Tuesday, September 10, 2013

వాడికి "రేప్" చెయ్యగల ’మగ ’ తనం వచ్చింది కానీ "ఉరిశిక్ష" వేయించుకోగల" వయో " తనం రాలేదన్న మట!


                                                                  

                                                               
 ఈ రోజు "నిర్భయ" కేసులో నిందితులందరూ, శిక్షార్హులు అని డిల్లి లోని  సాకేత్ కోర్టువారు తీర్పు ఇచ్చారు. చాలా సంతోషించ దగిన విషయం. రేపు శిక్ష నిర్దారణ చేస్తారు .జాతి మొత్తం ,మ్రుగాళ్ళకు ఉరిశిక్ష పడుతుందని ఎదురు చూస్తున్నరు. దేశం లో సంచలనం రేపిన కేసు మాత్రమే కాక అనేక చట్ట సవరణల కు దారి తీసిన కేసు ఇది. అంతే కాక స్త్రీ ల రక్షణ విషయం లో న్యాయ వ్యవస్త సైతం పట్టుదలతో ఉంది కాబట్టి, నిందితులకు గరిష్టంగా శిక్ష అంటే "ఉరి శిక్ష" విదించే అవకాశం ఉంది.

 అయితే ఇదే కేసుకు సంబందించి ఇదివరకు, బాలల న్యాయస్తానం, మైనర్ నిందితుడకు మూడేళ్ళు మాత్రమే శిక్ష విదించడం పట్ల జాతి తీవ్ర నిరసనలు తెలిపింది. దీనికి న్యాయస్తానాన్ని తప్పు పట్టవలసిన పని లేదు. చట్ట ప్రకారం అదే మైనర్లకు గరిష్ట శిక్ష మరి! ఎప్పుడో జమానా లో అంటే పాతీకేళ్ళకు కూడా  అమ్మాయిలతో మాట్లాడటానికి  మగాళ్ళు బిడియ పడే రోజుల్లో చేసిన చట్టాలు కామోసు అవి!  అందుకే అంత శిక్ష చాలులే అనుకుని ఉంటారు మన చట్ట నిర్మాతలు. కానీ  ఇప్పుడు పన్నిండేల్లకే  "రేప్"  లు చెయ్యగల ముదురు  పౌరులు అయ్యారు అని గ్రహించ లేక పోతున్నారు నేటి ప్రజా ప్రతినిదులు. లేకపోతే, ఇదే తరహా కేసులో పాల్గొన్న నిందితులకు , అమెరికాలో సైతం కఠిన సిఖ్షలు ఉంటే మన కేమిటీ ఈ దిక్కు మాలిన ఉదారత! అసలు మ్రుగాళ్ళకు "అరబ్ కంట్రీస్ " లాంటి  చట్టలు చేస్తే బాగుంటుందనుకుంటా!

 ఏది ఎమైన నిర్భయ కేసులో మైనర్ గాడికి రేప్ చేసే వయస్సు వచ్చింది కాని ఉరిశిక్ష వేయించుకునే వయసు రాలేదు కాబట్టి బ్రతికి పోయాడు. రేపు వాడు ఎన్నికల్లో నిలబడి "నిర్భయ ఫేం" గా ఏదో ఒక పార్టీ నాయకుడు అయినా ఆశ్చర్య  పడవలసిన పని లేదు.



No comments:

Post a Comment