Wednesday, September 18, 2013

భద్రాచలాన్ని వాళ్ళొదులుకోలేరు, భాగ్య నగరాన్ని వీళ్లోదుకోలేరు!



                                                              

  భద్రా చలం! పరమ పవిత్ర రామ ధామం. పుణ్య గోదావరీ తీరాన నిర్మితమైన చారిత్రక పుణ్య క్షేత్రం. ఒక్క ఆంద్ర ప్రదేశ్ కే కాక యావత్ భారత దేశంలో విశిష్ట గుర్తింపు కలిగిన క్షేత్రం. ఆదాయం పరంగా కాక పోయినా, రామాయణ కాలం నాడు శ్రీ రాములు వారు సీతాలక్ష్మణ సమేతంగ తిరుగాడిన ప్రాంతం కాబట్టి, ఆ క్షెత్రానికి దేశ వ్యాప్తంగా పేరు గాంచింది. మరి అటువంటి భద్రాచలం తెలంగాణా ఎర్పాటు ప్రకటన వలన సమస్యల్లో చిక్కుకుంది.

  ఆంద్రప్రదేశ్ ఏర్పడక ముందు భద్రాచలం  నిజాముల నిర్వాకం వల్ల బ్రిటిష్ వారి పాలనలోకి వెళ్ళి సీమాంద్రా ప్రాంతం లో ఉండేది. తెలుగువారంతా ఒకటేనని ఆంద్రప్రదేశ్ ఏర్పాటు చేసిన తర్వాత, భద్రాచలం డివిజన్ ని తెలంగాణా లోని ఖమ్మం  జిల్లాలో కలిపారు.మరి ఇప్పుడు తెలంగాణ వాదులు కోరుతున్నట్లు  1956 ముందు తెలంగాణా ప్రాంతాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్నందువలన భద్రాచలాన్ని తెలంగాణా వారు వదులుకోక తప్పని పరిస్తితి. కానీ సీమాంద్రులకు పుణ్యక్షేత్రం కంటే తమ పిల్లలకు ఇంత ఫుడ్ పెట్టె బాగ్యనగరం గురించే బెంగ పట్టుకుంది కాబట్టి, ప్రస్తుతం భద్రాచలం విషయంలో అంత సీరియస్ గా లేకపోయినా, బవిష్యతులో తెలంగాణా ఖాయం అని వారికి అనిపిస్తే భద్ద్రాచలం గురించి సీరియస్ గా క్లైమ్ చేయవచ్చు. కాబట్టి ఇరు ప్రాంతాల గురించి చర్చలు జరిగేటప్పుడు బాగ్యనగరం గురించి ఎంత పట్టుదలగా సీమాంద్రులు క్లైమ్ చేస్తారో భద్రాచలం గురించి తెలంగాణా వారు అంతే సీరియస్ గ క్లైమ్ చేస్తారు.

   మొత్తానికి అటు  సీమాంద్రులకు బాగ్యనగరం తో ఎంత అట్టాచ్ మెంట్ ఏర్పడిందో ఖమ్మం జిల్లా వారికి భద్రాచలం తో అంత అటాచ్ మెంట్ ఏర్పడింది. ఈ రెండు ప్రాంతాల భవితవ్యం ఏమిటో వేచి చూడాలి.  

2 comments: