Sunday, October 6, 2013

" రేప్" చేసిన పదేండ్లకు కేసు పెట్టడం లో మతలబ్ ఏమిటి?


                                                                    

 ఈ మద్య ఆసరామ్ బాపు అనే కలియుగ ఆశ్రమ వాసిని లైంగిక వేదింపులు కింద అరెస్ట్ చేసి జెయిల్ లో పెట్టారు. దానికి అయన కింకా బెయిల్ రాలెదు. కాని విచిత్రంగా నిన్న ఇద్దరు అక్కా చెల్లెలు ఆయన మీద ఆయన కొడుకు మీద కేసు పెట్టాఅట. అదేమిటంటే పది సంవత్సరాల క్రింద ఆస్రామ్ బాపు, ఆయన కొడుకు తమను  రేప్ చేసారని. సూరత్ పోలిసులు కేసు రిజిస్టర్ చేసి విచారణ చేపట్టారు. ఇటువంటి రేప్ లు వారి మీద 2002  నుండి 2004  వరకు జరిగాయటా! 

 రేప్ కేసులో ప్రదానమైనది మెడికల్ ఎవిడెన్స్. పదేళ్ళు క్రితం జరిగిన రేప్ల ని మరి ఎలా రుజువు చేస్తారో ఆ పోలిసులకే తెలియాలి. మరి పదేళ్ల వరకు కేసు పెట్ట కుండాఎందుకు ఆగారో ఆ అక్క చెల్లెలకి తెలియాలి. ఇవ్వన్ని ఆస్రాం బాపు  అనే ఆశ్రమ వాసికి ఎందుకుnజరుగుతున్నాయో ఆయన్ని కేసులలో ఇరికిస్తున్న రాజకీయ నాయకులకి తెలియాలి. అసలు కేసులో ఉన్న నిజా నిజలు ఆయన కేసు దర్యాప్తు జరుపుతున్న "కరుణామయుడు" జోద్ పూర్ కమీషనర్ జార్జ్ గారికి తెలియాలి. అధికార పార్టీ ని విమర్శించే హిందూ గురూజీల మీద ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెట్టడం ఎందుకు  జరుగుతుందో ఆ సెక్యులర్ అధిష్టాన దేవతకే తెలియాలి.

 అయినా ఆస్రం బాపు మీద ఉన్న కేసులను తక్షణ మే విచారించి అతను దోషి అని రుజువు అయితే ఆయన ఆశ్రమ ఆస్తుల ను ఇతర హిందూ సంస్తలకు అప్ప చెప్పాలి. ఒక వేళ నిర్దోషి అని రుజువు అయితే ఆయన బక్తులే చూసుకుంటారు దానికి కారకులైన వారి సంగతి.  రేప్ చేసారని పదేళ్ళు తర్వత కేసులు పెట్టె వారు ఎక్కువైతే "నిర్భయ" లాంటి కేసులు కూడా జనం నమ్మరు.   

No comments:

Post a Comment