Wednesday, July 31, 2013

రాజీవ్ గాందీ గారి పెండ్లి రాష్త్ర నాయకుల చావు కొచ్చిందా ?

                                                                




ఎంకి పెండ్లి సుబ్బి  చావు కొచ్చిందని సామెత. అలాగే రాజీవ్ గాందీ గారి పెండ్లి మన రాష్ట్ర ప్రజల చావు కొచ్చిందా ,అని అనిపిస్తుంది. పాపం అయన గారు ఉంటే ఆంద్రా నాయకులు అయన గారీ దగ్గర తమ గోడు వెళ్ళ బోసుకునే అవకాసం ఉండేది. ఎంత ఇటలీ అమ్మాయిని పెండ్లాడినా , ఆయనలోను ఉన్నది అయన అమ్మగారి భారతీయ రక్తమే కాబట్టి ఆంద్రా వారిమూగ వేదన ను అర్దం చేసుకుని రాష్ట్రాన్ని విడగొట్టే వారు కాదు. . కానీ ఆ అవకాశం లేకుండా  తమిళ పులులు ఆయన్ని పొట్టన పెట్టుకున్నారాయే !

  అసలే తెలుగు వారికి డబల్ యాక్షన్ అంటే యమ ఇష్టం . అందుకే పైకి చెప్పేదొకటి , మనసులో అనుకునేది ఇంకొకటి. తెలంగాణా లో ప్రజలను మబ్య పెట్టడానికి "ఇచ్చేది మేమే , తెచ్చేది మేమే " అని ఒకరంటే వారు ఇస్తే మాకేమి అబ్యంతరం అని ఉదారత ఒలక బోశారు . అఖిల పక్ష బేటిలోను అదే నొక్కి వక్కానించే సరికి , వీరి డబల్ యాక్షన్ గురించి అవగాహన లేని ఇందిరమ్మ కోడలు జై తెలంగాణా అనేసరికి నోటి మాట రాక , తెల్ల ముఖం వేసుకుని , అమ్మా ,అమ్మా , ఆలోచించమ్మా , అని ఆంద్రా వారు ఆనక ప్రాదేయ పడుతుంటే , 'నదింగ్ డూయింగ్ , డెసిషన్ ఇస్ ఓవర్ " అనే సరికి కళ్ళ నీరు కుక్కుకుంటూ , పైనున్న రాజీవుని తలచుకుని, తలచుకుని బాద పడ్డారట .

  అందుకే పెద్దలంటారు . పెండ్లి చేసుకునే టప్పుడు అటు ఏడు తరాలు , ఇటు ఏడూ తరాలు చూడాలని . రాజరిక వంశాలు లో ఇది తప్పని తప్పని సరి . ఎండుకంటే ఆ వచ్చే వారికి మన ఏడ్చే ఏడ్పు అర్దం కావాలిగా . అందుకని ! అదే రాజీవ్ గాందీ గారు ఐ దేశం అమ్మాయిని పెండ్లి చేసుకుంటే , ఆంద్రా వారి అంతర బాష ,అర్దమయి ఉండేది . "ఒహో b.j.p.  వారికి రామాలయం లాంటిది , ఆంద్రా వారి తెలంగాణం " అని . కాని అది పొసగలేదు. . అప్పుడు అనిపించిందట  " రాజీవ్ గాందీ గారి పెండ్లి రాష్త్ర  నాయకుల చావు కొచ్చిందా " అని !

No comments:

Post a Comment