Sunday, July 21, 2013

హిందువులు గురించి అయిపోయింది! ఇక ముస్లిం లది మొదలయింది . !

                                                                            



ఆ  ఊరిలో ఒక పుల్లగొండి పెద్దయ్య ఉన్నాడు .    కొంచం ఎక్కువ చదువుకుని   ఉండటం  వల్ల ,అతను చెప్పేదానికి  ఎవరూ ఎదురు చెప్పే వారు కారు . దానితో ఇక అన్ని తనకే తెలుసనీ, అ ఊళ్ళో వారికి  ఏమి తెలియదని, వక నిర్ణయానికి వచ్చేసి, అవసరం ఉన్నా,లేకపోయినా, పని కల్పించుకుని , దారిన వచ్చే పోయే వారిని పిలిచి మరీ  తన పాండిత్యం ప్రదర్శించడం మొదలు పెట్టాడు .
ఆ ఊరిలో వక గుడి ఉంది . ఆ గుడిలో ఉత్సవాలు జరుగుతునాయి . ఆ సందర్బంగా వారం రోజులు పాటు సాయంత్రం వేళలో 'గీతా పారాయణం ' చేస్తుండే వారు . అది వినడానికి ఆ ఊళ్ళో ముసలి వారు ,స్త్రీలు వచ్చి వెళుతుం దేవారు . అ సమయంలో గుడి కొంచం దూరం లో, దారిలో  ఉన్న ఒక చెట్టు క్రింద కూర్చుని , అ గీతా పారాయణం విని వస్తున్నా వారిని  తన దగ్గరకు రమ్మని పిలిచే వాడు  పుల్ల గొండి పెద్దయ్య . స్త్రీలు అయితే అతనిని పట్టించుకోకుండా  తమకు పని ఉందని వెళ్లి పోయే వారు. ఇక నడవడం ఇబ్బందిగా ఉన్న, ముసలి వారు , కాసేపు కూర్చున్నట్లు ఉంటుo దని ,అక్కడికి వెళ్లి కూర్చుంటే, వారికి 'గీత ' అనేది పెద్ద రోత  అని  ,దానిని  చెప్పిన కృష్ణుడు  పెద్ద తాగుబోతు, తిరుగు బోతు అని వివరించడానికి ప్రయత్నిస్తే, వారంతా అతనిని  తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి , దేవుడా అంటూ ఇంటికి వెళ్ళిపోయే వారు. వారికి గీతలో ఏముందో  ప్రతి వాక్యం తెలియాల్సిన అవసరం లెదు. వారికి అర్ధం అయింది ఒకతె. ఎవడి పని వాడు చెయ్యటమే దేవుడుకు నచ్చుతుo ది. కుల మతాలతో పని లేకుండా,బక్తితో  పత్రం పుష్పం ఏది ఇచ్చినా దేవుడు తిసుకుo టాడు . వారిని అనుగ్రహిస్తాదు. ఇదే వారికి తెలిసిన గిత. కాని దేవుడనే  దొంగ   అనే  పెద్దయ్య మాటలు ఎవరూ పట్టిం చుకునే వారు కారు. అయినా సరే అ వారం రోజులు పెద్దయ్య తన 'పుల్ల గొండి ' విద్యనూ ప్రదర్శిస్తూనే ఉన్నాదు. ఎలాగో వారం రోజులు గదిచాయి. ఉత్సవాలు తో పాటు గీతా పారాయణం  కూడా ముగిసిo ది. దానితో పెద్దయకు పని లేక నోరు దూల పెట్ట సాగిo ది.
 ఇంతలో ముస్లింల పండగ ఒకటి వచ్చింది . దానితో ముస్లిం లంతా మజిద్ కు  వెళ్లి నమాజులు  చెయ్యటం మొదలు పెత్తారు. అంతే ! పెద్దయ్యకు టక్కున ఒక ఆలోచన వచ్చిo ది . గీతను తిట్టినట్లు ఖురాన్ ని కూడా విమర్సిమ్చడానికి  కంకణం కట్టుకుని, మసీద్ కి దగ్గరలో కూర్చుని బయటకు వస్తున్నా యువకులను పిలిచి, కురాన్ లోని లోపాలను ఎత్తి చూప సాగాదు. అది వింటున్న కుర్ర వాళ్లకి మొదట్లో ఏమి అర్ధం కాలెదు. కొంచం అర్ధం అయ్యే సరికి . వారి కి కోపం నసాళానికి అంటి నట్లు , ఒక్క సారిగా పెద్దయ్య మిద పడి విర కుమ్ముడు కుమ్మే సరికి, పాపం పెద్దయ్య స్పృహ తప్పి పడి  పొతే, అ దారిన పోతున్న క్రిష్నయ్య  వారిని వారించి , పెద్దయ్యకు ఉప చర్యలు చేసి , హాస్పిటల్లో జాయిన్ చెసాదు. అ రోజు నుంచి పెద్దయ్య మాట్లాడితే ఒట్టు!
   

No comments:

Post a Comment