Friday, August 23, 2013

పదేళ్లు పైన కఠిన శిక్ష పడుతుందన్న భయంని, "పశువాంచ" అధిగమిస్తుందా!?.



                                                            


 అవుననే అనిపిస్తుంది. వేయి నిర్బయ చట్టాలు తెచ్చినా ఈ దేశంలో ఆడపిల్లలకి లైంగిక దాడుల భయం పోగొట్టలేము అనేది రూడి అవుతుంది. అసలు నాకొక అనుమానం ఏమిటంటే ,ఏదైన సంచలనాత్మక కేసు జరిగినపుడు ఈ పోలిసులు పట్టుకుంటుంది అసలు నేరస్తులనేనా? శిక్షలు విదించాక అసలు వారినే జైలులో ఉంచుతున్నారా? లేక బినామీలు ఉంటున్నారా? అలా ఉంటే వారిలో ఎందుకు పరివర్తన రావటం లేదు? అసలు చట్టం అంటే ఎందుకు నేరస్తులకు భయం లేకుండా పోతుంది? ఇవ్వన్ని అమాయకుడైన నా  లాంటి వారికి జనియించే ప్రశ్నలు.

  మొన్న డిల్లిలో జరిగిన నిర్బయ రేప్ ఉదంతం లో, ముందు మేమే నేరం చేసామని అంగీకరించిన నేరస్తులు, ఆ తర్వత మేము నిర్దోషులమని మొరపెట్టుకున్నారు. మొదట పట్టుకున్నప్పుడు వారి ముఖాలు అవి కనపడకుండా తీవ్రవాదులకి ముసుగులు వేసినట్లు వేసి మీడియా కంట పడకుండా తీసుకు వెలుతుంటారు పోలిసులు. అదేమిటంటే రేప్ లాంటి సున్నిత కేసులలో ముఖాలు చూపించడం కుదరదు అంటారు. రేప్ కు గురైన స్త్రీకి ఆ నిబందన వర్తిస్తుంది కాని, నిందితులకు ఎలా వర్తిస్తుంది. అటువంటి నీచ కార్యాలు చేసిన వారు ఎవ్వరో సమాజం తెలుసుకోవాలి. కాని అంతా సీక్రేటే అయితే నిజమైన నేరస్తులకే శిక్షలు పడుతున్నాయి అని గ్యారంటీ ఎమిటి? వారే జైలులో ఉంటున్నారన్న గ్యారంటీ ఏమిటి?

  నిన్న ముంబయిలో జరిగిన ఉదంతం కూడా అంతే .అయిదు పశువులు ఒక పొటో జర్నలిస్ట్ ని రేప్ చేసాయి. నిర్బయ కేసులో మాదిరే అమ్మాయి  భాయిప్రెండ్ సాక్షిగా రేప్ జరిగింది. రేప్ జరిగిన రెండు గంటల తర్వాత పోలిసులకు పిర్యాదు అందీంది. ఇది జనాలకు తెలిసి గొడవ అవగనే వెంటనే ఇద్దరిని పోలిసులు పట్టేశారట! వారి ముఖాలు మీడియ కంట బడకుండా చేసారు. అదేమిటంటే సున్నితమైన కేసు అని సమాదానం. అయిదుగురులో ఇద్దరు రౌడీ షీటర్ లట! అందరిని పట్టుకున్నరని ఒక వార్త. కాదు ఇద్దరినేనని పోలిసుల సమాచరం. భాదితురాలను కాని, వారి కుటుంబం గురించి కాని తెలియ చేయక పోయిన పర్వాలేదు. కాని ఆ పశువులు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంది.

  డిల్లీ ఉదంతం, ముంబాయి ఉదంతం లో ఇంచు మించు విషయం ఒకటే. అమ్మయి బాయిప్రెండ్ తోడుతో నిర్జన ప్రాంతం(బస్సులో అయిన అదే) లో కనపడ్డారు. క్రూర జంతువుకి సాదు జంతువును చూస్తే ఎంత ఆనందమో, ఒక అమ్మాయి అబ్బాయి నిర్జన ప్రాంతంలో  కనపడితే మ్రుగాళ్లకు అంత ఆనందం. జరిగే ప్రతి దానికి ప్రబుత్వాన్ని, సమాజాన్ని నిందించినంత మాత్రాన మన ఆడపిల్లలకు  లభించే రక్షణ నామ మత్రమే. ఎవరి జాగ్రతలో వారుండాలి. అలా ఉన్నప్పటికి లైంగిక దడులు జరిగితే ఆ దాడులను చేసిన వారిని అమ్మాయి తరపు బందువులు అది మొత్తం కుటుంబం మీద జరిగిన దాడిగ బావించి నేరస్తుడికి పూర్తీ కాలం శిక్ష పడేల చెయ్యడానికి పంతం కట్టి పని చెయ్యాలి. ఎక్కడా రాజి  పడరాదు. అవసరమైతే పోలిస్ ప్రాసిక్యూషన్ కి తోడుగా ప్రైవేట్ లాయర్ని పెట్టి కేసును ఆసాంతం పర్యవేక్షీంచాలి. ఆర్దికంగా స్తోమత లేని వారు స్వచ్చంద సంస్తల సహాయం తీసుకోవాలి. మనం ఎంత రాజ్య రక్షణ విదానం  లో ఉన్న మన ప్రాణాలు, మానాలు తీసిన వారిని శిక్షించడంలో  ప్రభుత్వం విఫలమైతే ఆ పని మనం చేసినా తప్పు లేదని నా అభిప్రయం . అలా  అయిన నేరస్తులకు భయం ఉండి నేర కట్టడి జరిగే అవకాశం ఉంది.              

No comments:

Post a Comment