Friday, February 7, 2014

టెన్షన్ తో తొందర పడి ముందే కూస్తున్న సిమాంద్ర కోయిలలు !

                                                                 
                                                         

దేనికైనా ఒక టైం  ఉంటుంది . అది అ టైం  ప్రకారమే జరుగుతుంది . వసంతకాలం లో కోయిలలు కూస్తాయి ,అంతే కాని కోయిల కూసింది కదా అని వసంత కాలం రాదు . వసంత కాలం రాకుండా కూసే కోయిల కూతలు తొందరపడి కూసేవే అవుతుంది . ఇదే విషయాన్ని రెండవ సారి మన సుప్రీం కోర్టు  వారు సిమాంద్ర నాయకుల పక్షానా వాదనలు వినిపించిన సుప్రీం కోర్టు న్యాయవాదులకు చెపుతూ, వారు దాఖలు చేసిన రాష్ట్ర విభజన మిద పీటిషన్లు ను సున్నితంగా తిరస్కరించారు .

  4 రోజుల క్రితం తెలంగాణా రాష్ట్ర విభజన ను చాలెంజ్ చేస్తూ సిమాo ద్రకు చెందిన వారు 9 పిటిషన్ లు వేసారు . గతంలో ఇలాగే వెయ్యగా అవి అపరిపక్వమైనవని , అసెంబ్లీ తీర్మానం కాని , కేంద్ర ప్రబుత్వ నిర్ణయం కాని జరుగకుండా వాటి మిద విచారణ జరపటం తొందరపాటు చర్య అవుతుందని కోర్టు వారు పెటిషన్ లను తిరస్కరించారు . ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం అయి పోయింది . విభజన బిల్ టెక్నికల్ గా తిరాస్కారానికి గురి అయిo ది . అయినా సరే రాష్ట్ర విబజనకే  కంకణం కట్టుకున్నట్లు కేంద్రం తెగ యాక్షన్ చేస్తుంటే , టెన్షన్ పెంచుకున్న సిమాంద్ర నాయకులు కొందరు తిరిగి చాలెంజ్ పిటిషన్ లు వేస్తె కోర్టు వారు గంటన్నర వాదనలు విన్నాక , గతంలో పిటిషన్ లకు ప్రస్తుతం వేసిన పిటిషన్ లకు పెద్ద తేడా లేదని పెదవి విరచి ఈ రోజు తిరస్కరించారు

  కాకపొతే సమైక్యతా కోరుకునే వారికి ఉన్న ఒక్క ఆశ  ఏమిటంటే , పిటిషన్లు తిరస్కరిస్తూ సుప్రీం కోర్టు వారు అన్న మాటలు . " కేంద్ర ప్రబుత్వం నిర్ణయం ఏమిటో తెలియకుండా పిటిషన్లు విచారించడం తొoదర పాటు చర్య అవుతుoది. కాబట్టి సరి అయిన సమయంలో వేస్తె పరిశిలించవచ్చు " అంది . అంటే కేంద్రం రాజ్యంగా ప్రకారం రాష్ట్ర విభజన చెయ్యడానికి ఇంకా అవకాశం  ఉంది అని సుప్రీం కోర్టు వారి అభిప్రాయం కావచ్చు. అది నిజమే . రాజ్యంగా బద్దంగా విభజన చెయ్యడానికి కేంద్ర ప్రబుత్వానికి ఆవకాశం  ఉంది . కానీ టైమే  లేదు . కాంగ్రెస్ వారు చెయ్యాలంటే ఇప్పుడున్న రూపంలోనే మమా అనిపించాలి .దానిని కోర్టువారు అడ్డుకునే ఆవకాశం  కూడా లేకపోలేదు . ఈ రోజు కోర్టువారు అన్న చివరి మాటలు అదే అభిప్రాయం కలిగిస్తున్నాయి . ఒక వేలా కోర్టులకు ఆ చాన్స్ ఇవ్వద్దు అనుకుంటే రాష్ట్ర విభజన బాద్యతను రాబోయే ప్రబుత్వానికి వదిలెయ్యాలి .అది కాంగ్రెస్ కి కష్టమైనా పనే . అందుకే డ్రామాలకు తేర తీసింది . చూదాం ఏమి జరుగుద్దో!

2 comments:

  1. ప్రభుత్వంలో మూడు శాఖలు ఉంటాయి. అన్నటికీ తమతమ పరిధులు & బాధ్యతలు ఉంటాయి (separation of powers). చట్టాలు ఆమోదించడం చట్టసభ (legislature) పని: ఇందులో న్యాయస్థానాలు (judiciary) జోక్యం చేసుకోవు.

    న్యాయస్థానాల పని ఏమిటి? చట్టాలు & నియమాలు రాజ్యంగబద్దమా కాదా అని చెప్పాల్సిన బాధ్యత ఈ శాఖదే. చట్టం లేదా నిర్ణయం వెలువడ్డ తరువాతే ఇది కుదురుతుంది కాబట్టి అంతకుముందు జరుగుతున్నా ప్రక్రియలలో వీరు తల దూర్చరు. అలాగే ఒక చట్టం/నిర్ణయం మంచా కాదా అనే విషయం కూడా న్యాయస్థానాలకు అవసరం లేదు.

    ReplyDelete
  2. ఇదే విషయంపై నా టపా చూడండి:

    http://jaigottimukkala.blogspot.in/2014/02/article-3-federalism-and-bommai-case.html

    ReplyDelete