Tuesday, August 6, 2013

సీమాంద్ర అడుక్కు తినే వాళ్ళ J.A.C కూడా ఉద్యమం చేస్తుందట !



                                                                


   ఇన్నాళ్ళు తెలంగాణా కోసం రకరాల J.A.C. లు తెలంగాణా లో ఉద్యమం సాగించాయి  వాటి క్రుషి పలితమో ,సోనీయమ్మ కరుణ పలితమో తెలంగాణా ప్రత్యేక రాష్త్ర ఏర్పాటు ప్రకటించడం జరిగింది .ఇప్పుడు ఉద్యమ ఊపు సీమాంద్రలో షురూ  అయింది . తెలంగాణాలో ఏ విదంగా ఉద్యమాలు చేసారో అదే విదానం సీమాంద్రలోను "సమైఖ్యాంద్ర " కోసం కోన సాగుతుంది . మంత్రుల ఇళ్ళ ముట్టడి దగ్గర్నుంచి రోడ్ల మీద వంటా వార్పూ దాకా అదే స్టైల్ . కాకపోతే సీమాంద్ర ఉద్యమంలో అన్ని వర్గాల j.a.c.  లతో పాటు బిచ్చగాళ్ళ J.A.C.  అదేనండి అడుక్కు తినేవాళ్ల J.A.C. కూడా  ఉద్యమంలో చురుకుగా పాల్గొంటుందట !.

అది విన్న నాకు ఆశ్చర్యం వేసింది . ఇదేమిటబ్బా ! తెలంగాణా ఏర్పడితే సీమాంద్రా బిచ్చ గాళ్ళకి కలిగే నష్టమేమిటా అని ,తెగ ఆలోచించగా, ఆలోచించగా టక్కున ప్లాష్ అయింది సమాదానం . అసలు సీమాంద్రా వారు ఉద్యమం చేసేదే హైదరాబాద్ కోసం . హైదరాబాద్ తమ చేజారిపోతే , ఉద్యోగ అవకాశాలు లేని తమ పిల్లలు సీమాంద్రాలో బొచ్చె పట్టుకుని అడుక్కోవాల్సి వస్తుందని సీమాంద్రుల వాదన . మరి అదే నిజమయితే సీమాంద్రలో ఇప్పుడ్డున్న అడ్డుక్కు తినే వారికి హెవీ కాంపిటీషన్ ఏర్పడే ప్రమాదముంది కాబట్టి , ముందుగానే జాగర్తపడి ,ఉద్యమం లో పాలు పంచుకుని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఆపు చేస్తే , తమ వృత్తికి బంగం కలగదని , ముందు చూపుతో ,అడుక్కు తినే వారంతా J.A.C. గా ఏర్పడి ఉద్యమం చేస్తున్నారన్న మాట !

 చూసారా ,అడుక్కు తినే వారైన వారికున్న ముందు చూపు ఎంత గొప్పదో! కనీసం వీరికున్న పాటి ముందు చూపు సీమాంద్ర రాజకీయ నాయకులకు లేదాయే! సీమాంద్ర ప్రజల మెడలు సోనీయా చేతిలో పెట్టి తమాషా చూస్తున్నారు . సిమాంద్ర ప్రజలు ఇక రాబోయే ఎలక్షన్ లలో రాజకీయ నాయకులని బదులు అడుక్కు తినే వారిని నిలబెట్టి గెలిపిస్తే కనీసం నిరుద్యోగులకు అడుకునే రాత తప్పిస్తారు .విష్ యూ బెస్ట్ ఆప్ లక్ .


4 comments:

  1. >>> తెలంగాణా ఏర్పడితే సీమాంద్రా బిచ్చ గాళ్ళకి కలిగే నష్టమేమిటా అని ,తెగ ఆలోచించగా, ఆలోచించగా టక్కున ప్లాష్ అయింది సమాదానం . అసలు సీమాంద్రా వారు ఉద్యమం చేసేదే హైదరాబాద్ కోసం . హైదరాబాద్ తమ చేజారిపోతే , ఉద్యోగ అవకాశాలు లేని తమ పిల్లలు సీమాంద్రాలో బొచ్చె పట్టుకుని అడుక్కోవాల్సి వస్తుందని సీమాంద్రుల వాదన . మరి అదే నిజమయితే సీమాంద్రలో ఇప్పుడ్డున్న అడ్డుక్కు తినే వారికి హెవీ కాంపిటీషన్ ఏర్పడే ప్రమాదముంది కాబట్టి , ముందుగానే జాగర్తపడి ,ఉద్యమం లో పాలు పంచుకుని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఆపు చేస్తే , తమ వృత్తికి బంగం కలగదని , ముందు చూపుతో ,అడుక్కు తినే వారంతా J.A.C. గా ఏర్పడి ఉద్యమం చేస్తున్నారన్న మాట !<<<<
    Excellent!!

    ReplyDelete