Saturday, September 7, 2013

పిచ్చోడు పిటిషన్ వేస్తే, ప్రొటెక్షన్ ఎదుటోడికి రావడమంటే ఇదే మరి!.


                                                              

 ఎదుటోడు  ఏదైనా చేస్తుంటే కడుపుబ్బు పట్టలేక చేసే పనులన్ని చాలా సార్లు ఎదుటొడికే లాభిస్తాయి. ఈ రోజు సమైఖ్యాంద్రా ఉద్యోగుల సభ విజయవంతం కావడానికి ఉద్యోగులలో ఉన్న సంకల్పం సగం కారణమైతే, ఏమి చేస్తున్నారో తెలియని స్తితిలో, తెలంగాణా  వారు చేసిన ప్రతీకార పనులు సగం కారణం అని చెప్పవచ్చు.

   తెలంగాణా వారు చేసిన పిచ్చి పనుల్లో ప్రధానమైనది సిమాంద్ర ఉద్యోగుల సభకి వ్యతిరేకంగా హై కోర్టులొ పిటిషన్ వెయ్యడం. ఏ కోర్టు అయినా పౌరుల ప్రాదమిక హక్కులకు ముఖ్యంగా బావ ప్రకటనా స్వేచ్చకు భంగం కలిగించే ఆర్డర్ లు ఇస్తుందా? అలా ఇవ్వలేదు సరి కదా,ఉద్యోగుల సబలో ఎటువంటి అవాంచనీయ సంఘటణలు జరుగకుండా చూడాల్సిందిగా పోలీసులకు  స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అంతే! అప్పటి దాక పంతొమ్మిది షరతులు పెట్టి సీమాంద్రా ఉద్యోగులను కంగారు పెడుతున్న పోలిసులు, ఒక సారీగ ఎలర్ట్ అయి, సీమాంద్ర ఉద్యొగుల సభను సక్సెస్ చెయ్యడమెలా అనే ఆలోచనలో పడ్డారు. దానిలో బాగంగనే సభలకు ఆటంకం కలిగించే వారి తాటలు తీస్తామని హుకుం జారీ చేసి దానిని పాటించారు కూడా.అడుగడుగునా పోలిస్ రక్షణ కల్పించి, సీమాంద్రా ఉద్యోగుల సమైక్యతా రాగం దేశానికి వినిపించడంలో సక్సెస్ అయ్యేలా సహకరించారు.   ఈ విదంగ తెలంగాణా వారు వేసిన పిటిషన్ సీమాంద్రా ఉద్యోగులకు స్పెషల్  పోలిస్ ప్రొటెక్షన్  ఇచ్చేలా చేసి , ఎనలేని లాబం చేకూర్చింది.

  అందుకే పెద్దలంటారు. చెరపకురా, చెడేవూ! అని . వినిపించుకుంటెనా.  

2 comments:

  1. మొత్తానికి తెలంగాణ వారిని పిచ్చోళ్ళను చేసారు కదా?

    ReplyDelete