Friday, January 17, 2014

ముంబాయి డాన్సర్ "రేప్" కేసు కున్న ప్రాదాన్యత, మచిలీపట్టణం ఇంజనీర్ అనూహ్య మర్డర్ కేసుకు లేదా ?

                                                             


 లేదనే అనిపిస్తుంది , ముంబాయి పోలిసుల తీరు  చూస్తుంటే . ఇక విషయానికి వస్తే , మొన్నీ  మద్య ,హైదరాబాద్ లో జనవరి 1 వేడుకల్లో డాన్స్ చెయ్యడానికని ముంబాయికి చెందిన డాన్సర్ ఒకామె హైదరాబాద్ కి వచ్చింది . ఆమెను ఎయిర్పోర్టులో పికప్ చేసుకోవడానికి వచ్చిన వారు ఆమెకు మత్తు  మందు ఇచ్చి , దూరంగా ఎక్కడి కో  తీసుకు వెళ్లి, ఆమె మిద సామూహిక అత్యాచారం జరపి , ఆమె దగ్గరున్నది దోచుకుని , అ తర్వాత ఆమెను ముంబాయి బస్ ఎక్కించారట . ఆమె కూడా మత్తులో ఉండటం వలన ఇవేవి గమనించక ఇంటికి పోయి చూసుకున్న తర్వాత గాని తనకు జరిగిన అన్యాయం అర్ధం కాలేదట . అక్కడి పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే వారు పట్టించుకో పోయేసరికి , తనకున్న ఇన్ప్లూయన్స్ తో ఒక సామాజిక సంస్ట  ద్వారా  ముంబాయి పోలీసులను కదిలించి , వారిని తీసుకుని హైదరాబాద్ కు వచ్చి , ఇక్కడి పోలీసులను కదిలిస్తే , అప్పటికప్పుడు 4 స్పెషల్ టీంలు  ఏర్పాటు చేసి నిందితులను పట్టుకుని కట కటాల  వెనుకకు నెట్టారు . ఈ  కేసు గురించి పోలిస్ అధికార్లు ఎంత శ్రద్ద తీసుకున్నారో పోలిస్ అధికారుల మాటల్లోనే ఈ విడియో  ద్వారా తెలుస్తుంది . ఇందుకు హైదరాబాద్ పోలిస్ వారిని అభినందించి తీరవలసిందే !


                                               

  అయితే ఇక్కడొక ప్రశ్న  ఏమిటంటే , ముంబాయికి చెందిన అమ్మాయి రెప కేసు గురించి హైదరాబాద్ పోలీసులు చూపించిన శ్రద్ద లో , మచిలీ పట్నానికి  చెందిన తెలుగు ఇంజనీర్ అనూహ్య ఘోరంగా మొన్న తగులపెట్టబడి శవంగా ముంబాయి సమీపంలో దొరికితే , ఆ  కేసు మిద ముంబాయి పోలీసులు వందవ  వంతైనా చూపించారా అని ?
  ఈ  కేసు వివరాలు లోకి వెళితే , మచిలీ పట్నానికి  చెందిన అమ్మాయి అనూహ్య ముంబాయి లో ఇంజనీర్ గా ఉద్యోగం  చేస్తుంది . క్రిష్టమస్ సెలవులకు ఇంటికి వచ్చిన అనూహ్య ,పండగ తర్వాత ముంబాయి వెళ్ళింది . కాని ఆమె ముంబాయి చేరినట్లు సమాచారం ఆమె తండ్రికి రాలెదు. అ రోజు నుంచి ఆమె ఏమైందో అర్ధం కాలెదు. దానితో విజయవాడ రైల్వే పోలిస్ స్టేషన్ లో ఆమె తండ్రి పిర్యాదు చేస్తే , మిస్సింగ్ కేసు నమోదు చేసిన విజయవాడ పోలీసులు కేసును ముంబాయి పోలీసులకు బదిలీ చేసారు . కానీ అక్కడి పోలీసులు ఈ  కేసును ఎ మాత్రం పట్టించుకోక పోవడం తో , అమ్మాయి తాలూకు వారె ఒక టీం  గా ముంబాయి వెళ్లి అక్కడి స్తానికుల సహకారం తో గాలింపు చేపట్టారు . చివరగా వారికి ఒక చోట తగుల పెట్టబడి కంపు కొడుతున్న స్తితిలో , అనూహ్య శవం  కనిపించగా , ఆ  సమాచారాన్ని తండ్రికి చెపితే అయన ముంబాయి వెళ్లి, దారుణంగా హత్య చేయబడిన తన కూతురు ని చూసి కన్నీరు మున్నీరు అయ్యారు . కాని ఈ విషయం  లో ముంబాయి పోలీసులు ఎ మాత్రం పట్టించుకోలేదని తెలుస్తుమ్ది..  దిని మిద అమ్మాయి తాలూకు వారి బాదను క్రింది విడియో లో చూడండి . కాబట్టి దిని వలన అర్దమయ్యేది ఒకటే , ముంబాయి డాన్సర్ గారికి ఉన్న ఇంప్లూయన్స్  ఆంద్రా  అమ్మాయి తల్లి తండ్రులకు లెదు. ఉంటే ఇంత నిమకు నిరెత్తినత్లు ఉంటారా పోలీసులు ?
ముంబాయి అయినా , హైదరాబాద్ అయిన అందరూ ఇండియన్ పోలీసులే . మరి డాన్సర్ గారి విషయంలో చూపిన శ్రద్ద , అబాగ్య ఇంజనీర్ విషయం లో ఎందుకు చూపించడం లేదు? ఈ  విషయం లో తెలుగు వారు అంతా అనూహ్య తల్లి తండ్రులకు సంగి బావం తో కూడిన సంతాపం తెలుపాల్సిన   అవసరం ఉంది . దానిలో బాగంగానే అనూహ్య తల్లి తండ్రులకు కల్కి ఖడ్గం బ్లాగర్ గా నా సంఘీ బావం ను మరియు సంతాపం ని తెలియ చేస్తున్నాను.      

        

                   

No comments:

Post a Comment