్టాను. తిన్న తర్వాత అసలు ఏమి జరిగిందో చెప్ప మన్నాను. ఆమె చెప్పినది విన్న తర్వాత నాకు నోట మాట రాలేదు. అలాగే మ్రాన్పడి పోయాను. రాములమ్మ తెల్లారి టైం కి వస్తాను అని చెప్పి వెళ్ళి పోయింది. ఇంతకీ ఆమె చెప్పిన విషయం ఏమీటంటే,

  రాములమ్మకు చిన్న తనంలోనే పెండ్లి సంబందం వచ్చింది.  ఆమె మొగుడు భద్రయ్య కొంచం చదువుకోవటమే కాక గడుగ్గాయి గా  పేరు పడిన  కుర్రాడు. అందుకు రాములమ్మని ఇవ్వడానికి తల్లితండ్రులు సందేహిస్తుంటే, మద్య వర్తి" అమ్మాయి యుక్తవయస్కురాలు అయ్యాకే  పెండ్లి చెద్దాం. ముందు పప్పన్నాలు తినండి. ఒక వేళ పెండ్లి నాటికి మీకు ఇష్తం లేక పోతే అప్పుడే సంబందం కాన్సిల్ చేసుకోవచ్చు, మీ రెండు కుటుంబాలు కలిస్తే ఇద్దరికి మంచిగుంటుంది. ఆ పైన మీ ఇష్టం".అంటే సరే అని సంబందం కుదుర్చు కున్నారట. ఆ తర్వాత రాములమ్మ యుక్త వయస్కురాలవడం, ఆ పైన ఏ అబ్యంతరం లేకుండా వారి పెండ్లి జరగటం అయిపోయాయి. ఆ తర్వాత అందరి సంసారాల మల్లేనే అప్పుడప్పుడు కీచులాడుకోవడం, అలిగి పుట్టిటీంటికి వెళ్ళడం, బ్రతిమాలో, పెద్దల జ్యోక్యంతోనో  తిర్గి కాపురానికి రావడం, ఇలా గడుస్తూనే ముగ్గురు బిడ్డల తల్లి అయింది రాములమ్మ.

  నిజానికి రాములమ్మకు పని చేసి పొట్ట పోసుకోవలసిన అవసరం లేదు. పెడ్ద అబ్బయి కాలరీస్ లో పని చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. తక్కిన ఇద్దరు ఆడపిల్లలకు పెండ్లిల్లు అయి వారి మొగ్గుల్లతో చక్క గా కాపురం చేసుకుంటున్నారు. కొడుకు కూడా తల్లితండ్రులకు నెల నెలా ఖర్చులకి సరి పోను పంపిస్తున్నా, రాములమ్మే కోడుకు కి తెలియకుండా మా ఇంటిలో పని చేస్తుందట. రాములమ్మ మొగుడికి ఇప్పుడు అరవైఅయిడేళ్లు. ఇంటి దగ్గరే ఉంటాడు.

  ఈ మద్య రాములమ్మ ఉండే కాలనీలోని ఆడాళ్లందరికి కలిపి ఒక సంఘం పెట్టారట. ఆ సంఘం లో ఆడాళ్ళ హక్కులు, ఆడోళ్ళు మీద మొగుళ్ళు చేసే దౌర్జన్యాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలిపారట! వారందరిలో ఒకామె చెప్పిన ఉపన్యాసం రాములమ్మని ఆలోచనలో పడేసిందట. ఆమె చెప్పిన దాని ప్రకారం "ఆడదానికి దేనిలోను స్వాతంత్ర్యం లేదు. అన్నిటీ లోను మగాడే జులుం చేసి తన కోరినట్లు ఆడది నడిచేలా చేస్తున్నాడు. చివరకు పడకింట్లో కూడా మాగాడిదే పై చేయట(?). అందుకని అటువంటి సంసారం ఇష్ట పూర్వకంగా చేసినది కాదు కాబట్టి, అది కూడా దోపిడి క్రిందే లెఖ్ఖట!కాబట్టి ఇప్పుడు అటువంటి మొగుళ్ళకి  ఎదురు తిరగాలట, అవసరమైతే విడాకులు ఇవ్వాలట!

 ఇది విన్న తర్వాత రాములమ్మకి తను రోజు మొగుడి క్రింద ఎంత దోపిడికి గురి కాబడిందో తెలిసి గుండే చెరువు అయిందట! ఎంత అవమానం! ఇక ఈ అవమానం భరించడం తన వల్ల కాదట. అందుకే తన ముసలి మొగుడికి విడాకులు ఇద్దామని పెద్దమనుషులు పంచాయితి పెడితే, కాలనీ స్త్రీల సంఘం ఒత్తిడితో కాలనీలోని పెద్ద మనుషులు విడాకులు ఇప్పిస్తాను అని ఒప్పుకున్నాడట. దానికి రాములమ్మ మొగుడు తన కొడుకు ఇచ్చే డబ్బులతో ఎలాగో బ్రకుతాను అంటే దానికి రాములమ్మ తరపు వారు ఒప్పుకోలెదట. ఇన్నాళ్ళు రాములమ్మని దోచుకుందే కాక, ఇప్పుడు రాములమ్మ కొడుకు డబ్బులు దోచుకోవడానికి ముసలాడు కుట్ర పన్నాడు అని అన్నారట. పంచాయితీ వచ్చే వారం కి వాయిదా వేసారట. అందుకే రాములమ్మ ఈ రోజు పని లోకి రాలేదట. అదీ రాములమ్మ మొగుడి  నలబై యేండ్ల దోపిడి కద.

 ఆమె కద వింటుంటే నాకెక్కడో ఇలాంటి కదే ఈ మద్య విన్నట్లు ఉంది, ఎక్కడబ్బా? అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను.          
                                                                                                                                                                    (28/9/2013 Post Republished).                      



Sunday, September 25, 2016

హఠాతుగా ప్రత్యక్షమైన దెయ్యం కారు! ఎక్కడి నుండి వచ్చిందో చెప్పగల విజ్ఞానులు ఎవరు?

                   
                                                                           
                               

                                 ఆస్ట్రేలియాలో ని ఒక రోడ్డుమీద గొప్ప విచిత్రం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తూ తన ఎదురుగా వెళుతున్న కారు గమనాన్ని వీడియో షూట్ చేస్తున్నాడు. ఒక మలుపు దగ్గర హఠాతుగా తన కారు ముందు ఉన్న కారు ఆగింది. కారణం ఏమిటంటే సదరు  కారు ముందు వెళుతున్న వ్యాన్ ను బూడిద రంగు ఆస్ట్రా కారు ఒకటి హఠాతుగా ఢీకొనడమే కాక 180 డిగ్రీ లలో తిరిగిపోయింది. ఆ తర్వాత ముందున్న కారు చిన్నగా టర్నింగ్  తీసుకుని ఆ ఢీకొట్టిన కారు పక్కనుంచి వెళ్లడం తో ఈ  వీడియో ఉన్న కారు కూడా కదలి వెళ్లి పోయింది. ఇది మాములు విషయమే కదా? ఇందులో విశేషం ఏమిటంటారా? అయితే చూడండి .

     మీరనుకున్నట్లే అది మామూలు విషయమే అని వీడియో తీస్తున్న మిత్రుడు కూడా వెళ్ళిపోయాడు. కానీ ఇంటికి వెళ్లి వీడియో పరిశీలిస్తున్నప్పుడు ఆ విచిత్రం తెలిసింది.  సదరు మలుపు దగ్గర  ముందు నుంచి టర్న్ అవుతున్న కారు , వ్యాన్,  మరియు  ఎదురుగా వస్తున్నా అన్ని కారులు కనిపిస్తున్నాయి. కానీ వ్యాన్ ను డి కొట్టిన కారు మాత్రం అందులో కనిపించలేదు. అది హఠాతుగా ప్రత్యక్షమై వ్యాన్ ను డి కొట్టి ఆగాక మాత్రమే కనిపించింది. అందులోనుంచి ఎవరో దిగారు కూడా . మరి అప్పటి వరకు రోడ్డు మీద కానీ , ఆ పరిసరాలలో కానీ లేని కారు హఠాతుగా ఎలా ప్రత్యక్షమైంది ? అది ట్రాఫిక్ లో వ్యాన్ ను ఢీకొట్టబట్టి ఆగింది కానీ నిర్మానుష ప్రాంతం లో అయితే దానిని గుర్తించే అవకాశం  లేదు.

                    అటువంటి కారు ను తెలుగు సినిమాలు చూసే  మనం  "దెయ్యం కారు " అంటామేమో కానీ , సదరు వీడియో తీసిన వ్యక్తికీ ఇంగ్లీష్ సినిమాలు చూస్తాడు అనుకుంటా , అందులో  చూపించే అడ్వాంస్డ్ సైన్స్ లాగా  "టెలిఫోర్టేషన్  " విధానం ద్వారా ప్రత్యక్షమైన కారు అంటున్నాడు . అంటే మనం దృశ్య , శ్రవణాలను ఎలాగైతే ఒక చోట నుండి మరొక చోటుకి ప్రసారం చేస్తున్నామో  , అలాగే వస్తువులను కూడా   ఒక చోటు నుండి మరొక చోటుకి క్షణాల్లో లేక నిమిషాల్లో  పంపే ప్రక్రియ అన్న మాట . ఇదేలాగో వివరంగా తెలుసుకోవాలంటే గూగుల్ సెర్చ్ ద్వారా తెలుసుకొండి. లేదూ , నేనే చెప్పమంటే నాకు వీలున్నప్పుడు వివరంగా చదివి ఇదే బ్లాగులో చెపుతాను . అందాక ఈ విచిత్రాన్ని క్రింది వీడియోలో చూచి అశ్చర్య పడుడి !..





                                                                    

Friday, September 23, 2016

."కల్లూరి గుట్టల" మీద బ్రతుకుతూ , "కల్ల కొండలకు " మొక్కడమేందిరా?

                                                          

                                              మా వూరి ప్రక్కనే నరసింహ రావు పేట అనే ఊరు ఉంది . అ ఊరిలో తెలగ వారి కుటుంబాలు ఎక్కువుగా ఉన్నాయి . మా పొలం ప్రక్కనే వారి పొలాలు ఉండేవి కాబట్టి వారితో మాకు పరిచయాలు ఉన్నాయి . అప్పుడప్పుడు  వారు పిలిస్తే వాళ్ళ ఇండ్లకు కూడా  వెళ్ళటం జరిగేది. ఒక రోజు అప్పయ్య  అనే స్నేహితుడు పిలిస్తే వారింటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో కల్లూరు గుట్ట దేవతకు సంబందించిన కొలువు కొలిచారట , దాని సందర్బంగా జరుపుఇతున్న పంక్షన్ అది. దానికే నాతో పాటు మరి కొంత మంది ప్రెండ్స్ ని పిలిస్తే వెళ్ళటం జరిగింది.

ఇక్కడ "కల్లూరు గుట్టలు " గురించి కొంత తెలుసుకోవాలి. మా ఊరికి తూర్పున పది కిలో మీటర్లు దూరంలో వ్యాపించి ఉన్న గుట్టల శ్రేణిని "కల్లూర్ గుట్టలు" అని పిలుస్తారు. ఈ  గుట్టలను అనుకుని అనేక గ్రామాలు ఉన్నా , పెద్ద గ్రామం , ఇప్పట్టి మండలం అయిన కల్లూరు కు దగ్గరలో ఉన్నందు వలన వీటికి ఆ పేరే వచ్చింది. ఈ  గుట్టలు మీద "టేకు" జాతి తప్ప , మిగతా అన్ని వృక్ష జాతులు లభిస్తాయి. మా ఊరుకు దగ్గరలో చిన్న చిన్న గుట్టలమీద సహితం టేకు చెట్లు ఉంటాయి కానీ, అంత పెద్ద గుట్టలమీద టేకు చెట్లు కనపడక పోవటం విశేషం. మా చుట్టు ప్రక్కల ఊర్లు అయిన అన్నారు గూడెం, నరసింహా రావు పేట, ఏనుకూరు గ్రామ రైతులకు కావలసిన కలప , వెదురు, చిల్లమండ, బడితెలుకు ఎక్కువుగా ఈ  గుట్టల మీదే ఆదారపడే వారు. ఇక పోతే అన్నారుగోడేం, నరసింహా రావు పేట గ్రామానికి చెందిన చాలా కుటుంబాల వారు ఈ గుట్టల మీదే ఆదారపడి బ్రతికే వారు. వారు ఉదయం కోడి కూయగానే లేచి , గొడ్డళ్ళు బుజాన వేసుకుని , కల్లూరు గుట్టలకు వెళ్లి , అక్కడ రైతులకు కావాల్సిన కలపను తీసుకుని వచ్చి, గ్రామాలలో రైతులకు ఇస్తూ తమ జీవనోపాది సంపాదించుకునే వారు. కాబట్టి ఆ కుటుంబాల వారందరికి "కల్లూరు గుట్టలు" తమకు బ్రతుకు తెరువు చూపుతున్న దేవతలు . అందుకే వాటిని దేవత రూపం లో కొలుపులు కొలుస్తూ పూజించడం వారికి ఆచారం. వారి ఇండ్లలో ఎవరైనా మగ పిల్లలు పుడితే ముందుగా ఆ పిల్ల వాడిని కల్లూరు గుట్టల వైపు పెట్టి నమస్కరించి, తమ పిల్లవాడికి ఏ లోటు లేకుండా చూడాలని మొక్కే వారట. అంత సెంటిమెంట్ వారికి!

                         అయితే ఇక్కడ మేము వెళ్ళిన మా మిత్రుడి ఇంట్లో ఒక చిన్న పాటి గొడవ మా మిత్రుడు తండ్రికి , తమ్ముడికి జరుగుతుంది. మా మిత్రుడు తమ్ముడు డు కొంత కాలం క్రితం వేరే మతం లోకి వెళ్ళాడట. ఆ మత  పద్దతుల ప్రకారం వేరే దేవతను కానీ, దేవుళ్ళను కాని పూజించకూడదు అంట. కనీసం బొట్ట కూడా  పెట్టుకోకూడదు అంట! అటువంటి వాటికి చాలా దూరంగా ఉండాలట . లేకుంటే సైతాన్ పట్టి పీడీస్తాడట! అందుకే ఇంటి పక్కన  ఉన్న ఆతను ఈ  పంక్షన్ కి రాలెదు. కానీ మా మిత్రుడు ఇంటికి వచ్చిన బందుమిత్రులను చూసి వారి పిల్లలు పెదనాన్న  ఇంటికి వెళతామని గొడవ చేస్తుంటే , వారు ఇక్కడకు  రాకుండా చెయ్యటానికి వారి మత ఆచారాల ప్రకారం పూజించే "విదేశి  కొండలు " పోటో ఒకటి పెట్టుకుని పూజలు చెయ్యడం మొదలుపెట్టాడు. అది చూసిన మా మిత్రుడు తండ్రికి కోపం నసాళానికి అంటి చిన్న కొడుకుతో గొడవ పెట్టుకుంటున్నాడు. " ఒరే వెదవా , పొద్దున్న లేచింది మొదలు సాయం కాలం వరకు నువ్వు గడిపేది కల్లూరు గుట్టల మీద. నీకు, నీ పెళ్ళాం బిడ్డలకు ఇంత  కూడు  పెట్టేది ఆ కల్లూరు గుట్ట దేవత అయితే నువ్వేదో ఆ "కల్ల  గుట్టలు " కు మొకుతావేందిరా అని తిడుతూ నానా హంగామా చేస్తుంటే మేము సర్ది చెప్పి, ఎవరి విశ్వాసాలు వారివి అని నచ్చ చెప్పటానికి ప్రయత్నించిన ఆ పెద్దాయన శాంతించలేదు. " మీకు తెలియదయ్యా, నవాబుల కాలం నుండి మాకు కల్లూరు గుట్టలే దేవతలు. వారు కూడ మా నమ్మక్కాన్ని గౌరవించారు కానీ ఇదేమి మాయదారి కాలమో , ఆ గుట్ట ల మీద ఆదారపడి బ్రతుకుతూ , వేరే దేశంలో  ఉన్న గుట్ట దేవతను కొలవడమేమ్ది? అలా అంత నమ్మక్క్జం ఉంటే ఆడికే పోయి బ్రతకాల , ఈడేందుకు ? అలా చేసి అలా చేసి , ఏదో ఒక నాడు మా ఆచారం అంత మాయం చ్జేస్తారు,   . అని ఆ ఆ పెద్దాయన అంటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆ పెద్దాయనకున్న ఆలోచనలో పదవ వంతు కూడా  మనలో చాలా మందికి లేదనిపించింది.

                                     ఇది జరిగి చానాళ్లు అయింది. మన ఆచారాలు సంప్రదాయాలు మాత్రమే దాడికి గురవుతూ , అన్య మతాలూ మరింతగా విస్తృత మవడానికి అవి కారణమవుతున్నాయి. ఈ  దేశ వనరుల మీద బ్రతుకుతూ, అన్య దేశాలను , అక్కడి ప్రాంతాలను ఆరాద్య ప్రాంతాలుగా కొలవడం అంటే అది కచ్చితంగా ఈ  ఇంటి తిండి  తిని ఎదురింటోడికి ఉపయోగపడటం లాంటిది . ఎప్పటికైనా ఇటువంటి విదానలతో మన దేశ సమగ్రతకు ముప్పే అని గ్రహించటం విజ్ఞుల లక్షణం. స్తానిక పరిసరాలను, నదులు, కొండలును ఆరాదించడం అనేది మనలోని దేశ భక్తికి కూడా నిదర్శనం.

                           మా ఊరు ప్రక్కనే ఉన్న గుట్ట ని నరసింహ స్వామి గుట్ట అంటారు. కారణం ఆ గుట్ట మీదే మా ఇల వేల్పు శ్రీ లక్ష్మి నరసింహా స్వామి వెలిసాడు కాబట్టి. అందుకే ఆ గుట్ట ని ఎంతో పవిత్రంగా చూస్తారు భక్తులు. ఆ గుట్ట మరియు నరసింహా స్వామీ దేవాలయ విశేషాల కోసం ఈ  క్రింది వీడియో లింక్ ని క్లిక్ చెయ్యండి
                                                   


                   

                                           (8/12/2013 Post Republished).

Thursday, September 22, 2016

తిరుమల కొండ మీద "పంది " సంచరిస్తుందని "వీర బ్రహ్మం " గారు చెప్పిన మాట ఈ విధంగా నిజం అయిందా!!

                            


హిందువుల ఆరాధ్య దైవమైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామీ వేంచేసిన  తిరుమల  పరమ పుణ్య పవిత్ర క్షేత్రం . ప్రపంచం లోని అన్ని మతాల వారు ఆ దేవ దేవుని భక్తీ ప్రపత్తులతో కొలుస్తున్న తీరు ఆ స్వామీ మహత్యానికి నిదర్శనం . మరి అటువంటి తిరుమల కొండ మీదకు వెళ్ళడమే కాక , సాక్షాత్తు ఆ దేవ దేవున్ని తూలనాడి , కోట్లాది హిందూ భక్తుల మనోబావాలను గాయపరచిన వాడు  ఈ తెలుగు గడ్డ మీద ఇంకా శిక్షింప బడకుండా  ఉన్నాడు అంటే అది  ఇండియా లాంటి కుహానా సెక్యులర్ వాదులు  ఉన్న దేశం లొనే  సాద్యం . 

    మాజీ ముఖ్య మంత్రి గారి పుణ్యమా అని  తెలుగు గడ్డ మీద విచ్చలవిడిగా కిరస్తానీ మతం కు చెందిన  కొంత మంది  మత మార్పిడి  కార్యక్రమాలు పెచ్చు మీరి పోయాయి.   సాక్షాత్తు ఏడుకొండల స్వామీ నే రెండు కొండలుకు పరిమితం చేసే తెంపరి తనం అన్య మతస్తులకు కలిగిందంటె అది ఖచ్చితంగా ఆ మహానుబావుని చలవే. హిందూ మత విస్వాసాల మీద నమ్మక్కం లేని వ్యక్తులను ధర్మకర్తలుగా, ఎండోమేంట్ అధికారులుగా నియమించబట్టె ఇటువంటి ఆగడలు ఏడుకొండలు మీద ఏదో ఒక రూపం లో నిత్యం జరుగుతున్నాయి. ఇంత వరకు మత మార్పిడి వ్యవహారాలలో చట్ట విరుద్దంగా ప్రవర్తించిన వారికీ శిక్షలు విదించిన దాఖ్హాలలు లేవు. కారణం అటువంటి విషయాలలో కేసులు పెట్టె టప్పూడు ఉన్న శ్రద్ద, ప్రాసిక్యూట్ చేసేటప్పుడు ఉండక పోవడమే. మరి అటువంటప్పుడు చట్టాలు ఎందుకు? ఎవరి కళ్ళ నీళ్ళు తుడవడానికి? తిరుల కొండ మీద ప్రభుత్వ జ్యోక్యం తొలగించి నిఖార్సైన హిందూ సంస్తలకు పాలనా బాద్యత అప్పగించి చూడండి. ఇటువంటి తప్పుడు మత ప్రచారాలు చేసే వారు కొండ ఎక్కడానికి సాహసించగలరా ? దేవ దేవున్ని ధూషించి బ్రతికి బట్ట కట్ట గలరా?

  ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటె  కిరస్తాని మతం  న చెందిన వ్యక్తి ఒకతను తిరుమల కొంద మీదకు వేళ్ళి ఆ దేవ దేవున్ని, ఆయనను పూజించే భక్త కోటి వీస్వాసాలను చాలా తీవ్రంగా అవమానిస్తూ, దానిని ఒక వీడియోగా తీయడమే కాక, దానిని వీదేశాలలో ఉన్న మత మార్పిడి స్పాన్శర్ లకు పంపి అక్కడ నుండి డబ్బు తెప్పించుకుని ఇక్కడ తన దుష్ట కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. దానిని అతడు య్యూ టూభ్ లో పెట్టి మరీ హిందూ జాతిని అవమానిస్తున్నాడు అంటె అది ఇండియాలో మరియు తెలుగు గడ్డ మీదే సాద్యం అని అతనికి గట్టి నమ్మఖ్ఖం కాబట్టి. వీడియోలో అతను ఏమి వాగాడొ తెలుసుకోవాలంటె క్రింది విడియోను క్లిక్ చేసి చూడవచ్చు. ఈ వీషయంలో అతను, అతనితో ఉన్నవారి మీదే కాక ఇతువంటి అప్రాచ్యపు పనులకు ప్రోత్సాహించిన అతని విదేశి స్పాన్సర్ ల మీద కేసు బుక్ చేసి వారిని శిఖ్షింప చేయగలందులకు తగిన చర్యలు తీసుకోవలసిందిగా ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడమైనది.

 బ్రహ్మం గారి  కాల జ్ణానం లో ఒక చోట ఒక "పంది" తిరుమల కోండ మీద సంచరించి ఆ ప్రదేశాన్ని పాడు చేస్తుందని ఉంది. బహూశా అది ఈ వ్యక్తి గురించే కావచ్చు. ఎందుకంటె పంది సంచారమ్ ని మలినానికి ప్రతీక గా బావిస్తాం. ఇటువంటి దైవ దూషకుడు వలన తిరుమల అపవిత్రం అయింది. కాబట్టి శుద్ది కార్యక్రమాలు చేపట్ట వలసిన అవసరం ఉంది. ఇకనుండి ఇతువంటి వారి పట్ల దేవస్తానం అధికారులు అలెర్ట్ గా ఉండాలి.         

                                                                        

                                                                       

Wednesday, September 21, 2016

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "చండాల" పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.


                                                            
                                                            

 నిన్న దమ్మున్న చానల్, దుమ్మురేపే చానల్ లో ఒక స్వామి గారి లీలలు ప్రసారం చేసారు. పాపం, చానల్ వారు ఊహించినట్లు అది బ్లాస్ట్ కాకపోవడానికి కారణాలు ఎన్నున్నా అవి మనకు అనవసరం. కాని వారు ప్రసారం చేసిన అంశాలలో మాత్రం ఒకటి ఆస్చ్యర్యం కలిగించింది.

 ఒక స్వామీ వారు. చిన్నప్పుడు జులాయ్గా తిరిగినా పెద్దాయ్యకా, ఆయన ఒడ్డూ, పొడుగూ చూసి మూడు సినిమాలలో చాన్సులు ఇస్తే అవి కాస్తా ప్లాప్ అయ్యాయట. అంతే ఒక బ్రహ్మాండమైన నెట్వర్కుతో స్వామీజీ అవతారం ఎత్తితే కోట్లరూపాయసంపాదన అట. ఈయన గారిదగ్గరకు సంపన్న వర్ఘాల స్తీలు వచ్చే వారట. వారి సమస్య ఏమిటంటే , వారి కాపురాలు సజావుగా సాగడం లేదు కాబట్టి, వారి భర్తల మనసు మార్చేలా ఏదైనా పూజలు చెయ్యమని స్వామీ వారిని అడిగే వారట!.

  దాన్కి సదరు స్వామ్ వారు "యోని పూజ" ఒక్కటే మార్గమని సెలవిస్తే అందుకు సరే అని చేయించేవారట ఆ కలిగిన కాంతలు. యోని పూజకు ముందు వారు ఒంటిమీద నూలుపోగు లేకుండా నగ్నంగా స్వామీవారి సమక్షంలో కాళీకా మాత విగ్రహం ముందు కూర్చో వాలట. ఆ తర్వాత పూజ చేసి పంపించేవాడట. అలా పూజ చేయించుకున్న వార్ కాపురాలు కుదుటపడ్డాయో లేదో కాని, అత్యాచారం(?) మాత్రం గ్యారంటీగా జరిగేదట స్వామీగారి చేత.

 ఏమండీ! నాకు తెలియకడుగుతా! భర్తతో సంసారం బాగుండాలని ఏ ఆడపిల్లైనా  పరాయిమగవాడి ముందు నగ్నంగా పూజలు చేయించుకుంటుందా? నాకు తెలిసి అటువంటివి తంత్ర విద్యలు అంటే బ్లాక్ మాజిక్ ఒకరి మీద ఆదిపత్యం కోసం చేసే పూజలు అవి. అంటే తన భర్త తన చెప్పుచేతుల్లో ఉండాలని బావించే డబ్బున్న వారు చేసే వికారపు చేష్టలు ఇవి. వారు దానికోసం ఏదైనా చేస్తారు. నిజంగా భర్తని  కావాలనుకుంటే, ఒక్కరోజు ఆయనకి మనసు మెచ్చేలా ప్రేమతో  పూజ చేస్తే, పాపం పిచ్చి మొగుడు మీ జీవితాంతం  మీరు కోరుకున్న రీతీలో పూజలు చెయ్యడూ!

   దాంపత్యానికి  కావల్సింది ప్రేమా అనురాగాలు. సంసారానికి కావల్సింది సర్దుబాటు గుణం. ఇవి లేకుండా మొగుడు తమ గుప్పెట్లో ఉండాలని సన్నాసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి "చండాల" పూజలు చేస్తే ఒల్లు గుల్ల! ఇల్లు గుల్ల! మెడలు మెరిపించే బంగారం కాదు ఆడదానికి కావాల్సింది, మెదళ్ళు మెరిపించే జ్ణానం. అది లేకపోతే బ్రతుకు "చండాలమే"!

                                             (11/7/2013 Post republished)

Tuesday, September 20, 2016

అక్కినేని గారు దేవుణ్ణి నమ్మారు అనటానికి "నాగ దేవుడు" సెంటిమెంటే సాక్ష్యం . .

                 

                                       (స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినోత్సవ సందర్భంగా పునః ప్రచురణ చేయడమైనది .)                                   

చాలామంది, దివంగత నటులుశ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారికి దేవుడు అంటే నమక్కo లేదు అనుకుంటారు . అయన గారు కూడా ఒక ఇంటర్వ్యూ లో తనకు దేవుడు అంటే పెద్దగా నమ్మకం లేదని చెప్పారు తప్పా , తనకు అసలు నమక్కం లేదని చెప్పలెదు. అయన గారికి దేవుడు మిద అపారమైన నమ్మక్కం  ఉందని చెప్పటానికి అయన గారికి ఉన్న "నాగ" సెంటిమెంటే ఉదాహరణ .
 శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారు , ఆయన 1923 సెప్టెంబర్ 20 వ తేదీ కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురం లో జన్మించాడు. చిన్ననాటినుండే నాటకరంగంవైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించాడు. అక్కినేనితో అన్నపూర్ణ వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు లో 1933 ఆగస్టు 14న ఆమె జన్మించారు. ఆమెపేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా, కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు నాగచైతన్య ,  సుమంత్, అఖిల్ సహా పలువురు నటీనటుల్నీ, దర్శకుల్నీ పరిచయం చేశారు.

 అయితే నాగేశ్వర రావు గారికి ఉన్న" నాగ " సెంటిమెంట్ పాజిటివ్ పలితాలు ఇచ్చిందనే చెప్పాలి. అయన తన సంతానం లో ఒక కుమారుడు పేరు నాగార్జున కాగా , కుమార్తె పేరు నాగ సుశీల . అలాగే నాగార్జున గారి కుమారుడి పేరు కూడా నాగ చైతన్యయే . అక్కినేని నాగేశ్వర రావు గారి తర్వాత ప్రజలలో మళ్లి  అంత పాపులారిటి సంపాదించిన వారు కుమారుడు నాగార్జున మరియు మనుమడు నాగ చైతన్యయె కావడం గమనార్హం . మిగతా వారు వీరంతా పాపులార్టి పర్సన్స్ కాదు. కాబట్టి నాగేశ్వర రావు గారి నమక్కాన్ని "నాగ దేవుడు" లేక నాగ దేవత వమ్ము  చెయలెదు.అని చెప్పవచ్చు.  అక్కినేని నాగేశ్వరరావు 91 సంవత్సరాల వయసులో 22-1-2014న మరణించారు. అయన గారి ఆత్మకు శాంతి కలగాలని అ దేవ దేవుణ్ణి ప్రార్దిస్తున్నాను.

          "మడిసన్నాకా కూసింత కళా పోసనే కాదు , కాస్తంత దైవ బక్తి కూడా ఉంటే లాబమే కాని , నష్టం ఏమి లేదు" అని అక్కినేని గారి కుటుంబాన్ని చూస్తె తెలియడమ్లా ?

                                                (24/1/2014 Post Republished).


  

Monday, September 19, 2016

'మానవుడు' వచ్చింది 'మంకీ ' నుండా ? ,' మార్స్ ' గ్రహం నుండా ? అని నేను ఊహించింది నిజమే అని రుజువు చేస్తున్న సైన్స్ ఆర్టికిల్ !

                                                           


నేను గత నవంబర్ 6 న క టపాని "'మానవుడు' వచ్చింది 'మంకీ ' నుండా ? ,' మార్స్ ' గ్రహం నుండా ? " అనే టైటిల్ తో ప్రచురించటం జరిగింది. ఆ రోజు ఎందుకో నాకు మనిషి అనేవాడు కోతి నుండి కాక మార్క్స్ గ్రహం మీద అభివృద్ధి చెందిన మానవుడిగా ఉండి అక్కడ పరిస్తితులు జీవించడానికి వీలు లేనంతగా మారి పోయాక అంటే అతి శీతలం   వలన కానీ ఇతరత్రా కారణాల వలన కానీ , స్పేస్ షిప్ ల ద్వారా సూర్యకుటుంబం లో తర్వాతి గ్రహం మరియు జీవరాసి మనుగడకు అనుగుణంగా ఉన్న భూమి మీదకు వచ్చి ఉంటాడని ఒక ఆలోచన వచ్చింది.

      ఒక వేళ అదే నిజమయితే భూమికి  కూడా కొన్నేళ్ళకి అదే పరిస్తితి కలిగితే  తిరిగి మానవుడు వెళ్ళవలసింది శుక్ర గ్రహానికే కానీ తిరిగి అంగారక గ్రహానికి కాదు కదా అని కూడా అనిపించింది. నా ఆలోచనకు ఆదారం ఏమిటంటే ఏ గ్రహం అయినా సరే సూర్యుడు లేక నక్షత్రానికి , ప్రస్తుతం భూమి ఎంత దూరంలో ఉందో అంతే దూరంలో ఉండి ఉంటే అక్కడ జీవరాసి కి అనువైన వాతా వరణం ఉండి ఉండాలి. మరి విశ్వం వ్యాపిస్తుంది నిజమే అయితే తప్పకుండా గ్రహాలు సూర్యుడికి రాను రాను దూరంగా వెళుతుండాలి కదా. అలాంటప్పుడు ఏ గ్రహం కూడా  స్తిరంగా ఒకే కక్ష్యలో తిరగటానికి వీలు లేదు. అలాంటి పరిస్తితుల్లో ప్రస్తుతం ఉన్న పొజిషన్ కి  భూమి ఏ మాత్రం సూర్యుడుకి  దూరంగా వెళ్ళిన వాతావణం మార్పులు చెంది భూమి మానవ  నివాసయోగ్యానికి పనికి రాకుండా పోతుంది. అప్పుడు అభివృద్ధి చెందిన మానవుడు తప్పకుండా వేరే గ్రహానికి వలస పోవడానికి ప్రయత్నిస్తాడు. అలా ఒకప్పుడు ప్రయత్నించి ,ఆ ప్రయత్నంలో బాగంగానే అంగారక గ్రహం మీద నుండి భూ గ్రహం మీదకు మానవుడు అడుగు పెట్టి ఉంటాడని నాకు కలిగిన ఊహ.దానిని తర్వాతి టపాలో రాద్దామనుకున్నాను. కానీ కొన్ని అనుమానాలు నివృత్తి కాక టపా రాయడం వాయిదా వేసాను.

  అయితే  ఈ  మద్య ఒక చోట ఒక విషయం చదివాను.ఎవరో స్పేస్ ట్రావల్  కంపనీ వారు 2023 నాటికి అంగారక గ్రహం మీద నివాస గృహాలు ఏర్పరచి, అక్కడికి మానవులను తీసుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారని, దానికి ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలు మంది అప్లికేషన్లు పెట్టుకున్నారని , అందులో మన హైదరాబాద్ వారు కూడా  ఉన్నారని చదివి ఆశ్చర్య పోయాను. ఇది నా ఊహకు విరుద్దం.ఒక సారి నివాస అర్హత కోల్పోయిన గ్రహంని అంటే సూర్యుని నుండి నియమిత దూరంలో ఉండాల్సినదానికంటే కొంచం దూరంగా జరిగి అక్కడి వాతావరణం శీతలంగా మారిపోయి, వాయువులు సైతం ఘనీబవించే స్తితిలో ఉన్న గ్రహాన్ని తిరిగి నివాసయోగ్యం చేయడం ఎలా సాద్యం.అక్కడి వాతావరణం ని మార్చడం అసాద్యం.  అదంతా సైన్స్ కు పేరున ప్రజల్ని మోసం  చేసి తమ స్పేస్ వ్యాపారం సంబందించి అసత్యాలు ప్రకటిస్తున్నారు అనిపిస్తుంది. లేదా . బహూశా ఇది మార్స్ గ్రహం పట్ల ప్రజలలో ఆసక్తి కలిగించేందుకు కొంతమంది పని కట్టుకుని ఇలా చేస్తుండవచ్చుఅని కూడా   అనిపిస్తుంది. కాబట్టి వీటి గురించి ఇంకా ఏమన్నా కొత్త సాక్ష్యాలు బయల్పడతయా అని ఎదురు చూ స్తున్నాను.

  నిన్న ఒక ఆర్టికిల్ చదవి చాలా ఆశ్చర్యం వేసింది. ఆ ఆర్టికిల్ ఏమిటంటే   Evidence suggests life on Earth could have started on Mars.  దానిలో మొదటి లోనే ఎమున్నదంటే "There is a theory that’s gaining a bit of traction in the scientific community, a theory which suggests that life on Earth could have come from Mars. Evidence in favor of this theory has been building over the last couple of decades, and it indicates that we all (could be) Martians." అని.

   కాకపోతే సైంటిస్టుల ఊహ ఏమిటంటే అంగారక గ్రహం మీద జీవం  పరిణామ దశలో ఉండగా అక్కడి  శిలలు కొన్ని అంగారక కక్ష్యలో నుండి తప్పి భూమి మీదకు వచ్చి పడ్డాయని,అట్టి శిలలు మీద ఉన్న జీవరాశి భూ గ్రహం మీద అభివృద్ధి చెంది ఇప్పటి జంతుజాలంగా ఆవిర్భవించిందని సూత్రీకరిస్తున్నారు. దిని ప్రకారం డార్విన్ సిద్దాంతం కూడా కరక్టే అని వారి ఊహా కావచ్చు. . ఇది నా ఊహకు విరుద్దం. ఖచ్చితంగ మానవుడు అంగారక గ్రహం మీద అభివృద్ధి చెందాకే ఈ  గ్రహం మీదకు అంతరిక్ష  నౌకల ద్వారా వచ్చి ఉండాలి. మన పురాణాలలో చెపుతున్న కదలకు అంగారక గ్రహం కు ఏదో సంబందం ఉండి ఉండాలి అనిపిస్తుంది. నా ఊహ నిజమే అయితే విశ్వంలో భూమి ని పోలిన  జీవ సహిత గ్రహాలు ఇంకా చాలా  ఉండి ఉండాలి. వాటి మీద జీవులు కూడా ఇప్పుడు మనం ఆలోచిస్తున్నట్లు ఆలోచిస్తూ ఉండాలి. వారి మద్య, మన మద్య ఏదో రకమైన కమునీకేషన్ సిస్టం ఉండి ఉండాలి. అవే మనకు ఆలోచనలు గ ఫ్లాష్ అవుతూ ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సైన్స్ పిక్షన్ సినిమా కద అవుతుంది .

  కానీ నాకు తెలిసినంత వరకు ఒకటి మాత్రం నిజం . సైంటిస్ట్ కంటే అద్యాత్మికంగా ఆలోచించే వారికే విశ్వ రహస్యాలు ముందుగా తెలుస్తుంటయి. వాటిని నిరూపించడమే సైంటిస్టులు చేసే క్రుషి .అంతే! మన పూర్వికులు కుజ గ్రహాన్ని బూమి పుత్రుడు గా బావించారు.ఏ పరిశోదనలు చెయ్యకుండా , సైన్స్ అనేది తెలియని రోజుల్లో వారికి ఆ ఆలోచన ఎలా వచ్చింది? భూమికి అంగారకుడుకి సంబందం ఉంటుందని ఎలా ఊహించారు? అదే విశ్వ రహస్యం. మనిషికి, ప్రక్రుతి కాలానుగుణంగా  అట్టి జ్ఞానాన్ని ఎరుక పరుస్తుంది అని నా దృడ అభిప్రాయం. అందుకే చాలా మందికి ఆపిల్ పండ్లు చెట్టునుండి క్రింద పడడం అనుభవమే అయినా , ఒక న్యూటన్ మాత్రమే దానిలోని రహస్యాన్ని కనుగోగలిగాడు. అయిన్స్టీన్ సైతం ఏ రోజు లేబరిటరిలోకి అడుగు పెట్టకుండానే విశ్వం యొక్క  రహస్యాలు కనిపెట్టగలిగాడు. ఇవ్వన్నీ సాద్యమవటానికి దృష్టిని సంబదిత విషయం మీద లగ్నం చేసి ఆలోచన చెయ్యడం లేదా ద్యానం  చెయ్యడం. . దానినే సమాది స్తితి అంటారు. అదే మన పూర్వికులు చేసింది! 

    పై ఆర్టికిల్ కోసం ఈ  లింక్ మీద క్లిక్ చెయ్యండి. http://www.fromquarkstoquasars.com/evidence-suggests-life-on-earth-could-have-started-on-mars/

 నేను ఇదివరకు పెట్టిన'మానవుడు' వచ్చింది 'మంకీ ' నుండా ? ,' మార్స్ ' గ్రహం నుండా ? టపా  కోసం ఈ  లింక్ మీద క్లిక్ చెయ్యండి. http://kalkiavataar.blogspot.in/2013/11/blog-post_6.html

                                                   (2/1/2014 Post Republished).

Sunday, September 18, 2016

పాంట్ లూడదీసి చూసి మతాన్ని నిర్ణయించి మానవ హననం చేసినోడు "సేక్యులరిస్టా" ? !


                                                           


                                    నిన్న అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ గారు నిజాం పట్ల తనకున్న అంతులేని అభిమాన్నాన్ని చాటుకున్నారు. ఆ యన ప్రసంగం లో నిజాం యొక్క ఔదార్యాన్ని , ఆయనలోని పరిపాలనా దక్షతను , దానగునాన్ని పర పరి విధాలా కీర్తించాడు . కాని  నిజాం   చేసిన లేక చేయించిన మానహననాలు , మారణ హోమాలు గురించి మాట్లాడవద్దని హెచ్చరికలు చెసాడు . అలా చేస్తే  ఆంద్రప్రదేశ్ అంతా రక్తాలు పారుతాయి అని కూడా సెలవిచ్చారు. ఆయన చేసిన మారణహోమం ఏమో మానిపోయిన గాయాలు ఆట. ప్రజలను పీడించి వసూలు చేసిన సొమ్ముని  తమ పరివార విలాస వంత జీవనానికోసం వెచ్చిస్తే అది అభివ్రుద్ది అట.అందుకు నిజాం  గొప్ప రూలర్ అట. ఏది ఏమైనా అతని మాటలు వలన అతను ఎలాంటి బావాలు కలిగిన వాడో అర్దం చేసుకోవటానికి తెలుగు ప్రజలకు ఒక మంచి అవకాశం కలిగింది.

 తెలంగాణా ప్రాంతంలో ఎంతో మంది తెలుగు వారు ఉర్దూ నేర్చుకున్నారు. ఉర్దూ ని అభిమానించారు. అలాగే ముస్లిమ్లు కూడా తెలుగు నేర్చుకుని తమకు ప్రాంతీయ బాష పట్ల ఉన్న మక్కువను తెలియ చేసారు. అలాగే సీమాంద్రా లో కూడా ముస్లిమ్ లు  ఉర్దు కంటే తెలుగు బాషకే ఎక్కువ ప్రాదాన్యత ఇచ్చి , ఆ బాషాభివ్రుద్దికి కె కాక నిజమయిన సెక్యులరిజం కోసం తపించారు . కానీ హైద్రాబాద్లో ఒక ప్రజా నాయకుడుగా ఉంటూ కనీసం చూసి "సామాజిక" అనే తెలుగు పదాన్ని కూడా ఉచ్చరించలేని వాడు "సెక్యులరిజం " గురించి గప్పాలు కొట్టడం, పైగా  తెలుగుదేశం పార్టీ వారి  సెక్యులరిజం గురించి ప్రశ్నించడం  విడ్డూరం. ఖచ్చితంగా అక్బరుద్దీన్ గారు నిజాం లకు వారసుడు తప్పా, తెలుగు గడ్డ మీద పుట్టి పెరిగిన ముస్లిమ్లకు మాత్రం కాదు.

   ఇక పోతే ఆయన నిజాం గురించి మాట్లాడుతూ ఆయన కూడా సెక్యులరిస్టే  అన్న దోరణీ కనపర్చాడు. నిజమే మరి నిజాం ప్రైవేట్ సైన్యం అయిన రజాకార్లు హిందువుల మీద జరిపిన  అత్యాచారాలు , హత్యాచారాలు గురించి తెలుసుకుంటే నిజాం ఎంత సెక్యులరిస్టో అర్దమవుతుంది. పాంట్లు ఊడడిసీ చూసి మతాన్ని నిర్ణయించి హత్యలు చేసిన  వారిని సెక్యులరిస్ట్లు అంటే,  ఇక చెప్పేదేమి లేదు . వారికి దూరంగా ఉండడం, దూరంగా ఉంచడం తప్పా!.

                                  (21/1/2014 Post Republished).   

Friday, September 16, 2016

బ్రహ్మం గారు చెప్పిన "చంద్రగుప్త మహరాజు","చంద్ర బాబు నాయుడు"గారేనా!?

                                                                  
మిత్రులారా "కల్కి" అవతార పురుషుడి గురించి నా పరిశొదనా కొనసాగుతుంది. ఈ లోపు ఇతర బవిష్యాలు గురించి తెలియ చెపుతాను. నేను మొదటగా చెప్పినట్లు, నేను చెప్పేదంతా  బవిష్య గ్రంథాలలో ఉన్న దానికి నా పరిశీలనా అంశాలు జోడించి మీ ముందుంచటం జరుగుతుంది.అవి నిజాలా ?కావా?అన్నది కాలానికి వదిలేద్దాం.నమ్మే వారు నమ్మవచ్చు.లేనివారు లైట్ తీసుకుని హాయిగా నవ్వుకోవచ్చు.

                                                                        

  ఇక విషయానికి వస్తే బ్రహ్మం గారి కాలజ్ణానం లో ఒక చోట"కల్కి అవతారుడి వలన "పచ్చ బండ" రూపం లో ఉన్న చంద్రగుప్త మహరాజుకు శాప విమోచనం కలుగును" అని చెపుతారు.ఇది కల్కి అవతారం రావడానికి నాందిగా ఉంటుందని కూడ చెపుతారు.

 ఇది చదవిన నాకు చాలా ఆశ్చ్చర్యం వేసింది. ఎప్పుడొ గతించిన "చంద్రగుప్త మహారాజు"కలియుగాంతానికి ఎలా వస్టాడు అనే అనుమానం ఒకటి కాగా,ఆయన "పచ్చ బండ రూపం" లో ఉండటం ఏమిటి? అనేది రెండవది. దీని మీద లోతుగా పరిశిలిస్తే ఒక విషయం ఫ్లాష్ లైట్ లా వెలిగింది!

                                                                             
                                                                           
"చంద్ర గుప్త మహారాజు" అంటే "నారా చంద్రబాబు నాయుడు"గారు అయ్యుండాలి.పచ్చ బండ రూపం అంటే "తెలుగు దేశం" పార్టి అయ్యూండాలి(జెండా రంగు పసుపే కదా). మరి శాప విమోచనం అంటే ఏమిటి?.గత కొన్ని యేళ్లుగా ఆయన అధికారంలో లేడు కదా!. ఇది ఆయనకు దేవుడు ఇచ్చిన శాపమని దివంగత ముక్యమంత్రి అనేక సందర్బాలలో అన్నారు. కాబట్టి ఈ సారి ఎన్నికలలో "కల్కి అవతార పురుషుడు" వలన తిరిగి చంద్ర బాబు నాయుడు గారు అదికార పగ్గాలు చేపట్ట బోతున్నారా?! ఈ విషయమే బ్రహ్మం గారు తన కాలజ్ణానం లో చెప్పారా?చూద్దాం ఏమి జరుగబోతుందో?      

  Note: ఈ  టపా 2012 లో నవంబర్ 14 న రాయబడింది. ఈ  టపాలో  చెప్పినట్లే  2014 లో చంద్రబాబు గారు ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టడమే కాక , ఎంతో చారిత్రిక ప్రసిద్ధం కాబోతున్న "అమరావతి " అనే రాజధాని నిర్మాణానికి నాంది పలకటం వలన చారిత్రిక పురుషుడు కాబోతున్నాడు.

Wednesday, September 14, 2016

"పంది కడుపున ఏనుగు పుట్టును " అన్న బ్రహ్మం గారి కాలజ్ఞాన వాక్యం నిజమయిందా !!!?

                                   


                                                బవిష్యత్ లో జరుగబోయే దానిని ముందుగానే దర్శించిన మహానీయుల్లో తెలుగు గడ్డ మీద జన్మించిన శ్రీ వీరబ్రహ్మేంద్రుల వారు ఒకరు . 16 వ శతాబ్దానికి చెందిన ఈయన రచించిన "కాలజ్ఞానం "లోని అనేక బవిష్యాలు నిజమయ్యాయి అని అనేక మంది నమ్ముతున్నారు . తాను కలి యుగాంతం నకు వీరబోగ వసంత రాయలు నై వస్తాను అని ,అప్పుడు జరగబోయే కొన్ని వింతలు  వీరబోగ వసంత రాయలు రాకకు గుర్తుగా ఉంటాయని కూడా "కాలజ్ఞానం '" లో చెప్పడం జరిగింది . అలాంటి వింతల్లో 'పంది కడుపున ఏనుగు పుట్టును ' అనేది కూడా ఒకటి . అ వాక్యం వేరే రూపంలో  నిజమయిందా  అని అనిపిస్తుంది "నార్వే'" దేశం లో జరిగిన ఈ వింత జననం చూస్తుంటే .
                                                                   

 నార్వే దేశం లో ని అండర్సన్ ,అలెగ్జాండర్ అనే   దంపతులకు ఒక పిల్లవాడు కలిగాడు . అయితే అ పసివాడు ఏనుగు పిల్ల మాదిరి వింత ఆకారం తో జన్మించడం తో తల్లి తండ్రులు అతనిని ఎవరికీ కనపడకుండా రహస్యంగా ఉంచినప్పటికి ,చివరకు అది బయటకు పొక్కి మిడియా వాళ్ళ చెవిన పడింది అంట . చివరకు ఆ వింత బాలుడిని యూ ట్యూబ్ లో పెట్టె సరికి అందరూ వింతగా చూసినా ,మన దేశం వాళ్ళు మాత్రం సాక్షాత్తు గణేషుని అవతారం అని అంటున్నారు అంట . ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువు  లోను బగవంతుని దర్శించే హిందూ జీవన విదానం లోని గొప్పదనం అదే కదా !

కాని నార్వే కు చెందిన ఆ బాలుడి తల్లి తండ్రులు మాటలు వింటుంటె వీరు మనుషులా ? పందులా ? అనిపిస్తుంది . తమకు పుట్టింది "అష్టా వక్రుడు " అయినా తల్లి తండ్రులకు అంతో ఇంతొ మమకారం ఉంటుంది .ఆ కారణం వలననే వికలాంగులు అయిన పిల్లలు భూమి మీద జివించ గలుగుతున్నారు .కాని ఈ చిన్నారి తండ్రి అలెగ్జామ్డర్ తమకు పుట్టింది ఒక క్రీచర్ అని ఈసడించడమె కాక ,ఆ పిల్ల వాడిని 'బేస్ మెంట్ "లో ఉంచి ,రోడ్ల మీద ఏరుకొచ్చిన చెత్త ని అతడికి ఆహారంగా ఇస్తాను అని ,కుదిరితే ఇండియా లో ఎవరికైనా ఇస్తాను అని ,వారైతే ఆ వింత బాలుడిని 'తాజ్ మహల్ " లో పెట్టి చిరంజీవి గా ఉంచుతారని  చాలా అసహ్యంగా మాట్లాడాడు . అలెగ్జాండర్ కు అబ్బిన సైన్స్ విజ్ఞానం అలా అతనిలోని మానవత్వాన్ని చంపి వేసింది అన్న మాట. పిల్లల ఆలనా పాలన పట్టించుకోకుండా తిరిగే తల్లి తండ్రులను "పంది కన్నట్లు కనగానె సరిపోదు 'అని మన పెద్దలు తీడుతుంటారు . అ లెక్కన ఆండర్సన్ దంపతులు పందులు క్రిందే లెఖ్ఖ .

  ఆవిధంగా చూసినపుడు బ్రహ్మం గారు తన కాల జ్ఞానం లో చెప్పిన మాటలు ఇలా నిజమయ్యాయ్యా !? అని అనిపిస్తుంది .
                                                       

Tuesday, September 13, 2016

"కదిరి" నరసింహుడే "వీరబోగ వసంత రాయలా"?

                                                                    
  బ్రహ్మం గారు తన కాలజ్ణాణంలో తాను "వీరబోగ వసంత రాయలు" గా యుగాంతం లో వస్తానని చెప్పే మాట చాల ఆశ్చర్యం కలిగిస్తుంది.అసలు ఆ ప్రత్యేకమయిన పేరును ఎందుకు ప్రస్తావించారు అనేది కూడ ఊహకు అందనిదే. ఒకానొక పరిశీలనానుసారం ఆంద్రప్రదేశ్ లొని,కదిరి పట్టణం లో వేంచేసి ఉన్న "శ్రీ లక్ష్మి నరసింహా స్వామి " నే వీరబోగ వసంత రాయలు అంటారట. ఒక వేళా అది నిజమే అయితే ఆ స్వామి పేరునే ఎందుకు చెప్పారు అనేది కూడ ఆలోచించవలశిన విషయమే.

  "కదిరి" అంటే ఒక చెట్టు పేరు. దీనినే మనం "సండ్ర చెట్టు" అంటాం. ఈ చెట్లు అదికంగా ఉన్న ప్రాంతం కాబట్టే "కదిరి" పట్టణానికి ఆ పేరు వచ్చింది. మరి "వీరభొగవసంత రాయుడు"  రావటానికి ఈ ’సండ్ర" చెట్లకు ఏమయిన సంబందం ఉందా? లేక రాబోయే అవతార పురుషుడికి "సండ్ర" చెట్లు కి ఏమయినా సంబందం ఉందా అనేది కూడ పరిసోదించాల్శిన విషయమే.ఇంకొక చోట బ్రహ్మం గారు "వేదాల" స్తానం లో "సాంద్ర సిందు వేదం" నిలుస్తుంది అంటారు.దీని గురించి తర్వాతి టపాలో చెపుతాను.

  నరసింహ స్వామికి రాబోయే మన్వంతరంలో ’ఇంద్రుడు" కాబోయే ’బలి చక్రవర్తి" కి ఉన్న సంబందం చూద్దాం.హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ’నరసింహ స్వామి" ప్రహ్లాదుని చక్రవర్తిగా చేసి అతని వంశం వారిని చంపనని వరమిస్తాడట!  కాని ఆ తర్వాత వచ్చిన "వామన" అవతారంలో "ప్రహ్లాదుని" మనుమడయిన "బలి చక్రవర్తి" ని పాతాళానికి తొక్కి వేశినట్లు పురాణం లో చెప్ప బడింది. ఇది ఇంచు మించు చంపడం క్రిందికే వస్తుంది. తిరిగి రాబోయే "మన్వంతరం" లో ’బలి చక్రవర్తినే" "ఇంద్రుడు" గా నియమించాలి అంటే అది ఆ "నరసింహ" శక్తికి తప్ప అన్యులకు అలవి కాదు.కాబట్టే బ్రహ్మం గారు నరసింహ స్వామిని ద్రుష్టిలో పెట్టుకునే " వీరబోగ వసంత రాయలు" పేరు చెప్పి ఉండవచ్చు.

  ఇకపోతే నరసింహ స్వామికి "కల్కి" కి ఉన్న లింక్ గూర్చి తెలుసుకోవడానికి ఈ లింఖ్ ని క్లిక్ చెయ్యగలరు.
                     http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_8576.html

                                         ( 10/12/2012 Post Republished).

Monday, September 12, 2016

వేప చెట్టు నుండి పాలు కారడం నిజమేనా ? బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజం అవ్వడం నిజమేనా ?!!

                           
                                                                             

                       
         


                                 అనంత పురం జిల్లా తాడి పత్రిలో ఒక వింత చోటు చేసుకుంది అట  . అదేమిటంటే బ్రహ్మం గారు తన కాలజ్ఞానం లో ఏమి చెప్పారో అది నిజం అయిందట. నిన్న పేస్ బుక్ లో ఒక మిత్రుడు పెట్టిన Dug out  T.V వారి  యూట్యూబ్ వీడియో 2 నెలల క్రితం పబ్లిష్ అయింది ,చూడటం జరిగింది . ఆ వీడియో సారాంశం ఏమిటంటే తాడిపత్రిలో ఒక నివాస సముదాయం లో ఉన్న వేప చెట్టు నుండి చిక్కటి, తెల్లటి ద్రవ పదార్థం బయటకు వస్తుంది . దాని రుచి తియ్యగా ఉంది అంటున్నారు . కెమెరామెన్ ఆ పాలు అని చెప్పబడే ద్రవం వస్తున్న దగ్గర కెమెరా ఫోకస్ చేసినప్పుడు మరింతగా ఆ ద్రవ పదార్థం బయటకు వస్తూ కనపడింది. ఆ చెట్టు వెనకాల ఎవరో మనిషి ఉన్నట్లు కూడా కనపడుతుంది. కాబట్టి సదరు T.V  లో చూపించింది నిజమా? ఎవరైనా క్రియేట్  చేశారా ? అనేది తేల్చాల్సి ఉంది. కావాలంటే మీరు ఆ వీడియోను చూడండి .

                                                               


                                      ఈ  విషయం  మీద ఇంతకు ముందు ప్రసారం అయిన యూట్యూబ్ వీడియోలు కొరకు వెతికితే , 23/9/2015 న స్టూడియో N  news  వారు ప్రసారం చేసిన సేమ్ స్టోరీతో కూడిన వీడియో ఉంది. మరి నాడు తియ్యటి పాలను స్రవించిన వేప చెట్టు , Dug  T.V  లో చూపిన వేప చెట్టు ఒకటేనా కాదా? అనేది తెలియటం లేదు. రెండు సంఘటనలు అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలోనే జారినట్లు చెపుతున్నారు. నా ఉద్దేశ్యం 11 నెలల క్రితం స్టూడియో N  వారు ప్రసారం చేసిన వేప చెట్టు వింత ని ,   T.V  వారు వారి ఛానల్ ప్రమోషన్ కోసం  వారే పాలు పోయించి దానిని వీడియో షూట్  చేసి యూ ట్యూబ్  ద్వారా ప్రచారం చేసుకుంటున్నట్లు ఉంది. కావాలంటే మీరు Dug  out  వారి  పై వీడియో ను , స్టూడియో N  news  వారి క్రింది వీడియో ను కూడా చూడండి. కాబట్టి ఇందులో N  న్యూస్ వారి వీడియో లో కల్పితం లేదు అని Dug  అవుట్ వారి వీడియో లో క్రియేషన్ ఉందని అర్ధం అవుతుంది.



       

    ఇక అసలు   బ్రహ్మం గారు వేపచెట్టు గురించి కాలజ్ఞానం లో ఏమి చెప్పారో చూదాం .                                                                        
 "కలియుగాన 5000 సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదు. బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జననష్టం జరుగుతుంది. పగిలిన రాతిముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయి.
పసిబిడ్డలు మాట్లాడతారు. ఒకరి భార్య మరొకరి భార్యగా మారుతుంది.
కార్తీక బహుళ ద్వాదశి రోజున ఉత్తరాన వింత వింత చుక్కలు కన్పిస్తాయి. అవి అయిదు నెలలపాటు వుంటాయి. వేంకటేశ్వరుని సొమ్ము దొంగలు అపహరిస్తారు. కృష్ణా, గోదావరి నదుల మధ్య ప్రాంతమందు జనులు ఎక్కువగా నశిస్తారు. ప్రజలు గ్రామాలు వదిలి అడవులకు వెళ్ళిపోతారు. అనేక రకాలయిన జబ్బుల వలన పలువురు మరణిస్తారు." (కాలజ్ఞానం )

                             పైన తెల్పినట్లు  అయన చెప్పిన కాలజ్ఞానం లో "వేప చెట్టు నుండి అమృతం కారుతుంది " అన్నారు కానీ, తియ్యని పాలు కారుతాయి అని ఎక్కడా చెప్పలేదు.అప్కోర్స్ అమృతం అంటే పాలు అని అర్ధం కూడా ఉంది.  బ్రహ్మం గారి కాలజ్ఞానం అంతా మరుగు మాటల్లో అంటే ఒక కోడ్ భాషలో చెప్పినట్లు తెలుస్తోంది. దానిని అర్ధం చేసుకుని డి కోడ్ చేస్తే తప్ప అసలు విషయం అవగతం అవదు. ఉదాహరణకు వేపచెట్టు నుండి అమృతం కారుతుంది అంటే ఎదో తియ్యని ద్రవ పదార్దo  కారుతుందని కాదు. అమృతం అంటే  మానవులను  నిత్య యవ్వన వంతులుగా , మరణం లేని వారిగా గా చేసే ఒకానొక దివ్య ఔషధం అని పురాణాల్లో చెప్పబడింది.  అది త్రాగిన వారు దేవతలతో సమానం అని కూడా చెప్పారు. మరి అలాంటి ఔషధ గుణాలేవో వేపచెట్టు నుండి కనుగొంటారు అని బ్రహ్మం గారి ఉద్దేశ్యం కావచ్చు.

                            వేప చెట్టు విషయం లో అలాంటి ఔషధ గుణాలు గురించి చెప్పాల్సి వస్తే, మనుషులకు ఆరోగ్యపరంగా కలిగే అనేక సమస్యలను , వేప ఆకుల చూర్ణం కానీ, రసం కానీ ఎలా నివారిస్తుందో చూడండి

వేపఆకుల చూర్ణం - రోజుకు అర గ్రాము నుంచి 5 గ్రాముల వరకు. ఆకుల స్వరసం - రోజుకి 3 నుండి 15 మి.లీ. వరకు
తీసుకుంటే కలిగే ఆరోగ్య ఫలితాలు :
* చర్మవ్యాధులను, దురదలను నివారిస్తుంది. (కుష్ఠఘ్న)
* ప్రేవుల్లోని పురుగులను అంతం చేస్తుంది. (కృమిఘ్న)
* పెద్దపేగులోని అదనపు ద్రవాలను శోషింపజేసి ద్రవరూప మలాన్ని గట్టిపడేలాగా చేస్తుంది. (గ్రాహి)
* గాయాలను, దెబ్బలను త్వరగా మానిపోయేలా చేస్తుంది. (వ్రణఘ్న)
* జ్వరాన్ని తగ్గిస్తుంది. (జ్వరఘ్న)
* శరీరంలో మంటలను, వేడిని తగ్గిస్తుంది. (దాహ ప్రసమన)
* కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. (నేత్య్రం)
* ఛాతిలో మంటను, పులిత్రేన్పులను తగ్గిస్తుంది. (ఆమ్లపిత్తఘ్నం)
* పైత్యం వల్ల శరీరాంతర్గతంగా జరిగే రక్తస్రావాలను తగ్గిస్తుంది. (రక్తపిత్నఘ్నం)
* రక్తాన్ని శుద్ధి చేస్తుంది. (రక్తశోధన)
* శరీరంలోకి చేరిన విషాన్ని నిర్వీర్యపరుస్తుంది. (విషఘ్న)
జీవ వైద్య గుణాలు (బయోమెడికల్ యాక్షన్స్)
* ఆల్టరేటివ్ (వ్యాధి రహితంగా చేస్తుంది.)
* యాంటీ ప్రూరైటిక్ (దురదలను తగ్గిస్తుంది.)
* యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (వాపును తగ్గిస్తుంది)
* యాంటీ పైరెటిక్ (జ్వరాన్ని తగ్గిస్తుంది)
* యాంటీసెప్టిక్ (ఇన్‌ఫెక్షన్ సోకకుండా నిరోధిస్తుంది)
* యాంటీ బాక్టీరియల్ (బాక్టీరియాను అంతం చేస్తుంది)
* యాంటీ ఫంగల్ (బూజును పెరగనివ్వదు)
* యాంటీ ప్రోటోజోవల్ (ఏకకణ జీవులను పెరగనివ్వదు)
* యాంటీ మలేరియల్ (మలేరియా కారక జీవులను సంహరిస్తుంది)
* యాంతెల్మింటిక్ (పేగుల్లోని ఎలుక పాములను, బద్దె పురుగులను చంపుతుంది)
* బిట్టర్ టానిక్ (చేదు తత్వాలు కలిగిన శక్తి ప్రదాయిని)
* యాంటాసిడ్ (ఆమ్లాలను తటస్థపరుస్తుంది)
* హైపోగ్లైసీమిక్ (రక్తంలో చక్కెర మొత్తాలను అదుపు చేస్తుంది.)
జీవక్రియ:
చర్మం: రక్తం, పిత్తం ప్రకోపించడం వల్ల చర్మవ్యాధులు వస్తుంటాయి. సాధారణంగా దురద, రసి కారటం, మంటలు, ఇనె్ఫక్షన్లు వంటివి ఈ తరహా చర్మవ్యాధుల్లో ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. ఇలాంటి అన్ని సందర్భాల్లో వేప ఔషధంగా పని చేస్తుంది. ఎగ్జిమా, సొరియాసిస్, మొటిమలు, దద్దుర్లు, గజ్జి, తామర, పేలు.. ఇలాంటి చర్మ సంబంధ వ్యాధుల్లో దీని పనితీరు అమోఘం. వేప గింజల నుంచి తీసిన తైలం చర్మం మీద తయారయ్యే తామర, ఇతర ఫంగల్ ఇన్‌ఫెక్షన్లను, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లను నమ్మకంగా తగ్గిస్తుంది.

                  అలాగే    పైరులు మీద సోకె కీటకాలను , సిలింద్రాలను  నాశనం చేసే కీటక నాశన మందులు తయారు చెయ్యడం లో వేప ఉత్పత్తులు బాగా పని చేస్తాయని గ్రహించారు ఆధునిక శాస్త్రవేత్తలు . అందుకే న్యూ యార్క్ కి చెందిన మల్టీనేషనల్ కంపెనీ వారు వేప ఉత్పత్తి అయిన వేప నూనెను మేమె కనిపెట్టాం అని పేటెంట్ రైట్ పొందితే , దానిని వ్యతిరేకించిన అనేక దేశాలు ముఖ్యంగా ఇండియాకి చెందిన ప్రముఖ సంస్థలు , వేప ఉత్పత్తులను మందులుగా వాడడం   భారతీయులకు ఏ ప్పటినుండో తెలుసు అని , న్యూ యార్క్ కంపెనీ వారు పేటెంట్ రైట్ కి అప్ప్లై చేయక పూర్వమే భారతీయ పరిశోధనా సంస్థలు కీటక నాశనులుగా వేప నూనెను వాడే ప్రక్రియ కనుగొన్నాయని వాదించి , వారికిచ్చిన పేటెంట్ రైట్ ను ఉపసంహరించేలా ఉత్తర్వులు పొందడం లోసఫలీకృతులు అయ్యారు. పూర్తీ సమాచారం కొరకు క్రింది ఇవ్వబడిన  సారాంశం చూడండి .

                          కాబట్టి వేప ఉత్పత్తులలోఉన్న ఔషధ గుణాలను వేళ్ల  ఏండ్ల నాడే  భారతీయులు గ్రహించారు. అది ఈ  నాడు ప్రపంచానికి తెలిసింది. భవిష్యత్ లో మనిషికిఉపయోగపడే అనేక ఔషదాలు కూడా వేప ఉత్పత్తులు నుండి కనిపెట్టబడవచ్చు. కొంత మంది శాస్త్రవేత్తలు, మానవుని పాలిట మహమ్మారిలా మారి వారి ప్రాణాలను కబళిస్తున్న ఎయిడ్స్ వ్యాధిని నిరోధించే గుణం వేపలో ఉందని ప్రకటించారు. అవి ప్రయోగ దశలో ఉన్నాయి. అదే నిజమయిన నాడు వేపచెట్టు నుండి అమృతం వెలికి తీసినట్లే కదా! అందుకే వేప చెట్టు నుండి అమృతం కారును అని బ్రహ్మం గారు కాలజ్ఞానం లో రాసి ఉంటారు. అలా కాలజ్ఞానం నిజం అయిందని చెప్పవచ్చు. అంతే కానీ ఎక్కడి ఒక ఊళ్ళోఉన్న  వేప చెట్టుకి  తెల్లటి ద్రవపదార్థం లాంటిది స్రవిస్తుంటే దానిని పట్టుకుని అమృతం అనుకోవడం కరెక్టు కాదు నా ఉద్దేశ్యం.

 ( On December 12, 1990 the multinational agribusiness corporation W.R. Grace of New York and the United States Department of Agriculture, Washington DC, filed a European Patent application with the European Patent Office (EPO) on the basis of a U.S. priority application of December 26, 1989, covering a method for controlling fungi on plants by the aid of a hydrophobic extracted neem oil.

After a very difficult and highly controversial examination procedure, the grant of a European patent for this application was published on September 14, 1994, the main claim having been restricted by the EPO to:

"A method for controlling fungi on plants comprising contacting the fungi with a neem oil formulation containing 0.1 to 10% of a hydrophoobic extracted neem oil which is substantially free of azadirachtin, 0.005 to 5.0% of emulsifying surfactant, and 0 to 99% water."

In June of 1995 a legal opposition against the grant of this patent was filed by Magda Aelvoet, MEP, on behalf of the Green Group in the European Parliament, Brussels, Dr. Vandana Shiva, on behalf of the Research Foundation for Science, Technology, and Natural Resource Policy, New Delhi, and the International Federation of Organic Agriculture Movements, based in Germany.

The Opponents submitted evidence to the EPO that the fungicidal effect of hydrophobic extracts of neem seeds was known and used for centuries on a broad scale in India, both in Ayurvedic medicine to cure dermatological diseases, and in traditional Indian agricultural practice to protect crops from being destroyed by fungal infections. Since this traditional Indian knowledge was in public use for centuries, it would seem that the patent application in question lacked two basic statutory requirements for the grant of a European patent, namely novelty and inventive step (in the U.S. non-obviousness).

In addition, the Opponents charged that the fungicidal method claimed in the patent was based on one single plant variety (Azadirachta indica) and hence resulted in at least partially monopolising this single plant variety. Since the European Patent Convention (EPC) explicitly prohibits the patenting of plant varieties, the patent should therefore be revoked.

In a first preliminary statement of September 30, 1997, the Opposition Board of EPO held that in summary, it appeared that "the present patent cannot be maintained" in view of the [evidence supplied by the Opponents] for lack of novelty and inventive step. Moreover, the content of [additional evidence filed by the Opponents] could "possibly form a very relevant prior art with regard to the inventive step."

In a second preliminary statement of June 15, 1999, the Opposition Board of EPO held that according to evidence supplied by the Opponents it appeared that "all features of the present claim (of the patent) have been disclosed to the public prior to the patent application during field trials in the two Indian districts Pune and Sangli"of Maharashtra, Western India, in summer 1985 and 1986.Furthermore, the Opposition Board held that on the basis of other evidence supplied by the Opponents, it appeared to be " mere routine work for a skilled person to add an emulsifier in an appropriate amount" and that therefore, "the present subject-matter was considered not to involve an inventive step."

 Counsel for the Opponents in the Oral Proceedings will be Dr. Fritz Dolder, Professor of Intellectual Property, Faculty of Law, University of Basel (Switzerland).

The NEEM tree.

The botanic name of the Neem Tree is Azadirachta indica, which is taken from the Persian name for the tree, Azad-Darakth, meaning "the free tree." The tree is a member of the mahogany family and is indigenous to the Indian subcontinent. Over the past century it has been introduced and now flourishes in many countries of Africa, Central and South America, the Caribbean and Asia. Neem trees are attractive tropical evergreens that can grow up to 30 meters tall and 2.5 meters in girth. Their spreading branches form rounded crowns as much as 10 meters across, and they may live for more than two centuries.

It is in India that the tree is most widely used. It is mentioned in Indian texts written over 2000 years ago and has been applied for centuries in agriculture as an insect and pest repellent, in human and veterinary medicine, toiletries and cosmetics. It is also venerated in the culture, religions, and literature of the region. India has freely shared its "free tree" and knowledge of its myriad uses with the world community; but now, through the patent sytem, this important resource is becoming the private property of a few corporations.

The NEEM patents

At the time the Neem patent challenge was filed, only four patents had been granted on Neem products by the European Patent Office. Today one can find 40 neem patent applications at various stages in the European Patent Office, and 90 have been granted worldwide. These include claims for insecticides, fungicidal effects, methods of extraction, storage stable formulations of one of the active ingredients, azadirachten, contraceptives, and medical uses. The majority of neem "proprietors" are transnational corporations, such as the pharmaceutical company Rohm and Haas, and the agrochemical giant W.R. Grace.

It should be noted that none of the neem patents involve a genetically engineered product; neither has the tree itself been patented, nor any of its parts. The case which will be heard May 9th and 10th involves a simple oil-based extraction of coarsely ground seeds from the Neem tree.

A list of all the Neem patent applications at the European Patent Office will be available at the Press Conference or can be ordered from one of the numbers below.

The NEEM tree and biopiracy

The neem patents will result in major financial gains for their so-called owners, but the communities which first understood the neems uses and shared this knowledge with the rest of the world will not be compensated at all. The neem patents are just one in a large catalogue of genetic resources originating in the South over which intellectual property rights are being asserted by a few multinational corporations originating, for the most part, in the North. The Northern patent system was not intended to recognise or reward as inventive the products of community innovation processes such as those which created the various uses of the neem today. It is only when these uses are described in the terms of Western science and technology that an "invention" is deemed to have taken place and an individual "inventor" or a set of individual "inventors" is allowed to be rewarded with the monopoly property rights that make a patent worth having. This is the mechanism through which a massive transfer of biological and intellectual wealth is taking place--from the Third World to the North.
The fungicide claimed in the USDA/W.R. Grace patent cannot be produced without naturally occurring neem seeds. One direct impact of the corporate monopoly on the Neem made possible by the patent system is a staggering increase in the companies demand for seed. A processing plant set up by Grace in India can handle 20 tons of seed per day. Almost all the seed collected - which was previously freely available to the farmer and healer - is now purchased by the company, causing the price of neem seed to rise beyond the reach of the ordinary people. Neem oil itself, used for lighting lamps, is now practically unavailable, as the local oil millers are not able to access the seed. Poor people have lost access to a resource vital for their survival - a resource that was once widely and cheaply available to them.

In an effort to deal with the problems of biopiracy there were attempts to introduce a mechanism for "prior informed consent" into the EU Directive on "Legal Protection of Biotechnological Inventions." However, this controversial legislation was enacted in July 1998 without building in any of the proposed protective measures. Now efforts are being focused on the Biodiversity Convention as an international legal instrument to require that patent applications involving biological resources identify the source of the material.

The NEEM campaign

The Neem Patent challenge was initiated in solidarity with the Neem Campaign, which was launched in 1993 by farmers in India who feared that their genetic resources and traditional knowledge were coming increasingly under foreign control through the legal mechanism of patents. They likened what they were experiencing to a modern form of "enclosure of the commons" - but in this case it was not public land which is being privatized, it was public knowledge. A delegation of Indian farmers and scientists is bringing to Munich 500,000 signatures of Indian citizens demanding that the patents on Neem be withdrawn.

Organizations supporting the NEEM patent challenge:

Research Foundation for Science, Technology, and Natural Resource Policy
Magda Aelvoet, Belgium Minister of Consumer Protection, Public Health, and the Environment
International Federation of Organic Agriculture Movements (IFOAM)
The Greens in the European Parliament
The Schweisfurth Stiftung (Germany)
Kein Patent auf Leben (Munich, Germany)
The European Coordination No Patents on Life! (Switzerland)
A-SEED (International, based in Amsterdam)
GAIA (International, based in U.K.)
Oxfam-Wereldwinkels (Belgium)
Oxfam-Solidarity (Belgium)
Ecoropa (France)
Oxfam G.B.
Erklarung von Bern (Switzerland)
Keine Patente auf Leben (Koordination Schweiz)
Action Aid (U.K.)
Five Year Freeze (U.K.)
The Edmonds Institute (USA)
GRAIN (international, based in Barcelona)
N.P.G. Dutch Platform on Genetechnology (Netherlands) ).

 Source:        
                          http://www.platformgentechnologie.nl/patents/euro_pat_office/parents/neem_final_backgrounder_nl.shtml



Friday, September 9, 2016

కట్నం తీసుకునేవాడు గాడిద అయితె, ఆ గాడిదతొ కాపురం చేసేవారు ఏమవుతారు?

                                                             
                                                          

  సంపాదన  ల కోసం చాన్నల్లు పెట్టి, రేటింగ్ ల కోసం సంచలనలూ స్రుష్టించే తెలుగు చానల్ ఒకటి తానేదో సమాజ ఉద్దరణ కోసం పాటు పడుతున్నట్లు తెగ ఊదర గొట్టేస్తుంది. సదరు చానల్ వారు అరగంట కు ఒక సారి " కట్నం తీసుకునేవాడు గాడిద,కట్నం తీసుకునేవాడు గాడిద" అని అంటుంటే ఎవరూ పెద్దగా పట్టించుకోవటం లేదు. ఎందుకంటే,అన్నీ  గాడిదలు అయిన సమాజంలో ఉండి,  ఆ గాడిదలతోనే సంసారాలు చేస్తున్న వారు  ఉన్న రాష్ట్రంలో "చెవి కోసిన మేకలా" అరగంటకొక సారి ఏడిస్తే ఒరిగేదేమిటి? పబ్లిసిటీ కోసం చీప్  ట్రిక్  లు మాని సమస్యకు పరిష్కారం చెప్ప గలరా? ఆలోచించండి.

  వర కట్నం అనేది దురాచారం. ఇది అందరు అనే మాటే. కాని దానిని అందరు ఆమోదించబట్టే ఇంకా కొన సాగుతుంది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు, ఆడ మగ బేదం లేకుండా అందరూ దీని ప్రొత్సా హిస్తున్నారు. గవర్నమెంట్ దీనిని నిషేదించి చాలా కాలమయింది. వారు చెయ్యల్సింది వారు చేసారు. కాని ప్రజలు దానిని పట్టించ్కోవడం లేదు. "కట్నం తీసుకున్న వాడు గాడిద అని ఎవరూ అనుకోవటం లేదు కాని, కట్నం తీసుకోను అంటే వాడి మగతన్నాన్నే శంకించే వారు చాలా మంది ఉన్నారు. మరి ఇటువంటి పరిస్తితుల్లో ఏమి చేయ్యాలి. మన ముందున్నవి రెండే మార్గాలు.

  (1)వరకట్నం ని చట్టబద్దం చేయ్యాలి. దీని వలన ఆడపిల్లకు అన్ని రూపాలలో ఇచ్చిన ఆస్తి పాస్తులను రికార్డ్ చెయ్యటమే కాక, దాని మీద ఆమెకు సంపూర్ణ "స్తీ ధన" హక్కులు కలిగి ఉంటుంది. తల్లి తండ్రుల అనుమతి లేకుండా ఆమె కూడ తనకు, తన పిల్లల్కి తప్ప వేరెవారికి అన్యాక్రాంతం చేసే హక్కు ఉండకుండ చేస్తే మంచిది.

 (2). అసలు వరకట్నం అనేదే లేకుండా ఆడపిల్లకి తల్లితండ్రుల ఆస్తిలో సమాన ఆస్తి హక్కు కల్పించారు కాబట్టి, అందరి పెండ్ల్లిల్లు అయిన మరుక్షణమే ఆమె వాటాను ఆమె పార్టిషన్ కోరుకునే హక్కు కల్పిస్తే, తల్లితండ్రుల ఆస్తిని అంచనా వేసుకుని అల్లుళ్లు పెండ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు. వ్యక్తి ఆస్తిని, స్వార్జితం, పిత్రార్జితం అనే బేదంతో సంబందం లేకుండా ఆడ మగ పిల్లలు అందరికి, ఆస్తిలో హక్కు కల్పించాల్సిందే. కుటుంబ ఆస్తులే తప్పా వ్యక్తి గత ఆస్తులు కు తావు ఉండరాదు. తల్లి తండ్రుల సంరక్షణా బారం పిల్లలు అందరిది.మినిమమ్ సెక్యుర్డ్ ఆస్తిని నిర్ణయించి, అట్టి ఆస్తిని పిల్లలు ఎవరూ, తల్లి తంద్రులు చనిపోయేంత వరకు  అన్యాక్రాంతం చెయ్య రాదు.

          ఆడ, మగా అనే బేదం లేక వారు తమ మేదో పరమైన నైపుణ్యంతో సంపాదనా పరులైతే, పిల్లల హోదాలానుసారం మెఇంట్నెన్స్ కోరే హక్కు తల్లితండ్రులకు ఉండాలి. అమ్టే ఆడ పిల్ల అయినా,మగపిల్లవాడు అయినా సరే,  ఒక కలెక్టర్ తల్లి తండ్రులు ఆ స్తాయిలోనే మెఇంట్నెన్స్ కోరే హక్కు ఉండాలి. ఇదంతా స్తి దనం మీద పురుష పెత్తనం ఖచ్చితంగా తగ్గించడమే కాక స్తి పురుషులని ఇద్దరిని తల్లితండ్రులు సమానంగా చూడడానికి దోహదపడుతుంది.


                                          (8/7/2013 Post Republished) 

Wednesday, September 7, 2016

పరిసరాలు శుభ్రంగా లేనిచోట పందులు ఉండటం ఎంత కామనో , కట్టుబాట్లు లేని సమాజంలో కంత్రీ గాళ్ళు ఉండటం అంతే కామన్

అత్యా చారం జరిగిన పురాతన భవనం
                                                              
 ఒక అమ్మాయి. వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు . ఉద్యోగం పొటో జర్నలిస్ట్ . ఆమెకు పాడుబడిన బవనాల మీద పరిశోదన చెయ్యాలనిపించింది . మిత్రుడిని వెంట పెట్టుకుని సాయంత్రం ఆరు దాటిన తర్వాత ముంబాయి లోని శక్తి మిల్ అనే ప్రాంతం దగ్గరకు వెల్లింది . ఆ నిర్జన పాడు పడిన ప్రాంతం లో దెయ్యాలు అయితే ఉండవు  గాని ,బూతాలు లాంటి మ్రుగాళ్ళు  బుసలు కొడుతూ తిరుగుతుంటారట ! మరి అటువంటి ప్రాంతానికి పాపం పోటో జర్నలిస్ట్ ఆమె బాయి ఫ్రెండ్ వెళ్ళారు . ఇంకేముంది ! బుసలు కొట్టె మగాళ్ళు కి ఈ  ఇద్దరూ కనిపించారు . మొదట ఇక్కడ పొటోలు తియ్యడానికి విలు లేదు అన్నారట . ఆ తర్వాత వెకిలి మాటలు , వెకిలి చేష్టలు మొదలు పెట్టారట . ఈ  జర్నలిస్ట్ , ఆమె బాయి ఫ్రెండ్ ఎదురు మాట్లాడే సరికి కోపం వచ్చి , ఆ ఫ్రెండ్ ని బెల్ట్ తో కట్టిపడేసి , ఆ అమ్మాయిని పాడుబడిన భవంతిలోకి తీసుకు వెళ్లి రిపీటెడ్ గా రేప్ చేసారట . ఇలా ఆ ఘోర కాండ రెండు ఘంటలు జరిగాక వారు వెళ్లిపోయారట . పాపం ఆ పొటో జర్నలిస్ట్ మిత్రుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలిసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు .

సాదారణంగా ముంబాయి సిటీలో అర్దరాత్రి కోడా స్త్రీలు ఒంటరిగా  రైళ్ళలో బస్సుల్లో ప్రయాణిస్తూ ఉంటరట . ఆ విదంగా డిల్లీ తో పోల్చుకుంటే స్త్రీల రక్షణలో ముంబాయి బెస్టే . కాని సేమ్ డిల్లీ లో జరిగిన నిర్బయ రేప్ ఉదంతం లాగే ఐ ఘటన ఉండటంతో ఒకసారిగా ముంబాయి నగరవాసులు ఆందోళన చేసే సరికి, కంగారు పడిన ముంబాయి పోలిస్ 20 స్పెషల్ టీం  లని రంగం లో దించి ఇప్పటికి 5 గురు నిందితుల్లో 2 ని అరెస్ట్ చేసారట !. మిగాతా నిందితుల వివరాలు కూడా  రాబట్టారట. త్వరలోనే వారిని కూడా  అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరిత గతిన విచారణ చేయించి వారికి శిక్షలు పడేటట్లు చేస్తారు .  అక్కడితో ప్రబుత్వం బాద్యత తీరి పోతుంది . అమ్మాయి ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉంది .. త్వరలో ఆమె కూడా  కోలుకుని మళ్లీ  మామూలుగా తిరుగుతుందని ఆశిద్దాం .

  దేశాన్నీ  కుదిపేసిన నిర్భయ కేసుకి , ఐ కేసుకి చాలా పోలికలు ఉన్నాయి .అవి ఏమిటో చూదాం .

(1). రెండు కేసుల్లోను బాదితుల వెంట బాయి ఫ్రెండ్ లు ఉన్నారు.

(2). రెండు కేసులోనూ అత్యాచారం సాయంత్రం ఆరు దాటిన సమయం లో జరిగింది .

(3). నిర్బయ కేసులో జనం లేని బస్సులో రేప్ జరిగితే , ముంబాయి కేసు జనం లేని పాడుబడిన భవంతిలో జరిగింది .
(4) రెండు కేసుల్లోను  అత్యాచారానికి ముందు నిందితులు కి బాదితులకి మద్య వాగ్వాదం జరిగింది .

(5) రెండు కేసుల్లోను నిందితులు నేర స్వబావం కలిగిన వారు .

(6) రెండు కేసులోనూ బాదితులు పరిస్తితులకు తగ్గట్లు ప్రవర్తించగలిగిన ఇంగిత జ్ఞానం కొరవడిన వారు .ముంబాయి కేసులో దుష్టులతో వాగ్వాదం పెంచుకునే బదులు సాద్యమైనంత వరకు దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించ వలసి ఉందాల్సిమ్ది .

    అసలు మెట్రో పాలిటన్ కల్చర్ లో బాయి ప్రెండ్లతో తిరిగే అమ్మాయిల మీద మగాళ్ళకి ఎటువంటి అభిప్రాయం ఉంటుంది ? విదేశియుల  లాగా ఇట్స్ కామన్ అనుకుంటారా ! లేక అటువంటి అమ్మాయిలకి  అంతా కామనే అనుకుంటారా ! అలా అనుకుంటే తప్పు ఎవరిదీ? పరిసరాలు శుభ్రంగా లేక పోతే పందులు చేరతాయి . మరి మనుషులు ఉండాల్సిన పరిసరాల్లో పందులు చేరడానికి బాద్యత ఎవరిదీ? .పరిసరాలను శుభ్రంగా ఉమ్చుకోకుండా  పందులును ఆకర్షించే జనాలదా ? లేక పందులుదా ? కాబట్టి పరిసరాలు  శుభ్రంగా లేనిచోట పందులు ఉండటం ఎంత కామనో , కట్టుబాట్లు లేని సమాజంలో కంత్రీ గాళ్ళు ఉండటం అంతే కామన్ . ఇక పోతే అటువంటి   కంత్రీ లను ఏరి పారేయాల్సిన అవసరం లేదా అంటే , ఎందుకు లేదూ ,తప్పకుండా ఉంది . పందులు వల్ల  "స్వైన్ ప్లూ " రోగం వస్తే ఏమి చేస్తాం ? వెనుకా ముందూ  చూడకుండా కనపడిన పందిని కనపడినట్లే కాల్చి పారేస్తారు . కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోతుంది . అలా జరుగకుండా  ఉండాలంటే. . పరిశుబ్రత లాంటి కట్టుబాట్లు అవసరం .

                                              (24/8/2013)  

Sunday, September 4, 2016

2022 నాటికి ఆసియా ఖండం ని ఏకం చేసే దక్షిణ భారత దేశానికి చెందిన ఆ హిందూ మహాపురుషుడు ఎవరు?!!!

బ్లాగు వీక్షకులకు , స్నేహితులకు, అగ్రిగ్రేటర్ లు  అందరికి  వినాయక చవితి శుభాకాంక్షలతో ....
               
            కల్కిఖడ్గం గా గతం లో ప్రచురించిన ఈ బ్లాగును ,  కొంతమంది స్నేహితులు ,  విషయాసక్తి కల  అభిమానులు కోరిక మేరకు  "వీరభోగవసంతరాయలు " గా  పేరు మార్చి ,ఈ వినాయక చవితి పర్వదినాన  తిరిగి ప్రారంభించడం జరుగుతుంది. మా "మనవు"  బ్లాగు మాదిరే  ఈ బ్లాగుకు కూడా మీ అందరి ఆదరాభిమానాలు ఉంటాయని ఆశిస్తూ ......
                                                                                               మద్దిగుంట నరసింహ రావు .
                                                                                                  బ్లాగు అడ్మినిస్ట్రేటర్ .

                                                                 ఇక చదవండి .                                                                

                                              ప్రపంచం లో గొప్ప  భవిష్య ద్రష్ట గా ఎంతో పేరు గాంచిన ప్రెంచ్ కాలజ్ఞాని నోస్ట్రడామస్ 8 వ శతాబ్దానికి చెందిన వాడు . అయన చెప్పిన భవిష్య వాక్కులులో సుమారు 800,   గత 400 సంవత్సరాల కాలం లో జరిగినవి అట. అందులో బ్రిటిష్ సామ్రాజ్య పతనం  1942 లో జరుగుతుందని  చెప్పిన భవిష్య వాక్కు కూడా ఒకటి . నిజానికి 1942 లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమమే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి నాంది గా మారింది. అలాగే నాజీలు యూదులు ను ఊచకోత కోస్తారని ప్రెంచ్ భవిష్యద్రష్ఠ ఎన్నో శతాబ్దాలకు పూర్వమే తెలపడం ఆశ్చర్యమే కదా .

    నోస్ట్రడామస్ తెలిపిన భవిష్యవాణిలో లో భారత దేశానికి సంబంధించింది , ఎంతో అబ్బురం తో కూడిన ఆనందకరమైన విషయం ఒకటి ఉంది. ఆయనగారు చెప్పిన దాని ప్రకారం హిందూ మతానికి  ఎంతో ఉజ్జ్వల భవిష్యత్ ఉందని, దక్షిణ భారత దేశానికి చెందిన ఒక హిందూ మహానాయకుడి అద్వర్యం లో హిందూ లేక భారత సేన   ఆసియా లో మాత్రమే కాక మధ్యప్రాచ్యానికి తమ రాజ్యాన్ని విస్తరిస్తోందని తెలుస్తోంది .
     నోస్ట్రడామస్ తెలిపిన సదరు హిందూ మహాపురుషుడు మూడు సముద్రాలు కలిసే దక్షిణ భారత దేశం నుండి వస్తాడు  అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయన చెప్పిన దానిని పరిశీలిస్తే భవిష్యత్ లో రష్యా తమ కాలం చెల్లిన  కమ్యూనిజం బావాజాలానికి గుడ్ బై చెప్పడమే కాక, హిందూ సామ్రాజ్య విస్తృతికి తోడ్పడగలదని అర్ధమవుతుంది అట. 
   హిందూ సేనలు మధ్యప్రాచ్యం మొత్తం జయించాక , కాకసస్ పర్వతాలు దగ్గర రష్యా సేనలు వారితో కలుస్తాయి అని , ఆ తర్వాత వారంతా కలసి నల్లసముద్రం లేక మేడ్ట్ర్నియన్ ని దాటుతారని కళ్ళకు కట్టినట్లు తెలిపాడు. ఆ తర్వాత ఆ హిందూ నాయకుడు తన సేనలతో పారిస్ చేరుకుంటాడని , ఒక భయంకరమైన యుద్ధం తర్వాత దానిని కూడా హస్తగతం చేసుకుంటాడని  నోస్ట్రడామస్ కాలజ్ఞానం లో ఉన్నట్లు తెలుస్తోంది.

    మరి నోస్ట్రడామస్ చెప్పిన భవిష్యవాణి నిజమే  అయితే  మన దక్షిణ భారత దేశం లో , ఒక హిందువు అయి ఉండి , ప్రస్తుతం రాజకీయా నాయకులుగా కానీ, మఠాధిపతులలో కానీ , అలా ప్రపంచ స్థాయి నాయకుడు కాగలిగిన లక్షణాలు ఎవరికీ ఉన్నాయో చెప్పగలరా? 

   పై కధనం Zee న్యూస్  ఇండియా వారు తమ వెబ్సైట్ లో  సెప్టెంబర్ 2 వ తేదీన ప్రచురించారు. దాని మూలం  ఇది. 

               New Delhi: Nostradamus, the famed 8th century French scholar, continue to amaze the world with his predictions which often turned out to be true.

Over 800 of his forecasts were fulfilled in the last 400 years, and among which was the prediction that the British empire would collapse in 1942.

The Quit India movement gave a huge setback to the British imperialist forces. He had also predicted the annihilation of Nazis for the mass murder of Jews.

What is of particular interest to India is that he saw a bright future for the country, which according to him is “destined to be a force to be reckoned with”. He also saw Hinduism will grow across the vast spans of Asia and Middle East.

What's more interesting is that he saw an immortal leader emerging from South India with Hindu roots who will go on to bind the whole of Asia together.

The future world leader will come from a peninsula where the three seas meet, which can only be the Indian peninsula, he predicted. Thus, the future leader will be a Hindu from South India, who will bind Asia together.

According to the speakingtree.in, his forecast also seems to suggest that Russia will abandon Communism in favour of Hindu wisdom.

The Hindu troops will sweep through the Middle East, avenging former wrongs and the Russian army in the Caucasus mountains will link up with them, he predicted. And then they will cross the Mediterranean or the Black Sea.

He also saw that the Hindu leader will reach Paris, which will be taken after a fierce siege.