Thursday, October 3, 2013

"బొత్సా" గారికి సీమాంద్రా ఉద్యమం అంటే తన ఇంటి పేరు లాంటి దానితో సమానమా?



                                                                     

 అవుననే అనిపిస్తుంది ఆయన తంతు చూస్తుంటే. ప్రస్తుతం సీమాంద్రా లో నడుస్తున్న ప్రజా ఆందోళనలు చూస్తుంటే సీమాంద్రకు చెందిన ఏ రాజకీయ నాయకుడూ రాష్ట్ర విభజనకు అనుకూలంగా ప్రవర్తించి, తన రాజకీయ బవిష్యత్ మీద తనే నిప్పులు పోసుకోడు. మరి అటువంటి పనిని రాష్ట్ర కాంగ్రెస్ అద్యక్షులు శ్రీ బొత్సా సత్య నారయణ గారు చేస్తున్నారంటే అది సాహాసమా? లేకుంటే వేరే ఎదైనా మతలబ్ ఉందా?

  మొన్న ఎందుకో గానీ, సి.యమ్. గారు దిగ్విజయ్ సింగ్ కు వ్యతిరేకంగా మాట్లాడిన రోజే బొత్సా గరు రాజీనామా చేయబోతున్నారని కొన్ని మీడియాలలో ప్రకటణ లు వచ్చాయి. కాని ఆ రోజు అది జరుగ లేదు. మొన్న  మాత్రం చిరంజీవి గారితో సహ కొంత మందితో సీక్రేట్ మంతనాలు , హుటాహుటిన డిల్లీ వెళ్ళిన ఇరవై నాలుగు గంటల లోపే షిండే గారితో తెలంగాణ నోట్  సిద్దం చేయించి ఈ రోజు సాయంత్రం కేవళం టెబుల్ నోట్ ఆంశంగా కేంద్ర కాబినెట్ ముందు ప్రవేశ పెడుతున్నారంటే ఇందులో బొత్సా గారి పాత్ర ఎంత కీలకమయిందో చెప్పకనే చెపుతుంది.

  బొత్సాగారికి ,కేంద్ర పెద్దలకు మద్య ఉన్న చీకటి ఒప్పందం ఏమిటో, లగడపాటి న్గారు రాజీనామా చేసాక గాని చెప్పరట! అప్పట్టి దాక ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ అద్యక్షుడు  గేమ్ కొనసగుతూనే ఉంటుంది. ఈ రోజుతో బొత్సా గారి నిజ స్వరూపం సీమాంద్రులకు క్లియర్ గా తెలిసి పోయింది. ఆయనకి సీమాంద్రా ప్రజలు చేసే ఆందోళన ఆయనకు ఆయన నెత్తి మీద ఉన్న దానితో సమానం. అందుకే ఇంత ఆందోళనలు చేస్తున్నా ఆయన చేసేది ఆయన చెయ్య గలుగుతున్నాడు. ఆ కదిరీ నరసింహుడే సీమాంద్రులను కాపాడు గాక!

No comments:

Post a Comment