Thursday, October 31, 2013

ఉల్లిగడ్డల కోసం ఎల్లయ్య ఉసురు తీసిన దొంగలు!

                                                            


" ఉల్లిపాయకు ఉపదేశ మిచ్చే కల్లగురువులు వస్తారని" బ్రహ్మం గారు చెప్పారు కానీ, ఉల్లిగడ్డల దొంగతనం కోసం ఉసురు తీసే రోజులు వస్తాయని అయన కూడా  ఊహించలేక పోయారు కదా! అరె ! అరె! ఎంత పోక దల  కాలం వచ్చింది ఈ రాష్ట్రంలో ! ఆఖరుకు ఉల్లిపాయల కోసం కూడా ప్రాణాలు తీసే స్తాయికి దిగజారాయి రాష్ట్రం లోని శాంతి బద్రతలు.! ఈ  రోజు రంగారెడ్డి జిల్లలో జరిగిన వింత ఘోరం ఇది. ఒక ఉల్లిపాయల గోడౌన్ కి కాపలాగా ఉన్నాడు ముసలివాడైన ఎల్లయ్య. ముసలి వాడు కాబట్టి అతని ని బెదిరించి ఆ ఉల్లి గడ్డల బస్తాలను ఎత్తుకేల్లినా ,ఏమోలే ఉల్లి పాయకోసం కకుర్తి పడ్డారు అనుకోవచ్చు. కానీ ఏకంగా "ఎల్లయ"నే చంపి ఉల్లి గడ్డల దొంగతనం చేసారు అంటే ఖచ్చితంగా అతనిక్ తెలిసిన వారె ఈ  పని చేసి ఉండాలి. పని పాట చేయలేని పోరం బోకు వాళ్ళు కేవలం తమ చిల్లర ఖర్చుల కోసం ఇంతటి దురాగతానికి ఒడిగట్టి ఉంటారు అనిపిస్తుంది. పాపం ఎల్లయ్య ! దేశం లో ఉల్లి జనాలను ఏద్పిస్తుంటే,రాష్ట్రం లో ఏకంగా ఎల్లయ్య  ప్రాణాలు పోవడానికే కారణ మయింది!

No comments:

Post a Comment