Friday, August 30, 2013

ఇండియన్ మదర్ కన్నది అహ్మద్ సిద్దిబప్పానయితే, మదర్సా చదువు మార్చింది యాసిన్ భత్కల్ గా!


                                                                      


   యాసీన్ భత్కల్! ఒక నరరూఫ రాక్షసుడు. వీడికి కులం లేదు. మతం లేదు సరి కదా అసలు మానవత్వం అనేది మచ్చుకైన కానరావు వీడిలో . దేశంలో వివిద ప్రాంతాలలో జరిగిన   బాంబు  ప్రేళ్ళుల్లకు మాస్టర్ మైండ్ భత్కల్. అట్టి నర రూప రాక్షసుడు నిన్న ఇండియా నేపాల్ సరి హద్దుల్లో పోలిసులకు పట్టుబడటం జాతికి ఆనందం కలిగించే విషయం.

 యాసిన్ భత్కల్ అసలు పేరు అహ్మద్ సిద్దిబప్పా. ఇతడు ఉత్తర కర్ణాటక లోని భత్కల్ ప్రాంతానికి చెందిన వాడు. చిన్నప్పుడు' అంజుమన్ ఆమీన్ ఏ ముస్లీమీన్' అనే మదర్సాలో విద్యాబ్యాసం చేసాడు. ఆ తర్వాత దుబాయి వెళ్ళి తండ్రి నడుపుతున్న బట్టల కొట్లో పని చేసాడు. ఇతని లోని తివ్రవాద దోరణిల వల్ల తండ్రి తో సరిపడక అక్కడ నుండి ఇండియాకు వచ్చి ఇండియన్ ముజాహిద్దీన్ అనే సంస్తను స్తాపించి దేశం లోని వివిద ప్రాంతాలలో బాంబు పేళ్లుల్లు జరిపి ప్రజలను హత మార్చాడు. ఒక సారీ దొంగ నోట్ల కేసులో అరెస్ట్ అయినా పోలిసుల కళ్ళు కప్పి తప్పించుకున్నాడట!

ఇంటిల్జెన్స్ వర్గాల సమాచారం మేరకు  2008  నుండి ఇప్పటి వరకు యాసిన్ భత్కల్  బాంబు పేళ్లుల్లు జరిపిన ప్రాంతాలు.అహ్మదాబాద్    (2008), సూరత్  (2008), జైపూర్ (2008), న్యూ డిల్లీ (2008), వారణాసి (2010),బెంగళూర్  (2010), ఫునె (2011),ముంబై  (2011), హైదరాబాద్  (2013) బెంగళూర్  (2013).

  ఇప్పటికైన ఈ క్రూరుడిని పట్టుకోవడం సంతోషం. త్వరలో మిగతా ఉగ్రవాదులని కూడా పట్టుకుని ఉగ్రవాదుల  నుండి దేశాన్ని కాపాడతారని ఆశిద్దాం. 

No comments:

Post a Comment