Tuesday, September 17, 2013

రాష్ట్రంలో ఇంకా "రజాకార్ల సంతతి" మిగిలి ఉన్నట్లే కనిపిస్తుంది.



తెలంగాణా విమోచన కోసం అశువులు బాసిన తెలంగాణా వీర మాతలకు, వీర పుత్రులకు జోహార్లు అర్పిస్తూ.....  
                                                                

 ఈ రోజు తెలంగాణా విమోచనా దినం అని కొందరు, కాదు "వీలీన దినం" అని కొందరు ఎవరికి తోచిన బాష్యాలు వారు చేస్తున్నప్పటికి అంతిమంగా అందరూ అంగీకరించే విషయం ఏమిటంటే ఈ రోజు నిజాం పాలన కు గోరి కట్టిన దినం.మన తాతలు, తండ్రులు, అవ్వలు, అమ్మమ లందరి త్యాగాలకు ప్రతిపలంగా తెలంగాణా బిడ్డలు భారత సర్కార్ సహాయంతో నైజామోడి పీడ విరగడ చేయించుకున్న రోజు. ఎనబైఅయిదు  శాతం మంది మెజార్టీ ప్రజలను అష్టకష్టాలు పాలు చేసి ఊచకోత కోయించిన నిజామ్  "రాక్షస రజాకార్" ల పాలన నుండి విముక్తులమైన రోజు. ఇండియాకి పంద్రాగస్టు ఎలానో తెలంగాణాకు సత్రాసెప్టెంబర్ అలాగే. కానీ ఇ విషయాన్ని మనతో పాటు విముక్తులైన మరాఠా, కన్నడ రాష్ట్రాల వారు గుర్తుంచుకుని అధికారిక కార్యక్రమాలు చేస్తుంటే, మన వారు మాత్రం తూ తూ మంత్రాలతో మమ అనిపిస్తున్నారు.

 ఈ మద్య తెలంగాణా విభజన ఉద్యమం ఎక్కువయ్యాక, ఇదే సందురా అని చెప్పి అప్పటి రజాకార్ల మానస పుత్రులు కొందరు పైకి సీమాంద్రావారిని తెగడతున్నట్లు నటిస్తూ, అంతర్గతంగ నైజాము ప్రభువులను పొగిడే కార్యక్రమాలు చేపడుతూ, తెలంగాణా వారిలో నిజాముల పట్ల ఆరాదానా బావం పెంపొందించాలని చూస్తున్నారు. పొద్దున టి.వి. లో ఒక చర్చను చూశాను. అందులో ఒక మానసపుత్రుడు రాజాకార్ల దుష్క్రుత్యాలను సీంపుల్ గా తీసేస్తూ, భారత సైన్యం తెలంగానా ముస్లిమ్లను ఊచకోత కోసిందని సెలవిస్తూ, దానికి కారణం సీమాంద్రుల స్వార్దం అని వితండ వాదం చేస్తున్నాడు.అంటే మన తెలంగాణా లో ఇంకా రజాకార్ల పుత్రులు ఉన్నారని దీనిని బట్టి అర్దమవుతుంది.

 సీమాంద్రులు, తెలంగాన వారు అన్నదమ్ములు.  క్రిష్ణా గోదావరి మద్యనున్న గడ్డ అసలైన తెలుగుగడ్డ. తర్వాత కాల క్రమేనా జనాభివ్రుద్ది చేత అటు కావేరి వరకు విస్తరించ బడ్డాం. అంతే కానీ ఎక్కడో ఉజ్బెకిస్తాన్ నుండి పొట్ట కూటి కోసం వచ్చి పాలకులైన  నిజాములకు తెలంగాణా వారికి సంబందమే లేదు. వారి పాలన తెలుగు వారి పాలనా చరిత్రలో బాగం కాజాలదు.అన్నదమ్ముల మద్య అభిప్రాయ బేదాలు కలిగినంత మాత్రానా పరాయి వారిని తమ పూర్వికులు అని చెప్పుకునే దుస్తితిలో తెలంగాణా ప్రజలు లేరు.

  నాడు గోచి పెట్టి కొడవలి చేత పట్టి రజాకార్లను,వారి తొత్తులైన దొరలను దునుమాడిన వీర తెలంగాణా మాతల బిడ్డలమే మనం తప్పా, గొప్ప గొప్ప బవంతులు కట్టించాడని నిజాములను మన తెలంగాణ వాడు అని చెప్పటం ఆత్మ ద్రోహమే అవుతుంది.అసలు మరాఠీలు బొంబాయి ని ముంబాయి చేసిన  మాదిరి పౌరుషం ఉన్నవాళ్ళమైతే  మన పాలన రాగానే హైద్రాబాద్ పేరు మార్చి"ఐలమ్మ బాద్" అని పెట్టాల్సి ఉండే.అది మానేసి ఇంకా రజాకార్ల స్రుష్టి కర్తలను ఆరాదిస్తునారంటె ఎక్కడో రక్తం కలుషితమై ఉంటుంది అనుకోవాల్సి వస్తుంది. చచ్చినా బ్రతికినా అన్నదమ్ములు అన్నదమ్ములే. సందు దొరికింది కదా అని తోక జాడించాలనుకుంటె బేదాభిప్రాయాలు తొలిగిన నాడు తోకలు కట్ చేస్తారు అని రజాకార్ మానస పుత్రులు గుర్తుంచుకోవడం మంచిది.             

4 comments: