Wednesday, October 30, 2013

శోభన్ సర్కార్ సాదువు"బంగారం కల " భారతీయులకు, వేయి టన్నుల బంగారం కంటే విలువైనది ప్రసాదించింది!

                                                              


అవును! నూటికి  నూరుపాళ్ళు నిజం! ఈ  దేశం లో చాలా మంది చెయ్యలేని పని ఒక సాదువు చేయగలిగాడు. తార్కికంగ ఆలోచించటం చేతకాని వాడిని, ఎవరు ఏది చెపితే అదే నిజమని నమ్మి,పనికి రాని  పనులు చెసే " పిల్ల మనస్తత్వం " మున్నవాడిని  నమ్మి , బవిషత్ లో ఆయన్ని బారతానికి రారాజు ను చేస్తే ఎలాంటి పనులు చేస్తాడో , ప్రజలకు "పవర్ ప్రెసెంటేషన్ " ద్వారా చూపించినట్లు చూపించగలిగాడు . ఆ సాదు మహారాజ్ అయిన "శోభన్ సర్కార్ " కల పుణ్యమాని "యువరాజ్ సర్కార్" గురించి ప్రజలు కళ్ళు తెరిచినట్లైంది.

 ఆయనగారు ఒక సాదువు. పేరు శోభన్ సర్కార్. అన్నింటిలో భగవంతుని దర్శించే గుణమున్న భక్తులు ఆయన్ని భగవద్ స్వరూపంగా కొలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ,ఉన్నావ్ జిల్లలో ,సంగ్రామ్ పూర్ అనే గ్రామంలో ఉన్న "రాంబక్ష్ సింగ్" కోట ప్రాంతంలో సుమారు వేయి టన్నుల బంగారం ఉందని , అదే ప్రాంతానికి చెందిన సదరు  శోభన్ సర్కార్ మహారాజ్ గారు సెలవిచ్చారట! అది ఆయనకు ఎలా తెలిసిందంటే, అయన కు ఒక రోజు కలలో ఆ ప్రాంత పూర్విపు  రాజు అయినటువంటి "రాంబక్ష్ సింగ్" గారు కలలోకి వచ్చి "నాయనా శొభనా ,ఈ  దేశ ఆర్దిక పరిస్తితి చూస్తుంటే నాకు కడుపు తరుక్కు పోతుంది. అందుకే  ఈ  దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాడుగా ( ఆయనను ఆంగ్లేయులు సిపాయి తిరుగుబాటులో పాల్గొన్నందుకు ఉరి తీసారు) ఒక మేలు చెయాలనుకుంటున్నాను. నా కోట క్రింద సుమారు వేయి టన్నులు బంగారం దాచాను . కాబట్టి దానిని బయటకు తీయించి బారత దేశాన్ని రక్షించు. " అని అన్నారట. ఆ విషయం గురించి సదరు సాదువు గారు, ప్రదాన మంత్రి గారికి, రాష్ట్ర పతి  గారికి లేఖలు రాసా రట. కానీ వారు పట్టించుకోలేదు. ఆ తర్వాత బారత యువ రాజు గా కీర్తించబడుతున్న "రాహుల్ గాందీ " గారి దృష్టికి స్తానిక మంత్రి గారి తీసుకు వెళ్ళడం , వారీ ఆదేశాలు మేరకు అర్కియాలాజికల్ సర్వే అప్ ఇండియా వారు  దనా దన్  పలుగులు పారాలు పట్టుకు వెళ్లి పదిరోజులు పాటు  సాదువు గారు చెప్పిన చోట త్రవ్వితే , పుర్రెలు, ఏము కలు దొరికాయట. ఆ దెబ్బతో త్రవ్వడం ఆపుచేసి "రాహుల్  సర్కార్" వారికి "నిల్ " అని రిపోర్ట్ ఇచ్చారట. అదీ శోభన్ సర్కార్ అండ్  రాహుల్ సర్కార్  వారి " ది తొఉజెండ్ టన్స్  గోల్డ్ హుంట్" సినిమా !


  అయితే ఈ  ఉదంతం వలన భారతీయుల కు బంగారం లభించక పోయినా కాబోయే రారాజు, దేశ్ కి నేత అని పిలువబడుతున్న ఇద్దరు కాబోయే ప్రదాని  అభ్యర్దుల ఆలోచన సామర్ద్యాన్ని తెలియ చేసింది. కల ను నమ్మి కోట ప్రాంతాన్ని  త్రవ్వించిన రాహుల్ గాందీ గారి మానసిక స్తాయి ని, అది వ్యతిరేకించిన నరేంద్ర మోడీ గారి మానసిక స్తాయిని, అంచనా వేసి ,ప్రజలు రాబోయే ఎన్నికలలో తీర్పు ఇవ్వడానికి తగిన "జ్ఞానోదయం" చేసినట్లయింది. అది వేయి టన్నుల బంగారం కంటే ఎక్కువే గా మరి!

   యువరాజు గారికి సాదువుల  మాట మీద అంత గురి ఉంటే "బాబా రాందేవ్" చెపుతున్న స్విస్  ఖాతాలోని "నల్ల డబ్బు" ని దేశానికి తీసుకు రావచ్చు గా!

No comments:

Post a Comment